మాదిరి ప్రశ్నలు
1. శ్రీవాణీ గిరిజాశ్చిరాయదధతో.... అన్న ఆదిపద్యకర్త ఎవరు?
జ: నన్నయ
2. శారదరాత్రులుజ్జ్వల రసత్తర... అనే నన్నయ పద్యం కింది ఏ పర్వంలోనిది?
ఎ) ఆదిపర్వం బి) సభాపర్వం సి) అరణ్యపర్వం డి) ఉద్యోగపర్వం
జ: సి (అరణ్యపర్వం )
3. నన్నయ పూర్తిచేసిన పర్వాల సంఖ్య
జ: 2
4. ఆంధ్రకవితా విశారధుడు అని నన్నయను కీర్తించినవారు
జ: తిక్కన
5. 'ఆంధ్రకవితాగురుడు' అని నన్నయను కీర్తించినవారు
జ: మారన
6. సారమతింగవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి.... పద్యరచయిత
జ: నన్నయ
7. భారత భారతీసముద్రము దరియంగనీదను... పద్యరచయిత
జ: నన్నయ
8. గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్... పద్యరచయిత
జ: నన్నయ
9. భాషింతు నన్నయభట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌడి... పద్యరచయిత
జ: శ్రీనాథుడు
10. బహువన పాదపాబ్ధికుల పర్వత... పద్య రచయిత
జ: నన్నయ
11. కిందివారిలో 'కవిరాక్షసుడు' అనే బిరుదు ఎవరిది?
ఎ) వేములవాడ భీమకవి బి) నారాయణభట్టు
సి) నన్నయ డి) మారన
జ: ఎ (వేములవాడ భీమకవి )
12. తెలుగులో వెలసిన మొదటి ఛందోలక్షణ గ్రంథం
జ: కవిజనాశ్రయం
13. 'కవిజనాశ్రయుడు, శ్రావకాభరణుడు' అనే బిరుదు ఉన్న కవి
జ: మల్లియ రేచన
14. 'వార్తయందు జగము వర్థిల్లుచున్నది' అన్న మహాకవి ఎవరు?
జ: నన్నయ
15. నుతజల పూరితంబులగు నూతులు నూఱింటికంటె... పద్య రచయిత
జ: నన్నయ
16. నన్నెచోడుడు ఏ శతాబ్దానికి చెందినవాడు?
జ: 12
17. 'కవిరాజశిఖామణి' అనే బిరుదు ఎవరిది?
జ: నన్నెచోడుడు
18. నన్నెచోడుడు 'వస్తుకావ్యాబ్జరవి' అని ఎవరిని పొగిడాడు?
జ: వాల్మీకిని
19. 'జాను తెనుగు, వస్తుకవిత, దేశీయమార్గము' అనే శబ్దాలను ప్రయోగించినవారు
జ: నన్నెచోడుడు
20. ప్రబంధ శబ్దాన్ని ప్రయోగించినవారిలో ప్రథముడు
జ: నన్నెచోడుడు
21. కిందివారిలో శివత్రయంలో లేనివారు
ఎ) పాల్కురికి సోమన బి) పండితారాధ్యుడు
సి) నన్నెచోడుడు డి) మల్లికార్జున పండితుడు
జ: డి (మల్లికార్జున పండితుడు)
22. 'బసవపురాణం'లోని ఆశ్వాసాల సంఖ్య
జ: 6
23. పాల్కురికి సోమనాథుడి అలభ్యకృతి
జ: మల్లమదేవి పురాణం
24. పాల్కురికి సోమన 'అనుభవసారాన్ని' ఎవరికి అంకితం ఇచ్చారు?
జ: గొడగి త్రిపురాంతకుడు
25. వృషాధిపా శతకంలోని మకుటం
జ: బసవా! బసవా! బసవా! వృషాధిపా
26. తెలుగు నుంచి సంస్కృతంలోకి అనువాదమైన సోమన రచన
జ: బసవ పురాణం
27. అల్పాక్షరములతో అనల్పార్థ రచన చేయగల సమర్థుడు ఎవరు?
జ: పాల్కురికి సోమన
28. 'తెలుగు తోటలో తెలుగుకోసం, తెలుగు ఛందస్సు ద్విపదలో పాటలు పాడిన కోకిల పాల్కురికి సోమన' అని ఎవరు అన్నారు?
జ: ఆరుద్ర
29. శివా, అజా, రుద్రా, మహేశా.... అనే మకుటంతో సాగే శతకం
జ: శివతత్త్వసారం
30. కిందివారిలో పండిత త్రయంలో లేనివారు
ఎ) శ్రీపతి పండితుడు బి) మంచన పండితుడు
సి) మల్లికార్జున పండితుడు డి) పాల్కురికి
జ: సి (మల్లికార్జున పండితుడు)
31. 'నమశ్శివాయ' రగడను రచించింది
జ: చక్రపాణి రంగన
32. సర్వేశ్వర శతకాన్ని రచించింది ఎవరు?
జ: యథావాక్కుల అన్నమయ్య
33. 'కావ్యాలంకార చూడామణి' అనే అలంకార గ్రంథ్రాన్ని రచించింది
జ: విన్నకోట పెద్దన
34. శ్రీరాముడి దయచేతను నారూఢిగ... అనే పద్యం గల శతకం
జ: సుమతీ
35. తిక్కన మహాభారతాన్ని ఎవరికి అంకితం చేశాడు
జ: హరిహరనాథుడికి
36. తిక్కన అంకితం పొందిన గ్రంథం
జ: దశకుమార చరిత్ర
37. 'నానారసాభ్యుదయోల్లాసి' అని తిక్కన ఏ పర్వాన్ని పేర్కొన్నాడు?
జ: విరాట
38. కౌరవుల తరఫున పాండవుల వద్దకు మొదటిసారి రాయబారిగా వచ్చింది ఎవరు?
జ: సంజయుడు
39. 'తను గావించిన సృష్టి తక్కొరుల చేతగాదు' అని తిక్కనను పొగిడింది
జ: ఎర్రన
40. 'కవితఁజెప్పి ఉభయకవిమిత్రుమెప్పింపనరది బ్రహ్మకైన' అని చెప్పింది
జ: కేతన
41. 'అభినవ దండి' బిరుదు ఉన్న కవి
జ: కేతన
42. తెలుగులో వెలసిన మొదటి స్వతంత్ర వ్యాకరణ గ్రంథం
జ: ఆంధ్రభాషాభూషణం
43. మార్కండేయ పురాణం కృతిభర్త
జ: నాగయగన్నా
44. అష్టాదశ పురాణాల్లో 'మార్కండేయ పురాణం' ఎన్నోది?
జ: 7
45. మనుచరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానానికి మూలమైన పురాణం
జ: మార్కండేయ
46. కేయూర బాహుచరిత్ర గ్రంథకర్త ఎవరు?
జ: మంచన
47. రంగనాథ రామాయణం కృతిభర్త
జ: విఠల రంగనాథుడు
48. గోనబుద్దారెడ్డి కాలం
జ: 13వ శతాబ్దం
49. 'తల్లి సంస్కృతంబే యెల్ల భాషలకు' అని చెప్పింది
జ: కేతన
50. మంచన ఏ శతాబ్దానికి చెందిన కవి?
జ: 14
51. నన్నయభట్టు, తిక్కన కవినాథులు చూసిన త్రోవ పావనం.. అనే పద్య రచయిత ఎవరు?
జ: ఎర్రన
52. ఎర్రన అలభ్య రచన
జ: రామాయణం
53. 'శంభుదాసుడు మధ్యనాయకశ్రీ' అని వర్ణించింది
జ: చింతలపూడి ఎర్రన
54. 'పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరునిరేవ సూక్తి వైచిత్రినొక్కొక్కమాటు' అని అన్నది
జ: శ్రీనాథుడు
55. ఎర్రన హరివంశాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు?
జ: ప్రోలయ వేమారెడ్డి
56. భారతానికి పరిశిష్టగ్రంథం
జ: హరివంశం
57. తెలుగులో తొలి గోప కవిత్వం ఏ గ్రంథంలో కనిపిస్తుంది?
జ: హరివంశం
58. నాచన సోముడు ఏ శతాబ్దానికి చెందినవాడు?
జ: 14
59. నాచన సోముడి గ్రంథం
జ: ఉత్తర హరివంశం
60. సంవిధాన చక్రవర్తి, నవీనగుణసనాథుడు, సకల భాషాభూషణ తదితర బిరుదులు ఉన్న కవి
జ: సోమన
61. చంపూ పద్ధతిలో వెలువడిన మొదటి రామాయణం
జ: భాస్కర రామాయణం
62. కిందివారిలో సకల సుకవిజన వినుత యశస్కర బిరుదు గల కవి ఎవరు?
ఎ) గోనబుద్దారెడ్డి బి) హుళ్లక్కి భాస్కరుడు
సి) సోమన డి) మల్లికార్జున భట్టు
జ: బి (హుళ్లక్కి భాస్కరుడు)
63. భాస్కర రామాయణ కృతిభర్త
జ: సాహిణిమారన
64. శ్రీనాథుడి చాటువులను సేకరించి 'శృంగార శ్రీనాథము' అని పేరు పెట్టింది ఎవరు?
జ: వేటూరి ప్రభాకరశాస్త్రి
65. శ్రీనాథుడు చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచించిన గ్రంథం
జ: మరుత్తరాట్చరిత్ర
66. వీరభద్రారెడ్డి దగ్గర ఆస్థాన కవి ఎవరు?
జ: శ్రీనాథుడు
67. నిండు జవ్వనములో రచంచిన ప్రౌఢ గ్రంథం
జ: శృంగారనైషధం
68. నూనూగుమీసాల నూత్నయౌవనంబులో శ్రీనాథుడు రచించిన గ్రంథం ఏది?
జ: కాశీఖండం
69. శ్రీనాథుడి 'పండితారాధ్య చరిత్ర' కృతిభర్త.
జ: ప్రెగడయ్య
70. హరవిలాసం కృతి భర్త
జ: అవచి తిప్పయ్యశెట్టి
71. కాశీఖండం గ్రంథానికి మూలం
జ: స్కందపురాణం
72. తెలుగులో వెలసిన మొదటి హేళన గ్రంథం
జ: క్రీడాభిరామం
73. కాశీఖండాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు?
