కేంద్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్ కంటే ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతుంది. 2021-22 ఆర్థిక సర్వేలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇందులో భారతదేశ ఆదాయం, తలసరి ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని పేర్కొన్నారు.
భారతదేశ తలసరి ఆదాయం
సంవత్సరం | ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం | స్థిర ధరల్లో తలసరి ఆదాయం |
2018 - 19 | రూ.1,25,883 | రూ.92,241 |
2019 - 20 | రూ.1,34,186 | రూ.94,566 |
2020 - 21 | రూ.1,28,829 | రూ.86,659 |
2021 - 22 | రూ.1,50,326 | రూ.93,973 |
భారతదేశ జీడీపీ
సంవత్సరం | జీడీపీ ప్రస్తుత ధరల్లో (రూ.కోట్లలో) | జీడీపీ స్థిర ధరల్లో (రూ.కోట్లలో) |
2019 - 20 | 2,03,51,013 | 1,45,69,268 |
2020 - 21 | 1,97,45,670 | 1,35,12,740 |
2021 - 22 | 2,32,14,703 | 1,47,53,535 |
దేశంలో పొదుపు, పెట్టుబడి, స్థిర మూలధన కల్పన రేట్లు
సంవత్సరం | స్థూలదేశీయ పొదుపు రేటు | స్థూలదేశీయ పెట్టుబడి రేటు |
2017 - 18 | 32.1% | 31.0% |
2018 - 19 | 30.6% | 32.1% |
2019 - 20 | 31.4% | 30.7% |
స్థూలదేశీయ స్థిర మూలధన కల్పన రేటు
201718లో 28.2%, 201819లో 29.2%, 201920లో 28.8%.
భారతదేశంలో రాష్ట్రాల వారీగా తలసరి ఆదాయ వివరాలు (2019-20లో)
అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలు
1. గోవా - రూ.4,35,959
2. సిక్కిం - రూ.4,03,376
3. హరియాణ - రూ.2,47,628
అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలు
1. బిహార్ - రూ.45,071
2. ఉత్తర్ ప్రదేశ్ - రూ.65,704
3. ఝార్ఖండ్ - రూ.77,739
* అత్యధిక తలసరి ఆదాయం కలిగిన కేంద్రపాలిత ప్రాంతం - న్యూదిల్లీ (రూ.3,76,221్శ
* అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం - జమ్మూకశ్మీర్ (రూ.1,02,789్శ
భారత్లో అత్యధిక పంట ఉత్పత్తి చేస్తున్న వివిధ రాష్ట్రాలు (2020-21)
వరి: పశ్చిమ్ బంగా - 16.65 మిలియన్ టన్నులు, ఉత్తర్ ప్రదేశ్ - 15.66 మి.ట., పంజాబ్ - 12.18 మి.ట.
గోధుమ: ఉత్తర్ ప్రదేశ్ - 35.50 మి.ట., మధ్యప్రదేశ్ - 17.62 మి.ట, పంజాబ్ - 17.14 మి.ట.
మొక్కజొన్న: కర్ణాటక - 5.18 మి.ట., మధ్యప్రదేశ్ - 3.58 మి.ట., మహారాష్ట్ర - 3.44 మి.ట.
మొత్తం పప్పుధాన్యాలు: మధ్యప్రదేశ్ - 5.30 మి.ట., రాజస్థాన్ - 4.31 మి.ట., మహారాష్ట్ర - 4.30 మి.ట.
మొత్తం ఆహారధాన్యాలు: ఉత్తర్ ప్రదేశ్ - 58.32 మి.ట., మధ్యప్రదేశ్ - 31.96 మి.ట. పంజాబ్ - 29.77 మి.ట.
మొత్తం నూనెగింజలు: రాజస్థాన్ - 7.94 మి.ట., మహారాష్ట్ర - 6.69 మి.ట., మధ్యప్రదేశ్ - 6.68 మి.ట.
స్థిరధరల వద్ద వివిధ రంగాల వృద్ధిరేట్ల వివరాలు
సం. | వ్యవసాయ | పారిశ్రామిక | సేవా |
2019 - 20 | 4.3% | (-)1.2% | 7.2% |
2020 - 21 | 3.6% | (-)7.0% | (-)8.4% |
2021 - 22 | 3.9% | 11.8% | 8.2% |
వివిధ రంగాల వాటాల వివరాలు
రంగం | 2019 - 20 | 2020 - 21 | 2021 - 22 |
వ్యవసాయ | 18.4% | 20.2% | 18.8% |
పారిశ్రామిక | 26.7% | 25.9% | 28.2% |
సేవా | 55.0% | 53.9% | 53.0% |
మొత్తం | 100% | 100% | 100% |
భారత జీడీపీ వృద్ధి రేట్ల వివరాలు
201920లో 4.0%, 202021లో (-) 7.3%, 202122లో 9.2%.
