మాదిరి ప్రశ్నలు
1. విప్లవ కవుల్లో మొదట పేర్కొనదగిన కవి -
సమాధానం: శ్రీశ్రీ
2. శివసాగర్ రచన -
1) ఉద్యమం నెలబాలుడు 2) అగ్నిశ్వాస 3) పునాదిరాయి 4) చండాల చాటింపు
సమాధానం: 1 (ఉద్యమం నెలబాలుడు)
3. విరసం కవితా సంపుటి -
1) విప్లవం 2) ఝంఝ 3) రెంజిం 4) దివిటి
సమాధానం: 2 (ఝంఝ)
4. శ్రీశ్రీ షష్ఠిపూర్తి సభలో రచయితలకు సవాల్ కరపత్రం పంచినవారు-
సమాధానం: విశాఖ విద్యార్థులు
5. 'ఎరుపంటే కొందరికి భయం. పసిపిల్లలు వారి కంటే నయం' అన్న విప్లవ కవి -
సమాధానం: సుబ్బారావు పాణిగ్రాహి
6. ఆరుమంది కవులు ప్రారంభించిన కవితా ధోరణి -
సమాధానం: దిగంబర కవిత
7. 'నా చెల్లీ చంద్రమ్మ' పాట రచయిత -
సమాధానం: శివసాగర్
8. పాటకు ప్రాచుర్యాన్ని కలిగించిన కవితా ఉద్యమం-
సమాధానం: విప్లవ కవితా ఉద్యమం
9. విరసం తొలి అధ్యక్షుడు -
సమాధానం: శ్రీశ్రీ
10. 'మరో ప్రస్థానం' ఎవరి రచన?
సమాధానం: శ్రీశ్రీ
11. పంచతంత్ర కథలను ఆంగ్లంలోకి అనువదించినవారు -
సమాధానం: బెన్ఫె
12. జానపదుల ప్రస్తావన కనిపించే గ్రంథం-
సమాధానం: భారతం
13. 'గుమ్మడుపాట' ఏ కోవకు చెందిన గేయం?
సమాధానం: భాగవత గేయం
14. తాండ్ర పాపారాయుడు, విజయరామరాజ గజపతి, బుస్సీ లాంటి పాత్రలుండే చారిత్రక గేయం -
సమాధానం: బొబ్బిలి యుద్ధం
15. 'సర్వాయి పాపడు కథ' - ఎలాంటి రచన?
సమాధానం: అద్భుతరస గేయం
16. 'రోకటి పాటలు' ఏ పద్యాల్లో ఉంటాయని విన్నకోట పెద్దన చెప్పాడు?
సమాధానం: తరువోజ
17. శారదకాండ్రు ఏ ప్రాంతంలో వ్యాపించి ఉన్నారు?
సమాధానం: తెలంగాణ
18. తెలుగు జానపద సాహిత్యాన్ని మానవ శాస్త్ర దృష్టితో పరిశీలించిన తొలి మహిళా పరిశోధకురాలు -
సమాధానం: నాయని కృష్ణకుమారి
19. జానపద గేయాల్లో 'రామాయణపు పాటలు' ఏ శాఖకు చెందినవి?
సమాధానం: పౌరాణిక గేయాలు
20. 'బిరుదురాజు రామరాజు' ఎందుకు ప్రసిద్ధులు?
సమాధానం: జానపద సాహిత్యంపై మొదట పరిశోధన చేసినందుకు
21. కన్నడ సాహిత్యంలోని 'దాసపదావళి' లాంటివి తెలుగులో - వేటికి సామీప్యంగా ఉంటాయి?
సమాధానం: పదకవితలు
22. కిందివారిలో విప్లవ కవులు -
ఎ. శ్రీశ్రీ బి. సముద్రాల సి. వరవరరావు డి. ఆత్రేయ
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) ఎ, డి
సమాధానం: 3 (ఎ, సి)
23. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం కోరే సంస్థ-
సమాధానం: విరసం
24. 'సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మో - సినబోయి కూర్చున్నావెందుకమ్మా' పాట రచయిత -
సమాధానం: గద్దర్
25. ఊగరా ఊగరా ఊరికొయ్య నందుకుని ఊగరా...అన్న కవి -
సమాధానం: శ్రీశ్రీ
26. విప్లవ పోరాటంలో పాల్గొని ఉరిశిక్షకు గురైన భూమయ్య, క్రిష్ణాగౌడ్లపై శ్రీశ్రీ రచించిన స్మృతి గీతం
సమాధానం: భూమ్యాకాశాలు
27. 'లక్ష నక్షత్రాలు రాలందే ఉద్యమ ఉదయం ఉదయించదు' అన్న కవి-
సమాధానం: జ్వాలాముఖి
28. 'మా గుండె మా జెండా - మా మనసే మాకండ' - అన్న కవి ఎవరు?
సమాధానం: కె.వి.రమణారెడ్డి
29. 'తుది పయనం - తొలి విజయం' ఎవరి విప్లవ గీతం?
సమాధానం: శ్రీశ్రీ
30. 'విషం కలిసిన పాయసం మన స్వరాజ్యం - డబ్బున్న భడవా పోషించే ఉంపుడుగత్తె మన ప్రజాస్వామ్యం' అన్న కవులు
సమాధానం: తిరగబడు కవులు