జ: వీరభద్రారెడ్డి
74. సుకుమార చరిత్రకు ఉన్న మరో పేరు
జ: శివరాత్రి మహాత్మ్యం
75. ముమ్మడి శాంతయ్య అంకితం పొందిన గ్రంథం
జ: శివరాత్రి మహాత్మ్యం
76. దివిజ కవివరు గుండియలే దిగ్గురనగ......చాటువు రచయిత
జ: శ్రీనాథుడు
77. 'నా కవిత్వంబు నిజంబు కర్ణాట భాష' అన్నకవి
జ: శ్రీనాథుడు
78. భాగవతంలో పోతన అద్భుతంగా రచించిన స్కంధం ఏది?
జ: దశమ
79. భాగవతంలో ద్వాదశ స్కంధాన్ని ఎవరు రచించారు?
జ: వెలిగందలనారయ
80. భాగవతంలో ప్రథమస్కంధాన్ని రచించింది
జ: పోతన
81. 'పోతన తెలుగుల పుణ్యపేటి' అని పోతనను పొగిడింది ఎవరు?
జ: విశ్వనాథ సత్యనారాయణ
82. శ్రీ కైవల్యపదంబు చేరుటకై చింతించెదన్.. పద్య రచయిత
జ: పోతన
83. అలవైకుంఠపురములో నగరిలో... అనే పద్యాన్ని రాసింది ఎవరు?
జ: పోతన
84. మందార మకరంద మాధుర్యమును దేలు.. పద్య రచయిత ఎవరు?
జ: పోతన
85. జక్కన ఏ శతాబ్దానికి చెందిన కవి?
జ: 15
86. విక్రమార్క చరిత్ర కృతిభర్త
జ: వెన్నెలకంటి సిద్ధనామాత్యుడు
87. నాచికేతోపాఖ్యానము కృతికర్త
జ: దుగ్గన
88. బోజరాజీయము గ్రంథకర్త
జ: అనంతామాత్యుడు
89. బోజరాజీయము కృతిభర్త
జ: అహోబిలదేవుడు
90. 'ప్రతివాదమదగజ పంచానన' అనే బిరుదు గల కవి
జ: గౌరన
91. సింహాసన ద్వాత్రింశికలోని కథల సంఖ్య
జ: 32
92. సింహాసన ద్వాత్రింశిక కృతిభర్త
జ: హరిహరనాథుడు
93. పంచతంత్రాన్ని అంకితం పొందింది ఎవరు?
జ: బసవరాజు
94. కిందివాటిలో పిల్లలమర్రి పినవీరభద్రుడి కృతి ఏది?
ఎ) శృంగార శాకుంతలం బి) పంచతంత్రం
సి) ప్రమీలకథ డి) చంద్రహాస చరిత్ర
జ: ఎ (శృంగార శాకుంతలం)
95. జైమినీ భరత కృతిభర్త
జ: సాళువ నరసింహరాయలు
96. తుళువ నరసరాయలు అంకితం తీసుకున్నపురాణం ఏది?
జ: వరాహపురాణం
97. 'శృంగార మంజరీ' అనే ద్విపద కావ్యాలను రచించింది ఎవరు?
జ: అన్నమయ్య
98. 'చప్పిడి పురాణం' అని ఏ పురాణానికి పేరు?
జ: వరాహపురాణం
99. 'కవితార్కిక కేసరి, వేదాంతా చార్య' అనే బిరుదు గల కవి
జ: పెద్దతిరుమలాచార్య
100. తెలుగులో వెలసిన మొదటి సంకలన గ్రంథం
జ: సకలనీతి శాస్త్రసమ్మతము
101. కిందివారిలో 'లీలావతి గణితం' గ్రంథకర్త ఎవరు?
ఎ) అన్నమయ్య బి) తాళ్లపాక తిమ్మక్క
సి) తాళ్లపాక చిన్నన్న డి) పెద్ద తిరుమలాచార్యులు
జ: బి (తాళ్లపాక తిమ్మక్క)
102. 'అష్టభాషా చక్రవర్తి' అనే బిరుదు ఉన్న కవి ఎవరు?
జ: తాళ్లపాక చిన్నన్న
103. ఆముక్త మాల్యదలోని అశ్వాసాల సంఖ్య
జ: 7
104. శ్రీకృష్ణదేవరాయల చరిత్రను తెలిపే గ్రంథం
జ: రాయవాచకం
105. విష్ణుచిత్తుని వృత్తాంతం, మాలదాసరి కథ లాంటివి ఉన్న ప్రబంధం ఏది?
జ: ఆముక్తమాల్యద
106. మార్కండేయపురాణం నుంచి స్వీకరించిన ప్రబంధం
జ: మనుచరిత్ర
107. పెద్దనవలె కృతిచెప్పిన పెద్దనవలె... అని అల్లసాని పెద్దనను కీర్తించింది ఎవరు?
జ: కవిచౌడప్ప
108. అల్లసాని పెద్దన అలభ్యగ్రంథం
జ: హరికథాసారం
109. పారిజాతాపహరణంలోని అశ్వాసాల సంఖ్య
జ: 5
110. పారిజాతాపహరణం కృతిభర్త
జ: శ్రీకృష్ణదేవరాయలు
111. పారిజాతాపహరణానికి మూలం
జ: హరివంశం
112. నంది తిమ్మన బిరుదు
జ: సకల విద్యా వివేక చతురుడు
113. ఎదురైనచో తన మదకరీంద్రము... పద్య రచయిత
జ: అల్లసాని పెద్దన
114. అనవిని వేటు వడ్డ యురగాంగన.... పద్య రచయిత ఎవరు?
జ: నంది తిమ్మన
115. నత్కీరుని కథ, సాలెపురుగు - పాములకథ, వశిష్టుడి వృత్తాంతం కలిగిన ప్రబంధం
జ: శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం
116. ధూర్జటి బిరుదు
జ: సాహిత్యశ్రీవర
117. స్తుతిమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల కల్గెనీ అనే పద్యాన్ని రచించింది ఎవరు?
జ: శ్రీకృష్ణదేవరాయలు
118. శ్రీకాళహస్తీశ్వరా మహాత్మ్యానికి మూలం
జ: స్కందపురాణం
119. రాజుల్ మత్తుల్ వారిసేవ నరక ప్రాయంబు.... పద్య రచయిత ఎవరు?
జ: ధూర్జటి
120. రాజశేఖర చరిత్ర కృతిభర్త
జ: మల్లన
121. రామాభ్యుదయం ఎన్ని అశ్వాసాల గ్రంథం?
జ: 8
122. సకల కథాసార సంగ్రహం కృతికర్త
జ: రామభద్రుడు
123. కావ్యాలంకార సంగ్రాహానికి మరో పేరు
జ: నరసభూపాలీయం
124. వసుచరిత్ర ఎన్ని ఆశ్వాసాల కావ్యం?
జ: 6
125. వసుచరిత్రను అంకితం పొందిన వారు
జ: ఆరవీటి తిరుమలరాయలు
126. వసుచరిత్రకు మూలం
జ: ఆంధ్రమహాభారతం
127. కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములాద్య..... పద్య రచయిత ఎవరు?
జ: భట్టుమూర్తి
128. తెలుగు పద్యాల్లోని సత్తా తెలుసుకోవాలంటే వసుచరిత్ర చదవాలి అని చెప్పింది ఎవరు?
జ: కట్టమంచి రామలింగారెడ్డి
129. 'అల్లసాని అటు ఇటు ఏడ్చెను, తిమ్మన ముద్దుముద్దుగా ఏడ్చెను, భట్టుమూర్తి బావురమని ఏడ్చెను' అని చెప్పిన కవి
జ: తెనాలి రామలింగడు
130. 'రవి కాంచనిచో కవి కాంచునేగదా' అనే చాటువు చెప్పినకవి
జ: భట్టుమూర్తి
131. సూక్తిమతికోలాహల వృత్తాంతం, గిరికావసు రాజుల వృత్తాంతం ఉన్న కావ్యం
జ: వసుచరిత్ర
132. 'గరుడపురాణం' ఎవరి అలభ్య రచన
జ: పింగళిసూరన
133. తెలుగులో వెలసిన మొదటి ద్వర్థికావ్యం
జ: రాఘవ పాండవీయం
134. 'ఆకువీటి పెద్ద విరూపేశ్వరుడు' అంకితం పొందిన గ్రంథం
జ: రాఘవపాండవీయం
135. ఆ జాబిల్లి వెలుగు వెల్లికలు డాయంగలేర్ అనే పద్య రచయిత ఎవరు?
జ: భట్టుమూర్తి
136. 'కుమార భారతి' బిరుదు ఎవరికి ఉంది?
జ: తెనాలి రామలింగడు
137. పాండురంగ మహాత్మ్యానికి మూలం
జ: స్కందపురాణం
138. నిగమశర్మ కథ, పుండరీకుని కథ కలిగిన ప్రబంధం
జ: పాండురంగ మహాత్మ్యం
139. పాండురంగ మహాత్మ్యంలో దేని గురించి వర్ణించారు?
జ: తుంగభద్ర
140. పాండురంగ మహాత్మ్యం కృతిభర్త
జ: వీరూరి వేదాద్రి
141. ఉద్భటారాధ్య చరిత్రను అంకితం పొందినవారు
జ: ఊర దేచయ్య
142. కన్నాకటిలేదు గాని కంతుడవన్నా చాటువు రచయిత?
జ: తెనాలిరామలింగడు
143. 'రెండురెళ్ల ఆరు' గ్రంథ రచయిత ఎవరు?
జ: మల్లాది వెంకటకృష్ణ శాస్త్రి
144. తెలుగులో వెలసిన మొదటి యక్షగానం
జ: సుగ్రీవ విజయం
145. సుగ్రీవ విజయాన్ని కిందివారిలో ఎవరికి అంకితం ఇచ్చారు?
