• facebook
  • whatsapp
  • telegram

సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 1815లో రాజా రామ్మోహన్‌రాయ్ స్థాపించిన సంస్థ?
జ: ఆత్మీయసభ

 

2. బ్రహ్మసమాజంలో ఎప్పుడు చీలిక ఏర్పడింది?
జ: 1866 

 

3. 'వేదాలకు మరలండి' అనే నినాదాన్ని ఇచ్చినవారు?
జ: స్వామి దయానంద సరస్వతి

 

4. 'ఖురాన్ వైపునకు మరలండి' అని ఎవరు అన్నారు?
జ: సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్

 

5. 'మానవసేవే మాధవసేవ' అనేది ఏ సంస్థ నినాదం?
జ: రామకృష్ణ మిషన్

 

6. 'భారతదేశం భారతీయులకే' అనే నినాదాన్ని ఇచ్చినవారు?
జ: స్వామి దయానంద

 

7. రాజా రామ్మోహన్‌రాయ్ జీవిత చరిత్రను ఎవరు రాశారు?
జ: సోఫియా డాబ్సన్‌కోలెట్

 

8. 'బాల్య వివాహాల రద్దు' చట్టం చేయడానికి కృషి చేసినవారు?
జ: కేశవచంద్రసేన్

 

9. కింది అంశాలను జతపరచండి.
    i) ప్రార్థనా సమాజం              ఎ) 1897
    ii) ఆర్యసమాజం                  బి) 1867
    iii) రామకృష్ణ మిషన్            సి) 1875
    iv) బ్రహ్మసమాజం               డి) 1828
జ: i-బి, ii-సి, iii-ఎ, iv-డి

 

10. సంగత్ సభ/ సంగీత సభను ఎవరు స్థాపించారు?
జ: కేశవ చంద్రసేన్

 

11. ఆంధ్రదేశంలో తొలి వితంతు వివాహం ఎప్పుడు జరిగింది?
జ: 1881, డిసెంబరు 11

 

12. బెంగాలీ ప్రాథమిక వాచకాన్ని రాసినవారు?
జ: ఈశ్వరచంద్ర విద్యాసాగర్

 

13. భారతదేశంలో వితంతు వివాహాలను చట్టబద్ధం చేయడానికి కృషి చేసినవారు?
జ: ఈశ్వరచంద్ర విద్యాసాగర్

 

14. కింది అంశాలను జతపరచండి.
   i) గదాధరుడు                      ఎ) రామకృష్ణ పరమహంస
   ii) మూల్ శంకర్                   బి) స్వామి శ్రద్ధానంద్
   iii) మున్షీరాం                        సి) స్వామి వివేకానంద
   iv) నరేంద్రనాథ్‌దత్            డి) స్వామి దయానంద
జ: i-ఎ; ii-డి; iii-బి; iv-సి

 

15. 'వితంతు వివేకము'  గ్రంథ రచయిత?
జ: ఈశ్వరచంద్ర విద్యాసాగర్

 

16. 'బ్రహ్మ ధర్మము' అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: దేవేంద్రనాథ్ ఠాగూర్

 

17. రాజా రామ్మోహన్‌రాయ్ నడిపిన బెంగాలీ పత్రిక ఏది?
జ: సంవాద కౌముది

 

18. భారతదేశంలో తొలి వితంతు వివాహాన్ని జరిపించింది ఎవరు?
జ: ఈశ్వరచంద్ర విద్యాసాగర్

Posted Date : 03-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