• facebook
  • whatsapp
  • telegram

బహుళార్థసాధక/ భారీ నీటిపారుదల ప్రాజెక్టులు

        కాలువల ద్వారా జరిగే నీటి పారుదల సౌకర్యాన్ని ప్రధానంగా బహుళార్థ సాధక/ భారీ నీటిపారుదల ప్రాజెక్టులే సమకూరుస్తున్నాయి. బహుళార్థసాధక నదీ ప్రాజెక్టులు (Multipurpose river projects) అంటే కేవలం నీటి పారుదల సౌకర్యాలను కల్పించడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలను అందించేవి. జలవిద్యుత్ ఉత్పాదన, వరదలను అరికట్టడం, జల రవాణా, తాగునీటి సరఫరా, పరిశ్రమల అవసరాలు, మత్స్య సంపద అభివృద్ధి, పర్యాటక కేంద్రాలకు ఇవి ఉపయోగపడుతున్నాయి. అందుకే వీటిని బహుళార్థసాధక ప్రాజెక్టులంటారు. వీటిని భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 'ఆధునిక భారతదేశ దేవాలయాలు'(Temples of modern India)గా అభివర్ణించారు. ఇక భారీ నీటి పారుదల ప్రాజెక్టులంటే 10,000 హెక్టార్లకు (25000 ఎకరాలకు) మించి నీటి పారుదల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులని అర్థం.

అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాలు: వివిధ నదుల ప్రవాహక (Riparian States) రాష్ట్రాలు, నదీజలాలను వినియోగించుకోవడంలో తరచూ ఏర్పడే వివాదాలను పరిష్కరించుకునేందుకు రాజ్యాంగంలోని 262 ప్రకరణను అనుసరించి పార్లమెంట్ అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టాన్ని 1956లో రూపొందించింది. దీనిని అనుసరించి రాష్ట్రాలమధ్య ఉన్న నదీ జలాల పంపకాల వివాదాలను పరిష్కరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేస్తుంది.

ప్రస్తుతం  దేశంలోని ప్రధాన నదీజలాల వివాదాలు 

  నది 

వివాదాలున్న రాష్ట్రాలు 

1          కృష్ణ

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. 

2 తుంగభద్ర 

ఆంధ్రప్రదేశ్,  కర్ణాటక, 

3 గోదావరి 

మహారాష్ట్ర,  ఆంధ్రప్రదేశ్,  ఒరిస్సా,  చత్తీస్ గఢ్. 

4

నర్మద 

కర్ణాటక,  తమిళనాడు,  కేరళ. 

5

కావేరి 

పుదుచ్చేరి (కేంద్ర పాలిత). గోవా, కర్ణాటక. 

6 మండోలీ 

ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. 

7 వంశధార  

పంజాబ్, హర్యానా, రాజస్థాన్. 

8 రావిబియాస్  జమ్ము - కాశ్మీర్, ఢిల్లీ (కేంద్రపాలిత).
ఉత్తరప్రదేశ్, హర్యనా, హిమాచల్ ప్రదేశ్. 
9 యమున 

రాజస్ధాన్ మధ్యప్రదేశ్, ఢిల్లీ (కేంద్ర పాలిత). 

కేంద్ర జల సంఘం (Central Water Commission): కేంద్ర జలసంఘాన్ని 1945లో ఏర్పాటుచేశారు. జలవనరుల అభివృద్ధిరంగంలో ఇది దేశంలోనే ప్రధానమైన ఇంజినీరింగ్ సంస్థ, దేశంలోని, భూటాన్, నేపాల్ దేశాల్లోని వరద నివారణకు, జలవనరుల పరిరక్షణ, వినియోగాలకు సంబంధించిన పథకాలను ప్రారంభించడానికి, సమన్వయం చేయడానికి ఈ సంఘం బాధ్యత వహిస్తుంది.

కేంద్ర జల సంఘం (Central Water Commission): కేంద్ర జలసంఘాన్ని 1945లో ఏర్పాటుచేశారు. జలవనరుల అభివృద్ధిరంగంలో ఇది దేశంలోనే ప్రధానమైన ఇంజినీరింగ్ సంస్థ, దేశంలోని, భూటాన్, నేపాల్ దేశాల్లోని వరద నివారణకు, జలవనరుల పరిరక్షణ, వినియోగాలకు సంబంధించిన పథకాలను ప్రారంభించడానికి, సమన్వయం చేయడానికి ఈ సంఘం బాధ్యత వహిస్తుంది.