ఎ) సోమేశ్వరుడు బి) జనార్దనస్వామి
సి) కాసె సర్వప్ప డి) సంకుసాలన్నసింహ కవి
జ: బి (జనార్దనస్వామి)
146. తెలుగులో వెలసిన మొదటి అచ్చు తెనుగు కావ్యం
జ: యయాతి చరిత్ర
147. యయాతి చరిత్రను అంకింతం పొందినవారు
జ: అమీరుఖాను
148. 'వైజయంతీ విలాసా'నికి ఉన్న మరో పేరు
జ: యయాతి చరిత్ర
149. 'లింగమగుంట తిమ్మకవి' రచించిన గ్రంథం ఏది?
జ: సులక్షణిసారం
150. 'అభినవ వాగన శాసనుడు' బిరుదు గల కవి
జ: కూచిమంచి తిమ్మకవి
151. 'నీలా సుందరి పరిణయం, అచ్చతెనుగు రామాయణం' గ్రంథాలను రచించింది ఎవరు?
జ: కూచిమంచి తిమ్మకవి
152. 'సుభద్రా పరిణయం' గ్రంథకర్త
జ: కూచిమంచి జగ్గకవి
153. 'ఆంధ్ర చంద్రాలోకము, కవిజనరంజనం' గ్రంథాలను రచించింది ఎవరు?
జ: అడిదం సూరకవి
154. ఉత్తర రామాయణం, విష్ణుమాయా విలాసం (యక్షగానం) గ్రంథాల రచయిత
జ: కంకంటి పాపరాజు
155. రాధికా స్వాంతనమునకు ఉన్న మరో పేరు
జ: ఇళయాదేవీయము
156. 'నీతులు బూతులు లోక ఖ్యాతులు' అని చెప్పిన కవి ఎవరు?
జ: కవి చౌడప్ప
157. 'నలయాదవ రాఘవ పాండవీయం' గ్రంథకర్త
జ: మరిగంటి సింగరాచార్యులు
158. 'శబ్ద శాసన, ఆశుకవి ప్రతివాద భయంకర' బిరుదు పొందిన కవి ఎవరు?
జ: మరిగంటి సింగరాచార్యులు
159. 'వాల్మీకి చరిత్ర' గ్రంథ రచయిత
జ: రఘునాథ నాయకుడు
160. 'అభినవ భోజుడు, అభినవ శ్రీకృష్ణదేవరాయలు' బిరుదు ఉన్న కవి ఎవరు
జ: రఘునాథ నాయకుడు
161. రఘునాథ భూపాలుడి కొలువు కూటమిని ఏమని పిలుస్తారు?
జ: ఇందిర మందిరం
162. విజయ విలాసం కృతిభర్త
జ: రఘునాథ నాయకుడు
163. కిందివారిలో ఉషాపరిణయం, సంగ్రహ భారతం, సంగ్రహ రామాయణం గ్రంథాలను రచించింది ఎవరు?
ఎ) ముద్దు పళణి బి) రంగాజమ్మ
సి) చేమకూర వేంకటకవి డి) రఘునాథ నాయకుడు
జ: బి (రంగాజమ్మ)
164. రంగాజమ్మ బిరుదు
ఎ) పదకవితా విశారద బి) అష్టభాషా కవితా విశారదా
సి) సర్వంకషమనీషావ శేషశారద డి) అన్నీ
జ: డి (అన్నీ)
165. అపర శ్రీకృష్ణదేవరాయలు బిరుదాంకితుడు ఎవరు?
జ: విజయ రాఘవుడు
166. 'శ్లేషకవి చక్రవర్తి' బిరుదు ఉన్న కవి
జ: చేమకూర వేంకటకవి
167. 'మధురావిజయం' కృతికర్త
జ: గంగాదేవి
168. విజయ రాఘవుడి కొలువు కూటమి పేరు
జ: రాజగోపాల విలాసం
169. 'కవిమిత్ర' బిరుదు ఎవరికి ఉంది?
జ: పుష్పగిరి తిమ్మన
170. 'కువలయాశ్వ చరిత్ర' గ్రంథకర్త ఎవరు?
జ: సవరంచిన నారాయణరాజు
171. లింగనముఖి కామేశ్వర కవి బిరుదు ఎవరిది?
జ: తిరుకాసు కవి
172. 'సత్యభామాసాంత్వనము' గ్రంథకర్త
జ: లింగనముఖి కామేశ్వర కవి
173. 'సారంగధర చరిత్ర' గ్రంథకర్త
జ: సుముఖం వేంకటకృష్ణప్ప
174. 'తారాశశాంకం' గ్రంథ రచయిత
జ: శేషము వేంకటపతి
175. శహాజీ బిరుదు ఎవరిది?
జ: అభినవ భోజరాజు
176. 'అష్టభాషా విశారద' బిరుదు ఉన్న కవి ఎవరు?
జ: నివర్తి శేషాచలపతి
177. ఘటికాచల మహాత్మ్యానికి పీఠిక రాసింది ఎవరు?
జ: వేంకటకవి
178. 'పంచరత్నకవి' బిరుదాంకితుడు ఎవరు?
జ: శరభోజి
179. 'సంగీత సారామృతం' గ్రంథకర్త
జ: తులజాజీ
180. శుకసప్తతిలోని కథల సంఖ్య
జ: 70
181. 'శుకస్తతి'కి మూలం
జ: కథా సరిత్యాగరం
182. 'శుకసప్తతి' కృతిభర్త
జ: శ్రీరాముడు
183. అంపశయ్య రచన ఎవరిది?
జ: నవీన్
184. నుదురుపాటి వెంకన్న రచించిన అచ్చతెనుగు నిఘంటువు
జ: ఆంధ్రభాషా వర్ణవం
185. కిందివాటిలో కాకమాని మూర్తికవి రచన ఏది?
ఎ) ఉషాపరిణయం బి) బహుళాశ్వ చరిత్ర
సి) చంద్రికా పరిణయం డి) రాజవాహన విజయం
జ: డి (రాజవాహన విజయం)
186. 'అల్లసాని వానియల్లిక బిగిసొంపు, ముక్కు తిమ్మనార్య ముద్దుపలుకు, పాండురంగ సుకవి పద్యంబు హరువును' అని కవితా లక్షణాలు చెప్పినకవి
జ: కాకమాని మూర్తికవి
187. అక్కమహాదేవి చరిత్రను రచించింది ఎవరు?
జ: బాల పాపాంబ
188. 'కవిజనమనోరంజనం' గ్రంథ రచయిత
జ: అడిదం సూరకవి
189. 'చంద్రికా పరిణయం' గ్రంథ రచయిత
జ: సురభి మాధవరాయులు
190. 'నాద బ్రహ్మం' బిరుదు ఎవరిది?
జ: త్యాగయ్య
191. 'ప్రహ్లాద భక్త విజయం' గ్రంథ రచయిత
జ: త్యాగయ్య
192. 'ఎంతనేర్చిన, ఎంతజూచిన ఎంతవారలైనా'... సంకీర్తనా రచయిత ఎవరు?
జ: రామదాసు
193. పలుకే బంగారమాయనా కోదండపాణి... రచయిత ఎవరు?
జ: త్యాగయ్య
194. 'వరదయ్య' మారుపేరుగా ఉన్న సంకీర్తనాచార్యుడు
జ: క్షేత్రయ్య
195. పద సంగీత పితామహుడు బిరుదాంకితుడు
జ: క్షేత్రయ్య
196. తేనెసోక నోరు తీయనగు రీతిలో కవిత్వం ఉండాలని చెప్పింది...
జ: మొల్ల
197. వేమన బిరుదు
ఎ) ప్రజాకవి బి) ఆంధ్రకబీరు సి) లోకకవి డి) అన్నీ
జ: డి (అన్నీ)
198. ఆదికాలంలో తిక్కన, మధ్య కాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ మన తెలుగులో మహాకవులు అని అన్నది ఎవరు?
జ: శ్రీశ్రీ
199. ఎరుకగలుగువాడే ఎచ్చయిన కులజుడు అనే పద్యాన్ని రచించింది ఎవరు?
జ: వేమన
200. క్షేత్రయ్య తెలుగులో చెప్పిన పదాల సంఖ్య
జ: 4000
201. కాలజ్ఞానం, గోవింద వాక్యాలు లాంటి అద్వైతాలను బోధించినవారు
జ: పోతులూరి వీరబ్రహ్మం
202. నీతి శతకాలలో ప్రౌఢమైనది
జ: భాస్కరా శతకం
203. తెలుగులో వెలసిన తొలి దృష్టాంత శతకం ఏది?
జ: భాస్కరా శతకం
204. 'పెదబాలశిక్ష'ను రచించింది ఎవరు?
జ: పూదూరు సీతారామశాస్త్రి
205. 'కాశీమజిలీ కథలు' గ్రంథాన్ని రచించింది ఎవరు?
జ: మధుర సుబ్బన దీక్షితులు
206. 'నిరాఘంట వచోదురంధరుడు' బిరుదు గల కవి ఎవరు?
జ: శంకర కవి
207. రామరాజీయానికి ఉన్న మరో పేరు
జ: నరపతి విజయం
208. ప్రౌఢ వ్యాకరణం, కవి జీవితాలు, కన్యాశుల్క నాటకం గ్రంథాలను ఎవరికి అంకితం ఇచ్చారు?
జ: ఆనంద గజపతి
209. తెలుగు సాహిత్యంలో 'సంధియుగము' అంటే ఎన్నో శతాబ్దం
జ: 19
210. తెలుగులో వెలసిన తొలి సాహిత్య పత్రిక
జ: సుజన రంజని
211. చిన్నయసూరి రచించిన అసంపూర్ణ వ్యాకరణ గ్రంథం
జ: పద్యాంధ్రవ్యాకరణం
212. ప్రౌఢ వ్యాకరణానికి ఉన్న మరో పేరు
జ: త్రిలింగ లక్షణ
213. బాల వ్యాకరణానికి 'రమణీయం' అనే వ్యాఖ్యానం రచించింది ఎవరు?
జ: దువ్వూరి వేంకటరమణశాస్త్రి
214. వీరేశలింగం పంచతంత్రములో పూరించిన భాగం
జ: విగ్రహ తంత్రము
215. 'షోడశ కుమార చరిత్ర' గ్రంథకర్త ఎవరు?
