1. రాష్ట్ర స్థాయిలో పాఠ్య పుస్తకాలను అభివృద్ధి చేసేది-
జ: SCERT
2. తరగతి గది బోధనలో ఎక్కువగా ఉపయోగపడే బోధనోపకరణం
జ: పాఠ్యపుస్తకం
3. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషేతర పుస్తకాలను ప్రస్తుతం ఏ పద్ధతిలో రూపొందిస్తోంది?
జ: సర్పిల పద్ధతి
4. విషయ కాఠిన్యత, శీర్షిక పరిపూర్ణత సూత్రం మీద ఆధారపడిన పద్ధతి-
జ: శీర్షిక పద్ధతి
5. ఏకకేంద్ర పద్ధతికి సంబంధంలేని అంశం-
జ: విషయాలు నేర్చుకోవడంలో తార్కిక క్రమం ఉంటుంది.
6. కఠినతను అనుసరించి విషయ భాగాలను క్రమంలో అమర్చి, తగిన దశలో భాగాన్ని ప్రవేశపెట్టడం-
జ: సర్పిల విధానం
7. 'విద్యా ప్రణాళిక కళాకారుడి చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో, తన సామగ్రిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం' అని పేర్కొంది.
జ: ఆల్బర్టీ
8. విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి బోధన దోహదపడాలని సూచించింది
జ: జాతీయ విద్యా ప్రణాళిక - (2005)
9. కచ్చితత్వం, వేగం, ఏకాగ్రత మొదలైనవి ఏ కరిక్యులం నిర్మాణ సూత్రానికి చెందుతాయి?
జ: క్రమశిక్షణా విలువ
10. విద్యార్థి ఆసక్తి, అవసరాలు, సామర్థ్యాలకు ప్రాముఖ్యతనిచ్చేది
జ: శిశు కేంద్రీకృత సూత్రం