మాదిరి ప్రశ్నలు
1. "The Technology of Teaching" గ్రంథకర్త ఎవరు?
జ: స్కిన్నర్
2. సూక్ష్మ బోధన అనేది?
జ: ఒక బోధనా మెలకువ
3. ఫ్రాన్సిస్ చేస్, జె.ఎల్. ట్రంప్ అనే విద్యావేత్తలు వ్యాప్తి చేసిన భావన ఏది?
జ: బృంద బోధన
4. 'పునర్బలనం' ఆవశ్యకతను చెప్పిన ఆధునిక బోధనా వ్యూహం ఏది?
జ: కార్యక్రమయుత బోధన
5. సూక్ష్మ బోధన లక్షణాల్లో ఇది ఒకటి ......
జ: బోధనా సంక్లిష్టతలను తగ్గించడం.
6. బృంద బోధన 1957 లో ఎక్కడ అమలైంది?
జ: లెగ్జింగ్ టోన్
7. తిరిగి భర్తీ, నియంత్రణ అనే అంశాలకు విశేష ప్రాధాన్యం ఇచ్చిన విద్యార్థి కేంద్రీకృత అభ్యసన పద్ధతి .......
జ: కార్యక్రమయుత బోధన
8. 'సూక్ష్మ బోధన'లో బోధన తర్వాత వచ్చే సోపానం?
జ: పునర్బలనం
9. మూల్యాంకనం వెంటవెంటనే చేయడానికి, లోపాలను సవరించడానికి ఏ బోధనలో అవకాశం ఉంది?
జ: సూక్ష్మ బోధన
10. కొంత మంది ఉపాధ్యాయులు సమష్టిగా ఒకే పాఠాన్ని బోధించే పద్ధతి ........
జ: బృంద బోధన
11. కార్యక్రమయుత బోధన అంటే ఏమిటి?
జ: పాఠ్యాంశాన్ని చిన్న చిన్న భాగాలుగా బోధించడం.
12. 'బోధన - పునః బోధన' అనే పదబంధాలు ఏ బోధనకు సంబంధించినవి?
జ: సూక్ష్మ బోధన
13. అధ్యయనాంశాలను చిన్న చిన్న కృత్యాలుగా ఆకృతీకరించిన శాస్త్రవేత్త ఎవరు?
జ: గిల్బర్ట్
14. ఒక నైపుణ్యాన్ని సాధించడానికి ఎన్నిసార్లు బోధించాలి?
జ: నాలుగు సార్లు
15. ఏ బోధనలో విద్యార్థులు విషయ ఖండికలు, చట్రాల ద్వారా విషయాన్ని, భావనలను, నిర్వచనాలను గ్రహించి తప్పులను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటారు?
జ: కార్యక్రమయుత బోధన
16. గరిష్ఠ స్థాయిలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని ఏ బోధన ద్వారా పెంపొందించవచ్చు?
జ: బృంద బోధన
17. వ్యాకరణం, ఉపవాచకం, గద్యం, పద్యం మొదలైన భాషా ప్రక్రియలను బోధించే పద్ధతి ఏది?
జ: కార్యక్రమయుత బోధన
18. సూక్ష్మ బోధనలో బోధన సమయం ఎంత?
జ: 5 నిమిషాలు
19. ''ఇద్దరికంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒక ప్రణాళిక ప్రకారంగా, పరస్పర సహకారంతో బోధనను, మూల్యాంకనాన్ని నిర్వహించే విధానమే బృంద బోధన" అని నిర్వచించింది ఎవరు?
జ: ఎం.బి. నాయక్
20. బోధనా యంత్రాన్ని రూపొందించింది ఎవరు?
జ: బి.ఎఫ్. స్కిన్నర్
21. 'సూక్ష్మ బోధన' అనే పారిభాషిక పదాన్ని ఏ సంవత్సరంలో ఉపయోగించారు?
జ: 1963
22. సహజమైన అభిరుచికి చక్కటి ప్రత్యామ్నాయంగా ఏ బోధనను పేర్కొంటారు?
జ: బృంద బోధన
23. శిక్షణా సంస్థలకు వరప్రసాదం అని చెప్పదగిన బోధన ఏది?
జ: సూక్ష్మ బోధన
24. వివిధ పూర్వసేవ, సేవాంతర్గత స్థాయి ఉపాధ్యాయుల వృత్తి వికాసానికి ఉపకరించే బోధన ఏది?
జ: సూక్ష్మ బోధన
25. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు తమ తమ నైపుణ్యాలను, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని చేసే బోధన ఏది?
జ: బృంద బోధన