జ: వెన్నెలకంటి అన్నయామాత్యుడు
216. చిన్నయసూరి పద్యాంధ్ర వ్యాకరణానికి మూలగ్రంథం ఏది?
జ: ఆంధ్రశబ్ద చింతామణి
217. కొక్కొండం వెంకటరత్న పంతులు స్థాపించిన పత్రిక ఏది?
జ: ఆంధ్రభాషా సంజీవిని
218. మహాశ్వేత నవల గ్రంథకర్త ఎవరు?
జ: కొక్కొండం వెంకటరత్నం
219. కొక్కొండం వెంకటరత్న పంతులు బిరుదు ఏది?
జ: ఆంధ్రభాషా జాన్సన్
220. బృహతంత్రాన్ని అంకితం పొందిన వారు
జ: రాబర్ట్ మెకంజీ
221. కందుకూరి వీరేశలింగాన్ని అభినవాంధ్ర ఆద్యబ్రహ్మ అని ప్రశంసించింది ఎవరు?
జ: ఆరుద్ర
222. సరస్వతీనారద సంవాదం, ఆంధ్రకవుల చరిత్ర తదితర రచనలను రచించింది ఎవరు?
జ: కందుకూరి వీరేశలింగం
223. కందుకూరి వీరేశలింగం పరిశోధనా శక్తికి తార్కాణం
జ: ఆంధ్రకవుల చరిత్ర
224. కందుకూరి వీరేశలింగం రచించిన జీవిత చరిత్ర
ఎ) జీసస్ చరిత్ర బి) రామమోహన్రాయ్ చరిత్ర
సి) విక్టోరియా మహారాణి చరిత్ర డి) అన్నీ
జ: డి (అన్నీ)
225. 'గలివర్స్ ట్రావెల్స్' ఆధారంగా కందుకూరి వీరేశలింగం రచించిన కావ్యం ఏది?
జ: సత్యరాజా పూర్వ దేశయాత్రలు
226. కందుకూరి వీరేశలింగం రచించిన శతకం ఏది?
జ: మార్కండేయ శతకం
227. 'అభినవాంధ్రకు ఆయన ఆధ్యబ్రహ్మ, ఆధునిక కవులకు పూజనీయుడు' అని కందుకూరి వీరేశలింగాన్ని కీర్తించింది ఎవరు?
జ: కడియాల రామమోహన్రావు
228. షేక్స్పియర్ రచించిన 'ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్' నాటకాన్ని ఏ పేరుతో అనువదించారు?
జ: చమత్కార రత్నావళి
229. 'నవయుగ వైతాళికుడు' బిరుదు ఉన్న కవి
జ: గురజాడ అప్పారావు
230. కిందివాటిలో గురజాడ అప్పారావు కథానిక
ఎ) కొండు బట్టీయం బి) బిల్హనీయం సి) కన్యాశుల్కం డి) దిద్దుబాటు
జ: డి (దిద్దుబాటు)
231. కన్యాశుల్కం నాటక కృతిభర్త
జ: ఆనంద గజపతిరాజు
232. తెలుగులో వెలసిన తొలి సాంఘిక, వ్యవహారిక భాషలో వెలువడిన నాటకం
జ: కన్యాశుల్కం
233. గిరీశం, మధురవాణి, అవధానులు పాత్రలు ఉన్న నాటకం
జ: కన్యాశుల్కం
234. బాల్యవివాహాల మీద గురజాడ అప్పారావు రచించిన కరుణ రసాత్మక కథాకావ్యం
జ: పూర్ణమ్మ
235. 'మంచి చెడ్డలు మనుజులందున యెంచి చూడ రెండు కులములు' అని అన్నది
జ: గురజాడ అప్పారావు
236. అడుగు జాడ గురజాడది అది భావికి బాట అని చెప్పింది.
జ: శ్రీశ్రీ
237. మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును... అన్నది
జ: గురజాడ అప్పారావు
238. ఆధునిక వాల్మీకి అనే బిరుదు ఎవరికి కలదు
జ: గురజాడ అప్పారావు
239. 'బుద్ధచరిత్ర'ను అంకితం పొందినవారు
జ: పోలవరపు జమీందారు
240. శ్రీదేవీ భాగవతం, శ్రవణానందం, పాండవోద్యోగ విజయాలు తదితర గ్రంథాలు రాసినవారు
జ: తిరుపతి వేంకటకవులు
241. తిరుపతి వేంకటకవులు పద్యరూపంలో రచించిన స్వీయచరిత్ర
జ: జాతకచర్య
242. 'లైట్ ఆఫ్ ఏసియా' గ్రంథానికి అనువాద గ్రంథం ఏది?
జ: బుద్ధ చరిత్ర
243. జెండాపై కపిరాజు పద్యరచయిత
జ: తిరుపతి వేంకటకవులు
244. అలుగుటయే యెరుంగని.. పద్య రచయిత
జ: తిరుపతి వేంకటకవులు
245. తొలకరి, పాలస్తహృదయం, సంక్రాంతి, గుడిగంటలు తదితర గ్రంథాలను రచించింది ఎవరు?
జ: రాయప్రోలు సుబ్బారావు
246. పింగళి కాటూరి కవిత్వంలో నిక్కంపు నీలములున్నవి తళుకుబెళుకు రాళ్లులేవు అని ప్రశంసించింది ఎవరు?
జ: విద్వాన్విశ్వం
247. ఆధునిక యుగంలో వెలసిన ఉద్ధాత్త కావ్యాల్లో విశిష్టమైనవి
జ: సౌందరనందనం
248. అభినవ కవికుల గురువు, కోకిలస్వామి బిరుదులు ఉన్న కవి
జ: రాయప్రోలు సుబ్బారావు
249. 'భావకవిత్వము' అని పేరు పెట్టింది
జ: గాడిచర్ల హరిసర్వోత్తమరావు
250. టెన్నిసను రాసిన 'డోరా' కావ్యాన్ని ఏ పేరుతో రాయప్రోలు సుబ్బారావు అనువదించారు?
జ: అనుమతి
251. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా రాయప్రోలు రచించిన గ్రంథం
జ: అనుమతి
252. ఏ దేశమేగినా ఎందుకాలిడినా... గేయ రచయిత ఎవరు?
జ: రాయప్రోలు సుబ్బారావు
253. అమరావతి నగరంలో బౌద్ధుల విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు?
జ: రాయప్రోలు సుబ్బారావు
254. 'గోల్డ్స్మిత్' రాసిన 'హెర్మిట్'ను సుబ్బారావు ఏ పేరుతో అనువదించారు?
జ: లలిత
255. ఆంధ్రాషెల్లీ, ఆంధ్రాకీట్స్, భావకవితా భాస్కరుడు బిరుదులు ఉన్న కవి ఎవరు?
జ: కృష్ణశాస్త్రి
256. బలిపీఠం గ్రంథ రచయిత
జ: ముప్పాళ రంగనాయకమ్మ
257. దుఃఖానికి, నిరాశకు ప్రతీకమైన కృష్ణశాస్త్రి కావ్యం ఏది?
జ: కృష్ణపక్షం
258. 'శుక్లపక్షం' గ్రంథ రచయిత
జ: అనంతం రామలింగ పంతులు
259. కృష్ణశాస్త్రి ఊహా సుందరి
జ: ఊర్వశి
260. నేను శోకభీకర తిమిర లోకైక పతిని అని చెప్పుకున్న కవి ఎవరు?
జ: కృష్ణశాస్త్రి
261. 'దిగిరాను దిగిరాను దివి నుంచి భువికి' అన్న కవి
జ: కృష్ణశాస్త్రి
262. కృష్ణశాస్త్రి మరణించినప్పుడు షెల్లీ మళ్లీ మరణించాడు అని చెప్పింది ఎవరు?
జ: శ్రీశ్రీ
263. 'కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ, శ్రీశ్రీ బాధ' అని చెప్పింది ఎవరు?
జ: చలం
264. 'సెలయేటి గానం' గ్రంథ రచయిత
జ: బసవరాజు అప్పారావు
265. శిథిలాలయమ్ములో శివుడు లేడోయి... గేయ రచయిత
జ: కృష్ణశాస్త్రి
266. కొల్లాయి కడితేనేమి మా గాంధీ కోమటై పుడితేనేమి వాక్యం రచించినవారు
జ: బసవరాజు అప్పారావు
267. విశ్వనాథ సత్యనారాయణ బిరుదు ఏది?
జ: కవిసామ్రాట్
268. నర్తనశాల, అనార్కలి, త్రిశూలం, సాప్తిక ప్రళయం లాంటి నాటకాలను రచించింది ఎవరు?
జ: విశ్వనాథ సత్యనారాయణ
269. కిందివాటిలో విశ్వనాథ సత్యనారాయణ శతకం ఏది?
ఎ) మాస్వామి శతకం బి) కుప్పుస్వామి శతకం
సి) చీపురుపుల్ల శతకం డి) విసనకర్ర శతకం
జ: ఎ (మాస్వామి శతకం)
270. విశ్వనాథ సత్యనారాయణ రచించిన విమర్శనా గ్రంథాలు
ఎ) అల్లసాని వాని అల్లిక జిగిబిగి బి) నన్నయ గారి ప్రసన్న కథా కవితార్థయుక్తి
సి) ఒకడు నాచన సోమన డి) అన్నీ
జ: డి (అన్నీ)
271. విశ్వనాథ సత్యనారాయణ మొదటి నవల ఏది?
జ: అంతరాత్మ
272. తెలుగులో వచ్చిన మొదటి కాల్పనిక నవల ఏది?
జ: ఏకవీర
273. 'విశ్వనాథ' వారి 'ఆంధ్రపశస్తి' కావ్యాన్ని అంకితం పొందినవారు ఎవరు?
జ: మల్లంపల్లి సోమశేఖర శర్మ
274. 'రామాయణ విషవృక్షం' గ్రంథ రచయిత ఎవరు?
