• facebook
  • whatsapp
  • telegram

బయోటెక్నాలజీ

* జీవశాస్త్ర ప్రక్రియలను ఉపయోగించి మానవుడు పంటలు, పెంపుడు జంతువులను దాదాపు 10,000 సంవత్సరాల పూర్వమే ఆహారం, వస్త్రధారణ కోసం వినియోగించాడు.
* వేదకాలంలోనే జీవశాస్త్ర పరిక్రియలను ఉపయోగించి ఆహార అన్వేషణ కొనసాగించారు. ఆధునిక ప్రపంచంలో మానవుడు సగటు జీవి. ఆహార అన్వేషణ కోసం జీవ, ఆహార శాస్త్రాల్లో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాడు.
* జీవసాంకేతిక శాస్త్రం అనే భావనను 21వ శతాబ్దంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
* దీని అధ్యయనం అనేక రకాల ఆహార పదార్థాల అన్వేషణ కోసమే కాకుండా అనేక రకాలుగా వ్యాపిస్తున్న వ్యాధుల నివారణకు మార్గం చూపుతోంది.
* ఇటీవల నానోటెక్నాలజీని జీవసాంకేతికతకు అన్వయించి అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారు


జీవసాంకేతిక శాస్త్రం
* సూక్ష్మజీవులు, వాటి జీవక్రియలను ఉపయోగించి నియమిత పరిధిలో మానవాళికి ఉపయోగపడే ఉత్పత్తులను, రసాయన పదార్థాలను తయారు చేసే ప్రక్రియను 'జీవసాంకేతిక శాస్త్రం' అంటారు.
* బయోటెక్నాలజీ అనే పదాన్ని వాడిన వారు కార్ల్  ఎరికే (1919).
* ఇది జన్యుశాస్త్రం, సూక్ష్మ జీవశాస్త్రం, జీవ రసాయనశాస్త్రం, జీవ‌స్త్రాల‌ కలయిక.


రెడ్ బయోటెక్నాలజీ
* వైద్య రంగంలో అనువర్తింపజేసే జీవసాంకేతిక శాస్త్రం
    ఉదా: జన్యుథెరపీ విధానం ద్వారా అనేక జన్యు వ్యాధులను సరిచేయడం.
వైట్, గ్రే బయోటెక్నాలజీ
* పారిశ్రామిక రంగంలో వినియోగించే జీవసాంకేతిక శాస్త్రం.
    ఉదా: విటమిన్స్, ఆంటిబయోటిక్స్.
గ్రీన్ బయోటెక్నాలజీ
* వ్యవసాయ రంగంలో అనువర్తింపజేసే జీవసాంకేతిక శాస్త్రం.
    ఉదా: జన్యుపరివర్తన మొక్కలు తయారు చేయటం.
బ్లూ బయోటెక్నాలజీ
* జల సంబంధమైన జీవ సాంకేతిక శాస్త్రం.
 బయోటెక్నాలజీలో ఎక్కువగా ఉపయోగించే బ్యాక్టీరియా  ఎశ్చరీషియా కొలై.


క్లోనింగ్
* గ్రీకు భాషలో క్లోనింగ్ అంటే రెమ్మ (Branch) అని అర్థం.
* శుక్రకణాలు, అండాల కలయిక లేకుండా ఒక జీవి శారీరక కణాన్ని తీసుకొని దాని కేంద్రకాన్ని (2X) ఆడ జీవి అండకణంలోకి (కేంద్రకాన్ని తొలగించిన) పంపించి, ప్రయోగశాలలో దాన్ని అభివృద్ధి చేసి పిల్ల జీవులను ఏర్పరిచే సాంకేతిక ప్రక్రియను క్లోనింగ్ అంటారు.
* దీనిలో ఏర్పడే పిల్లజీవి ఏ శరీర కణ కేంద్రకం నుంచి తీసుకున్నారో ఆ తల్లి జీవిని పోలి ఉంటుంది. అంటే తల్లి జీవి, పిల్ల జీవి అచ్చం ఒకేలా ఉంటాయి.
* ఈ ప్రక్రియను అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం (A sexual reproductive process) అంటారు.
* మానవ క్లోనింగ్‌ను మొదట నిషేధించిన దేశాలు అమెరికా, బ్రిటన్.
* ప్రపంచంలో మొదటిసారిగా స్కాట్‌లాండ్ దేశంలోని రోసిలిన్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన‌ 'ఇయాన్ విల్మట్' (ఫాదర్ ఆఫ్ క్లోనింగ్) 1996లో మొదట గొర్రె పొదుగు కణాలను (Udder cell) తీసుకొని క్లోనింగ్ చేసి డాలీ అనే మొదటి 'క్షీరద గొర్రె పిల్ల' ను స్పష్టించారు. ఇది 2003లో ఊపిరితిత్తుల వ్యాధి, కీళ్లనొప్పితో (Arthiritis) చనిపోయింది.
* ప్రతీ జీవి జీవకణాలతో రూపొందించి ఉంటుంది. ఈ జీవకణాలు రెండు రకాలు. అవి:
    1. జెర్మ్ జీవకణం
    2. సొమాటిక్ జీవకణం

క్లోనింగ్ జీవి

జీవి దేశం
1. మెటిల్డా గొర్రెపిల్ల  ఆస్ట్రేలియా
2. డ్యూయీ జింకపిల్ల  అమెరికా
3. ప్రొమాటీ గుర్రంపిల్ల ఇటలీ (మొదటి క్లోనింగ్ గుర్రం)
4. ఎన్టీ - 20 కుందేలు పోలాండ్
5. స్నూపీ కుక్కపిల్ల దక్షిణ కొరియా (సియోల్ జాతీయ విశ్వవిద్యాలయం)
6. ప్రిన్సెస్ పంది పిల్ల అమెరికా
7. కాపిక్యాట్, లిటిల్ నిక్కి పిల్లి పిల్ల అమెరికా
8. యాంగ్ యాంగ్ మేక చైనా
9. టెట్రా కోతి అమెరికా
10. హబావో లేగదూడ అమెరికా
11. గుంపా, బ్రాండీ ఆవుదూడ అమెరికా
12. పెట గోనియా 1, 2, 3, 4 ఆవుదూడలు అర్జెంటీనా
13. ఇవాహోజియా

కంచర గాడిదమగ గాడిద + ఆడ గుర్రం (mule herny) 

మగ గుర్రం + ఆడ గాడిద (calt) 

అమెరికా
14. ఈవ్ మొదటి క్లోన్‌డ్ బేబి అమెరికా క్లొనాయిడ్ సంస్థ
15. జెమి మొదటి డిజైనర్ బేబీ అమెరికా
16. రోమాన్ గొర్రె ఇరాన్
17. హన్నా మేక ఇరాన్
18. స్నో వూల్ఫ్ తోడేళ్లు సియోల్ విశ్వవిద్యాలయం(దక్షిణ కొరియా)
19. నోహ్ అడవి దున్న మొదట అంతరించిపోయిన జాతి
 20. సంరూప, గరిమా పెయ్యదూడలు (గేదే) ఇండియా,  నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్
21. ఇన్ ఫాజ్ మొదటి ఒంటె యూఏఈ
22. జియో జియో మొదటి చుంచెలుక  చైనా
23. గోట్ స్పెయిన్ బుల్ స్పెయిన్

మనదేశంలో క్లోనింగ్ సాంకేతికత
* భారతదేశంలో క్లోనింగ్ సాంకేతికతను మొదట అభివృద్ధి చేసిన సంస్థ నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NDRI), కర్నాల్ (హ‌రియాణా). ఈ  సంస్థ ప్రపంచంలోనే మొదటి క్లోన్ గేదె 'సంరూపను' 2009లో సృష్టించింది.
* 2009లో 'హ్యాండ్ గైడెడ్ టెక్నాలజీ' అనే అత్యాధునిక శాస్త్ర సాంకేతిక ప్రక్రియ ద్వారా రెండో క్లోన్‌ గేదె 'గరిమా - 1'ను సృష్టించారు. ఇది వెంటనే చనిపోయింది. 2010లో గరిమా - 2 ను సృష్టించారు. దాని నుంచి 2013లో 'మహిమ' అనే మరొక క్లోన్ గేదెను ఉత్పత్తి చేశారు. క్లోన్ జీవి నుంచి మరోక క్లోన్ గేదెను ఉత్పత్తి చేశారు. ఇదే టెక్నాలజీ ద్వారా '2010'లో 'శ్రేష్ఠ్' అనే దున్నపోతును, 2014, జూన్ 2న 'లాలిమా' అనే గేదెను సృష్టించారు.
* కశ్మీర్ శాస్త్రవేత్తలు ప్రపంచంలో తొలిసారిగా 'పార్శినా' మేకను 'నూరీ' అనే పేరుతో క్లోనింగ్ చేశారు.
* 2014, జులై 23న NDRI శాస్త్రవేత్తలు హ్యాండ్ గైడెడ్ టెక్నాలజీ ద్వారా రాజత్ అనే దున్నపోతును సృష్టించారు.
 

అపూర్వ
* దీన్ని NDRI  2015 మార్చిలో  క్లోనింగ్ ద్వారా ఉత్పత్తి చేసింది. ఇది ఒక ముర్రె జాతి గేదె.
* దీన్ని NDRI మూత్రంలోని సొమాటిక్ (శారీరక) కణాలను ఉపయోగించి క్లోనింగ్ చేసింది.  ఇలా చేయడం ప్రపంచంలోనే మొదటిసారి.


కృత్రిమ గర్భదారణం (IN VITRO FERTILISATION - IVF)
* శుక్రకణాలు, అండాలను పరీక్ష నాళికలో ఫలదీకరణం చెందించి పిండాన్ని ఏర్పరిచి, ఆ పిండాన్ని ఆడ జీవి గర్భాశయంలో ప్రవేశ పెట్టి పిల్ల జీవులను ఏర్పరిచే ప్రక్రియను కృత్రిమ గర్భ దారణం (IVF) అంటారు.
* ఈ విధంగా ఉత్పత్తి అయిన శిశువులను టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటారు.
* ఈ విధానం ద్వారా ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీని ఉత్పత్తి చేసింది పాట్రిక్ స్టెప్టో, రాబర్ట్ ఎడ్వర్డ్స్.
* ఆ మొదటి శిశువు లూసీ బ్రౌన్. 1978లో బ్రిటన్‌లో జన్మించింది.
* భారత్‌లో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ హర్ష (1986).
* మన దేశంలో అధికంగా టెస్ట్ ట్యూబ్ బేబీలను ఉత్పత్తి చేసింది డాక్టర్ ఫిరోజ్ ఫారిక్ రిలయన్స్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ - ముంబయి.
* సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ - హైదరాబాద్ (CCMB), లాల్జిసింగ్ ఆధ్వర్యంలో 2 జింకలను IVF పద్ధతి ద్వారా ఉత్పత్తి చేసింది. అవి:
» మచ్చల జింక - దీని పేరు స్పాటీ
» కృష్ణ జింక - దీని పేరు బ్లాకీ.
* ఈ విధంగా జింకల ఉత్పత్తిలో మొదటి, రెండు, మూడో స్ధానాల్లో వరుసగా అమెరికా,  ఆస్ట్రేలియా, భారతదేశం ఉన్నాయి.
* 1978లో 'సుభాష్ ముఖోపాధ్యాయ' భారతదేశంలోనే మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి 'దుర్గ'ని ఉత్పత్తి చేశారు. అయితే పశ్చిమ బంగా ప్రభుత్వం దీన్ని గుర్తించలేదు.