పన్ను ఆదాయం జీడీపీలో శాతం పరంగా
సంవత్సరం | స్థూల పన్ను | నికర పన్ను |
2017 - 18 | 11.2% | 7.3% |
2018 - 19 | 11.0% | 6.9% |
2019 - 20 | 9.9% | 6.7% |
2020 - 21 | 10.3% | 7.2% |
2021 - 22 | 9.9% | 6.9% |
భారత్లో ద్రవ్యలోటు వివరాలు
201718లో 3.5%, 201819లో 3.4%, 201920లో 4.6%, 202021లో 9.2%, 202122లో 6.8%.
భారతదేశ రుణాల వివరాలు
సం. | స్వదేశీ రుణం (రూ.లక్షల కోట్లలో) | విదేశీ రుణం (రూ.లక్షల కోట్లలో) |
2018 - 19 | 70.75 | 4.74 |
2019 - 20 | 80.20 | 5.44 |
2020 - 21 | 99.09 | 6.15 |
* భారత్ నుంచి జరిగే ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం అమెరికా.
* మన దిగుమతుల్లో ప్రథమ స్థానంలో క్రూడ్ ఆయిల్ ఉంది.
* దిగుమతుల్లో మొదటి స్థానంలో చైనా ఉంది.
* కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 3.0%.
* అత్యధిక ఎఫ్డీఐలు సింగపూర్ (25.9%), అమెరికా (14.9%), మారిషస్ (13.9%), నెదర్లాండ్స్ (6.9%) నుంచి వచ్చాయి.
* అత్యధిక ఎఫ్డీఐలు వచ్చిన రంగాలు: కంప్యూటర్ సాఫ్ట్వేర్-హార్డ్వేర్ (22.9%), ఆటోమొబైల్ పరిశ్రమ (15.8%), సేవారంగం-విత్తం, బ్యాంకింగ్, బీమా (10.1%), వర్తకం (6.6%).
* ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎఫ్ఎస్ఆర్) 2021 ప్రకారం భారత్లో 21.71% అడవులు ఉన్నాయి.
ఏపీ ఆర్థిక సర్వే 2021-22
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021-22 ఏడాదికి సోషియో ఎకనమిక్ సర్వేను విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగం, రాష్ట్ర జీఎస్డీపీ, రాష్ట్ర విత్త వివరాలు, విద్యా, ఆరోగ్యం, పేదరికం, నిరుద్యోగ వివరాలను పొందుపరిచారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయరంగం
* సోషియో ఎకనమిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలో నికర సాగుభూమి 201819లో 60.49 లక్షల హెక్టార్లు ఉండగా, 201920లో 60.49 లక్షల హెక్టార్లు, 202021లో 60.88 లక్షల హెక్టార్లు ఉంది.
* 202021లో నికర సాగు భూమి ఎక్కువగా ఉన్న జిల్లా కర్నూల్ కాగా, తక్కువగా ఉన్న జిల్లా విజయనగరం.
* 10వ వ్యవసాయ సెన్సెస్ రిపోర్ట్ 201516 ప్రకారం ఏపీలో సగటు కమతం 0.94 హెక్టార్లు. సగటు కమతం అధికంగా ఉన్న జిల్లా అనంతపురం (1.63 హెక్టార్లు), కాగా, తక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళం (0.51 హెక్టార్లు).
* మొత్తం కమతాదార్ల సంఖ్య 85.24 లక్షలు.
* మొత్తం కమతాల విస్తీర్ణం 80.04 లక్షల హెక్టార్లు.
కమతాల వర్గీకరణ: కమతాలను అయిదు రకాలుగా వర్గీకరించారు. అవి:
1. ఉపాంత కమతం 1 హెక్టార్లోపు భూమి.
2. చిన్న కమతం 1 నుంచి 2 హెక్టార్ల వరకు
3. సెమీ మీడియం కమతం - 2 నుంచి 4 హెక్టార్ల వరకు
4. మీడియం కమతం - 4 నుంచి 10 హెక్టార్ల వరకు
5. పెద్ద కమతం 10 హెక్టార్ల కంటే ఎక్కువ
జిల్లాలవారీగా స్థూల సాగునీటి వివరాలు
కాలువల ద్వారా వ్యవసాయం ఎక్కువగా చేస్తున్న జిల్లాలు:
గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి
కాలువల ద్వారా వ్యవసాయం తక్కువగా చేస్తున్న జిల్లాలు:
చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప
సాగు కోసం చెరువులపై ఎక్కువగా ఆధార పడిన జిల్లాలు:
నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం.
చెరువుల ద్వారా వ్యవసాయం తక్కువగా ఉన్న జిల్లాలు:
గుంటూరు, అనంతపురం, వైఎస్సార్ కడప
బావుల ద్వారా వ్యవసాయం ఎక్కువగా చేస్తున్న జిల్లాలు:
పశ్చిమగోదావరి, అనంతపురం, చిత్తూరు
బావుల ద్వారా వ్యవసాయం తక్కువగా చేస్తున్న జిల్లాలు:
శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం
* ఏపీలో ఖనిజాల ద్వారా అధికంగా రెవెన్యూ వచ్చే జిల్లా ప్రకాశం, తక్కువ రెవెన్యూ వచ్చే జిల్లా పశ్చిమగోదావరి.