జ: ముప్పాళ్ల రంగనాయకమ్మ
275. విశ్వనాథవారు కోడాలి ఆంజనేయులుతో కలిసి సత్యాంజనేయులు పేరుతో రచించిన గ్రంథం
ఎ) రాధ బి) ఆడపిల్ల
సి) సన్యాసి డి) అన్నీ
జ: డి (అన్నీ)
276. 'ఋషితుల్యుడైన నన్నయ రెండో వాల్మీకి' అని చెప్పింది
జ: విశ్వనాథ సత్యనారాయణ
277. 'దేశం పట్టనంతటి మహాకవి' అని విశ్వనాథ వారిని పొగిడింది ఎవరు?
జ: మల్లాది కృష్ణశాస్త్రి
278. అల నన్నయకు లేదు తిక్కనకు లేదు బోగస్మామదృశుండల..... పద్య రచయిత ఎవరు?
జ: విశ్వనాథ సత్యనారాయణ
279. విశ్వనాథవారి 'కిన్నెరసాని' రచనకు జ్ఞానపీఠ్ అవార్డు వచ్చి ఉంటే బాగుండేది అన్నదెవరు?
జ: శ్రీశ్రీ
280. కృషీవలుడు, పుష్పబాణవిలాసం, కవిరాయబారం, రుతు సంహారం తదితర గ్రంథాల రచయిత ఎవరు?
జ: దువ్వూరి రామిరెడ్డి
281. మాతృశతకం, మిత్రార్థశతకాన్ని రచించింది ఎవరు?
జ: దువ్వూరి రామిరెడ్డి
282. అడవి బాపిరాజు ఊహాసుందరి
జ: శశికళ
283. అడవి బాపిరాజు సంపాదకత్వం వహించిన పత్రిక ఏది?
జ: మీజా
284. భారత స్వాతంత్రోద్యమ ప్రశక్తి ఉన్న బాపిరాజు నవల ఏది?
జ: నారాయణరావు
285. 'లేపాక్షి బసవయ్య లేచి రావయ్య' అనే గేయ రచయిత
జ: అడవి బాపిరాజు
286. సవర భాషపై ప్రయోగాలు చేసి 'ఎమాన్యువల్ ఆఫ్ సవర లాంగ్వేజ్'ను రచించింది ఎవరు?
జ: గిడుగురామ్మూర్తి
287. వ్వవహారిక భాషలో రచించిన తొలి శతకం
జ: భారతీ శతకం
288. తెలుగు భాషా దినోత్సవం (గిడుగు రామ్మూర్తి వారి పుట్టిన రోజు)ఎప్పుడు?
జ: ఆగస్టు 29
289. చూపుతో మాట్లాడి ఊపిరితో తెనిగించిన కవి
జ: నండూరి వేంకటసుబ్బారావు
290. నండూరి సుబ్బారావు అద్భుత కావ్యం
జ: ఎంకి పాటలు
291. 'భగ్న హృదయం' స్మృతికావ్యం ఎవరి రచన?
జ: దువ్వూరి రామిరెడ్డి
292. 'బాపూజీ' స్మృతికావ్యం ఎవరి రచన?
జ: గుర్రం జాషువా
293. 'హంస ఎగిరిపోయింది' ఎవరి రచన?
జ: కుందుర్తి ఆంజనేయులు
294. సంగీత, సాహిత్య, నాట్య సంకేతాల సలక్షణంగా కనిపించే పుటపర్తి నారాయణాచార్యుల రచన ఏది?
జ: శివతాండవం
295. విశ్వనాథ సత్యనారాయణ 'ఏకవీర' నవలను మళయాలంలోకి అనువదించింది ఎవరు?
జ: పుటపర్తి నారాయణాచార్యులు
296. కిందివాటిలో పుటపర్తి నారాయణాచార్యుల రచన ఏది?
ఎ) అమృతం కురిసినరాత్రి బి) విరికన్నె
సి) మేఘదూతం డి) శివరాత్రి ప్రభ
జ: సి (మేఘదూతం)
297. అనుభూతి ప్రధానం గల కవి
జ: తిలక్
298. 'నా దేశాన్ని గురించి పాడలేను' అని అన్నది ఎవరు?
జ: తిలక్
299. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు అని అన్నది
జ: తిలక్
300. 'నవ్యసాహిత్యమాల' పత్రికకు సంపాదకత్వం వహించినవారు
జ: విద్వాన్ విశ్వం
301. విద్వాన్ విశ్వం రచించిన రాయలసీమ ప్రాంత కన్నీటి గాథ ఏది?
జ: పెన్నేటిపాట
302. 'కవికొండల వేంకటరావు' బిరుదు
జ: ఆంధ్రా వర్డ్స్వర్త్
303. 'గడ్డపరక' గ్రంథాన్ని రచించింది ఎవరు?
జ: కవికొండల వేంకటరావు
304. కవితా విశారద, మధుర శ్రీనాథ, కవికోకిల బిరుదులు ఉన్న కవి
జ: గుర్రం జాషువా
305. గుర్రం జాషువా స్వీయచరిత్ర
జ: నా కథ
306. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందిన జాషువా కావ్యం ఏది?
జ: క్రీస్తు చరిత్ర
307. ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వేలు.... పద్యరచయిత
జ: గుర్రం జాషువా
308. గుర్రం జాషువా ఎవరితో కలిసి జంట కవిత్వం చెప్పారు?
జ: దీపాల పిచ్చయచౌదరి
309. అభినవ తిక్కన బిరుదు ఉన్న కవి
జ: తుమ్మల సీతారామమూర్తి చౌదరి
310. రాష్ట్రగానం, ధర్మజ్యోతి, ఉదయగానం, తెనుగు నీతి తదితర గ్రంథాలు రచించిన కవి ఎవరు?
జ: తుమ్మల సీతారామమూర్తి
311. రామలింగేశ్వర శతకం రచించింది
జ: తుమ్మల సీతారామమూర్తి
312. గాంధీ మహాత్ముడి చరిత్రను 'మహాత్మకథ'గా స్వతంత్ర కావ్యంగా రచించింది ఎవరు?
జ: తుమ్మల సీతారామమూర్తి
313. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి బిరుదు ఏది?
జ: నవయుగ చక్రవర్తి
314. 'అనుభవాలు - జ్ఞాపకాలు' ఎవరి ఆత్మకథ?
జ: తుమ్మల సీతారామమూర్తి
315. శ్రీపాద వారి నవలలో మొదటిది ఏది?
జ: మిధునానురాగం
316. ఆంధ్రాస్కాట్, ఆంధ్రామిల్టన్ బిరుదులు ఉన్న కవి?
జ: చిలకమర్తి
317. చిలకమర్తి వారి హాస్య నవల
జ: గణపతి
318. చిలకమర్తి వారు రచించిన అద్భుత నాటకం
జ: గయోపాఖ్యానం
319. 'చిలకమర్తి వారు హాస్యానికి, కరుణానికీ పొత్తు కుదిర్చారు' అని ప్రశంసించినవారు
జ: మునిమాణిక్యం నరసింహరావు
320. చింతామణి నవలా పోటీల్లో మొదటి బహుమతి పొందిన నవల ఏది?
జ: రామచంద్ర విజయం
321. కిందివారిలో ఆంధ్రా అడిసన్, ఆంధ్రా షేక్స్పియర్, ఆంధ్రా కాళిదాసు అనే బిరుదులు ఉన్న కవి ఎవరు?
ఎ) చిలకమర్తివారు బి) కట్టమంచి వారు
సి) పానుగంటి వారు డి) మొక్కపాటి నరసింహారావు
జ: సి (పానుగంటి వారు)
322. సారంగధర, విప్రనారాయణ, పాదుకాపట్టాభిషేకం తదితర నాటకాలు రచించిన వారు
జ: పానుగంటివారు
323. ఎడిసన్ ప్రకటించిన స్పెక్టేటర్ ప్రేరణతో పానుగంటివారు రచించింది
జ: సాక్షివ్యాసాలు
324. నాటకాల్లో 'కన్యాశుల్కం' ఎట్టిదో గద్యరచనల్లో 'సాక్షి' అటువంటిది అని చెప్పింది
జ: మధునాపంతుల సత్యనారాయణ
325. భావకవిత్వానికి మార్గదర్శకంగా వెలువడిన కట్టమంచి వారి కావ్యం
జ: ముసలమ్మ మరణం
326. కట్టమంచి వారు కవిత తత్త్వ విచారములో విమర్శించిన గ్రంథం
జ: కళాపూర్ణోదయం
327. మొక్కపాటి నరసింహారావు రచించిన ఏకాంకిక
జ: మొక్కుబడి
328. ప్రజల మనిషి నవల రచయిత ఎవరు?
జ: వట్టికోట ఆళ్వారుస్వామి
329. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు ......
జ: శ్రీశ్రీ
330. 'మార్కిజాన్ని కథా సాహిత్యంలోకి ప్రవేశ పెట్టింది నేనే' అని చెప్పుకున్నది ఎవరు?
జ: చాగంటి సోమయాజులు
331. కుంకుడాకు, దుమ్మల గొండి, కుక్కుటేశ్వరం తదితర గ్రంథాలను రచించిన కవి
జ: చాగంటి సోమయాజులు
332. సంగీత రత్నాకర, సంగీత కళానిధి, గానకళా సింధూ, గానకళా ప్రపూర్ణ బిరుదులు గల కవి
జ: రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ
333. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ రచించిన విమర్శనా గ్రంథం
జ: వేమన
334. 'నిగమశర్మ అక్క' లాంటి ప్రద్ధ వ్యాసాన్ని రచించింది
జ: రాళ్లపల్లివారు
335. నార్ల వేంకటేశ్వరరావు తన నాటికలను ఏ పేరుతో వెలువరించాడు?
జ: కొత్తగడ్డ
336. నార్ల వేంకటేశ్వరరావు సంపాదకీయ వ్యాసం
జ: మూడు దశాబ్దాలు
337. వేదం వేంకట్రాయశాస్త్రి బిరుదు
జ: అపరమల్లినాథుడు
338. నాగానందం, బొబ్బిలియుద్ధం, ఉత్తర రామచరిత్ర తదితర గ్రంథాలను రచించింది ఎవరు?