సరోగసీ
* పరీక్ష నాళికలో అభివృద్ధి చేసిన పిండాన్ని ఆడజీవిలో ప్రవేశపెట్టి పిల్లలను పొందే ప్రక్రియను 'సరోగసీ' అని అంటారు.
* ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తుండటంతో 2016, ఆగష్టు 24న సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలను జారీ చేసింది.
   1. పెళ్లై ఐదు సంవత్సరాలు దాటిన జంటలకు సరోగసీ అవకాశం లభిస్తుంది.
   2. భార్య వయసు 25 - 50 సంవత్సరాలు, భర్త వయసు 26 - 55 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఆ ఇద్దరిలో
      * ఒకరికి పిల్లలను కనేందుకు అవసరమైన సామర్థ్యం లేదని లేదా తక్కువగా ఉంది అనే వైద్యుల ధ్రువపత్రం
       తప్పనిసరి.
  3. సరోగసీ ద్వారా పుట్టే బిడ్డకు ఆస్తిపై పూర్తి హక్కు కల్పించనున్నారు.
  4. ఒకసారి మాత్రమే అద్దె గర్భం ఇచ్చే అవకాశం, సరోగసీ ద్వారా జన్మించిన చిన్నారులు ఎక్కడైన, ఎవరైనా
     * ఎలా జన్మించినా భద్రత కల్పించాలి.
* జపాన్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో ఎలుకల అండాలను వృద్ధి చేసి వాటి ద్వారా ఏర్పడ్డ పిండాలను సరోగసీ పద్ధతిలో వేరే ఎలుకల గర్భంలోకి ప్రవేశపెట్టి సంతానాన్ని సృష్టించారు.


క్యాన్సర్ (Cancer)
* దీని అధ్యయనాన్ని  ఆంకాలజీ అంటారు.
* ఇది కలిగించే వైరస్  ఆంకోవైరస్. వీటిలో ముఖ్యమైంది  హ్యూమన్ పాపిలోమా వైరస్.
* కణవిభజన క్రోమోజోమ్/డీఎన్ఏ/ జన్యువుల ఆధీనంలో నియంత్రితమవుతుంది. వీటిలో 'ఉత్పరివర్తనాలు/ మార్పుల వల్ల కణవిభజన అదుపు తప్పి కణాల రాశి /గడ్డ /ట్యూమర్ సంభవిస్తుంది. దీన్నే 'క్యాన్సర్' అంటారు.
* క్యాన్సర్‌ను కలిగించే కారకాలను కార్సినో ఏజెంట్స్. అవి దుమ్ము, పొగ, మసి, క్రిమి సంహారకాలు, డీడీటీ, బాంబులు, నికోటిన్, అప్లోటాక్సిన్.
 

క్యాన్సర్ రెండు రకాలు
i) Benign Cancer: కణాల గడ్డ చుట్టూ సంధాయక కణజాలం (Connective Tissue) ఆవరిస్తుంది. దీన్ని సర్జరీ ద్వారా తొలగించవచ్చు. అపాయమేమి ఉండదు.
ii) Malignant Cancer: దీనిలో కణాల గడ్డకు ఇతర కణాలను నాశనం చేసే గుణం ఉంటుంది. ఇది చాలా అపాయం.
* ఈ క్యాన్సర్ కణాల రక్తం, శోషరసం ద్వారా ఇతర భాగాలకు వ్యాప్తి చెందడాన్ని మెటా స్టాటిస్  అంటారు.
* భారతదేశంలో పురుషులకు ఎక్కువగా నోటి, గొంతు క్యాన్సర్; స్త్రీలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Uterine Servical) వస్తుంది.
* క్యాన్సర్ నిర్ధారణను బ‌యాప్సీ అంటారు.
* ప్రాణం ఉన్న జీవి శరీరంలో అనుమానిత భాగం నుంచి కణజాలం (రక్తం, శోషరసం) తీసి పరీక్షించడాన్ని బయాప్సీ అంటారు.
 

క్యాన్సర్ వచ్చే భాగాన్ని బట్టి రకాలు.
     1. కార్సినోమా - ఎపిథిలియల్ కణాలకు.
         ఉదా: చ‌ర్మం, జీర్ణాశయం, క్లోమం, పేగు
     2. సార్కోమా - కండరాలు, ఎముకలకు.
     3. ల్యుకేమిమా (బ్లడ్ క్యాన్సర్) - తెల్ల రక్త కణాలకు.
     4. లింఫోమా - లింఫ్ గ్రంథులకు.
     5. మెలనోమా - చర్మంలోని మెలనోసైట్ కణాలకు.


గర్భాశయ ముఖద్వార క్యాన్సర్
* దీన్ని కలిగించే వైరస్ హ్యూమన్ పాపిలోమా.
* గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు 'గర్డాసిల్' అనే మందు వాడాలి. దీని నిర్ధారణ పాప్‌స్మియర్ పరీక్ష

చికిత్స
* రసాయనాలను (Cobalt − 60) ఉపయోగించి క్యాన్సర్ కణాలను నశింపచేయడాన్ని కీమోథెరపీ అంటారు.
* గమనిక: కోబాల్డ్ 60 అనే ఐసోటోపు విడుదల చేసే γ కిరణాలు  క్యాన్సర్ కణాలను చంపుతాయి.
* 'కీమోథెరపీ'ని కనుక్కున్నది − లూయీస్ గుడ్‌మన్, ఆల్ ఫ్రెడ్ గిల్ మన్
* ఫాదర్ ఆఫ్ కీమోథెరపీ − పాల్ ఎర్లిచ్
* ల్యుకేమియా(బ్లడ్ క్యాన్సర్) చికిత్సకు ఎక్కువగా బిళ్లగన్నేరు (Vinca rosea) నుంచి లభించే విన్ క్రిస్టిన్, విన్ బ్లాస్టిన్ అనే ఆల్కాలాయిడ్ ఉపయోగిస్తారు.
* (టాక్స్ బాక‌టా) అనే వివృత బీజం (Gymno Sperm) నుంచి లభించే Taxol రసాయనాన్ని కూడా క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తారు.
 Other Testing Instruments
    1) RapidArc Instrument
    2) Laser Induced florence Spectroscopy ద్వారా రోగి రక్తాన్ని పరీక్షిస్తారు
 

క్రయో సర్జికల్ అల్లేషన్ థెరపీ
* ఇది క్యాన్సర్ వ్యాధికి ప్రత్యామ్నాయ చికిత్స
* ఇది ప్రస్తుతం చైనా, అమెరికాలో అందుబాటులో ఉంది.
* దీనిలో మొదట క్యాన్సర్ కణితి పైకి సన్నని సూది ద్వారా 'ఆర్గాన్' మూలకాన్ని పంపుతారు.
-1600 °C వద్ద కణితి మంచు గడ్డగా మారుతుంది.
* చివరగా దాని పైకి 'హీలియం' వాయువును ప్రయోగిస్తారు. ఫలితంగా అది నెమ్మదిగా కరుగుతుంది.
* ఇది గ్లిమోబ్లాస్టోమా (Brain tumour), ల్యూకేమియా (Blood Cancer) మినహా అన్ని క్యాన్సర్‌లను తగ్గిస్తుంది.
 

VIA (Visual Inspection with Acetic Acid)
* ఇది కేవలం రూ.2 ఖర్చుతో గర్భాశయ ముఖద్వార కాన్సర్‌ను గుర్తించే అతి చవకైన పరీక్ష.
* దీని రూపకల్పన చేసింది  శ్రీ గంగారం ఆసుపత్రి పరిశోధకులు (న్యూదిల్లీ).
* దీనిలో ఎసిటిక్ ఆమ్లాన్ని గర్భాశయ ముఖ ద్వారంలోకి పంపినప్పుడు క్యాన్సర్ కణాలు ఎండిపోయి వాటిలోని ప్రోటీన్స్ గడ్డ కడతాయి.
* ఇది ప్రస్తుతమున్న 'పాప్ స్మియర్' పరీక్ష కంటే వేగంగా, కచ్చితమైన ఫలితాలనిచ్చే పరీక్ష.
గమనిక: రక్త పరీక్ష ద్వారా వివిధ క్యాన్సర్‌లను గుర్తించే పరికరాన్ని అభివృద్ధి చేస్తున్న కంపెనీ మిరాక్కులస్ (అమెరికా). ఆ పరికరం పేరు 'మిరియం'. అది రక్తంలోని 'మైక్రో RNA' ను గుర్తిస్తుంది.
 

మూలకణ సాంకేతికత (Stem Cell Technology)
* దేహంలో ఏదైనా కొంత భాగాన్ని కోల్పోవడం వల్ల వివిధ రకాల వ్యాధులు వ‌స్తాయి. ఈ విధంగా కొల్పోయిన‌ భాగాలను తిరిగి ఏర్పరిచే శక్తి ఉన్న కణాలను Stem Cells/ మూల / కాండ / ఆధారకణాలు అంటారు.
* వీటిపైన పరిశోధనలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిమండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
* వీటిని ఎక్కువగా రీ జనరేటివ్ అనే వైద్య విభాగంలో ఉపయోగిస్తారు. అంటే కోల్పోయిన భాగాలను తిరిగి ఏర్పాటు చేసేది. ఈ విధంగా ఏర్పరిచే ప్రక్రియను 'క్లోనింగ్ చికిత్స' అంటారు.
 

మూల కణాల రకాలు
1) పిండ మూలకణాలు (Embryonic Stem Cells)
      ఎక్కువగా 5 - 7 రోజుల పిండం నుంచి కొన్ని కణాలను సేకరించి మూల కణాలుగా ఉపయోగిస్తారు.
2) లింబస్ మూలకణాలు
      ఇవి కంటిలో ఉంటాయి.
      ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వీటి పైన పరిశోధన చేస్తుంది.
3) ఎముక మజ్జ మూల కణాలు (Bone Marrow Stem cells)
      ఎముక మజ్జలో ఉంటాయి.

4) ఉల్బద్రవ మూల కణాలు (Amniotic Stem cells)
     పిండం చుట్టూ ఉండే ఉల్బ ద్రవంలో ఉంటాయి.
5) బొడ్డు తాడు మూల కణాలు (Cord blood stem cells)
    * శిశివు జన్మించేటప్పుడు తల్లికి, శిశువుకు మధ్య ఉన్న తాడును 'బొడ్డుతాడు' అంటారు.
    * ఈ మధ్య కాలంలో వీటిని ఉపయోగించి బ్రిటన్‌లోని 'న్యూ కాస్టిల్ విశ్వవిద్యాలయ' శాస్త్రవేత్తలు ప్రపంచంలో
    * మొదటి సారిగా కృత్రిమ కాలేయాన్ని తయారు చేశారు.
    దీనిలోని మూల క‌ణం నుంచి తయారు చేసిన రక్తం 'తాడు రక్తం' (Cord blood).


పరిశోధనా కేంద్రాలు
   1) ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ − హైదరాబాద్
   2) సెంటర్ ఫర్ స్టెమ్ సెల్ సైన్సెస్ − హైదరాబాద్
   3) క్లినికల్ రిసర్చ్ ఫెసిలిటీ ఆన్ స్టెమ్ సెల్స్ అండ్ రీ జెనరేటివ్ మెడిసిన్ − హైదరాబాద్
   4) నేషనల్ బ్రెయిన్ రీసర్చ్ సెంటర్ − గుర్గావ్
   5) రిలయన్స్ లైఫ్ సైన్సెస్ − ముంబయి
   6) నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ − బెంగళూరు
   7) ఇంటర్నేషనల్ స్టెమ్ సెల్ బ్యాంక్ − సియోల్ (దక్షిణ కొరియా
* ప్రపంచంలోనే మొదటి స్టెమ్ సెల్ బ్యాంక్‌ను లండన్‌లో ఏర్పాటు చేశారు.
* భారత దేశంలో మొదటి సెల్ బ్యాంక్‌ను చెన్నైలో నెలకొల్పారు. దీనికి ప్రస్తుత బ్రాండ్ అంబాసిడర్‌గా ఐశ్వర్యరాయ్ వ్యవహరిస్తున్నారు.
* వడోదరాలో మరో స్టెమ్ సెల్ బ్యాంక్‌ని ఏర్పాటు చేశారు.
 

