మాదిరి ప్రశ్నలు
1. 1805లో లండన్ మిషనరీ సొసైటీ ఏ ప్రాంతంలో తన కార్యక్రమాలు చేపట్టింది?
జ: జమ్మలమడుగు
2. కడప, కర్నూలు ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీ కార్యక్రమాలు ప్రారంభించిన మిషన్ -
జ: గోస్పల్ మిషన్
3. హిందూ రిఫార్మర్ పత్రికను ఎవరు ప్రారంభించారు?
జ: మన్నవ బుచ్చయ్య పంతులు
4. మచిలీపట్నం నుంచి ఉమారంగనాయకులు నాయుడు ప్రారంభించిన పత్రిక ఏది?
జ: పురుషార్థప్రదాయని
5. కందుకూరి కార్యక్రమాలను కొక్కండ వెంకటరత్నం ఏ పత్రికలో విమర్శించేవారు?
జ: ఆంధ్రభాషా సంజీవని
6. చిలకమర్తి రచనలు ఏ పత్రికలో ప్రచురితమయ్యాయి?
జ: చింతామణి
7. తొలి తెలుగు పత్రిక -
జ: సత్యదూత
8. 1902లో కృష్ణా పత్రికను స్థాపించినదెవరు?
జ: కొండా వెంకటప్పయ్య
9. తెలుగు నేలపై అచ్చయి వెలువడిన తొలి తెలుగు పత్రిక ఏది?
జ: హితవాది
10. కిందివారిలో గోల్కొండ పత్రిక సంపాదకుడు -
1) మాడపాటి హనుమంతరావు 2) సురవరం ప్రతాపరెడ్డి 3) ఖాసా సుబ్బారావు 4) ఎవరూకాదు
జ: 2(సురవరం ప్రతాపరెడ్డి)
11. 'అమృతాంజన్'ను కనుక్కున్న వ్యక్తి ఎవరు?
జ: కాశీనాథుని నాగేశ్వరరావు
12. 'హిత సూచని' గ్రంథం రాసి సంఘ సంస్కరణ ఉద్యమన్ని నడిపిన వ్యక్తి-
జ: సామినేని ముద్దు నరసింహం
13. 'వితంతు వివేకం' గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: పరవస్తు రంగాచార్యులు
14. ఆంధ్రాలో కల్నల్ ఆల్కాట్ పర్యటనను ఏర్పాటు చేసిన వ్యక్తి-
జ: తల్లాప్రగడ సుబ్బారావు
15. క్రిసెంట్ పత్రిక ద్వారా సంఘ సంస్కరణ ఉద్యమాన్ని ప్రచారం చేసింది-
జ: గాజుల నరసుశెట్టి
16. పిఠాపురం కేంద్రంగా ఆర్య సమాజం శాఖను ఎవరు ప్రారంభించారు?
జ: ఆదిపూడి సోమనాథరావు
17. కందుకూరి వీరేశలింగం గురువుగా ఎవరిని పేర్కొంటారు?
జ: ఆత్మూరి లక్ష్మీ నరసింహం
18. కందుకూరి స్థాపించిన తొలి బాలికా పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు-
జ: మల్లాది అచ్చన్న శాస్త్రి
19. కందుకూరి ఆంధ్రదేశంలో తొలి వితంతు వివాహాన్ని ఎప్పుడు జరిపించారు?
జ: 1881, డిసెంబరు 11
20. ఆంధ్రాలో తొలి వితంతు వివాహానికి పెళ్లి మంత్రాలు చదివింది-
జ: పి. ఆనందాచార్యులు
21. కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించిన తొలి పత్రిక-
జ: వివేక వర్ధిని
22. 1898లో మద్రాస్లో కందుకూరికి 'దక్షిణ భారత విద్యాసాగరుడు' బిరుదును ఎవరిచ్చారు?
జ: ఎం.జి. రెనడే
23. 1893లో కందుకూరి వీరేశలింగం పొందిన బిరుదు-
జ: రావు బహదూర్
24. మద్రాస్లో ఎవరి నివాసంలో కందుకూరి వీరేశలింగం పంతులు మరణించారు?
జ: కొమర్రాజు లక్ష్మణరావు
25. భారతదేశంలో తొలి వితంతు వివాహన్ని జరిపించిన వ్యక్తి-
జ: ఈశ్వరచంద్ర విద్యాసాగర్
26. 1906లో కందుకూరి వీరేశలింగం హితకారిణి సమాజాన్ని ఎక్కడ స్థాపించారు?
జ: రాజమండ్రి
27. తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్రకు ఆధార గ్రంథం-
జ: వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్
28. రాజశేఖర చరిత్రకు మరొక పేరు-
జ: వివేక చంద్రిక
29. సాంఘిక దురాచారమైన కన్యాశుల్కాన్ని విమర్శిస్తూ కందుకూరి రాసిన నాటకం-
జ: బ్రహ్మ వివాహం
30. కింది అంశాలను సరైన వరుసలో అమర్చండి.
1) కందుకూరి వీరేశలింగం తొలి పత్రిక స్థాపన
2) దక్షిణ భారత విద్యాసాగరుడు బిరుదు పొందడం
3) హితకారిణి సమాజ స్థాపన
4) రాజమండ్రిలో వితంతు శరణాలయ స్థాపన
జ: 1, 2, 4, 3
31. సాంఘిక శుద్ధి సంఘాన్ని స్థాపించి సంఘ సంస్కరణ ఉద్యమం చేసినదెవరు?