జ: వేదం వెంకట్రాయశాస్త్రి
339. సౌభద్రుడి ప్రణయయాత్ర, మాతృగీతాలు, విషాదమోహనం తదితర గ్రంథాలను రచించింది
జ: నాయని సుబ్బారావు
340. ఎవడా క్రూరకర్ముడెవడు, నీలజలద నిర్ముక్తశైశిర.... రచించిన వారు ఎవరు?
జ: నాయని సుబ్బారావు
341. తెలుగులో మొదట కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కావ్యం ఏది?
జ: ఆంధ్రుల సాంఘికచరిత్ర
342. 'ఇదా స్వరాజ్యం' ఖండకావ్యం రచించింది
జ: పుండరీకాక్షుడు
343. కవిసార్వభౌమ, కవిసింహ, కావ్య, కళానిధి బిరుదులు ఉన్న కవి
జ: దర్భాక రాజశేఖర శతావధాని
344. కొమ్మర్రాజు లక్ష్మణరావు తెలుగువారికి అందించిన గొప్పకావ్యం
జ: ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం
345. 'రుధిరజ్యోతి' గ్రంథ రచయిత
జ: శ్రీరంగం నారాయణబాబు
346. 'కవిత్వంలోనే అరాచకవాది, సాహిత్యంలోనే విప్లవకారుడు' అని నారాయణ బాబు గురించి చెప్పింది ఎవరు?
జ: ఆరుద్ర
347. తెలుగులో చిత్ర వచన కవిత్వానికి ఆద్యుడు
జ: తిక్కవరపు పట్టాభి
348. పిడేలు రాగాల డజనుకు ఇంట్రో రాసినవారు
జ: శ్రీశ్రీ
349. 'చిన్నయసూరి బాల వ్యాకరణాన్ని చాలా దండిస్తాను' అని చెప్పింది
జ: పట్టాభి సీతారామయ్య
350. 'అనుసరిస్తాను నవీన పంథా కానీ భావకవిని కాను అహంభావ కవిని' అని చెప్పింది
జ: పట్టాభి సీతారామయ్య
351. 'శ్రీనాథ కవితా సామ్రాజ్యం' గ్రంథ రచయిత ఎవరు?
జ: గడియారం వేంకటశేషశాస్త్రి
352. గడియారం వేంకటశేషశాస్త్రి బిరుదులు
ఎ) కవితావతంస బి) కవిసింహ
సి) అవధాన పంచానన డి) అన్నీ
జ: డి (అన్నీ)
353. చెట్టు నా ఆదర్శం, మృత్యువృక్షం, చిలుకలు వాలిన చెట్టు తదితర గ్రంథాలను రచించింది ఎవరు?
జ: ఇస్మాయిల్
354. కిందివాటిలో కుందుర్తి ఆంజనేయులు ఆత్మకథ ఏది?
ఎ) తెలంగాణ బి) నయాగార
సి) నగరంలో వాన డి) బతుకుమాట
జ: డి (బతుకుమాట)
355. కుందుర్తి ఆంజనేయులు వారి ఏ రచనకు సోవియట్ల్యాండ్ అవార్డు లభించింది.
జ: నగరంలో వాన
356. 'వచనకవితా పితామహుడు' బిరుదు ఉన్న కవి
జ: కుందుర్తి ఆంజనేయులు
357. నెహ్రూ అవార్డు పొందిన కుందుర్తి వారి రచన
జ: నాలోనినాదాలు
358. 'పాతకాలం పద్యమైతే వర్తమానం వచన గేయం' అని చెప్పింది
జ: కుందుర్తి ఆంజనేయులు
359. 'కూనలమ్మ పదాలు' గ్రంథ రచయిత
జ: ఆరుద్ర
360. ఆరుద్ర, శ్రీశ్రీతో కలసి రచించిన శతకం
జ: కుక్కుటేశ్వర శతకం
361. ఆరుద్ర రచించిన 'త్వమేవహం'కు లఘుటిప్పణి రచించింది
జ: శ్రీశ్రీ
362. 'కవిత కోసం నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను' అన్న కవి ఎవరు?
జ: ఆరుద్ర
363. సోమసుందర్ సంపాదకత్వం వహించిన పత్రిక
జ: కళాకేళి
364. సోమసుందర్ రచనల్లో సుప్రసిద్ధమైంది
జ: వజ్రాయుధం
365. కాశ్మీరపట్టమహిషి నవలా రచయిత
జ: పిలకా గణపతిశాస్త్రి
366. కిందివారిలో ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయాలు - ప్రయోజనాలు సిద్ధాంత గ్రంథాన్ని రచించింది ఎవరు?
ఎ) సినారె బి) శ్రీశ్రీ
సి) నాళం కృష్ణారావు డి) ఆరుద్ర
జ: ఎ (సినారె)
367. 'నాళం కృష్ణారావు' బిరుదు
జ: మధురకవి
368. 'సర్పయాగం' గ్రంథ రచయిత
జ: రెంటాల గోపాలకృష్ణ
369. ఆంధ్రకల్హణ, సాహితీ సామ్రాట్ బిరుదు గల కవి
జ: మదునా పంతుల సత్యనారాయణ
370. మధునా పంతుల సత్యనారాయణ అద్భుత కావ్యం
జ: ఆంధ్ర పురాణం
371. 'నవమి చిలుక, విష్ణు ధనువు' తదితర గ్రంథాలు రచించిన కవి
జ: శిష్ట్లా ఉమామహేశ్వరరావు
372. 'తెలుగు పద్యంలో జిలుగుదనం, మెత్తదనం ఉన్నంతకాలం కరుణ శ్రీవాణి చిరంజీవి' అని అన్నది
జ: జి.వి. సుబ్రహ్మణ్యం
373. పుష్ప విలాపం, కుంతీకుమారి, పాకిపిల్ల తదితర గ్రంథాలను రచించింది
జ: జంధ్యాల పాపయ్య
374. శివశంకర శాస్త్రి ఖండ కావ్యం
జ: హృదయేశ్వరి
375. 'దీపావళి' గ్రంథ రచయిత
జ: వేదుల సత్యనారాయణ
376. కిందివారిలో 'వైతాళికులు' గ్రంథ రచయిత
ఎ) పురిపండల అప్పలస్వామి బి) వేదుల సత్యనారాయణ
సి) ముద్దుకృష్ణ డి) తెన్నేటి సూరి
జ: సి (ముద్దుకృష్ణ)
377. పులిపంజా గ్రంథ రచయిత
జ: పురిపండల అప్పలస్వామి
378. 'అరుణ రేఖలు' గ్రంథ రచయిత
జ: తెన్నేటి సూరి
379. 'అగ్నివీణ' గ్రంథ రచయిత
జ: అనిసెట్టి సుబ్బారావు
380. 'తాజ్మహల్ పడగొట్టండోయ్' గ్రంథ రచయిత
జ: ఆలూరి బైరాగి
381. 'గుడిసెలు కాలిపోతున్నాయి' గ్రంథ రచయిత
జ: బోయి భీమన్న
382. ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించినవారు
జ: దేవులపల్లి రామానుజరావు
383. 'అశోక సామ్రాట్' అనే నాటకాన్ని రచించింది ఎవరు?
జ: ఆత్రేయ
384. నండూరి రామ్మోహనరావు రచించిన వ్యంగ్య వ్యాసం ఏది?
జ: ఆశ నిరాశ
385. కొడవటిగంటి కుటుంబరావు రచించిన నవలల్లో ముఖ్యమైంది
జ: చదువు
386. వావి కొలను సుబ్బారావు బిరుదు ఏది?
జ: ఆంధ్రా వాల్మీకి
387. 'కప్పతల్లి పెళ్లి' గ్రంథ రచయిత
జ: చావలి బంగారమ్మ
388. తిరుపతి వేంకట కవుల 'కవితా వైభవం' గ్రంథ రచయిత
జ: జి.వి. సుబ్రహ్మణ్యం
389. 'అబలా సచ్చరిత్ర రత్నమాల' గ్రంథ రచయిత
జ: బండారు అచ్చమాంబ
390. 'స్వర్ణకమలాలు' గ్రంథ రచయిత
జ: ఇల్లిందుల సరస్వతి దేవి
391. 'అపశృతి' గ్రంథ రచయిత
జ: బెళ్లూరి శ్రీనివాసమూర్తి
392. విప్రనారాయణ చరిత్రను రచించింది ఎవరు?
జ: చదలవాడ మల్లన
393. 'మహాశ్వేత' గ్రంథ రచయిత
జ: స్ఫూర్తి శ్రీ
394. 'ఈ జంట నగరాలు - హేమంత శిశిరాలు' రచయిత ఎవరు?
జ: ఉత్పల సత్యనారాయణ
395. 'ఉదయని' గ్రంథ రచయిత
జ: గంగినేని వేంకటేశ్వరరావు
396. 'ఉద్యమం నెలబాలుడు' రచించినవారు
జ: శివసాగర్
397. 'నా చెల్లి చంద్రమ్మ' రచించిన వారు
జ: శివసాగర్
398. కిందివాటిలో జయధీర్ తిరుమలరావు రచన ఏది?
ఎ) ఏరువాక బి) కవి సమయాలు సి) అరణ్యనేత్రం డి) కవితావిపంచి
జ: సి (అరణ్యనేత్రం)
399. 'సంసారవృక్షం' గ్రంథ రచయిత
జ: ఆర్.ఎస్. సుదర్శనం
400. 'కవి సమయాలు' గ్రంథ రచయిత ఎవరు?
జ: ఇరివెంటి కృష్ణమూర్తి
401. 'తెలుగు జానపద గేయ గాథలు' గ్రంథ రచయిత
జ: నాయని కృష్ణకుమారి
402. బుచ్చిబాబు రచించిన మనో వైజ్ఞానిక నవల ఏది?
జ: చివరకు మిగిలేది
403. 'పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టెను' అని చెప్పింది ఎవరు?
