మాదిరి ప్రశ్నలు
1. శ్రీవాణీ గిరిజాశ్చిరాయదధతో.... అన్న ఆదిపద్యకర్త ఎవరు?
జ: నన్నయ
2. శారదరాత్రులుజ్జ్వల రసత్తర... అనే నన్నయ పద్యం కింది ఏ పర్వంలోనిది?
ఎ) ఆదిపర్వం బి) సభాపర్వం సి) అరణ్యపర్వం డి) ఉద్యోగపర్వం
జ: సి (అరణ్యపర్వం )
3. నన్నయ పూర్తిచేసిన పర్వాల సంఖ్య
జ: 2
4. ఆంధ్రకవితా విశారధుడు అని నన్నయను కీర్తించినవారు
జ: తిక్కన
5. 'ఆంధ్రకవితాగురుడు' అని నన్నయను కీర్తించినవారు
జ: మారన
6. సారమతింగవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి.... పద్యరచయిత
జ: నన్నయ
7. భారత భారతీసముద్రము దరియంగనీదను... పద్యరచయిత
జ: నన్నయ
8. గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్... పద్యరచయిత
జ: నన్నయ
9. భాషింతు నన్నయభట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌడి... పద్యరచయిత
జ: శ్రీనాథుడు
10. బహువన పాదపాబ్ధికుల పర్వత... పద్య రచయిత
జ: నన్నయ
11. కిందివారిలో 'కవిరాక్షసుడు' అనే బిరుదు ఎవరిది?
ఎ) వేములవాడ భీమకవి బి) నారాయణభట్టు
సి) నన్నయ డి) మారన
జ: ఎ (వేములవాడ భీమకవి )
12. తెలుగులో వెలసిన మొదటి ఛందోలక్షణ గ్రంథం
జ: కవిజనాశ్రయం
13. 'కవిజనాశ్రయుడు, శ్రావకాభరణుడు' అనే బిరుదు ఉన్న కవి
జ: మల్లియ రేచన
14. 'వార్తయందు జగము వర్థిల్లుచున్నది' అన్న మహాకవి ఎవరు?
జ: నన్నయ
15. నుతజల పూరితంబులగు నూతులు నూఱింటికంటె... పద్య రచయిత
జ: నన్నయ
16. నన్నెచోడుడు ఏ శతాబ్దానికి చెందినవాడు?
జ: 12
17. 'కవిరాజశిఖామణి' అనే బిరుదు ఎవరిది?
జ: నన్నెచోడుడు
18. నన్నెచోడుడు 'వస్తుకావ్యాబ్జరవి' అని ఎవరిని పొగిడాడు?
జ: వాల్మీకిని
19. 'జాను తెనుగు, వస్తుకవిత, దేశీయమార్గము' అనే శబ్దాలను ప్రయోగించినవారు
జ: నన్నెచోడుడు
20. ప్రబంధ శబ్దాన్ని ప్రయోగించినవారిలో ప్రథముడు
జ: నన్నెచోడుడు
21. కిందివారిలో శివత్రయంలో లేనివారు
ఎ) పాల్కురికి సోమన బి) పండితారాధ్యుడు
సి) నన్నెచోడుడు డి) మల్లికార్జున పండితుడు
జ: డి (మల్లికార్జున పండితుడు)
22. 'బసవపురాణం'లోని ఆశ్వాసాల సంఖ్య
జ: 6
23. పాల్కురికి సోమనాథుడి అలభ్యకృతి
జ: మల్లమదేవి పురాణం
24. పాల్కురికి సోమన 'అనుభవసారాన్ని' ఎవరికి అంకితం ఇచ్చారు?
జ: గొడగి త్రిపురాంతకుడు
25. వృషాధిపా శతకంలోని మకుటం
జ: బసవా! బసవా! బసవా! వృషాధిపా
26. తెలుగు నుంచి సంస్కృతంలోకి అనువాదమైన సోమన రచన
జ: బసవ పురాణం
27. అల్పాక్షరములతో అనల్పార్థ రచన చేయగల సమర్థుడు ఎవరు?
జ: పాల్కురికి సోమన
28. 'తెలుగు తోటలో తెలుగుకోసం, తెలుగు ఛందస్సు ద్విపదలో పాటలు పాడిన కోకిల పాల్కురికి సోమన' అని ఎవరు అన్నారు?
జ: ఆరుద్ర
29. శివా, అజా, రుద్రా, మహేశా.... అనే మకుటంతో సాగే శతకం
జ: శివతత్త్వసారం
30. కిందివారిలో పండిత త్రయంలో లేనివారు
ఎ) శ్రీపతి పండితుడు బి) మంచన పండితుడు
సి) మల్లికార్జున పండితుడు డి) పాల్కురికి
జ: సి (మల్లికార్జున పండితుడు)
31. 'నమశ్శివాయ' రగడను రచించింది
జ: చక్రపాణి రంగన
32. సర్వేశ్వర శతకాన్ని రచించింది ఎవరు?
జ: యథావాక్కుల అన్నమయ్య
33. 'కావ్యాలంకార చూడామణి' అనే అలంకార గ్రంథ్రాన్ని రచించింది
జ: విన్నకోట పెద్దన