మాదిరి ప్రశ్నలు
1. 1815లో రాజా రామ్మోహన్రాయ్ స్థాపించిన సంస్థ?
జ: ఆత్మీయసభ
2. బ్రహ్మసమాజంలో ఎప్పుడు చీలిక ఏర్పడింది?
జ: 1866
3. 'వేదాలకు మరలండి' అనే నినాదాన్ని ఇచ్చినవారు?
జ: స్వామి దయానంద సరస్వతి
4. 'ఖురాన్ వైపునకు మరలండి' అని ఎవరు అన్నారు?
జ: సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
5. 'మానవసేవే మాధవసేవ' అనేది ఏ సంస్థ నినాదం?
జ: రామకృష్ణ మిషన్
6. 'భారతదేశం భారతీయులకే' అనే నినాదాన్ని ఇచ్చినవారు?
జ: స్వామి దయానంద
7. రాజా రామ్మోహన్రాయ్ జీవిత చరిత్రను ఎవరు రాశారు?
జ: సోఫియా డాబ్సన్కోలెట్
8. 'బాల్య వివాహాల రద్దు' చట్టం చేయడానికి కృషి చేసినవారు?
జ: కేశవచంద్రసేన్
9. కింది అంశాలను జతపరచండి.
i) ప్రార్థనా సమాజం ఎ) 1897
ii) ఆర్యసమాజం బి) 1867
iii) రామకృష్ణ మిషన్ సి) 1875
iv) బ్రహ్మసమాజం డి) 1828
జ: i-బి, ii-సి, iii-ఎ, iv-డి
10. సంగత్ సభ/ సంగీత సభను ఎవరు స్థాపించారు?
జ: కేశవ చంద్రసేన్
11. ఆంధ్రదేశంలో తొలి వితంతు వివాహం ఎప్పుడు జరిగింది?
జ: 1881, డిసెంబరు 11
12. బెంగాలీ ప్రాథమిక వాచకాన్ని రాసినవారు?
జ: ఈశ్వరచంద్ర విద్యాసాగర్
13. భారతదేశంలో వితంతు వివాహాలను చట్టబద్ధం చేయడానికి కృషి చేసినవారు?
జ: ఈశ్వరచంద్ర విద్యాసాగర్
14. కింది అంశాలను జతపరచండి.
i) గదాధరుడు ఎ) రామకృష్ణ పరమహంస
ii) మూల్ శంకర్ బి) స్వామి శ్రద్ధానంద్
iii) మున్షీరాం సి) స్వామి వివేకానంద
iv) నరేంద్రనాథ్దత్ డి) స్వామి దయానంద
జ: i-ఎ; ii-డి; iii-బి; iv-సి
15. 'వితంతు వివేకము' గ్రంథ రచయిత?
జ: ఈశ్వరచంద్ర విద్యాసాగర్
16. 'బ్రహ్మ ధర్మము' అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: దేవేంద్రనాథ్ ఠాగూర్
17. రాజా రామ్మోహన్రాయ్ నడిపిన బెంగాలీ పత్రిక ఏది?
జ: సంవాద కౌముది
18. భారతదేశంలో తొలి వితంతు వివాహాన్ని జరిపించింది ఎవరు?
జ: ఈశ్వరచంద్ర విద్యాసాగర్