జ: శ్రీశ్రీ
404. 'ఉదయిని' గ్రంథ రచయిత
జ: కొంపెల్ల జనార్దనరావు
405. 'జలపాతం' అనే అభ్యుదయ గ్రంథ రచయిత
జ: సినారె
406. 'రుద్రవీణ' గ్రంథ రచయిత
జ: దాశరథి కృష్ణమాచార్యులు
407. విప్లవ రచయితల సంఘం తొలి కవితా సంకలనం
జ: ఝంఝు
408. శ్రీశ్రీ రచించిన విప్లవ గ్రంథం
జ: మరో ప్రస్థానం
409. 'స్వేచ్ఛ' అనే విప్లవ కవితా సంపుటిని రచించింది
జ: వరవరరావు
410. భావ కవిత్వాన్ని దిక్దిగంతాలకు వ్యాపింపచేసిన వాడు
జ: కృష్ణశాస్త్రి
411. 'తూర్పు గాలి', 'జైల్లో సముద్రం' రచనలు ఎవరివి?
జ: నగ్నముని
412. 'వందేమాతరం' గ్రంథ రచయిత
జ: చెరబండరాజు
413. 'నన్నెక్కనివ్వండి - బోను' గ్రంథ రచయిత
జ: చెరబండరాజు
414. తొలి స్త్రీ వాద కవయిత్రి
జ: రేవతీదేవి
415. తెలుగులో తొలి స్త్రీవాద సంకలనం
జ: గురిచూసి పాడేపాట
416. ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా చివరకు వంటింటి గిన్నెలన్నింటిపైనా మా నాన్న పేరే అని చెప్పిన రచయిత్రి
జ: విమల
417. మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోందన్నది
జ: నిర్మల
418. 'అల్పాక్షరాలతో అనల్వార్థ రచన' చేసిన కవిత
జ: బందిపోట్లు
419. 'ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడిది' గ్రంథ రచయిత ఎవరు?
జ: జయప్రభా
420. 'హృదయానికి బహువచనం' గ్రంథ రచయిత
జ: కొండేపూడి నిర్మల
421. 'తాళికట్టిన మృగం' గ్రంథ రచయిత
జ: తుర్లపాటి రాజేశ్వరి
422. 'ఆకురాలు కాలం' గ్రంథ రచయిత ఎవరు?
జ: మహేజాబీన్
423. 'జానకి విముక్తి' గ్రంథ రచయిత ఎవరు?
జ: రంగనాయకమ్మ
424. 'మా కొద్దీ నల్ల దొరతనం' అంటూ పంచముల పక్షాన గొంతెత్తి చాటిన వారు
జ: కుసుమ ధర్మన్న
425. కొలకలూరి ఇనాక్ రచించిన గ్రంథం
జ: ఊరబావి
426. దాశరథి రంగాచార్యులు రచించిన గ్రంథం
జ: చిల్లర దేవుళ్లు
427. 'శేషజ్యోత్స్న' గ్రంథ రచయిత
జ: గుంటూరు శేషేంద్ర శర్మ
428. దర్భాక రాజశేఖర శతావధాని రచించిన గ్రంథం
జ: రాణాప్రతాప సింహ
429. కిందివాటిలో కొడాలి వేంకట సుబ్బారావు రచించిన గ్రంథం ఏది?
ఎ) అరుణరేఖలు బి) శ్రీగాంధీ భారతం
సి) హంపీ క్షేత్రం డి) ఆగస్టు గేయాలు
జ: సి (హంపీ క్షేత్రం)
430. 'చెయ్యెత్తి జై గొట్టు తెలుగోడా, గతమెంతో గణకీర్తి గలవాడా' గ్రంథ రచయిత ఎవరు?
జ: వేములపల్లి శ్రీకృష్ణ
431. శ్రీనాథుడు ద్విపదలో రచించిన కావ్యం
జ: పల్నాటి వీరచరిత్ర
432. గౌరన రచించిన ద్విపద కావ్యం ఏది?
జ: హరిశ్చంద్రోపాఖ్యానం
433. తాళ్లపాక చిన్నన్న రచించిన ద్విపద కావ్యాలు
ఎ) అష్టమహిషీకళ్యాణం బి) ఉషా పరిణయం
సి) అన్నమాచార్య చరిత్ర డి) అన్నీ
జ: డి (అన్నీ)
434. ముకుంద యోగి రచించిన ద్విపద కావ్యం
జ: శ్రీరంగ మహాత్మ్యం
435. కందుకూరి వీరేశలింగం రచించిన ద్విపద ఏది?
జ: సత్యా ద్రౌపదీ సంవాదం
436. 'హైకూ' కవిత్వం ఏ దేశం నుంచి తెలుగులోకి అనువాదమైంది.
జ: జపాన్
437. 'హైకూ'ని మొదట తెలుగులోకి అనువదించింది ఎవరు?
జ: ఇస్మాయిల్
438. కాశీనాథుని నాగేశ్వరరావు కింద ఇచ్చిన ఏ నవలకు పీఠికను రాశారు?
ఎ) ధూమరేఖ బి) హిమబిందు
సి) వేయిపడగలు డి) మాలపల్లి
జ: డి (మాలపల్లి)
439. 'సుగ్రీవ విజయం' యక్షగానం రచించింది ఎవరు?
జ: కందుకూరి రుద్రకవి
440. పసుపులేటి రంగాజమ్మ రచించిన యక్షగానం
జ: మన్నారుదాసు విలాసం
441. 'ఆంధ్రయక్షగాన వాజ్ఞ్మయ చరిత్ర' గ్రంథకర్త ఎవరు?
జ: ఎస్వీ. జోగారావు
442. 'అక్కమహాదేవి చరిత్ర' యక్షగాన కర్త
జ: టేకుమళ్ల రంగశాయి
443. పొన్నగంటి తెలగన రచించన కావ్యం
జ: యయాతి చరిత్ర
444. శుద్ధాంధ్ర భారత సంగ్రహం, శుద్ధాంద్ర రామాయణ సంగ్రహం ఇతర గంథ్రాల కర్త ఎవరు?
జ: వీరేశలింగం పంతులు
445. 'నీలా సుందరి పరిణయము' రచించింది ఎవరు?
జ: కూచిమంచి తిమ్మకవి
446. కిందివారిలో 'ఆంధ్రనామ శేషము' అచ్చ తెలుగు నిఘంటువును ఎవరు రచించారు?
ఎ) కస్తూరి రంగకవి బి) పైడిపాటి లక్ష్మణకవి
సి) అడిదము సూరకవి డి) గణవరపు వేంకటకవి
జ: సి (అడిదము సూరకవి)
447. 'ఆంధ్రనామ సంగ్రహము' నిఘంటువు కర్త
జ: పైడిపాటి లక్ష్మణకవి
448. 'శతక వాఞ్మయ బ్రహ్మ'గా పేరు పొందింది ఎవరు?
జ: పాల్కురికి సోమన
449. సంస్కృతంలో మయూరుడు రచించిన శతకం ఏది?
జ: సూర్యశతకం
450. 'ఆంధ్రశతక సాహిత్య వికాశము' అనే పరిశోధనా గ్రంథకర్త ఎవరు?
జ: గోపాలకృష్ణారావు
451. తెలుగులో వెలసిన మొదటి శృంగార శతకం ఏది?
జ: వేంకటేశ్వర
452. దువ్వూరి రామిరెడ్డి రచించిన శతకం
జ: మాతృశతకం
453. 'క్రైస్తవ శతక' కర్త ఎవరు?
జ: జాన్ సుందరరావు
454. వీర నారాయణ, ముకుంద శతకాలను రచించింది ఎవరు?
జ: రావూరి సంజీవకవి
455. 'శారదాపతి శతకం'ను రచించింది ఎవరు?
జ: జొన్నలగడ్డ శారదాంబ
456. తెన్నేటి నారాయణ శర్మ రచించిన శతకం ఏది?
జ: మృత్యుంజయ శతకం
457. హంసలదీవి వేణుగోపాల శతకం, ఆంధ్రనాయకశతకం, మానవబోధ శతకాలు రచించింది ఎవరు?
జ: కాసుల పురుషోత్తమకవి
458. 'ఆరోగ్య కామేశ్వరీ శతకం' రచించింది
జ: చెళ్లపిల్ల వేంకటశాస్త్రి
459. కుప్పుస్వామి శతకాన్ని రచించింది ఎవరు?
జ: త్రిపురనేని రామస్వామి చౌదరి
460. 'హరబ్రహ్మేశ్వర' కవులు రచించిన శతకం
జ: విసనకర్ర శతకం
461. 'ఆంధ్ర నాటక చరిత్ర పితామహుడు' అని ఎవరిని అంటారు?
జ: కోలాచలం శ్రీనివాస్
462. తొలి సాంఘిక నాటకం 'నందక రాజ్యం'ను రచించింది ఎవరు?
జ: వావిలాల వాసుదేవ శాస్త్రి
463. మంజరీ మధుకరము, వేణీసంహారము అనే నాటకాలను రచించింది ఎవరు?
జ: కోరాడ రామచంద్రశాస్త్రి
464. 'నాగానందం' నాటకాన్ని రచించింది ఎవరు?
జ: వేదం వెంకటరాయశాస్త్రి
465. కిందివారిలో పానుగంటి లక్ష్మీనరసింహం రచించిన నాటకం ఏది?
ఎ) విప్రనారాయణ చరిత్ర బి) పాదుకాపట్టాభిషేకం
సి) రాధాకృష్ణ డి) అన్నీ
జ: డి (అన్నీ)
466. చిలకమర్తి వారి ప్రసిద్ధ నాటకాలు ఏవి?
ఎ) కీచక వద బి) గయోపాఖ్యానం సి) ప్రహ్లాద చరిత్ర డి) అన్నీ
జ: డి (అన్నీ)
467. 'శంబూక వధ' ఎవరి ప్రసిద్ధ నాటకం?
జ: త్రిపురనేని రామస్వామి చౌదరి
468. నారాయణరెడ్డి ప్రసిద్ధ నాటకం ఏది?
జ: నవ్వని పువ్వు
469. 'ఆంధ్రనాటక పితామహ' అనే బిరుదు ఉన్న కవి ఎవరు?
జ: ధర్మవరం కృష్ణమాచార్య
470. తెలుగులో రాసిన తొలి చారిత్రక నాటకం ఏది?
జ: ప్రతాపరుద్రీయం
471. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రచించిన నాటకం ఏది?