ప్రయోజనాలు
   1) డయాబెటిస్/ (మ‌ధుమేహ వ్యాధి)
   2) క్యాన్సర్
   3) అల్జీమర్స్ (జ్ఞాపకశక్తి లోపం)
   4) నాడీ క్షీణత (ముసలి వాళ్లలో ఎక్కువ)
   5) కండర క్షీణత  (కండరాలు క్షీణించటం వల్ల చలనం జరగదు)
   6) వెన్నెముక సంబంధిత వ్యాధులు
* పై వ్యాధులను మూల క‌ణాల‌ను  ఉపయోగించి నిర్ధారించవచ్చు.
* ఇటీవల విటమిన్ − ఎ రెటోనిక్ ఆమ్ల సహాయంతో కృత్రిమ వీర్యం తయారు చేశారు. (డెన్మార్క్)

జెనిటిక్ ఇంజినీరింగ్
* వివిధ రకాల జీవుల్లోని, ముఖ్యంగా సూక్ష్మజీవుల్లోని జన్యువులను ఉపయోగించి మానవాళికి కావాల్సిన ఉత్పత్తులను తయారు చేసుకునే ప్రక్రియ బ‌యోటెక్నాల‌జీ.
* ఈ పదాన్ని వాడిని వ్యక్తి కార్ల్ ఎరిక్.
* సూక్ష్మ జీవుల్లోని జన్యువులను ఏ విధమైన సాంకేతిక పద్ధతుల ద్వారా ఉపయోగించాలో తెలిపేది 'జెనిటిక్ ఇంజినీరింగ్'.
* బయోటెక్నాలజీ పితామహుడు − పౌల్ బెర్గ్.
* దీనిలో ఎక్కువగా ఉపయోగించే జీవులు E−Coli అనే బాక్టీరియా. దీనిలో ఉంగరాకారంలో DNA ముక్కలుంటాయి. వాటినే ప్లాస్మిడ్స్ అంటారు. ఇవి జన్యువులను తీసుకెళ్లే వాహకాలుగా (Vectors) పని చేస్తాయి. వాటికి ప్రతికృతి (Replication) చెందే సామర్థ్యం ఉంటుంది. అంటే సంఖ్యను రెట్టింపు చేసుకునే సామర్థ్యం ఉంటుంది.
* కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీని పైన పరిశోధనలు జరుగుతాయి.
* వీటి పెంపకం కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉంటుంది.
* DNA ను ముక్కలుగా చేసే అణు కత్తెరల ను కనుక్కొని, వాటి లక్షణాలను వివరించింది ఆర్థర్‌, నాథన్స్, స్మిత్.


అనువర్తనాలు (Applications)
1) (Transgenic Crops or Gm Crops (Genetically) Modified crops) జన్యుపరివర్తిత/ మార్పిడి మొక్కలు
* ఒక జీవిలోని ఉపయోగకర జన్యువులను వివిధ వాహకాల ద్వారా పంట మొక్కల్లో ప్రవేశపెట్టి, ప్రయోజనాలను పొందడానికి ఏర్పరచిన పంటలను "జ‌న్యుప‌రివ‌ర్తిత / మార్పిడి మొక్కలు" అంటారు.    
 

గోల్డెన్ రైస్
* Vit−A, Zn, Fe లు ఎక్కువగా ఉంటాయి. వీటిని చైనా వారు తయారు చేశారు. దీని ఉత్పత్తికి మూల పురుషుడు  ఇంగో పాట్రికస్.

గోల్డెన్ గ్రౌండ్ నట్
* Vit−A ఉన్న వేరుశనగను హైదరాబాద్‌లోని ICRISAT అనే సంస్థ తయారు చేసింది.
 

బీటీ కాటన్
* బీటీ అంటే బాసిల్లన్ తురుంజియెన్సెస్ − ఇది కీటకాలను చంపే బాక్టీరియా, అంటే ఇది ఒక బయోపెస్టిసైడ్.
* ఈ పత్తి కీటకాలను (శనగ, పచ్చ పురుగులు, లెపిడోప్టెరాన్స్) నివారించవచ్చు. దీన్ని మొదటిసారిగా తయారు చేసింది అమెరికాకు చెందిన మొన్సాంటో అనే బహుళజాతి సంస్థ.
* మన దేశంలో దీన్ని అభివృద్ధి చేసింది Mahyco (MH).
 

ఫ్లేవర్ సేవర్ టమోటా
* ఎక్కువ గుజ్జు కలిగి తొందరగా పక్వానికి రాదు.
* జన్యు మార్పిడి వల్ల తయారుచేసిన అధిక అమైలోపెక్టిన్ అనే ప్రత్యేక పిండి పదార్థం ఉన్న బంగాళదుంప  ఆమ్‌ప్లోరా (యూరప్).
* భారత్‌లో నిరసనలకు గురై తాత్కాలికంగా నిలుపుదల చేసిన మొదటి జన్యుమార్పిడి చేసిన ఆహార పంట వంకాయ (సొలానం మెలాంజినా).
1) టర్మినేటెడ్ సీడ్స్ ఒక పంటకు మాత్రమే ఉపయోగించే విత్తనాలు.
2) ఇన్సులిన్ ఉత్పత్తి బయోటెక్ ద్వారా ఉత్పత్తయిన ఇన్సులిన్ పేరు హ్యుమిన్.
3) బయోరెమిడయేషన్: బ్యాక్టీరియా, శైవలాలు, ఆల్గే శిలీంధ్రాలు, ఫంగస్ ఉపయోగించి పరిసరాలను శుభ్రపరిచే ప్రక్రియ.
4) సూపర్ బగ్ బ్యాక్టీరియా (సూడోమోనాస్ పుటిడా).
* ఇది నూనె తినే బాక్టీరియా.
* దీని తయారీలో ముఖ్యపాత్ర పోషించింది  ఆనంద్ చక్రవర్తి. నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ − నాగపూర్ (NEERI)
  5) ఇంటర్‌ఫెరాన్స్: ఇవి 'క్యాన్సర్ వైరస్‌'కు (అంకో వైరస్) వ్యతిరేకంగా మన దేహంలో ఉత్పత్తయ్యే 'ప్రోటీన్స్'.
  6) హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ (HFC'S).
* దీన్ని ఆహార పరిశ్రమల్లో ఆహారానికి 'తీపి' ఇవ్వడానికి ఉపయోగిస్తారు.
  7) కణజాల వర్ధనం (Tissue Culture):
* మొక్కల్లోని ఏదైనా భాగాన్ని (వేరు, కాండం, కొన, పత్రం, అండం, అండాశయం) పోషకాలు కలిసిన యానకంలో పెంచి కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే ప్రక్రియను 'కణజాల వర్ధనం' అంటారు.
* ఇది ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి రకం.
* టిష్యూ కల్చర్ పితామహుడు  హేబర్ లాండ్.
* ఈ వర్ధనానికి మూలసూత్రం  టొటీ పొటెన్సీ. అంటే ఏదైనా మొక్క భాగానికి పూర్తి మొక్కను ఏర్పరిచే  అంతర్గత సామర్థ్యం.
* మొక్క పెరగడానికి కావాల్సిన అన్ని రకాల పోషకాల మిశ్రమానికి 'పోషక యానకం' (Nutrient medium) అంటారు. దీన్ని తయారు చేసింది మురిషిగే, స్కూగ్.
* ఏ మొక్క భాగాన్నైతే ఉపయోగిస్తామో దాన్ని ఎక్స్‌ప్లాంట్ అంటారు.
ఉదా: కాండం కొన, వేరు, అండం. 
* పోషక యానకాన్ని ఘనస్థితిలోకి మార్చడానికి తోడ్పడేది అగార్ - అగార్.
* ఎక్స్‌ప్లాంట్‌ను పోషక యానకంలో ఉంచినప్పుడు అది విభజన చెంది కణాల గుంపును ఏర్పరుస్తుంది. దీనికి ఆక్సిన్ అనే ఫైటో హార్మోన్లను కలిపితే వేర్లు, సైటో కైనిన్స్ అనే హర్మోన్లను కలిపితే కాండం వస్తాయి.
* ఈ వ‌ర్ధనం వల్ల తక్కువ కాలంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేసి గార్డెన్స్ (హార్టీ కల్చర్) లో పెంచుతారు.
* దీని వల్ల వైరస్ రహిత మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు.
* ఫారెస్టరీ, ఫార్మసీ, సోషల్ ఫారెస్టరీలో ఈ విధంగా ఉత్పత్తి అయిన మొక్కలను వాడతారు.
* ఈ వర్థనం సహయంతో తక్కువ కాలంలో, తక్కువ స్థలంలో అధికంగా మొక్కలను ఉత్పత్తి చేయడాన్ని 'మైక్రో ప్రొపగేషన్' అంటారు
* దీని నుంచి కృత్రిమ విత్తనాలను సింథటిక్ సీడ్స్ తయారు చేస్తారు.
* కృత్రిమ విత్తనాలను తయారు చేయడానికి వాడే రసాయనం − సోడియం ఆల్జినేట్

హైబ్రిడోమా టెక్నాలజీ
* దీన్ని రూపొందించింది కొహెలర్, మైల్‌స్టిన్.
* దీని ద్వారా ఒకే ఆకారం,  పరిమాణంలో ఉన్న అనేక రకాల ప్రతి రక్షకాలు (Antibodies) ను ఉత్పత్తి చేస్తారు. వీటినే మోనోక్లోనల్ యాంటీ బాడీస్ (MAB) అంటారు.
* ఒక ప్లీహ కణాన్ని, క్యాన్సర్ కణంతో సంకరణం చెందించి యాంటీబాడీస్ ను ఏర్పరుస్తారు.
* క్యాన్సర్ నివారణ, మూత్ర పిండాల మార్పిడిలో ఉపయోగపడుతుంది.
 

వైద్య పరికరాలు (INSTRUMENTS)
1) వ్యాధి నిర్ధారణ పరికరాలు (Diagnostic Instruments).
ఎ) ECG (Electro Cardiogram/ graph)
 దీన్ని కనుక్కున్నది  ఇండోవెన్.
 ఇది గుండె కండర, విద్యుత్ ప్రచోదనాలను రికార్డు చేస్తుంది.
 ఇది సోనో గ్రాఫిక్ చిత్రాలను ఇస్తుంది.
బి) EEG (Electro Encephalo Graph)
* ఇది మెదడులోని విద్యుత్ ప్రకంపనాలను తెలియజేస్తుంది.
* దీంతో మెదడుకు సంబంధించిన వివిధ వ్యాధులను తెలుసుకోవచ్చు.
    1) ఎపిలెప్సి - మూర్చ
    2) మానసిక రోగులు
    3) బ్రెయిన్ ట్యూమర్ (క్యాన్సర్)
సి) MET (Magneto Encephalo Graph)
* మెదడు ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం తెలియజేస్తుంది.
2) IMAGING INSTRUMENTS (ప్రతిబింబం)
 

ఎ) CT Scanning (Computed Tomography)
* దీనిలో స్కానింగ్  X − కిరణాలు ఉపయోగించి ఊపిరితిత్తులు, గుండె, విరుపులు (Fractures), మూత్రపిండాలు, కీళ్లకు సంబంధించిన వ్యాధులను కనుక్కోవచ్చు.
* దీనిలో బేరియం, అయోడిన్ మూలకాలను ఉపయోగిస్తారు.
* ఇది సున్నిత భాగాల సమాచారాన్ని తెలియజేయలేదు.
* దీన్ని అభివృద్ధి పరిచింది − గాడ్‌ఫ్రె హన్స్‌ఫీల్డ్ (1972). ఇతడికి 1979లో నోబెల్ బహుమతి లభించింది.
* ఉద‌రం (Abdomen) ఛాతీ, వెన్నుపాము, కణతలు (Tumours) కు సంబంధించిన వ్యాధులను నిర్ధారిస్తుంది.
 

