మాదిరి ప్రశ్నలు
1. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి -
జ: కాళేశ్వరం
2. పింగళి వెంకయ్యతోపాటు జాతీయ పతాకను రూపొందించింది -
జ: సిస్టర్ నివేదిత
3. సరైన వాక్యం గుర్తించండి.
1) గతం కంటే వర్తమానం ముఖ్యం. 2) వర్తమానం కంటే గతం ముఖ్యం.
3) వర్తమానం కంటే భవిష్యత్తు ముఖ్యం. 4) గతం, వర్తమానాలు భవిష్యత్తుకు సోపానాలు.
జ: గతం, వర్తమానాలు భవిష్యత్తుకు సోపానాలు.
4. 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో. మంచి పుస్తకం కొనుక్కో' అన్నది -
జ: కందుకూరి వీరేశలింగం.
5. 'గ్రంథాలయ పితామహ' అని ఎవరిని అంటారు?
జ: అయ్యంకి వెంకట రమణయ్య
6. 'రామరాజీయం' వ్యాస సంపుటి రాసిందెవరు?
జ: బి. రామరాజు
7. నన్నయను ఇలా అంటారు -
1) ఆదికవి 2) వాగనుశాసనుడు 3) శబ్దశాసనుడు 4) అన్నీ
జ: అన్నీ
8. 'కరుణశ్రీ'ఎవరు?
జ: జంధ్యాల పాపయ్యశాస్త్రి
9. ఎనిమిదో ఏటనే కంద పద్యం రాసిన కవి ఎవరు?
జ: శ్రీశ్రీ
10. తొలి యాత్రారచన ఏది?
జ: కాశీ యాత్రాచరిత్ర
11. 'సత్యహరిశ్చంద్ర' నాటక రచయిత -
జ: బలిజేపల్లి లక్ష్మీకాంతం
12. వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన నవల -
జ: ప్రజల మనిషి
13. 'గజల్' అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
జ: ఉర్దూ
14. 'మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది' అన్నది?
జ: సినారె
15. గొబ్బూరి నరసరాజుకి అంకితమిచ్చిన రచన -
జ: రామాభ్యుదయం
16. పద్మశ్రీ పొందిన 'ఆమ్రపాలి' కావ్య కవి?
జ: జ్ఞానానంద కవి
17. 'హైదరాబాద్ స్వాతంత్య్రోద్యమ చరిత్ర' రాసిందెవరు?
జ: వెల్తుర్ది మాణిక్యరావు
18. జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన కావ్యమేది?
1) వేయిపడగలు 2) విశ్వంభర 3) పాకుడురాళ్లు 4) శివతాండవం
జ: విశ్వంభర