జ: రఘుపతి వెంకటరత్నం నాయుడు
32. కిందివాటిలో రఘుపతి వెంకటరత్నం నాయుడు బిరుదు కానిది-
1) కులపతి 2) బ్రహ్మర్షి 3) అభినవ సోక్రటీస్ 4) రావు బహదూర్
జ: 4(రావు బహదూర్)
33. కిందివాటిలో ఏది రఘుపతి వెంకటరత్నం నాయుడి కృషి ఫలితంగా నిషేధితమైంది?
1) సతి పద్థతి 2) కన్యాశుల్కం 3) వరకట్నం 4) దేవదాసీ వ్యవస్థ
జ: 4(దేవదాసీ వ్యవస్థ)
34. రఘుపతి వెంకటరత్నం నాయుడు నడపని పత్రిక -
1) బ్రహ్మప్రకాశిక 2) ఫెలోవర్కర్ 3) సోఫల్ రిఫార్మర్ 4) పీపుల్ప్ ఒపీనియన్
జ: 4(పీపుల్ప్ ఒపీనియన్)
35. విద్యారంగంలో చేసిన కృషికి ఆంగ్ల ప్రభుత్వం రఘుపతి వెంకటరత్నం నాయుడికి ఇచ్చిన బిరుదు
జ: నైట్హుడ్
36. వ్యవహారిక తెలుగు భాషలో రాసిన తొలి నాటకం-
జ: కన్యాశుల్కం
37. నవయుగ వైతాళికుడుగా పేరొందిన ఆంధ్రుడు-
జ: గురజాడ అప్పారావు
38. తెలుగుభాషలో తొలి కథానికను రాసింది-
జ: గురజాడ అప్పారావు
39. 1906లో విజ్ఞాన చంద్రికామండలిని ప్రారంభించినదెవరు?
జ: కొమర్రాజు లక్ష్మణరావు
40. వ్యవహారిక భాషోద్యమ పితామహుడిగా పేరొందిన వ్యక్తి-
జ: గిడుగు రామమూర్తి
41. ఆంధ్ర చరిత్ర పరిశోధన పితామహుడిగా పేరొందిన వ్యక్తి ఎవరు?
జ: కొమర్రాజు లక్ష్మణరావు
42. సూర్యరాయ ఆంధ్రభాషా నిఘంటువును రాసినదెవరు?
జ: జయంతి రామయ్య
43. ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమ పితామహుడిగా పేరొందింది-
జ: అయ్యంకి వెంకట రమణయ్య
44. 'తుది విన్నపం' పేరుతో స్వీయ చరిత్ర రాసిందెవరు?
జ: గిడుగు రామమూర్తి
45. కింది రచనలను జతపరచండి.
1) వ్యాస మంజరి ఎ. గిడుగు రామమూర్తి
2) శాసన పద్యమంజరి బి. జయంతి రామయ్య
3) తెలుగు పత్రిక సి. గిడుగు రామమూర్తి
4) దేశమాత పత్రిక డి. చిలకమర్తి లక్ష్మీనరసింహం
జ: 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
46. 'మాలపల్లి' నవలను రాసింది-
జ: ఉన్నవ లక్ష్మీనారాయణ
47. 1901లో కొమర్రాజు లక్ష్మణరావు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయాన్ని ఎక్కడ స్థాపించారు?
జ: హైదరాబాద్
48. భారతదేశంలో ప్రాంతీయ భాషలో తొలి విజ్ఞాన సర్వస్వాన్ని రాసిన వ్యక్తి-
జ: కొమర్రాజు లక్ష్మణరావు
49. సవర భాష అభివృద్ధికి గిడుగు చేసిన కృషికి మద్రాస్ ప్రభుత్వం ఏ బిరుదుతో గౌరవించింది?
జ: రావు సాహెబ్
50. విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురించిన 'ఆంధ్రుల చరిత్ర'ను ఎవరు రాశారు?
జ: చిలుకూరి వీరభద్రరావు
51. గురజాడ అప్పారావు తన దేశభక్తి గీతాలను ఏ గ్రంథంలో రాశారు?
జ: ముత్యాల సరాలు
52. గురజాడ 'కన్యాశుల్కం' నాటకాన్ని ఎప్పుడు రాశారు?
జ: 1896
53. కందుకూరి వీరేశలింగం పంతులు తొలి వితంతు శరణాలయాన్ని ఎక్కడ స్థాపించారు?
జ: మద్రాసు
54. 1874లో కందుకూరి వీరేశలింగం ప్రారంభించిన వివేకవర్ధిని పత్రిక-
జ: మాస పత్రిక
55. సవర-ఇంగ్లిష్ నిఘంటువును రూపొందించింది-
జ: గిడుగు రామమూర్తి
56. అంధకవి, ఆంధ్రా మిల్టన్గా పేరొందిన కవి-
జ: ఆచంట లక్ష్మీపతి
57. 'బుడబుక్కల జోస్యం' గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: ఉన్నవ లక్ష్మీనారాయణ
58. 1922లో గుంటూరులో శారదా నికేతన్ను ఎవరు స్థాపించారు?
జ: ఉన్నవ లక్ష్మీబాయమ్మ
59. కందుకూరి వీరేశలింగం పంతులు గురించి ''తన దేహం, గేహం, విద్య, ధనం ప్రజలకు అర్చించిన ఘనుడు"
అని అన్నదెవరు?
జ: చిలకమర్తి లక్ష్మీనరసింహం
60. కందుకూరి వీరేశలింగం పంతులు తన ''విదేశీ నారీమణుల చరిత్రం" వ్యాసాన్ని ఏ పత్రికలో ప్రచురించారు?
జ: తెలుగు జనానా