బి) PET (Positron Emission Tomography)
* దీనిలో పాజిట్రాన్ విడుదల చేసే రేడియో ఐసోటోప్‌లైన 11C7, 13N7, 8O15, 9F18 లను జీవరసాయనాలైన గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు O2, CO2లకు సంధానించి శరీరంలోకి పంపించి వ్యాధులను నిర్ధారిస్తారు.
* దీంతో జీవక్రియారేటు, రక్త ఘనపరిమాణం, ప్రసరణ, వ్యాధి కలిగే ప్రదేశాలు, మెదడుతో సక్రమంగా పని చేయని ప్రదేశాలను తెలుసుకోవచ్చు.
 

సి) MRI (Magnetic Resonance Imaging)
* బలమైన ద్రవరూప హీలియం (He) అనే మూలకాన్ని ఉపయోగించి శరీరం లోపలి కణజాలాలను, వ్యాధులు విస్తరించే మార్పులను గుర్తించవచ్చు.
* ఇది CT, PET స్కానింగ్ కంటే అద్భుతమైన స్కానింగ్

డి) Ultra Sound (or) Sonographic Imaging
* Ultra Sound అంటే అధిక ధ్వనులు. వీటిని ఈ లెడ్ జిర్‌కోనేట్ స్ఫటికాల నుంచి విద్యుత్ పంపించి ఉత్పత్తి చేస్తారు.
* దీని ద్వారా శరీర అంతర అవయవాలను అంటే మూత్రాపిండాల్లోని రాళ్లు, ఫాలోపియన్ నాళం, గర్భాశయ సంబంధ వ్యాధులను నిర్ధారించవచ్చు.
* దీన్ని భ్రూణం వయసు, ఆరోగ్యం, లైంగికత్వం తెలుసుకోవటానికి కూడా ఉపయోగిస్తారు.
3) Therapeutic Instruments
 

a) Pace maker (గుండె)
* ఇది మొదటి ఎలక్ట్రిక్ పరికరం.
* దీన్ని కనుక్కున్నది విల్సన్ గ్రేట్ బాచ్.
* ఇది హృదయ స్పందనను ఉత్పత్తి చేసేది. దీనిలో 'లిథియం హాలైడ్' కణాలు ఉంటాయి.
 

బి) ఆంజియోప్లాస్టీ
 హృదయ ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వును తీసివేసే ప్రక్రియ.
 

సి) కృత్రిమ ధమనులు (Artificial Arteries)
* ధమనులకు ఏవైనా అవాంతరాలు ఎదురైనప్పుడు తంతుయుత ప్లాస్టిక్ డెక్రాన్ లేదా టెఫ్లాన్‌తో కృత్రిమ ధమనులు తయారు చేస్తారు.
NMR (Nuclear Magnetic Resonance Imaging)
 స్పెక్ట్రోస్కోపీ ద్వారా కణజాల జీవ క్రియను అధ్యయనం చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు.
 దీన్ని కనుక్కున్నవారు − పర్సెల్, బ్లాచ్


ఎండోస్కోపీ
* శరీరంలోని వివిధ భాగాలను పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది.
* ఉదరంలోని అల్సర్‌లను పరిశీలించేందుకు 'గ్యాస్ట్రోస్కోప్‌'ను ఉపయోగిస్తారు.
* యురెట్రస్, పాలోపియన్ నాళాలు, అండాలలో ఏర్పడ్డ సిస్ట్ (కోశాలు) ఇన్‌ఫెక్షన్లను గుర్తించేందుకు 'లాప్రోస్కోపును' ఉపయోగిస్తారు.
 

ఆక్సి జనరేటర్
* ఓపెన్ హార్ట్ సర్జరీలో Heart − Lung Machine ద్వారా ఆమ్లజనిసహిత రక్తం సరఫరా చేసేందుకు ఉపయోగిస్తున్నారు.
* మొదటి Open − Heart Surgery జరిగిన సంవత్సరం − 1953.
* ఆక్సిజనరేటర్‌నే 'కృత్రిమ ఊపిరితిత్తులు' అంటారు.


కృత్రిమ మూత్రపిండం
* మూత్రపిండాలు విఫలమైనప్పుడు శరీరంలోని జీవక్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థాలను తొలగించేందుకు డయాలసిస్ పద్ధతిలో రక్తాన్ని శుభ్రపరుస్తారు. దీన్నే 'కృత్రిమ మూత్రపిండం' అంటారు.
* డయాలసిస్ అనేది 'విసరణ', 'ఆస్మాసిస్' అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది.
* డయాలసిస్ కనుక్కున్నది − కోల్ఫ్


జీవ - వైవిధ్యత ((Bio − Diversity)
* జీవావరణంలోని సమస్త జీవజాతుల మధ్య ఉన్న తేడాల వైవిధ్యతనే జీవ వైవిధ్యత అని అంటారు.
* జీవవైవిధ్యత అనే పదాన్ని శాస్త్ర ప్రపంచానికి 1980లో చెప్పిన శాస్త్రవేత్త 'లౌజాయ్'
* 1986లో జీవవైవిధ్యత అనే పదాన్ని డబ్ల్యూ. జి. రోసెన్ అనే శాస్త్రవేత్త అమెరికాలో నిర్వహించిన 'నేషనల్ ఫోరం ఆఫ్ బయోడైవర్సిటీ' సందర్భంగా ఉపయోగించారు.
* 1988లో ఈవో. విల్సన్ అనే శాస్త్రవెత్త బయోడైవర్సిటీ అనే పుస్తకం ప్రచురించారు.
* 1992లో రియో సదస్సులో జీవ వైవిధ్యాన్ని కింది విధంగా నిర్వచించారు. 'జీవావరణంలోని భౌమ, జలావరణ వ్యవస్థల్లో ఉన్న సమస్త జీవజాతుల మధ్య ఉన్న జన్యుపరమైన, ఆవరణ వ్యవస్థల పరమైన తేడాలు, వైవిధ్యతలను జీవ వైవిధ్యం' అని అంటారు.
* దీని ప్రకారం జీవ వైవిధ్యం మూడు రకాలుగా అంచనా వేయవచ్చు.
1. జన్యు వైవిధ్యం (Genetic Diversity)
2. జాతుల వైవిధ్యం (Speceies Diversity)
3. ఆవరణ వ్యవస్థల వైవిధ్యం (Eco System Diversity)
1. జన్యు వైవిధ్యం (Genetic Diversity)
* భిన్నజాతి జీవుల మధ్య జన్యువుల్లో తేడాలు, ఒక జాతి జీవుల మధ్య జన్యు లక్షణాల్లోని తేడాలు. ఇలాంటి వైవిధ్యత తర్వాత తరాలకు అందుతుంది.
ఉదా: వరి              −        30 వేల నుంచి 50,000
          మానవుడు   −       35,000 నుంచి 45,000
          ఈ. కొలి          −      4,000
          మామిడి         −     1,000 రకాల జన్యు వైవిధ్యతలను కలిగి ఉన్నాయి.
* జన్యు వైవిధ్యత ఎక్కువగా ఉన్న జీవులు అధిక కాలం మనుగడ సాగిస్తాయి.


జాతుల వైవిధ్యత (Speceies Diversity)
* ఒక ప్రమాణ వైశాల్యంలో నివసించే వివిధ జాతుల మధ్య ఉన్న శారీరకమైన తేడాలు, వైవిధ్యతలను జాతుల వైవిధ్యం అంటారు.
* ఇది ప్రమాణ వైశాల్యం ఉన్న భూ భాగంలో ఎన్ని జాతులు నివసిస్తున్నాయి అనేది తెలియజేస్తుంది.
ఉదా: ఉష్ణమండల ప్రాంతంలో కప్పలు, పాములు, కోతులు, పుష్పించే మొక్కలు మొదలైనవి.
* ఆర్ద్రోపోడా వర్గానికి చెందిన వివిధ కీటకాలు 10,000 సంఖ్యలో ఉంటాయి.
* హిమాలయ ప్రాంతంలో చిరుతలు, కస్తూరి మృగాలు, పుష్పించే జాతి మొక్కలు అన్నీ కలిపి 13,000 వరకు నివసిస్తున్నాయి.
* పశ్చిమ కనుమల్లో జాతుల సంప‌న్నత్వం అధికంగా ఉంటుంది.
* ఒక భౌగోళిక ప్రాంతంలో జాతుల వైవిధ్యాన్ని తెలుసుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో జాతుల ఆదిపత్యాన్ని, సంపన్నత్వాన్ని, సమానత్వాన్ని గురించి తెలుసుకోవచ్చు.
* భూమధ్యరేఖ నుంచి ధృవాల వైపు వెళ్లే కొద్దీ వైవిధ్యత సాధారణంగా తగ్గుతుంది. కార‌ణం శీతోష్ణస్థితి, నేలలు. . అక్షాంశాలను బట్టి మారుతుండ‌టం.     
* భూమిపై అత్యధిక సంఖ్యలో జాతులు భూమధ్యరేఖకు ఇరు వైపుల 23 º ల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ జాతులు నివసిస్తున్నాయి.
ఉదా: ఉష్ణమండల అరణ్యాల్లో చదరపు హెక్టారుకు 300 పైగా జాతులు నివసిస్తున్నాయి. టైగా అరణ్యాల్లో కేవలం 3, 4 జాతులు మాత్రమే నివసిస్తున్నాయి.
* సముద్ర ఆవరణ వ్యవస్థలో ఖండతీరపు అంచువద్ద (Continental Shelf) జాతుల సంపన్నత్వం అధికంగా ఉంటుంది.
* జాతుల వైవిధ్యత అనేది ఆవరణ వ్యవస్థల స్థిరత్వాన్ని సూచిస్తుంది.
* జాతుల వైవిధ్యం కారణంగా ఒక జాతి మరొక జాతి జీవులపై ఆధారపడి ఆహారం పొందడం జరుగుతుంది.
ఉదా: గడ్డి మొక్కలపై ఎలుకలు
         ఎలుకలపై పాములు ఆధారపడి ఉంటాయి.
* జాతుల వివైధ్యత తగ్గితే ఆవరణ వ్యవస్థ మనుగడ దెబ్బ తింటుంది.


3. ఆవరణ వ్యవస్థల వైవిధ్యత (ECO System Diversity)
* జీవావరణంలోని భిన్న అరణ్య వ్యవస్థల మధ్య ఉన్న తేడాలు, వైవిధ్యతలనే ఆవరణ వ్యవస్థలపై వైవిధ్యత అని అంటారు.
* శీతోష్ణస్థితి, నైసర్గిక స్వరూపాల్లోని వైవిధ్యత వల్ల భిన్న ఆవరణ వ్యవస్థలో తేడాలు ఉంటాయి.
* మాన‌వ‌ చర్యల వల్ల ఆవరణ వ్యవస్థల పరిమాణంలో, శీతోష్ణస్థితుల మార్పులు సంభవించినట్లయితే అందులోని జనాభా, జీవసముదాయాలు, ఆవాసాల్లో మార్పు కలుగుతుంది.


