మాదిరి ప్రశ్నలు
1. 'మానవుడి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తి యుక్తులను, సామర్థ్యాలను గుర్తించి సమగ్రంగా బహిర్గతంచేసే సాధనం విద్య' అని నిర్వచించిన వారెవరు?
జ: గాంధీజీ
2. ముందుగా నిర్ణయించి, విద్యార్థుల్లో బోధన ద్వారా తీసుకు రాగలిగే, పరిశీలించగలిగే, కొలవగలిగే ప్రవర్తనా పరివర్తన ఏది?
జ: విద్యా లక్ష్యం
3. 'స్పెసిమన్ ఆబ్జెక్టివ్ టెస్ట్' గ్రంథ రచయిత ఎవరు?
జ: గి బెరిచ్
4. భావావేశ రంగంపై విశేషంగా కృషిచేసిన వారెవరు?
జ: ఆర్. క్రాత్వాల్
5. సాహితీవేత్తల అభిప్రాయం ప్రకారం నాతి సులభం, నాతి కఠినం అయిన రచనలు దేనికి చెందుతాయి?
జ: ద్రాక్ష పాకం
6. 'తలమే బ్రహ్మకునైన నీ నగ మహత్వం బెన్న...' అనే పద్యంలోని ధ్వన్యర్థాన్ని విద్యార్థి వివరించి చెప్పాడు. ఇందులో ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం-
జ: రసానుభూతి
7. ఒక పదానికి సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలను తెలిపేది ఏది?
జ: వ్యుత్పత్యర్థం
8. వాక్యరూపంలోని సాధారణీకరణాలేవి?
జ: సామెతలు
9. విద్యా ప్రణాళికల రూపకల్పనకు ఉపకరించేవి-
జ: గమ్యాలు
10. మూర్త సన్నివేశంలో జరిగే 'గుర్తించడం' అనే భావన ఏ లక్ష్యానికి స్పష్టీకరణ?
జ: జ్ఞానం
11. 'సంగీతమంతా సరిగమపదని స్వరాల్లో ఇమిడి ఉన్నట్టే, సాహిత్యం కూడా కొన్ని వర్ణాల సముదాయంలో ఇమిడి ఉంది' అని సాహిత్య స్వభావం గురించి పేర్కొన్న కవి ఎవరు?
జ: మాఘుడు
12. 'లక్ష్యాలు- సృష్టీకరణాలు' ఎవరికి సంబంధించినవి?
జ: ఉపాధ్యాయుడు, విద్యార్థి
13. 'విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన రేకెత్తించేది విద్య' అని నిర్వచించిందెవరు?
జ: జిడ్డు కృష్ణమూర్తి
14. బోధనా లక్ష్యాలను టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్లో వివరించిన ప్రసిద్ధ విద్యావేత్త ఎవరు?
జ: బెంజిమన్ బ్లూమ్
15. విద్యార్థులకు ఉపాధ్యాయుడు కొన్ని పదాలను ఇచ్చి, వాటిని ఒకే లక్షణం ఉన్న సమూహాలుగా వర్గీకరించాలని చెప్పాడు. ఇది ఏ లక్ష్యం పరిధిలోకి వస్తుంది?
జ: అవగాహన
16. 'మనసును ఒకదానివైపు ఆకర్షింపజేసేది అభిరుచి'- అని నిర్వచించింది ఎవరు?
జ: రాస్
17. విద్యార్థి 'మతిహీనుడు' పాఠం ద్వారా 'అయోగ్యుడికి అన్నీ ఇవ్వరాదు' అనే నీతిని గ్రహించాడు. అయితే విద్యార్థి సాధించిన లక్ష్యం-
జ: సంస్కృతీ సంప్రదాయాలు
18. 'ప్రౌఢి పరికింప సంస్కృత భాష యండ్రు, పలుకు నుడికారమున నాంధ్ర భాషయండ్రు' అన్న కవి ఎవరు?