* ఏపీలో 2021 నాటికి ఏపీ జెన్కో ద్వారా జరిగిన థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 3410.00 మెగావాట్లు, జలవిద్యుచ్ఛక్తి 1797.60 మెగా వాట్లు.
* 202021లో ఏపీలో తలసరి విద్యుత్ వినియోగం 1198 కిలో వాట్స్గా ఉంది.
* 202122లో రాష్ట్రంలో మొత్తం 5907 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) ఉన్నాయి. MSMEలు ఎక్కువగా ఉన్న జిల్లా తూర్పుగోదావరి, తక్కువగా ఉన్న జిల్లా విజయనగరం.
* రాష్ట్రంలో 2020, మార్చి నాటికి పెద్ద తరహా, మెగా పరిశ్రమల సంఖ్య 281. పెద్ద తరహా, మెగా పరిశ్రమలు ఎక్కువగా ఉన్న జిల్లా చిత్తూరు ్బ49్శ. తక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళం ్బ6్శ.
* రాష్ట్రానికి అధిక పెట్టుబడులు సాధించి, పరిశ్రమల స్థాపనకు వీలుగా ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి విధానం 202023ను రూపొందించింది.
* రాష్ట్రంలో లీళీలీనిల అభివృద్ధికి ‘వైఎస్సార్ నవోదయం’ పథకాన్ని ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్ సేవారంగం
* 202021లో రవాణా ద్వారా రెవెన్యూ అధికంగా వచ్చిన జిల్లా - విశాఖపట్నం, కాగా తక్కువగా వచ్చిన జిల్లా - విజయనగరం.
* రాష్ట్రంలో ఉన్న మొత్తం పోస్టాఫీసులు - 10,595. అత్యధిక పోస్టాఫీసులు ఉన్న జిల్లా అనంతపురం (943). తక్కువ ఉన్న జిల్లా - శ్రీకాకుళం (648).
* రాష్ట్రంలో ఉన్న మొత్తం బ్యాంకు బ్రాంచులు - 7,515. అత్యధిక బ్యాంకు బ్రాంచులు కృష్ణా ్బ888్శ జిల్లాలో ఉంటే, అత్యల్పంగా విజయనగరం (294) లో ఉన్నాయి.
ప్రజా పంపిణీ వ్యవస్థ (2021 డిసెంబరు నాటికి)
* రాష్ట్రంలో మొత్తం రేషన్ షాపుల సంఖ్య 29,784. రేషన్ షాపులు ఎక్కువగా ఉన్న జిల్లా అనంతపురం (3,012), తక్కువ ఉన్న జిల్లా - విజయనగరం (1,407).
* రాష్ట్రంలో మొత్తం తెల్లరేషన్ కార్డుల సంఖ్య 1,35,77,939. తెల్లరేషన్ కార్డులు ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాలో ఉంటే, తక్కువ సంఖ్యలో విజయనగరంలో ఉన్నాయి.
* రాష్ట్రంలో మొత్తం అన్నపూర్ణ కార్డుల సంఖ్య 7,251. ఇవి ఎక్కువగా ఉన్న జిల్లా- తూర్పు గోదావరి, తక్కువ ఉన్న జిల్లా కృష్ణా.
* రాష్ట్రంలో ఉన్న మొత్తం అంత్యోదయ అన్నయోజన కార్డులు- 8,61,696. అంత్యోదయ అన్నయోజన కార్డులు ఎక్కువగా అనంతపురంలో ఉండగా, తక్కువ సంఖ్యలో ప్రకాశంలో ఉన్నాయి.
ఆహారధాన్యాల ఉత్పత్తి - విస్తీర్ణం
ఏడాది | విస్తీర్ణం (లక్షల హెక్టార్లు) | ఉత్పత్తి (లక్షల టన్నులు) |
2017 - 18 | 42.06 | 167.22 |
2018 - 19 | 40.23 | 149.56 |
2019 - 20 | 41.45 | 175.12 |
2020 - 21 | 43.01 | 165.04 |
2021 - 22 | 41.44 | 169.57 |
రాష్ట్రంలో MSMEల పెట్టుబడి కింది విధంగా ఉంది. (2020 జూన్ 1 నుంచి)
పరిశ్రమ | పెట్టుబడి | టర్నోవర్ |
సూక్ష్మ పరిశ్రమ (Micro) | కోటి వరకు | 5 కోట్ల వరకు |
చిన్నతరహా పరిశ్రమ (Small) | 10 కోట్ల వరకు | 50 కోట్ల వరకు |
మధ్యతరహా పరిశ్రమ (Middle) | 50 కోట్ల వరకు | 250 కోట్ల వరకు |