జీవవైవిధ్య గణన (Measuring of Bio Diversity)
* 1972లో 'విట్టేకర్' అనే శాస్త్రవేత్త జీవవైవిధ్య గణనకు మూడు రకాలుగా కొలమానాలు ప్రతిపాదించాడు.
i) α - వైవిధ్యం
* ఆవరణ వ్యవస్థలో జాతుల సంఖ్యలో వచ్చే మార్పు.
* ఇది ప్రమాణ వైశాల్యం ఉన్న భూభాగం లేదా జీవసమాజం లేదా ఆవరణ వ్యవస్థలోని జాతుల వైవిధ్యాన్ని సూచిస్తుంది.
ii) β - వైవిధ్యత
* భిన్న ఆవరణ వ్యవస్థలో ఉన్న జీవసముదాయాల్లోని జాతుల మధ్య తేడాలను, ఆవాసాల మధ్య తేడాలను తెలియజేస్తుంది. సాదృశ్య సూచికను తెలుసుకోవడానికి β వైవిధ్యతను ఉపయోగిస్తారు.
iii) γ - వైవిధ్యత
* వివిధ ఆవరణ వ్యవస్థలోని జనాభా, జీవసముదాయాలు, వాటి ఆవాసాల మొత్తం సంఖ్యను, వాటిలో కలిగే మార్పులను, జాతుల సంపన్నత్వాన్ని సూచిస్తుంది.
γ = q (α + β)
q = ఆవాసాలు, జీవసమాజాల మొత్తం సంఖ్య
α = జాతుల సంఖ్య
β = ఆవాసాల సంఖ్య


ప్రపంచంలో జీవవైవిధ్యత పరిమాణం (Global Bio diverisity)
* 2001 'గ్లోబల్ బయోడైవర్సిటీ ఔట్‌లుక్' ప్రకారం ప్రపంచంలోని అన్ని ఆవరణ వ్యవస్థల్లో 140 మిలియన్ జీవజాతులు నివసిస్తూ ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
*  ఇప్పటి వరకు 1.74 మిలియన్ల జీవ జాతులను గుర్తించి వర్గీకరించారు.
     చేపలు                                       −       28,000
     క్షీరదాలు                                   −       4,000
     పక్షి జాతులు                             −       9,100
     సరీసృపాలు                             −       3,22,500
     వెన్నెముక లేని జీవులు            −      10,21,000
     సూక్ష్మజీవులు                           −       5,800


భారతదేశంలో జీవవైవిధ్యత
*  ఆర్ద్రతతో కూడిన శీతోష్ణస్థితి, వైవిధ్యభరిత నైసర్గిక స్వరూపం కలిగి ఉన్నందు వల్ల 329 మిలియన్ హెక్టార్లు ఉన్న భారతదేశంలో అత్యధిక జీవ వైవిధ్యత కనిపిస్తుంది.
*  ప్రపంచ జీవవైవిధ్యంలో భార‌త‌దేశ జీవ‌వైవిధ్యత‌ 8% .
*  వ్యవసాయ పంటలు − 167 (ప్రపంచంలో మొదటి స్థానం)
     కీటక జాతులు − 65,900
వెన్నెముక లేని జీవులు − 10,500
  ఉభయ చరాలు − 182 (ప్రపంచంలో 15వ స్థానం)
  చేపలు − 2,000
  సరీసృపాలు − 350 (ప్రపంచంలో 5వ స్థానం)
  పక్షిజాతులు − 1200 (ప్రపంచంలో 8వ స్థానం)
  క్షీరదాలు − 345 (ప్రపంచంలో 8వ స్థానం)
  వన్యజాతి మొక్కలు − 320
బృహత్ జీవవైవిధ్య మండలంగా భారతదేశం (India as Mega Diversity Region)
* 'మెగా డైవర్సిటీ' అనే భావనను UNEP ప్రవేశపెట్టింది.
* ఒక దేశాన్ని మెగా డైవర్సిటీగా పేర్కొనాలంటే
    i) స్థానిక జీవవైవిధ్యం అధికంగా ఉండాలి.
    ii) ప్రపంచ వృక్షజాతుల్లో కనీసం 5000 జాతులు ఆ దేశంలో ఉండాలి.
    iii) ఆ దేశపు జీవజాతులు ప్రమాదపు అంచుల్లో ఉండాలి.
* ప్రపంచంలో ఇప్పటివరకు 17 మెగా డైవర్సిటీలను గుర్తించారు. వాటిలో భారతదేశం ఒకటి.
* 'మెగా డైవర్సిటీ' అనే పదాన్ని మొదటిసారిగా 1988లో 'రసెల్ మిట్టర్ మీర్' అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టారు.
* అత్యధిక మెగా డైవర్సిటీ ఉన్న దేశం 'ఆస్ట్రేలియా'. తరువాత స్థానాల్లో కాంగో, మడగాస్కర్, దక్షిణాఫ్రికా, చైనా, భారతదేశం, ఇండోనేషియా, మలేషియా, పపువా న్యూ గినియా, ఫిలిప్పైన్స్, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, మెక్సికో, పెరూ, అమెరికా, వెనిజులా ఉన్నాయి.
* ప్రపంచంలోని మెగా డైవర్సిటీ దేశాలు అన్ని ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఉన్నాయి.
* భారతదేశంలో టండ్రా వ్యవస్థ తప్ప మిగిలిన అన్ని ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి.
* ప్రపంచంలోని 35 ఎకలాజికల్ హాట్‌స్పాట్‌లలో మూడు భారతదేశంలో ఉన్నాయి.
* భారతదేశంలో జీవ భౌగోళిక ప్రాంతాలు (Bio − Geographic Regions) − 10
* వ్యవసాయ శీతోష్ణస్థితి ప్రాంతాలు (Agro − Climatic Regions) − 16
 జీవ సరిహద్దులు − 25
 బయోమ్స్ (జీవ మండలం) − 5 
 ప్రపంచ జీవ వైవిధ్యతలో 7% వృక్షజాతులు ఉన్నాయి.

జంతు వైవిధ్యత
వృక్ష వైవిధ్యత
  పుష్పించే మొక్కలు − 5000 నుంచి 7500 జాతులు
  వన్యజాతి మొక్కలు − 320 జాతులు
  వ్యవసాయ పంటలు − 167 జాతులు
*  పైన తెలిపిన వాటితో పాటు 7,500 కి.మీ. పొడవైన తీరరేఖ వెంబడి ఉన్న మాంగ్రూవ్స్ (39), వెట్ లాండ్స్
* (దేశ భూభాగంలో 4.6% కలిగి 94 రకాల చిత్తడి నేలలు కలిగి ఉంది). ఎస్టురాగ్ ఆవరణ వ్యవస్థలు, భారత ప్రాదేశిక జలాల్లోని ప్రవాళదీవులు, భిన్న జాతులైన‌ క్రిష్టీషియన్లు, మొలస్కన్స్, సముద్ర తాబేళ్లకు నిలయంగా ఉన్నాయి.
* అంతే కాకుండా భారతదేశంలో పశువైవిధ్యతలో కూడా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ఉంది. 20 జాతుల పశువులు, 40 జాతుల గేదెలు, 22 జాతుల మేకలు ఉన్నాయి.
* పైన తెలిపిన విశిష్టతల కారణంగా భారతదేశాన్ని బృహత్ జీవ వైవిధ్యతా మండలంగా పేర్కొంటారు.


జీవావరణ సునిశిత ప్రాంతాలు
   స్థానీయమైన అత్యధిక జీవవైవిధ్యత ఉన్న ఒకప్పటి భౌగోళిక ప్రాంతాలు ప్రస్తుతం మానవ ప్రమేయం వల్ల ప్రమాదస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే ఆ భౌగోళిక ప్రాంతాలను Ecological Hotspots (EHs) అని పిలుస్తారు. 1988లో నార్మన్ మేయర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా ఈ భావనను అభివృద్ధిపరిచారు.
ఒక ప్రాంతాన్ని Hotspotగా ప్రకటించడానికి ఎన్నిక చేసుకునే ప్రమాణాలు
1. అత్యధికంగా జీవైవిధ్యత ఆ ప్రాంతంలో ఉండాలి.
2. ఆ ప్రాంతంలో నివసించే జీవజాతుల్లో ఎక్కువ స్థానీయ జాతులు (Endemic) ఉండాలి.
3. అక్కడి జాతుల ఆవాసాలు (habitates) ఏ స్థాయిలో నిర్మూలించబడ్డాయి అంటే ఆ ప్రాంతాల్లోని జాతుల ఆవాసాలు మానవచర్యల వల్ల 70% మార్పుకు లోనై ఉండాలి, ఆ ప్రాంతంలోని 70% వృక్ష సంపద అంతరించి అయినా ఉండాలి.
4. అక్కడి జాతుల్లో ఎక్కువ జాతులు ప్రమాదస్థితిని ఎదుర్కొంటూ ఉండాలి.
5. ఆ ప్రాంత జీవవైవిధ్యత మానవ ప్రమేయం ఏ స్థాయిలో ఉందో గమనించాలి.
* ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 35 ఎకలాజికల్ హాట్‌స్పాట్‌లను గుర్తించారు. అందులో భారతదేశంలో మూడు ఎకలాజికల్ హాట్‌స్పాట్లు ఉన్నాయి.


ఆఫ్రికాలోని ఎక‌లాజికల్ హాట్‌స్పాట్స్
* పశ్చిమ ఆఫ్రికా గినియ అడవులు, సక్కులెండ్ కరవా, కేప్‌ఫ్లోరిస్టిక్ ప్రాంతం, మపుటాల్యాండ్, పోండోల్యాండ్, ఆల్బని, తూర్పు ఆఫ్రికా తీర ఆడవులు, మడగాస్కర్, హిందూ మహాసముద్రం దీవి, హార్న్ ఆఫ్రికా, ఈస్ట్రన్ ఆఫ్రోమౌంటేన్.
 

ఆసియా పసిఫిక్‌లోని ఎకలాజికల్ హాట్‌స్పాట్స్
* నైరుతి చైనా, జపాన్, వాలేసియా, తూర్పు మెలనీసియ దీవులు, న్యూజిల్యాండ్, ఈశాన్య ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్, సుందాల్యాండ్, న్యూకాలిడోనియా, మైక్రోనీసియా - పాలనీసియా, నైరుతి ఆస్ట్రేలియా.
 

యూర‌ప్, మధ్య ఆసియా
* కాకానస్, మధ్య ఆసియా పర్వతాలు, మధ్యధరా ప్రాంతాలు ఇరాన్ అనతోలియాన్.
 

దక్షిణ అమెరికా
* టంచెస్ చోకో మ్యార్డెలీన, ట్రాపికల్ అండెస్, చిలిమ వింటర్, రెయన్‌ఫాల్, వాల్దీవియన్ అడవులు, బ్రెజిల్ ఫెర్రా.
 

ఉత్తర, మధ్య అమెరికా
* కాలిఫోర్నియా, ఫ్లోరిస్టిక్ ప్రావిన్స్, మ్యాడ్రియన్ పైన్ ఓక్ ఉడ్‌ల్యాండ్స్, మాసో అమెరికా, కరీబియన్ దీవులు.
 

