మాదిరి ప్రశ్నలు
1. జానపద గేయాలపై మొదటగా పరిశోధన చేసింది ఎవరు?
జ: బిరుదురాజు రామరాజు
2. కసిరెడ్డి వెంకటరెడ్డి రాసిన జానపద గ్రంథం ఏది?
జ: పొడుపు కథలు
3. పిల్లల పాటల్లో ఏది ప్రధానం?
జ: లయ
4. ఏరువాక పాటలు, రోకలి పాటలు దేనికి చెందుతాయి?
జ: శ్రామికుల పాటలు
5. స్థల పురాణాలకు సంబంధించినవి దేనికి చెందుతాయి?
జ: ఐతిహ్యాలు
6. కృష్ణా జిల్లాలోని 'కూచిపూడి' దేనికి ప్రసిద్ధి?
జ: భాగవత కళకి
7. 'మావాఁ పెళ్లాడతావా అంటే నాకెవరిస్తార్రా అబ్బీ' అనే సామెత...?
1) తత్త్వానికి సంబంధించింది 2) ఐతిహాసానికి సంబంధించింది
3) ప్రకృతికి సంబంధించింది 4) హాస్యానికి సంబంధించింది
జ: 4(హాస్యానికి సంబంధించింది)
8. 'కత్తి మీద సాము' అనేది-
జ: జాతీయం
9. కిందివాటిలో పొడుపు కథ ఏది?
1) చింత చచ్చినా పులుపు చావదు 2) నిదానం ప్రధానం
3) ఎర్రటి పండు.. ఈగైనా వాలదు 4) ఏదీకాదు
జ: 3(ఎర్రటి పండు.. ఈగైనా వాలదు)
10. జానపద సాహిత్యం అంటే...?
జ: ప్రజల సాహిత్యం