జాతీయ జల విజ్ఞాన సంస్థ (National Institute of Hydreotogy): జాతీయ జల విజ్ఞాన సంస్థ (ఎన్ఐహెచ్) 1979 నుంచి పనిచేస్తోంది. స్వతంత్రప్రతిపత్తి ఉన్న సంస్థగా దీన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ప్రధాన కార్యాలయం రూర్కీలో ఉంది. భారత ప్రభుత్వంలోని జలవనరుల మంత్రిత్వ శాఖ దీనికి పూర్తిగా ఆర్థిక సహాయం అందిస్తుంది. జలవిజ్ఞానానికి సంబంధించిన అన్నిఅంశాల్లో సైద్ధాంతిక, అనువర్తిత అధ్యయనాలతోపాటు పరిశోధన చేపట్టడం కూడా ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.

జాతీయ జల మండలి (National Water Board): ప్రభుత్వం 1990 సెప్టెంబర్‌లో జాతీయ జల మండలిని ఏర్పాటు చేసింది. దేశంలోని జలవనరులను క్రమబద్ధమైన రీతిలో అభివృద్ధి చేయడానికి, జాతీయ జల విధానం అమలు ప్రగతిని సమీక్షించి, జాతీయ జలవనరుల మండలికి నివేదించడానికి దీన్ని ఏర్పాటు చేశారు.

అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందాలు (International Agreements)
సింధు జలాల ఒడంబడిక (Indus Waters Treaty): సింధు నదీవ్యవస్థకు చెందిన జలాల వినియోగానికి సంబంధించి, రెండు దేశాల హక్కులను, బాధ్యతలను నిర్ణయించడానికి 1960 సెప్టెంబర్ 19న భారత, పాకిస్థాన్ దేశాలు సింధుజలాల ఒడంబడిక మీద సంతకాలు చేశాయి. దీని ప్రకారం రెండుదేశాలూ సింధూనది, ఉపనదుల జలాల వినియోగానికి శాశ్వత కమిషనర్లను నియమించి, జలాల వినియోగంపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతాయి.

భారత్ - బంగ్లాదేశ్ ఉమ్మడి నదుల కమిషన్ (Indo - Bangladesh Joint Rivers Commission): 1972 జులైలో ఏర్పాటు చేసిన భారత - బంగ్లాదేశ్ ఉమ్మడి నదుల కమిషన్, రెండుదేశాలకూ ఉమ్మడి నదీ వ్యవస్థ నుంచి గరిష్ఠ స్థాయిలో ప్రయోజనాలను సాధించడానికి ఫలప్రదమైన ఉమ్మడి ప్రయత్నాలకు వీలు కల్పిస్తుంది. వరదలను ముందుగా పసిగట్టడం, హెచ్చరికలు చేయడం, వరద నివారణ, నదుల అభివృద్ధి వంటి రంగాల్లో పరస్పర ప్రయోజనం కోసం తగిన చర్యలు రూపొందిస్తుంది. గంగ, తీస్తా (బ్రహ్మపుత్ర) నదులతో పాటు ఇతర ప్రధానమైన నదుల ప్రవాహాలను పంచుకోవడానికి రెండు దేశాలూ న్యాయోచితమైన, దీర్ఘకాలికమైన, సమగ్రమైన ఏర్పాటుకు అంగీకరించాయి. పరస్పర చర్చల ద్వారా రూపొందిన ఈ ఒప్పందం ఇరుదేశాల ప్రజల ప్రయోజనాలను ఉత్తమ రీతిలో కాపాడుతోంది.

భారత్-భూటాన్ ప్రాజెక్టులు (Indo - Bhutan Projects): భారత-భూటాన్ దేశాలకు ఉమ్మడి హక్కు ఉన్న నదులకు సంబంధించి ముందుగానే జల వాతావరణాన్ని, వరదలను పసిగట్టే వ్యవస్థ ఏర్పాటుకు, జలవిద్యుత్ అభివృద్ధికి సంబంధించిన పనుల విషయంలో భూటాన్ రాచరికపు ప్రభుత్వంతో సహకారం కొనసాగుతోంది. ఛుఖా (Chukha) II, III దశల ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. భారత, భూటాన్‌మధ్య 1993 జనవరిలో కుదిరిన ఒప్పందం మేరకు సంకోష్ బహుళార్థసాధక ప్రాజెక్టును చేపట్టింది.




Posted Date : 11-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