భారతదేశంలో ఎకలాజికల్ హాట్‌స్పాట్స్
*పశ్చిమ కనుమలు - శ్రీలంకలోని ద్వీప సమూహాలు
ఈ హాట్‌స్పాట్ గుజరాత్‌లోని కథియవార్ నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు విస్తరించి ఉంది. భారతదేశంలోని ఆరు రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది. ఇందులో కేరళలోని అగస్త్యమలై కొండలు, సైలెంట్ వ్యాలీ అనే 2 ముఖ్యమైన జీవవైవిధ్య కేంద్రాలున్నాయి. ఈ ప్రాంతంలో 1700 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన సతతహరితాల నుంచి ఆకులు రాలే అరణ్యాలు, పొదలతో కూడిన వృక్ష వైవిధ్యత ఉంది.
ఈ ప్రాంతంలో జీవవైవిధ్యత ఈ కింది విధంగా ఉంది.
ఎ) 1100 జంతుజాతులు నివసిస్తున్నాయి. ఇందులో 117 రకాల ఉభయచర జాతులు (89 జాతుల స్థానీయమైనవి), 165 రకాల సరీసృప జాతులు (89 స్థానీయ జాతులు), 104 రకాల చేప జాతులు, 12 రకాల క్షీరద జాతులు ఉన్నాయి. వీటితో పాటు ఈ ప్రాంతంలో అరుదుగా కనిపించే సింహాలు, తోక గల మకాక్ కోతులు, ఆసియా ఏనుగులు, నీలగిరి లాంగూర్, నీలగిరి టార్, మలబార్ గ్రే, హర్నీచిల్, ఎగిరే ఉడుతలు కనిపిస్తాయి.
బి. 450 పక్షిజాతులు
సి. 6000 నాళికాయుత వృక్షజాతులు, 1500 పుష్పించే జాతి మొక్కలు.
* ఇటీవల కాలంలో మానవ అభివృద్ధి కార్యక్రమాల్లో వాటి ఆవాసాలను, ఆహారపు వనరులను కోల్పోయి కింద తెలిపిన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అవి:
1. జనాభా పెరుగుదల
2. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ
3. అటవీ భూములను వ్యవసాయు భూములుగా మార్పు చేయడం
4. కలప అవససరాలకు అటవీ నిర్మూలన చేయడం
5. ఖనిజాల తవ్వకం
6. ముడిచమురు నిక్షేపాల వెలికితీత
7. కొంకన్ రైల్వే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడం


హిమాలయాలు (ఇంతకు ముందు తూర్పు హిమాలయాలు అని పిలిచేవారు)
    * ఇది పాకిస్థాన్, నేపాల్, భూటాన్, చైనా, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతమంతా ఉష్ణమండల, ఉప ఉష్ణమండల అరణ్యాలతో కూడిన అత్యంత వైవిధ్యభరితన్నాయి, స్థానీయమైన పుష్పించే జాతి వృక్ష రోడోడెండ్రాన్, జంతు జాతులతో నిండి ఉంది. ఒకప్పుడు 3,40,000 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ భూభాగం ప్రస్తుతం మానవ కార్యకలాపాల వల్ల 1,10,000 చ.కి.మీ. విస్తీర్ణానికి తగ్గిపోయింది.
ఎ) జనాభా పెరుగుదల
 బి) అటవీ నిర్మూలన
 సి) పారిశ్రామికీకరణ, పట్టణీకరణ
 డి) అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్పు చేయడం
 ఇ) భూపాతాలు (Landslides)
 ఎఫ్) అడవులకు నిప్పంటుకోవడం
 

ఇండో-బర్మన్ ప్రాంతం
*  గంగానది తూర్పు భాగం నుంచి బ్రహ్మపుత్ర లోతట్టు ప్రాంతాల వరకు 23,73,000ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్, దక్షిణ అసోం రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఇది స్థానీయ జాతులకు నిలయం.
     ఈ హాట్ స్పాట్ లో 1200ల పక్షి జాతులు (ఇందులో 60 స్థానీయమైనవి), 13,500 వృక్షజాతులు (ఇందులో 52 శాతం స్థానీయమైనవి) 430 క్షీర జాతులు (70 స్థానీయమైనవి).


ప్రమాదస్థితిని ఎదుర్కొంటున్న వన్యజాతులు - వర్గీకరణ
(Classification of Endangered Wild Species)
     ప్రపంచవ్యాప్తంగా అంతర్థానమయ్యే స్థితిలో ఉన్న జీవ జాతులను, ప్రకృతి వనరుల పరిరక్షణను స్థానికంగా చేపట్టడానికి, తగిన సూచనలను అందించడానికి 1963లో స్విట్జర్లాండ్‌లోని మార్గస్ గ్ల్రాండ్ ప్రధాన కేంద్రంగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కనజర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్‌సెస్ (IUCN) ఏర్పాటు చేయడం వల్ల ఈ సంస్థ మొదటిసారిగా ప్రపంచంలో మానవ చర్యల వల్ల ప్రధాన ప్రమాదస్థితిలో ఉన్న జాతులను గుర్తించి, అవి అంతరించడానికి కారణాలను పేర్కొంటూ, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు సూచిస్తూ రెడ్ డేటా బుక్‌ను మొదటిసారిగా 1963లో ప్రచురించింది. దీన్ని సర్ పీటర్ స్కాట్ రచించారు. 2014లో రెడ్ డేటా బుక్ ప్రచురించిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 18,000 జాతులను పరిశీలించగా 11,000 జాతులు (15,600 మొక్కలు, 5400 జంతువులు) అంతరించే దశలో ఉన్నాయని తెలియజేస్తుంది.
* రెడ్ డేటా బుక్‌లో గులాబీ రంగులో ఉన్న పేజీల్లో తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జీవజాతులను (Critically Endangered Species), ఆకుపచ్చ పేజీల్లో గతంలో అంతరించే స్థితిలో ఉండి ప్రస్తుతం లేనటువంటి జాతులను గురించి తెలియజేశారు.


రెడ్ డేటా బుక్ ద్వారా కలిగే ప్రయోజనాలు
1. విధాన నిర్ణేతలకు, ప్రజలకు జీవవైవిధ్యత ఎదుర్కొంటున్న ముప్పు ఏ దశలో ఉందో తెలియజేసి వారిని వాటి రక్షణలో జాగృతం చేయవచ్చు.
2. క్షీణించిన జీవవైవిధ్యం భౌగోళిక సూచికలు (Global Index) ను అందించవచ్చు.
3. అంతర్థాన దశలో ఉన్న జాతులను వివరించి, వాటిని గుర్తించి నమోదు చేయవచ్చు.
4. జీవ వైవిధ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన 'కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ' CBD, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ (CITES) లాంటి సంస్థలకు సమాచారాన్ని తెలియజేస్తుంది.
IUCN సంస్థ జాతుల అంతర్థాన స్థాయిని ఆధారంగా చేసుకుని వాటిని కింద తెలిపిన విధంగా విభ‌జించింది. అవి:
 

1. గతించిన జాతులు (Extinct Species))
* భూమిపై ఒక జాతికి చెందిన సంతతి ప్రాంతీయంగా దేశాల, ఖండాల పరంగా;  ప్రపంచ వ్యాప్తంగా చిట్టచివరి జీవి కూడా అంతరించినట్లయితే వాటిని 'గతించిన జాతులు' అని పిలుస్తారు.
ఉదా: దోడాపక్షి, డైనోసార్స్, ఆసియా చిరుతలు, పాసింజన్ పిజియాన్, ఊదారంగు తల ఉన్న బాతు.
 

2. లుప్తస్థితికి చేరిన జాతులు (Endangered Species)
* భవిష్యత్తులో కొన్ని వృక్షాలు, జంతువులు ఇంకా అక్కడక్కడా క‌నిసిస్తూ, లుప్తం కాకుండా మిగిలిన ఏ సమయంలోనైనా అంతరించే స్థితిలో ఉన్న ఒక జాతిని ఈ జాబితాలో చేర్చడానికి కొన్ని ప్రామాణికాలు ఉండాలి.
1) గత 120 సంవత్సరాల కాలం నుంచి కనీసం 70% జాతులు వాటి సహజ ఆవాసాల్లో అంతరించి ఉండాలి.
2) ప్రస్తుతం వాటి జనాభా 250 వరకు ఉండాలి.
3) గత 20 సంవత్సరాల కాలం నుంచి 20% అంతరించి ఉండాలి.
ఉదా: ఘరియల్ మొసళ్లు, సైలెంట్ వ్యాలీ ప్రాంతంలోని సింహపుతోక గల కోతులు, కృష్ణజింక (Black Buck), మడగాస్కర్‌లోని లెమూర్ కోతులు, కంచర గాడిదలు, రాణ్‌ ఆఫ్‌కోచ్, బ్లూవేల్, పశ్చిమ హిమాలయాల్లోని టెక్సాన్, కస్తూరి మృగాలు (Muckdeer), హిమాలయన్ నక్కలు, కొండచిలువలు, భారసింగా జాతి జింక (ఖన్హా జాతీయ పార్కు), నీలగిరి లాంగూర్, నీలగిరి థార్, ఎర్రచందనం వృక్షం (రెడ్ శాండిల్), వైట్ వార్డ్ డంక్ (అసొం రాష్ట్ర పక్షి) గోల్డెన్ లాంగూర్ (అసొం), సౌత్ చైనా పులి మొదలైనవి.
 

3. దుర్భల స్థితిలోని జాతులు (Vulnarable Species)
* ఎటువంటి పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ప్రమాదంలోకి చేరే స్థితిలో ఉన్న జాతుల్లో ఏదైనా ఒక జాతిని ఈ జాబితాలో చేర్చడానికి కింది ప్రామాణికాలు ఉండాలి. అవి:
ఎ) గత 10 సంవత్సరాల కాలంలో 50% తగ్గిపోయి (In Wilderness) ఉండాలి.
బి) జనాభా సంఖ్య 10,000 ఉండాలి.
సి) గత 100 సంవత్సరాల నుంచి 10% అంతరించి ఉండాలి.
ఉదా: పులులు, సింహాలు, గులాబి వర్ణపు తల ఉన్న బాతులు, ఆంటిలోప్‌లు; ఉత్తర, మధ్య భారతదేశంలోని భారాసింగ (Swamp deer), హిమాలయ ప్రాంతాల్లో రెడ్ పాండా, పశ్చిమ కనుమల్లోని నీలగిరి మార్టన్, గంగా నదిలోని డాల్ఫిన్లు, మంచినీటి డాల్ఫిన్లు, హిమాలయన్ డీర్ మొదలైనవి.
 

4. అరుదైన జాతులు (Rare Species)
* ఒక ప్రత్యేకమైన శీతోష్ణస్థితి ప్రాంతాల్లో నివసిస్తూ, తక్కువ జనాభా కలిగి, చెల్లాచెదురైన ప్రత్యేక ఆవాసాల్లో మాత్రమే నివసించే జాతులను అరుదైన జాతులుగా పిలుస్తారు. వీటి ఆవాసాలు ఏమాత్రం దెబ్బతిన్నా ఇవి జీవించే సామర్థ్యాన్ని కోల్పోతాయి
ఉదా: కడప, కర్నూల్ జిల్లాల్లోని అడవుల్లో ఉండే కలివి కోడి.  గదురు కప్పలు
* గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కనిపించే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి (కంకణజాతి పక్షి).
* కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పెరిగే ఎర్ర చందనం (టీరో కార్పస్) చెట్లు.
 

