1. విజయనగర సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం?
జ: క్రీ.శ. 1336
2. ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పాటైంది?
జ: మహ్మద్ బిన్ తుగ్లక్
3. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ నదిఒడ్డున స్థాపించారు?
జ: తుంగభద్ర
4. సంగమ వంశంలో గొప్పవాడు?
జ: రెండో దేవరాయలు
5. పారశీక రాయబారి అబ్దుల్ రజాక్ ఏ విజయనగర చక్రవర్తి కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు?
జ: రెండో దేవరాయలు
6. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాల వరుస క్రమాన్ని గుర్తించండి.
1. సంగమ 2. తుళువ 3. అరవీటి 4. సాళువ
జ: 1, 4, 2, 3
7. శ్రీకృష్ణదేవరాయలు ఏ సంవత్సరంలో పోర్చుగీసువారితో సంధి చేసుకున్నాడు?
జ: క్రీ.శ. 1510
8. శ్రీకృష్ణ దేవరాయలు విజయస్తంభాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు?
జ: సింహాచలం
9. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన విదేశీయుడు ఎవరు?
జ: డోమింగ్ పేయిజ్
10. ఆముక్తమాల్యద రచయిత ఎవరు?
జ: శ్రీకృష్ణదేవరాయలు
11. శిల్పులు రామాయణగాథను ఏ ఆలయ గోడలపై చెక్కారు?
జ: హజార రామాలయం
12. తళ్లికోట యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
జ: క్రీ.శ. 1565
13. కృష్ణదేవరాయల పండిత సభను ఏమనేవారు?
జ: భువన విజయం
14. శ్రీకృష్ణదేవరాయలు ఏ సంవత్సరంలో మరణించాడు?
జ: క్రీ.శ. 1529
15. విజయనగర రాజ్య ముఖ్య ఉద్దేశం?
జ: హిందూ ధర్మరక్షణ
16. ఏ వంశం రాజుల కాలం నుంచి వైష్ణవం బాగా వాడుకలోకి వచ్చింది?
జ: సాళువ