మాదిరి ప్రశ్నలు
1. కింది ఏ గ్రంథంలో 16 మహాజనపదాల ప్రస్తావన ఉంది?
1) అర్థశాస్త్రం 2) అంగుత్తరనికాయ
3) మృచ్ఛకటికం 4) ఏదీకాదు
2. వరుణ - అశి నదుల మధ్య ఉన్న నగరం ఏది?
1) కోసల 2) మగధ
3) వారణాసి 4) అంగ
3. ప్రాచీన కాలంలో చంపా నగరాన్ని ఏమని పిలిచేవారు?
1) ద్రౌపది నగరం 2) రాధా నగరం
3) మాలిని నగరం 4) మత్స్య దేశం
4. కిందివాటిలో గంగా - సోన్ నదుల మధ్య ఉన్న నగరం ఏది?
1) పాంచాల 2) విరాటనగరం
3) కౌశాంబి 4) రాజగృహం
5. హర్యాంక వంశ స్థాపకుడు ఎవరు?
1) కౌటిల్యుడు 2) బింబిసారుడు
3) ప్రసేనజిత్తు 4) బ్రహ్మదత్త
6. కిందివాటిలో వజ్జి రాజధాని ఏది?
1) కుశినగరం 2) విరాటనగరం
3) వైశాలి 4) త్రిపురి
7. అజాతశత్రువు ఎవరితో సుదీర్ఘ పోరాటం చేశాడు?
1) లిచ్ఛవులు 2) శిశుపాలుడు
3) ఇసుకాసుర 4) కాంభోజ
8. వత్స రాజధాని ‘కౌశాంబి’ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది?్శ
1) మధ్యప్రదేశ్ 2) దిల్లీ
3) రాజస్థాన్ 4) ఉత్తర్ ప్రదేశ్
9. ఉదయనుడు ఏ మతాన్ని స్వీకరించాడు?
1) బౌద్ధ మతం 2) హిందూ మతం
3) జైన మతం 4) అజీవక మతం
10. ‘ఉత్తరాధ్యయన సూత్ర’ అనే గ్రంథం ఏ మతానికి సంబంధించింది?
1) జైన మతం 2) బౌద్ధ మతం
3) శైవ మతం 4) హిందూ మతం
11. దక్షిణ పాంచాల రాజధాని ఏది?
1) విరాటనగరం 2) కౌశాంబి
3) వారణాసి 4) కాంపిల్య
12. బ్రహ్మర్షి దేశం అని దేనికి పేరు?
1) పాంచాల 2) మత్స్య
3) కౌశాంబి 4) తక్షశిల
13. ‘స్వప్నవాసవదత్త’ నాటక రచయిత ఎవరు?
1) బ్రహ్మదత్తుడు 2) చరకుడు
3) బాసుడు 4) శూద్రకుడు
14. కింది మహాజనపదాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక జనపదం ఏది?
1) అశ్మక 2) గాంధార
3) కాంభోజ 4) అవంతి
15. బోధన్ లేదా పొతన్ ప్రస్తుతం తెలంగాణాలోని ఏ జిల్లా?
1) ఆదిలాబాద్ 2) నిజామాబాద్
3) హైదరాబాద్ 4) సికింద్రాబాద్
16. గాంధార రాజధాని ఏది?
1) ఉజ్జయిని 2) తక్షశిల
3) కాంభోజ 4) శూరసేన
17. కౌటిల్యుడు కింది ఏ నగరంలో విద్యను అభ్యసించాడు?
1) తక్షశిల 2) రాజపురం
3) మధురానగర్ 4) విరాటనగరం
18. కింది నగరాల్లో ప్రముఖ విద్య, వాణిజ్య కేంద్రం ఏది?
1) పొతన్ 2) మాల్వా
3) శూరసేన 4) తక్షశిల
19. మగధ రాజధాని ‘పాటలీపుత్రం’ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది?
1) రాజస్థాన్ 2) దక్షిణ బిహార్
3) ఉత్తర్ ప్రదేశ్ 4) మధ్యప్రదేశ్
20. కుశినగరం ఏ మహాజనపదానికి రాజధానిగా ఉంది?
1) ఛేది 2) శుక్తిమతి 3) మల్ల 4) అవంతి
21. కింది నగరాల్లో దేని నుంచి అత్యధిక ఆదాయం వచ్చేది?
1) కాశీ 2) పొటాన్
3) రాజపురం 4) కాంపిల్య
22. ప్రాచీన భారతదేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో చంపా నగరం ఒకటని తెలిపే గ్రంథం ఏది?
1) దిఘనికాయ 2) కల్పసూత్ర
3) అష్టాంగసంగ్రహ 4) అర్థశాస్త్రం
23. కింది వారిలో బుద్ధుడి సమకాలికుడైన రాజు ఎవరు?
1) భోజకుడు 2) శిశునాగుడు
3) ప్రసేనజిత్తు 4) చంద్రగుప్తుడు
24. సేతవ్యాన్, ఉక్కటా, కీటాగిరి అనే పట్టణాలు ఏ రాజ్యంలో ఉండేవి?
1) పాంచాల 2) వత్స
3) అవంతి 4) కొసల
25. అజాతశత్రువుతో సుదీర్ఘ పోరాటం చేసిన కోసల రాజు ఎవరు?
1) ప్రసేనజిత్తు 2) ఉదయనుడు
3) బ్రహ్మదత్తుడు 4) పులికుడు
26. అర్థశాస్త్రం ప్రకారం మొదట రాజరిక రాజ్యంగా ఉండి, తర్వాత గణరాజ్యంగా మారిన మహాజనపదం ఏది?
1) అవంతి 2) కాంభోజ 3) ఛేది 4) కురు
27. వత్స రాజధాని కౌశాంబి ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తర్ ప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) బిహార్ 4) రాజస్థాన్
28. కౌశాంబిలో బౌద్ధవిహారాన్ని నిర్మించిన రాజు కింది వారిలో ఎవరు?
1) శిశునాగుడు 2) ప్రద్యోత
3) ఉదయనుడు 4) చేటకుడు
29. మహాభారత కాలంలో శిశుపాలుడు ఏ రాజ్యానికి పాలకుడిగా ఉండేవారు?
1) కురు 2) పాంచాల 3) ద్వారక 4) ఛేధి
30. దక్షిణ అవంతి రాజ్య రాజధాని ఏది?
1) మహిష్మతి 2) రాజపురం
3) భరత్పూర్ 4) మధుర
సమాధానాలు
1 - 2 2 - 3 3 - 3 4 - 4 5 - 2 6 - 3 7 - 1 8 - 4 9 - 1 10 - 1 11 - 4 12 - 2 13 - 3 14 - 1 15 - 2 16 - 2 17 - 1 18 - 4 19 - 2 20 - 3 21 - 1 22 - 1 23 - 3 24 - 4 25 - 1 26 - 2 27 - 1 28 - 3 29 - 4 30 - 1