5. ప్రమాదం అంచుల్లో ఉన్న జాతులు (Critically Endangered)
* దాదాపు అంతరించే స్థాయికి చేరిన వన్యప్రాణులు. మనిషి ప్రత్యేకంగా వాటిని సంరక్షిస్తే తప్ప వాటి మనుగడ సాధ్యం కాని స్థితిలో ఉన్న జీవజాతులు.
ఒక జీవిని ప్రమాదంలో ఉన్న జాతిగా పేర్కొనాలంటే కింద తెలిపిన ప్రామాణికాలు ఉండాలి
ఎ) గత 10 సంవత్సరాల కాలంలో 3 తరాల నుంచి వాటి సంఖ్య 80% తగ్గిపోయి (IN Wilderness) ఉండాలి.
బి) పరిమితి చెందిన జనాభా సంఖ్య 50 కంటే తక్కువగా ఉండాలి.
సి) వాటి సంచారం కొద్ది ప్రదేశానికే పరిమితమై ఉండాలి.
ఉదా: ఇండియన్ రైనో, లయన్ టెయిలెడ్ మకాకి, ఇండియన్ వైల్డ్ ఆస్, బట్టమేకల పక్షి, అడవి గుడ్లగూబ (Forest Owlet) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్; అతి చిన్న అడవిపంది (Pigmyhog), ఎగిరే ఉడుతలు (Flying Squirrel), పశ్చిమ కనుమలకు చెందిన స్థానీయమైన పులిజాతి.
 

6. సమీప భవిష్యత్తులో అంతర్థానమయ్యే స్థితిలో ఉన్న జాతులు
* ఏదైనా జాతి పూర్తిగా అంతరించిపోయే,  అరుదైన జాతుల వర్గానికి చెందకుండా ఉండి, సమీప భవిష్యత్తులో ప్రమాద స్థితిలో ఉన్న జాతుల జాబితాలోకి వెళ్లే స్థితిలో ఉన్న జాతులను 'సమీప భవిష్యత్తులో అంతర్థానమయ్యే స్థితిలో ఉన్న జాతులు' (Near Threatened) అని పిలుస్తారు.
 

7. పూర్తిగా అంతరించిపోయే దశకు దగ్గరలో ఉన్న జాతి (Threatened Species)
* పూర్తిగా అంతరించిపోయే, వల్నరబుల్ జాబితాల్లో ఉన్న జాతులన్నింటిని పూర్తిగా అంతరించిపోయే దశకు దగ్గరలో ఉన్న జాతి అని పిలుస్తారు. 2014 IUCN రెడ్ డేటా లిస్ట్ ప్రకారం భారత్‌లో ఈ జాబితాలో ఉన్న జాతుల  సంఖ్య 988.
 

8. సమాచారం లేనివి
* అధ్యయనంలో ఉన్నప్పటికీ తగినంత సమాచారం అందుబాటులో లేకపోవడం ద్వారా ఇంకా ఏ విభాగంలోకి వర్గీకరించని వన్యప్రాణులు.


అంతర్థాన స్థితిలో ఉన్న జాతుల పరిరక్షణ కోసం అమలు పరుస్తున్న కార్యక్రమాలు

ప్రాజెక్టు టైగర్
* అంతరించిపోతున్న పులుల సంతతిని పరిరక్షించడానికి, పెంపొందించడానికి; వాటిలోని సౌందర్య, సాంస్కృతిక, ఆర్థిక ఆవరణ వ్యవస్థల పరమైన విలువలను కాపాడటానికి 1973 నుంచి ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ప్రస్తుతం దేశంలో 49 టైగర్ అభయారణ్యాల్లో దాదాపు 2,226 పులులను సంరక్షిస్తున్నారు.
* దేశంలో అత్యధిక పులుల రక్షిత ప్రాంతాలు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. దీన్నే 'పులుల రాష్ట్రం'గా పిలుస్తారు.
* దేశంలో అత్యధిక పులులు ఉన్న రాష్ట్రం కర్ణాటక (406), ఉత్తరాఖండ్ (340).
* దేశంలోని మొదటి టైగర్ రిజర్వ్ ఉత్తరాఖండ్‌లోని జిమ్‌కార్బెట్ నేషనల్ పార్కు కాగా, అతిపెద్ద టైగర్ రిజర్వ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రాజీవ్‌గాంధీ టైగర్ వ్యాలీ ప్రాజెక్టు.
* మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్ ఇంటెన్సివ్ పెట్రోలింగ్ అండ్ ఎకోలాజికల్ సిస్టమ్.

ప్రాజెక్టు ఎలిఫెంట్
* 1992లో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో 32 సంరక్షణా కేంద్రాలున్నాయి. దేశంలో మొత్తం 17 రాష్ట్రాల్లో ఏనుగుల సంచారం ఉంది.
 

ఈ పథకం ముఖ్య ఉద్దేశం
* ఏనుగులు, వాటి ఆవాసాల పరిరక్షణ.
* మానవుడు − ఏనుగుల మధ్య ఘర్షణను నివారించడం.
* వాటి పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంపొందించడం.
ఏనుగు రక్షిత ప్రాంతాలను మూడు భాగాలుగా విభజించడం జరిగింది. అవి:
1) గ్రీన్ జోన్:మానవుడికి, ఏనుగుకి మధ్య తక్కువ సంఘర్షణ ఉన్న ప్రాంతం.
2) ఎల్లో జోన్: మానవుడికి, ఏనుగులకు మధ్య మధ్యస్థంగా సంఘర్షణ ఉన్న ప్రాంతం.
3) రెడ్ జోన్:మానవుడికి, ఏనుగులకు మధ్య తరచూ సంఘర్షణ ఉండే ప్రాంతం.
* మానిటరింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ (MIKE) కార్యక్రమాన్ని 2003లో ప్రపంచ వాతావరణ సదస్సు (COP) నిర్ణయం ప్రకారం సిటీస్ ఒప్పందం ద్వారా దక్షిణాసియాలో ప్రారంభించారు. దీన్ని భారత్‌లో 2004లో ప్రారంభించారు.  ఈ కార్యక్రమాన్ని ప్రాజెక్టు ఎలిఫెంటా కింద అమలు చేశారు. 
ఈ కార్యక్రమం లక్ష్యాలు
* ఏనుగులను చట్ట వ్యతిరేక కార్యక్రమాల ద్వారా ఎలాంటి ధోరణులు, ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించి కాలానుగుణంగా వేటాడే ధోరణుల్లో వస్తున్న మార్పులను తెలుసుకోవడం.
ప్రాజెక్టు గిర్ లయన్
* గుజరాత్‌లోని కథియావార్ ప్రాంతంలోని ఆకురాల్చే గిర్ అటవీ ప్రాంతాన్ని వీటి పరిరక్షణ ప్రాంతంగా ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ప్రాజెక్టు ఎలిఫెంటా కింద అమలు చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో 2015లో చేపట్టిన 14వ లయన్ సెన్సెస్ నివేదికల ప్రకారం ప్రస్తుతం ఇక్కడ‌ సింహాల సంఖ్య 523.
ప్రాజెక్టు క్రొకడైల్
* మొసళ్ల పరిరక్షణకు 1975 నుంచి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 8 రాష్ట్రాల్లో 16 మొసళ్ల‌ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొసళ్ల సంరక్షణ కోసం చెన్నైలో క్రొకడైల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. దేశంలో అత్యంత వేగంగా అంతరించిపోతున్న మొసళ్ల జాతి 'ఘరియల్ జాతి'.

ప్రాజెక్టు రెయినో
* ఒంటి కొమ్ము ఉన్న ఖడ్గమృగాల సంరక్షణా పథకం.
ప్రాజెక్టు స్నో లియోపార్డ్  
* మానవ - వన్య మృగాల ఘర్షణ వల్ల పశ్చిమ హిమాలయాల్లోని లియోపార్డ్‌ల సంఖ్య గత 150 సంవత్సరాల నుంచి క్రమంగా తగ్గుతోంది. దేశంలో ప్రస్తుతం 5 హిమాలయ రాష్ట్రాల్లో (జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాంచల్, సిక్కిం, ఉత్తర్ ప్రదేశ్) 11 లియోపార్డ్ అభయరణ్యాలను ఏర్పాటు చేశారు.
ప్రాజెక్టు సీటర్టిల్స్
* సముద్ర తాబేళ్ల పరిరక్షణకు 1975లో ఈ పథకాన్ని ఒడిశాలోని గహిర్‌మతా బీచ్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో రిడ్లే రకానికి చెందిన తాబేళ్లను పరిరక్షిస్తున్నారు. మరొక తాబేళ్ల బ్రీడింగ్ సెంటర్‌ను తమిళనాడులోని ట్యుటికోర‌న్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో హక్స్‌బిల్ రకానికి చెందిన తాబేళ్లను ప‌రిరక్షిస్తున్నారు.
గంగా డాల్ఫిన్ల సంరక్షణ
* దీని ఆవాసం భారత్‌లోని బ్రహ్మపుత్ర నది. ఇటీవల ఈ ప్రాంతంలో కాలుష్యం, బ్యారేజీల నిర్మాణం ఎక్కువ కావడంతో డాల్ఫిన్ల వేట ఈ జాతి మనుగడకు ప్రధాన అడ్డంకిగా మారింది. అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ  దీన్ని 'జాతీయ జలచ‌ర జంతువులుగా (National Aquatic Animal)'గా ప్రకటించారు.
ప్రాజెక్టు రెడ్ పాండా (Cat Beer)
* అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, డార్జిలింగ్ ప్రాంతాల్లోని దిగువ హిమాలయాల్లో నివసిస్తున్న ఈ జాతిని సంరక్షించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టును 1966లో పద్మజా నాయుడు హిమాలయన్ వైల్డ్ లైన్ పార్కులో ప్రారంభించింది.
ప్రాజెక్టు మణిపూర్ తమీన్
* మణిపూర్‌లో లోకతక్ సరస్సు ఆగ్నేయ ప్రాంతంలో తమీన్‌డీర్ అనే అరుదైన జింకలు నివసిస్తున్నాయి. వీటి సంఖ్యను పెంచే ఉద్దేశంతో 1977లో ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది.
ప్రాజెక్టు వల్చర్
*   రాబందుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన పథకం. రాబందులు మృత కళేబరాలపై ఆధారపడి జీవిస్తాయి. అందువల్ల వీటిని ప్రకృతిలో పాకీపని నిర్వర్తించే జీవులుగా పిలుస్తారు. పశువుల మృత కళేబరాలు జీవసాంద్రీకృతమై ఉన్న డైక్లోఫెనాసోడియం అనే కాలుష్యకం రాబందుల ఆహార గొలుసులోకి చేరి మూత్రపిండాలపై ప్రభావం చూపడం వల్ల, మొత్తం 9 రాబందుల జాతుల్లో 3 జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి ( 1. White backed vulture 2. Slender billed vulture 3. Long billed vulture).  వీటి పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం 2004లో ప్రాజెక్టు వల్చర్ ను ప్రారంభించింది.
*   సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (CCMB), నెహ్రూ జువాలజికల్ పార్క్, టీఎస్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు సంయుక్తంగా చనిపోయిన పులులు, సింహాల జన్యువులను భద్రపరిచే జన్యు బ్యాంకును ఏర్పాటు చేశారు.
*  ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ − తిరువనంతపురం
*  TBGRI − నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనిటికల్ (NBPGR) − న్యూదిల్లీ, రాజేంద్రనగర్ (హైదరాబాద్)
*  సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఎరోమాటిక్ ప్లాంట్స్ (CIMAP) − లఖ్‌నవూ
*  సెంట్రల్ ట్యూబర్ క్రాప్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్  (CTCRI)
* నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనిటికల్ రిసోర్సెస్‌ (NBAGR ) − కర్నాల్, పంజాబ్. ఇది పశుసంపద - పౌల్ట్రీకి చెందిన జన్యువనరులను సంరక్షిస్తుంది.
* ఇంటర్నేషనల్ క్రాప్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ సెమీ యార్డ్ ట్రాపిక్స్ (ICRISAT) -  హైదరాబాద్
* ఇందులో వరి, జొన్న, శనగలు, కందులు, వేరుశనగ పంటల జన్యువులను భద్రపరుస్తారు. 
 