జ: శ్రీనాథుడు
19. గమ్యాలు, ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, సృష్టీకరణలను నిర్వచించిన 'మ్యాన్యువల్ ఫర్ స్కూల్ లెవల్ సెమినార్ను' ప్రచురించింది-
జ: ఎస్సీఈఆర్టీ
20. 'పూర్వ గాథా పరిచయం' జ్ఞాన లక్ష్యంలో ఏ విభాగానికి చెందింది?
జ: విషయ జ్ఞానం
21. 'సన్నిహిత సంబంధం ఉన్న అంశాల సామ్య భేదాలను కనుగొంటాడు' - అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది?
జ: అవగాహన
22. ఏదైనా ఒకవిషయంపై 'ఒకే వ్యాఖ్య' చేయడానికి దోహదం చేసేవేవి?
జ: సంవృత లక్ష్యం
23. తెలుగు భాషలోని బోధనా లక్ష్యాలెన్ని?
జ: 10
24. గంభీర భావాలను వివేచించడం ఏ లక్ష్యానికి స్పష్టీకరణ?
జ: అవగాహన
25. హావభావాలను ప్రదర్శించడం ఏ రంగానికి చెందింది?
జ: మానసిక చలనాత్మక రంగం
26. శ్రీకృష్ణదేవరాయల 'ఆముక్తమాల్యద' దేనికి ఉదాహరణ?
జ: నారికేళపాకం
27. విద్యార్థి 'బొండు మల్లెలు' పాఠంలోని 'వంకాయలమ్మే మనిషి' పాత్ర ఔచిత్యాన్ని వివరించి చెప్పాడు. అయితే విద్యార్థి ఏ లక్ష్యాన్ని సాధించాడు?
జ: రసానుభూతి
28. రసానుభూతి అనేది-
జ: హృదయగతమైంది
29. శ్రీకృష్ణలీలలు అనే పాఠాన్ని విద్యార్థి 'సంభాషణ' ప్రక్రియలోకి మార్చాడు. విద్యార్థి సాధించిన లక్ష్యం-
జ: సృజనాత్మకత
30. 'అవబోధం' అని ఏ లక్ష్యానికి పేరు?
జ: అవగాహన
31. విద్యార్థి సవర్ణదీర్ఘ సంధి, అత్వసంధి మధ్య ఉన్న పోలికలను చెప్పగలిగాడు. ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి?
జ: అవగాహన
32. ఒక విద్యార్థి వేమన పద్యాలను సేకరించి చదివాడు ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం-
జ: భాషాభిరుచి
33. జ్ఞాన, భావావేశ, మానసిక చలనాత్మక రంగాల్లో సరైన మూల్యాంకన సాధనాలు లేని రంగం ఏది?
జ: భావావేశ రంగం
34. 'కొండంత భావనను ముత్యమంత పదంలో ఇమిడ్చి చెప్పే' స్వభావం ఉన్నవేవి?
జ: జాతీయాలు
35. 'రాజు మరణించె నొక తార రాలిపోయె కవియు మరణించె నొకతార గగనమెక్కె రాజు జీవించె రాతి విగ్రహములందు సుకవి జీవించె ప్రజల నాల్కలయందు'- పద్యానికి విద్యార్థి 'రాజు-సుకవి' అనే శీర్షికను సూచించాడు. అయితే విద్యార్థి సాధించిన లక్ష్యం-
జ: సృజనాత్మకత
36. 'పిల్ల కాకికేం తెలుస్తుంది ఉండేలు దెబ్బ' అనేది-
జ: సామెత
37. 'విద్యార్థి ఆయా అంశాల సందర్భాన్ని వివరించి వ్యాఖ్య చేయగలుగుతాడు'. ఇది ఏ బోధనా లక్ష్యానికి చెందింది?
జ: అవగాహన
38. 'నిదానమే ప్రదానం' అనే వాక్యంలోని దోషాన్ని గుర్తించి 'నిదానమే ప్రధానం' అని సరిచేశాడు. ఇందులో విద్యార్థి సాధించిన లక్ష్యం-
జ: అవగాహన