* అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ
* మే 20న పరీక్షలు ప్రారంభం
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2024 నిర్వహణకు విద్యాశాఖ సమాయత్తమైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ఉపయోగపడే మాక్టెస్టులను పాఠశాల విద్యా శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది 2.86 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టులను మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించనుంది. టెట్ను 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) రాయడానికి అర్హులు.
తెలంగాణ టెట్ మాక్ టెస్టు కోసం క్లిక్ చేయండి
TS TET Previous Question Papers