చట్టపరమైన పరిరక్షణ చర్యలు (Legislative Protective Meausres)
 1972   −  వైల్డ్ లైఫ్ ప్రొటక్షన్ యాక్ట్
 1980   − ఫారెస్ట్ క‌న్జర్వేషన్ యాక్ట్
 1986    − ఎన్విరాన్‌మెంట్ ప్రొటక్షన్ యాక్ట్
 2002   − నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్
2006    − షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడ్షిన‌ల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ (Recognition of forest Right Act, అటవీ హక్కు చట్టం).
 

రాజ్యాంగ పరమైన రక్షణలు
     1. ఆర్టికల్ 48(ఎ)
    2. ఆర్టికల్ 51(ఎ)
* అంతర్జాతీయ వన్యజీవుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన సంస్థలు
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ క‌న్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ (IUCN)
* ఇది ప్రపంచ వ్యాప్తంగా వన్య జీవులు ఎదుర్కొంటున్న ప్రమాద తీవ్రతను బట్టి వాటిని వర్గీకరిస్తూ, ప్రపంచ జీవ వైవిధ్య సూచికను రూపొందించి ప్రతీ సంవత్సరం రెడ్ డేటా బుక్‌లో ప్రచురించి జీవజాతుల పరిరక్షణ మార్గదర్శకాలను విడుదల చేస్తున్నారు. దీన్ని 1948లో ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని మార్గన్ అనే (గ్లాండ్) నగరంలో 1963లో ఏర్పాటు చేశారు. 2014 రెడ్ డేటా లిస్ట్ ప్రకారం దేశంలో ప్రస్తుతం Threat and Species సంఖ్య − 988


IUCN ప్రధాన లక్ష్యాలు
* ప్రమాద స్థితిలో ఉన్న జాతుల ప్రాముఖ్యం, సంరక్షణకు సంబంధించి ప్రజల్లో చైతన్యాన్ని కలగజేయడం.
* గుర్తించిన జాతులను నమోదు చేయడం.
* ప్రమాదస్థితిలో ఉన్న జాతులకు సంబంధించిన గ్లోబల్ ఇండెక్స్‌ను తయారు చేయడం.
* తగిన సంరక్షణ చర్యలను సూచించడం.
Man and Biosphere (MBA)
* వన్యజీవుల ఆవాసాలను అక్కడి చారిత్రాత్మక కట్టడాలను, స్థానీయ తెగల సంప్రదాయలను సంరక్షించే ఉద్దేశంతో 1971లో Man and Biosphere (MBA) కార్యక్రమాన్ని UNESCO ప్రారంభించింది.
* ఇందులో భాగంగా విదేశాల్లో బయోస్పియర్ రిజర్వ్ అనే రక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేస్తారు.
WWF - N (World Wide Wild Fund For Nature)
 అంతర్జాతీయ స్థాయిలో వన్యజీవుల పరిరక్షణ నిధుల సేకరణకు ఉద్దేశించి WWF కృషి చేస్తుంది.
CITES (Convention on International Trade In Endamaged Species of Wild Flora and Fauna)
* 1973లో ఈ ఒప్పందాన్ని సభ్యదేశాలు ఆమోదించాయి. 1975 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రధాన లక్ష్యం వివిధ దేశాల సరిహద్దుల వల్ల జరిగే వన్యజీవులు వాటి శరీర భాగాలు, ఉత్పత్తుల అక్రమ వాణిజ్యాన్ని నిరోధించడమే.
Appendix-1: వాణిజ్య కార్యకలాపాల వల్ల ప్రభావితమయ్యే ప్రమాద స్థితిలో ఉన్న జీవులను ఇందులో చేర్చారు.
Appendix-2: ఎటువంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోతే సమీప భవిష్యత్తులో ప్రమాదస్థితికి చేరే స్థితిలో ఉన్న జాతులను ఇందులో చేర్చారు.
Appendix-3: ఏ జాతుల విషయంలో వేటాడటం, సంహరించడం లాంటి కార్యకలాపాలను నిషేధించారో అలాంటి విలక్షణ జాతులను ఇందులో చేర్చారు.
CBD (Convention on Biological Diversity):
* 1992లో బ్రెజిల్‌లోని 'రియో'లో జరిగిన 'ధరిత్రీ సదస్సు' చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో 152 దేశాలు 'జీవవైవిధ్య ఒప్పందం' (CBD - Convention On Biological Diversity) ని ఆమోదించాయి. 1994లో భారతదేశం ఇందులో సభ్యదేశంగా చేరింది. ప్రస్తుతం ఇందులో సభ్యదేశాల సంఖ్య 175.

ఇందులోని ముఖ్యాంశాలు
* జీవవైవిధ్య సంరక్షణకు సంబంధించి వివిధ ప్రణాళికలు, నిబంధనలను రూపొందించి అమలు చేయడం
* జీవ వైవిధ్యతను పరపోషిత ప్రయోజనాలకు నిర్వహించడం (Sustainable use of it's Components)
* జన్యుపరమైన ప్రయోజనాలు సభ్యదేశాల చుట్టూ మధ్య, సమాన స్థాయిలో జరిగే విధంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం.
* జీవ వైవిధ్య పరిరక్షణకు ఉద్దేశించి 1993, డిసెంబర్ 29న CBD (Conventio on Biological Diversity) అనే ఒప్పందం అమల్లో ఉంది.
రామ్‌సార్‌ ఒప్పందం: 1971లో రూపొందించిన రామ్‌సార్ ఒప్పందం ప్రపంచంలోని మడ అడవులు, ప్రవాళభిత్తికలు, సరస్సులు, చెరువులు, చిత్తడి నేలల సంరక్షణకు సాంకేతికపరమైన చర్యలు తీసుకుంటుంది.
పారిస్ ఒప్పందం: 1972లో ప్రపంచ వారసత్వ సంపద పరిరక్షణకు రూపొందించిన 'పారిస్' ఒప్పందం.
బాన్ ఒప్పందం: 1979లో వలసపోయే పక్షుల సంరక్షణకు రూపొందించిన 'బాన్' ఒప్పందం జీవ వైవిధ్య సంరక్షణ దిశలో కృషి చేస్తున్నాయి.


జీవ భద్రతపై కార్టాజీన ప్రొటోకాల్
* దీన్నే 'బయోసెప్టిక్‌ ప్రొటోకాల్' అని కూడా అంటారు. 2000 సంవత్సరంలో ఈ ప్రొటోకాల్‌పై సంతకాలు జరుగగా, ఇది 2003, సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చింది. 2015 మార్చి నాటికి 170 దేశాలు దీన్ని అంగీకరించాయి. 

నగోయి జీవవైవిధ్య ఒప్పందం
      2010, అక్టోబర్ 18 − 29 వరకు జపాన్‌లోని నగోయిలో జరిగిన 11వ COP దేశాల జీవవైవిధ్య ఒప్పంద సదస్సు (CBD)లో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ కృషికి మార్గదర్శకత్వం చూపే పదేళ్ల నూతన వ్యూహాత్మక ప్రణాళిక 'ఎయిచీ టార్గెట్‌'ను ఆమోదించడం, యూఎన్‌వో 2010ని 'అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా ప్రక‌టించి' దీనిలో భాగంగా తీసుకున్నారు. ఈ ఒప్పందం 2014, అక్టోబరు 12 నుంచి అమల్లోకి వచ్చింది.
 

జీవ వైవిధ్య సదస్సు
     2012 అక్టోబరులో హైదరాబాద్ వేదికగా ఈ సదస్సును నిర్వహించారు. జన్యుపదార్థాల వల్ల కలిగే లబ్ధి అందిరికీ అందుబాటులో ఉండటానికి పొందుతున్న అభివృద్ధి చెందిన దేశాలు తమ లాభాలు అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవలసిన ఆవశ్యకతను ఈ సదస్సులో చర్చించారు.
 

జీవ వైవిధ్య సదస్సు (CBD - 2014)
    2014, అక్టోబరు 6 − 17 మధ్య దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌యాంగ్‌లో జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం జీవవైవిధ్య వనరులను పరిరక్షించడం.


భారతదేశం - సాంస్కృతిక వారసత్వపు దేశాలు (India - Cultural Herigage Sites)
* యునెస్కో (UNESCO) లిస్టులో చేర్చిన ప్రత్యేక లక్షణాలు ఉన్న ప్రదేశాలు, నిర్మాణాలను, ప్రకృతి ప్రాంతాలను 'సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు' అంటారు. ఈ ప్రాంతాల‌ను యునెస్కో జాబితాలో చేర్చారు.
వారసత్వ ప్రాంతాలను కింది పట్టికలో పొందుపరిచారు
ప్రాంతం పేరు                                        రాష్ట్రం
1. కజిరంగా నేషనల్ పార్క్            -        అసోం
2. మనాస్ వైల్డ్ లైఫ్ సాంచ్యురీ      -        అసోం
3. కియాల్డియో నేషనల్ పార్క్       -      రాజస్థాన్
4. సుందర్‌బన్ నేషనల్ పార్క్       -    పశ్చిమ బంగా
5. నందాదేవీ నేషనల్ పార్క్          -    ఉత్తరాఖండ్
6. వెస్ట్రన్ ఘాట్స్                          -    మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు


ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్యత
* 2014 సామాజిక − ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం 16 వన్య మృగ సంరక్షణ కేంద్రాలు, 3 జాతీయ పార్కులు, 7,410 చ.కి.మీ.ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. ఇందులో ఒక టైగర్ రిజర్వు, ఒక ఎలిఫెంట్ రిజర్వు, ఒక బయోస్పియర్ (శేషాచలం) ఉన్నాయి.
*  కోరంగి : తూర్పు గోదావరి జిల్లా
*  గుండ్ల బ్రహ్మేశ్వరం : కర్నూలు, ప్రకాశం
*  కౌండిన్య : చిత్తూరు
*  కొల్లేరు : పశ్చిమ గోదావరి, కృష్ణా
*  కృష్ణా : కృష్ణా, గుంటూరు
*  నాగార్జునసాగర్ : గుంటూరు, ప్రకాశం, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్గొండ
*  నేలపట్టు : నెల్లూరు
*  పాపికొండలు : తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి
*  పులికాట్ : నెల్లూరు
*  రోళ్లపాడు : కర్నూలు
*  శ్రీ లంకమల్లేశ్వర : కడప, చిత్తూరు
*  శ్రీ పెనుగుల నర్సింహ : కడప, చిత్తూరు
*  కంబాల కొండ : విశాఖపట్నం


జాతీయ పార్కులు
* రాజీవ్‌గాంధీ నేషనల్ పార్కు − కర్నూలు (నాగార్జున సాగర్)
* ఇందిరాగాంధీ నేషనల్ పార్కు − విశాఖపట్నం
* శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కు − చిత్తూరు
 

జింకల పార్కులు
* కండలేరు జింకల పార్కు − నెల్లూరు
* పులియం జింకల పార్కు − కర్నూలు
 

ముఖ్యమైన అంశాలు
1) రాష్ట్రంలో అతిపెద్ద మాంగ్రూవ్ తూర్పు గోదావరి జిల్లాలోని కోరింగ.
2) రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణం 34,572 చ.కి.మీ.
3) రాష్ట్రంలో ఎర్రచందనం ఎక్కువగా లభ్యమయ్యే జిల్లాలు  కడప, చిత్తూరు.
4) IUCN (International Union for Concervation of Nature and Natural Resources)
5) కంబాల కొండ జాతీయ పార్కు విశాఖ జిల్లాలో ఉంది.
6) ఎర్రచందనాన్ని ఎర్ర బంగారం అంటారు. ఇది చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో 2.5 లక్షల హెక్టార్‌లలో విస్తరించి ఉంది.
              

Posted Date : 16-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