జ: రాజరాజు
472. మిక్కిలి రాధాకృష్ణమూర్తి రచించిన ప్రసిద్ధ నాటకం
జ: నటరత్నాలు
473. మృచ్ఛకటికం, ముద్రారాక్షసం లాంటి అద్భుత నాటకాలను రచించింది
జ: తిరుపతి వేంకటకవులు
474. కాల్వానికోద్యమ ప్రభావంతో వెలువడిన తొలి చారిత్రక నవల ఏది?
జ: ఏకవీర
475. నైషధ పారిజాతాన్ని రచించింది ఎవరు?
జ: కృష్ణాధ్వరి
476. 'రాఘవ యాదవ పాండవీయము' అనుత్య్రర్థి కావ్య రచయిత
జ: నెల్లూరి వీరరాఘవ కవి
477. ఆంధ్రశబ్ద చింతామణి వ్యాఖ్యానము రచించింది ఎవరు?
జ: యలకూచి బాలసరస్వతి
478. 'ఆముక్తమాల్యదకు 'సంజీవనీ' అనే పేరుతో వ్యాఖ్యానం రచించినవారు ఎవరు?
జ: వేదం వేంకటరాయశాస్త్రి
479. 'వాల్మీకి రామాయణా'నికి మంధరం అనే పేరుతో వ్యాఖ్యానం చేసినవారు ఎవరు?
జ: వావికొలను సుబ్బారావు
480. విశ్వనాథుని స్థానాపతి రచించిన వచన కావ్యం
జ: రాయవాచకం
481. తుపాకుల అనంతభూపాలుడు రచించిన వచన కావ్యం ఏది?
జ: విష్ణుపురాణం
482. 'కృష్ణరాయ విజయాన్ని' రచించింది ఎవరు?
జ: కుమార ధూర్జటి
483. 'మధురా విజయము'ను రచించిన కవి
జ: గంగాదేవి
484. ముద్దుపళణి రచించిన గ్రంథం
జ: రాధికాసాంత్వనము
485. 'వాశిష్టరామాయణం' గ్రంథాన్ని రచించింది ఎవరు?
జ: తరిగొండ వెంగమాంబ
486. 'మిత్రవిందా పరిణయము' గ్రంథ రచయిత
జ: శేషాంబ
487. 'మాధవ శతకము'ను రచించింది ఎవరు?
జ: వేమూరి శారదాంబ
488. 'కవిత్వ తత్వవిచారము' గ్రంథాన్ని రచించింది ఎవరు?
జ: కట్టమంచి రామలింగారెడ్డి
489. 'సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు' రచించింది ఎవరు?
జ: జి.వి. సుబ్రహ్మణ్యం
490. 'సాహిత్య మొర్మారాలు' రచించింది ఎవరు?
జ: తాపీ ధర్మారావు
491. మొదలి నాగభూషణ శర్మ రచించిన సాహిత్యవిమర్శనా గ్రంథం ఏది?
జ: తెలుగు నవలావికాసం
492. 'గురజాడ కవికాడు' సాహిత్య విమర్శనా గ్రంథం ఎవరిది?
జ: పొట్లపల్లి సీతారామరావు
493. 'హరికథా వాఞ్మయం' గ్రంథ రచయిత ఎవరు?
జ: తూమాటి దోణప్ప
494. 'మొక్కుబడి' ఏకాంకిక ఎవరి రచన?
జ: మొక్కపాటి నరసింహశాస్త్రి
495. కిందివాటిలో తిరుమల రామచంద్ర రచన ఏది?
ఎ) వెన్నెలవాడ బి) తీరని బాకీ
సి) చెప్పుడు మాటలు డి) అప్సరస
జ: సి (చెప్పుడు మాటలు)
496. కథానికలను ప్రోత్సహించిన పత్రిక
జ: ఆంధ్రపత్రిక
497. కథక చక్రవర్తి అని పేరు పొందినవారు ఎవరు?
జ: చింతా దీక్షితులు
498. 'దిద్దుబాటు'కు ఉన్న మరో పేరు
జ: కమలిని
499. మెటిల్డా, మీపేరేమిటి, పెద్దమసీదు కథానికలు రచించింది ఎవరు?
జ: గురాజాడ అప్పారావు
500. ముగ్గురు బిచ్చగాళ్లు, మాక్సీదుర్గంలో కుక్క లాంటి కథలను రచించింది ఎవరు?
జ: విశ్వనాథ సత్యనారాయణ
501. తల్లావజ్జల శివశంకరశాస్త్రి రచించిన కథలు ఏవి?
జ: మురారి కథలు
502. ఓ పువ్వు పూసింది కథ ఎవరిది?
జ: చలం
503. 'ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి' రచించిన గ్రంథం ఏది?
జ: విజయదశమి
504. 'పరబ్రహ్మం' అనే కథను రచించింది ఎవరు?
జ: మధురాంతకం రాజారాం
505. కిందివాటిలో తాళ్లూరు నాగేశ్వరరావు రచించిన కథలు ఏవి?
ఎ) గోడల్లేని జైలు బి) ఎర్ర జెండాలు
సి) పాపికొండలు డి) మావూరి కథలు
జ: ఎ (గోడల్లేని జైలు)
506. జనతా ఎక్స్ప్రెస్ కథ ఎవరిది?
జ: ముళ్లపూడి వెంకటరమణ
507. యశోదారెడ్డి రచించిన కథలు ఏవి?
జ: మావూరి ముచ్చట్లు
508. 'అరచేతిలో గీత' గ్రంథ రచయిత ఎవరు?
జ: పులికంటి కృష్ణారెడ్డి
509. కిందివాటిలో సత్యం శంకరమంచి రచించిన కథ ఏది?
ఎ) యజ్ఞకథ బి) పరిచితరేఖ
సి) అమరా కథలు డి) సృష్టిరహస్యం
జ: సి (అమరా కథలు)
510. వ్యాసానికి మొదట ఉన్న పేర్లు
ఎ) ప్రమేయం బి) సంగ్రహం
సి) ఉపన్యాసం డి) అన్నీ
జ: డి (అన్నీ)
511. కిందివారిలో తొలి వ్యాస రచయిత్రి ఎవరు?
ఎ) పోతం జానకమ్మ బి) జానకీరాణీ
సి) బీనాదేవి డి) అచ్చమాంబ
జ: ఎ (పోతం జానకమ్మ)
512. 'తెలుగు మెరుగులు' వ్యాసాలను రచించింది.
జ: వేటూరి ప్రభాకర్ శాస్త్రి
513. 'సారస్వత సౌరభం' పుస్తకాన్ని రచించింది ఎవరు?
జ: జి.వి. సుబ్రహ్మణ్యం
514. సింగిరెడ్డి నారాయణ రెడ్డి రచించిన గ్రంథం ఏది?
జ: వ్యాసవాహిని
515. 'భానుమతీ రామకృష్ణ' రచించిన కథలు
జ: అత్తగారి కథలు
516. 'భద్రిరాజు కృష్ణమూర్తి' రచించిన పరిశోధనా గ్రంథం ఏది?
జ: తెలుగు భాషా చరిత్ర
517. తెలుగు జానపద గేయ సాహిత్యాన్ని రచించిన వారు ఎవరు?
జ: బిరుదరాజు రామరాజు
518. 'ఆంధ్ర నవలా పరిణామం'ను రచించింది ఎవరు?
జ: బి.వి. కుటుంబరావు
519. 'తెలుగు కథానిక స్వరూప స్వభావాలు' గ్రంథ రచయిత ఎవరు?
జ: పోరంకి దక్షిణామూర్తి
520. ఆదిభట్ల నారాయణదాసు రచించిన స్వీయచరిత్ర
జ: నాఎరుక
521. 'హంపి నుంచి హరప్పా దాకా' స్వీయ చరిత్రను రచించింది ఎవరు?
జ: తిరుమల రామచంద్ర
522. కిందివాటిలో ఉప్పల లక్ష్మణరావు రచించిన స్వీయ చరిత్ర ఏది?
ఎ) బతుకుమాట బి) బతుకు పుస్తకం
సి) రాళ్లు - రప్పలు డి) నాకథలు
జ: బి (బతుకు పుస్తకం)
523. నటస్థానం ఎవరి స్వీయచరిత్ర?
జ: స్థానం నరసింహారావు
524. గురజాడ శ్రీరామమూర్తి రచించిన జీవిత చరిత్ర
జ: కవి జీవితాలు
525. తిక్కన సోమయాజి జీవిత చరిత్రను రచించింది ఎవరు?
జ: చిలకూరి వీరభద్రారావు
526. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన లేదా స్థాపించిన పత్రిక ఏది?
జ: జ్వాల
527. కిందివాటిలో మరుగంటి సింగరాచార్యులు బిరుదు ఏది?
ఎ) గౌతమి కోకిల బి) కళామూర్తి
సి) శతఘంటావధాన డి) అభినవ పోతన
జ: సి (శతఘంటావధాన)
528. భమిడిపాటి కామేశ్వరరావు బిరుదు ఏది?
జ: హాస్య బ్రహ్మ
529. కావ్యాలంకార చూడామణి రచించింది ఎవరు?
జ: విన్నకోట పెద్దన
530. ఆంధ్రభాషా వర్ణము రచించింది ఎవరు?
జ: నుదురుపాటి వెంకన్న
531. ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము రచించింది
జ: ఖండవిల్లి లక్ష్మీరంజనం
532. తెలుగులో తొలి చారిత్రక నవల
జ: శ్రీ రంగరాజు చరిత్ర
533. కొక్కొండం వెంకట రత్నం పంతులు రచించిన నవల
జ: మహాశ్వేత
534. కిందివాటిలో తెన్నేటి సూరి రచించిన నవల ఏది?
ఎ) టిప్పుసుల్తాన్ బి) రెండు మహానగరాలు
సి) పాతాళభైరవి డి) ప్రపుల్లముఖి
జ: బి (రెండు మహానగరాలు)
535. రామచంద్ర విజయం, గణపతి, హేమలత, కర్పూరమంజరీ తదితర నవలలు రాసింది ఎవరు?
జ: చిలకమర్తి లక్ష్మీనరసింహం
536. మాలపల్లి నవలకు ఉన్న మరో పేరు ఏది?
జ: సంగవిజయం