మాదిరి ప్రశ్నలు
1. 1797లో అమరావతి స్తూపాన్ని ఎవరు కనుక్కున్నారు?
జ: కల్నల్ మెకంజీ
2. శాలిహుండం బౌద్ధ స్తూపం ఉన్న జిల్లా ఏది?
జ: గుంటూరు
3. శాతవాహనుల కాలంలో రాణులు పోషించిన మతం-
జ: బౌద్ధం
4. కిందివాటిని జతపరచండి.
1) పూర్వశైలం a) ధాన్యకటకం
2) ఉత్తరశైలం b) జగ్గయ్యపేట
3) అపరశైలం c) నాగార్జునకొండ
4) రాజగిరిక d) గుంటుపల్లి
5) సిద్ధార్థిక e) గుడివాడ
జ: 1-a, 2-b, 3-c, 4-d, 5-e
5. శాతవాహనుల కాలంనాటి ప్రాకృత భాషపై అధ్యయనం చేసింది ఎవరు?
జ: బుహ్లర్
6. శాతవాహన కాలంనాటి ఫోటేన్ నాణేలు ఏయే లోహాల మిశ్రమం?
జ: రాగి - సీసం
7. జోగల్ తంబి నాణేలు ఏ రాష్ట్రంలో లభించాయి?
జ: మహారాష్ట్ర
8. శాతవాహనుల కాలంలో ఒక సువర్ణానికి ఉన్న కర్షాపణాలు-
జ: 35
9. శ్రీముఖుడు జైనమతస్థుడు అని పేర్కొంటున్న గ్రంథం ఏది?
జ: సింహాసనాద్వాంత్రంశిక
10. సాంచీస్తూప దక్షిణ ద్వారంపై శాసనం వేయించిన శాతవాహనరాజు-
జ: రెండో శాతకర్ణి
11. రాధను గురించి ప్రస్తావించిన తొలి వాఞ్మయం/ గ్రంథం-
జ: గాథాసప్తసతి
12. నాసిక్ శాసనంలో రెండో పులోమావిని ఏ బిరుదుతో ప్రస్తావించారు?
జ: దక్షిణాపథేశ్వరుడు
13. కిందివాటిలో ఆచార్య నాగార్జునుడి మరణం గురించి వివరిస్తున్న గ్రంథం -
1) కువలయమాల 2) గాథాసప్తసతి 3) బృహత్కథ 4) కథాసరిత్సాగరం
జ: 4 (కథాసరిత్సాగరం)
14. శాతవాహనుల కాలంనాటి తాత్కాలిక సైనిక శిబిరాలు -
జ: స్కంథావరాలు
15. కిందివాటిని జతపరచండి.
1) శుల్క | a) వృత్తిపన్ను |
2) కర | b) భూమిశిస్తు |
3) కారుకర | c) నీటిపన్ను |
4) భాగ | d) తోటలపై పన్ను |
జ: 1-c, 2-d, 3-a, 4-b
16. శాతవాహనుల పూజలందుకున్న గుడిమల్లం శివలింగం ఏ జిల్లాలో ఉంది?
జ: చిత్తూరు
17. ఆంధ్రదేశంలోని అతిప్రాచీన చైత్యం -
జ: గుంటుపల్లి
18. రాజధానిలో జైనులకు చైత్యాలు నిర్మించిన పాలకుడు ఎవరు?
జ: మొదటి శాతకర్ణి
19. సమయసార గ్రంథాన్ని రచించినదెవరు?
జ: కుందు కుందాచార్యుడు
20. ధాన్యకటక మహాచైత్యానికి శిలా ప్రాకారం నిర్మించింది ఎవరు?
జ: నాగార్జునుడు
21. శాతవాహనుల అధికార చిహ్నం -
జ: సూర్యుడు, పంజా ఎత్తిన సింహం
22. భట్టిప్రోలు ప్రాచీన నామం -
జ: ప్రతీపాలపురం
23. గుణాఢ్యుడు బృహత్ కథను ఏ భాషలో రాశాడు?
జ: పైశాచి ప్రాకృతం
24. కామక్రీడలో భార్య మరణానికి కారకుడైన శాతవాహన రాజు -
జ: కుంతల శాతకర్ణి
25. ద్రవ్యరూపంలో వచ్చే ఆదాయాన్ని భద్రపరిచే అధికారి-
జ: హేరణిక