నమూనా ప్రశ్నలు
1. పద్య బోధన లక్ష్యం ఏమిటి?
జ: రసానుభూతి
2. ఎంపిక చేసుకున్న పద్య పాఠ్యాంశాన్ని 'ఏకాంశం'గా భావించి బోధించే పద్ధతి ఏది?
జ: పూర్ణ పద్ధతి
3. విద్యార్థికి 'భాషా జ్ఞానం' ఏ బోధన వల్ల కలుగుతుంది?
జ: గద్య బోధన
4. గద్య బోధనలో వ్యాకరణాంశాలను పరిచయం చేసే సందర్భం ఏది?
జ: విద్యార్థుల మౌన పఠనానికి ముందు
5. గద్య వాజ్ఞ్మయానికి ఆద్యునిగా ఎవరిని పేర్కొంటారు? (ఈయన 'సింహగిరి వచనములు' రచయిత).
జ: కృష్ణమాచార్యులు
6. పద్య బోధనలో తప్పనిసరై, గద్య బోధనలో అంతగా అవసరంలేని ఉప సోపానాలు ఏవి?
జ: స్థూలార్థ సంగ్రహణం, ఉపాధ్యాయుని పునఃపఠనం
7. పద్య బోధనలో విద్యార్థుల నుంచి రాబట్టడానికి వీల్లేని ధ్వని, రచనా చమత్కృతి, రసపోషణ, అలంకార వైశిష్ట్యం, ప్రతిభ, పదప్రయోగ ఔచిత్యం, నిగూఢ అంశాలను తెలియపరచి వారు అందులో లీనమయ్యేటట్లు చేసే పద్ధతిని ఏమంటారు?
జ: ప్రశంసా పద్ధతి
8. రమణీయార్థ ప్రతిపాదక శబ్దాలే కవిత్వం - అన్న లాక్షణికుడు ఎవరు?
జ: జగన్నాథ పండితరాయలు
9. మనస్తత్వ శాస్త్రానికి విరుద్ధమైన గద్య బోధన పద్ధతి?
జ: ప్రవచన పద్ధతి
10. పద్య బోధన సందర్భంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల దృష్టికి తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సింది?
జ: అన్వయక్రమం
11. గద్య పాఠ్య భేదాలు ఎన్ని?
జ: 14
12. పద్య బోధన ప్రధాన లక్ష్యం - ఈ లక్ష్యసాధనకు అనుసరణీయమైన బోధనా పద్ధతి?
1) భాషా జ్ఞానం - ప్రవచన పద్ధతి 2) సాహిత్యాభిరుచి - ఖండ పద్ధతి
3) రసానుభూతి - ప్రశంసా పద్ధతి 4) సృజనాత్మకత - పఠన పద్ధతి
జ: రసానుభూతి - ప్రశంసా పద్ధతి
13. పద్య బోధనలో వ్యాకరణాంశాల బోధన ఎలా జరిగితే ప్రయోజనకరం?
జ: పద్య స్వరూప స్పష్టత కోసం
14. గద్య పాఠ్యాంశ తరగతి నిర్వహణలో సంధి, సమాస, అర్థ సంగ్రహణ సోపానాల తర్వాత నిర్వహించే సోపానం?
జ: చర్చ
15. పాఠ్య బోధన సందర్భంలో సంధులు, సమాసాలు మొదలైన వ్యాకరణాంశాలను పరిచయం చేసే పద్ధతి?
జ: ఉదాహరణ పద్ధతి
16. ఉపాధ్యాయుడు ఏ పాఠ బోధన సందర్భంగా స్థూలార్థ సంగ్రహణం చేస్తాడు?
జ: పద్యం
17. పద్య బోధనకు ఉత్తమమైన పద్ధతి ఏది?
జ: పూర్ణ పద్ధతి
18. చర్చా పద్ధతి ఏయే దశలకు ప్రయోజనకారిగా ఉంటుంది?
జ: మాధ్యమిక, ఉన్నత దశలు
19. 'పునఃపఠనం' చేయదగిన పాఠ బోధన సందర్భం?
జ: పద్య బోధన
20. గద్య బోధనలో 'చర్చ'ను ప్రవేశపెట్టదగిన సందర్భంఏది?
జ: విద్యార్థుల మౌన పఠనం తర్వాత
21. పద్యం కేంద్రీయ భావాన్ని విద్యార్థులు ఏ మేరకు గ్రహించగలిగారో తెలుసుకునే సోపానం ఏది?
జ: స్థూలార్థ సంగ్రహణం
22. 'వాక్యం రసాత్మకం కావ్యం' అన్న లాక్షణికుడు ఎవరు?
జ: విశ్వనాథుడు
23. 'ఒక పద్యంలో ఉద్దిష్టాలయిన ఆవేశాలు మనలో తిరిగి మొలకెత్తితే గాని, ఆ భావానుభూతిని పొందితేగాని దాన్ని మనం అవగతం చేసుకున్నామనడానికి వీలు లేదు' - అని అభిప్రాయపడింది?
జ: ప్రొఫెసర్ ముర్రే
24. ఉపాధ్యాయుడు చర్చను ఆరంభించిన తర్వాత సాధారణీకరణం చేయాల్సిన సందర్భం?
జ: చర్చను ముగించే ముందు
25. కవుల పట్ల గౌరవ భావాలు ఏ పద్ధతిలో కలుగుతాయి?
జ: ప్రశంసనా పద్ధతి
26. కిందివాటిలో ఏది రాయడం కష్టం అంటారు?
1) పద్యం 2) గద్యం 3) నాటకం 4) కథ
జ: గద్యం