1. సంగం యుగం నాటి కవి, పండితులను పోషించిన రాజవంశం ఏది?
జ: పాండ్య
2. 'సంగం' గురించి మొదట ప్రస్తావించింది ఎవరు?
జ: తిరునావుక్కరసు
3. సంగం అంటే...?
జ: కవి పండిత పరిషత్
4. మొదటి సంగాన్ని ఎక్కడ నిర్వహించారు?
జ: తెన్మదురై
5. రెండో సంగానికి సంబంధించి లభిస్తున్న ఏకైక గ్రంథం ఏది?
జ: తొల్కప్పియర్
6. కిందివాటిలో సంగం సాహిత్యంలో భాగం కానిది?
ఎ) ఎట్టుతొగై బి) పత్తుప్పాట్టు సి) పదినెన్ కీల్కనక్కు డి) మత్తవిలాస ప్రహసనం
జ: డి (మత్తవిలాస ప్రహసనం)
7. తొల్కప్పియం గ్రంథం ఏ విషయానికి సంబంధించింది?
జ: వ్యాకరణం
8. మధురైక్కంజి గ్రంథ రచయిత ఎవరు?
జ: మంగుడి మరుదన్
9. సంగం యుగం నాటి 'కురింజి' విభాగం దేనికి సంబంధించింది?
జ: కొండలు
10. కురల్ గ్రంథ రచయిత ఎవరు?
జ: తిరువళ్లువార్
11. తమిళ భూమికి చెందిన బైబిల్గా ప్రసిద్ధిచెందిన గ్రంథం ఏది?
జ: తిరుక్కురల్
12. శిలప్పధికారం గ్రంథ రచయిత ఎవరు?
జ: ఇలంగో అడిగల్
13. సంగం యుగం నాటి లలితకళల అభివృద్ధి గురించి తెలిపే గ్రంథం ఏది?
జ: మణిమేఖలై
14. దక్షిణ భారత రాజ్యాల్లో మెగస్తనీస్ పేర్కొన్న మొదటి రాజ్యం ఎవరిది?
జ: పాండ్యులు
15. తమిళ రాజ్యాల గురించి ప్రస్తావించిన మొదట శాసనం ఏది?
జ: అశోకుని శాసనాలు
16. నక్కీరర్ ఎవరి ఆస్థాన కవి?
జ: నెడుం జెళియన్
17. సంగం యుగం నాటి చోళుల రాజధాని?
జ: ఉరయూర్
18. సంగం యుగం నాటి చోళుల్లో ప్రసిద్ధుడు?
జ: కరికాలుడు
19. చేర రాజుల రాజధాని ఏది?
జ: వంజి
20. చేర రాజుల్లో గొప్పవాడు ఎవరు?
జ: సెంగుట్టువాన్
21. చోళుల భూభాగాన్ని ఏమని పిలిచేవారు?
జ: తొండై మండలం
22. కొర్కై (Korkai) ఎవరి ఓడ రేవు?
జ: పాండ్యులు
23. చోళుల రాజ చిహ్నం ఏది?
జ: పులి
24. సంగం యుగంలో రాజు పుట్టినరోజు సంబరాలను ఏమని పిలిచేవారు?
జ: పెరునాల్
25. రాజ్యాన్ని ఎలా విభజించారు?
జ: మండలం
26. తీర ప్రాంత పట్టణాన్ని ఏమని పిలిచేవారు?
జ: పట్టిణం
27. సంగం యుగంలో రథాలను లాగేందుకు ఉపయోగించిన జంతువులు ఏవి?
ఎ) ఎద్దులు బి) గుర్రాలు సి) ఎ, బి డి) ఏనుగులు
జ: సి (ఎద్దులు, గుర్రాలు)
28. సైనికుల శరీరాన్ని కాపాడటానికి ఏ జంతువు చర్మంతో తయారుచేసిన కవచాన్ని వాడేవారు?
జ: పులి
29. యుద్ధంలో మరణించిన సైనికుల జ్ఞాపకార్థం పాతే రాళ్లను ఏమని పిలిచేవారు?
జ: వీరక్కల్
30. సంగం యుగంలో కిందివాటిలో క్రూరమైన నేరం కానిది?
జ: పన్నులు చెల్లించకపోవడం
31. సంగం యుగంలో రైతులను ఏమని పిలిచేవారు?
జ: వెల్లాలర్
32. సంగం యుగంనాటి ముఖ్య దేవత?
జ: మురుగన్
33. కిందివాటిలో మురుగన్కు మరో పేరు కానిది?
ఎ) కార్తికేయ బి) సుబ్రమణ్యం సి) స్కంద డి) భాస్కర
జ: డి (భాస్కర)
34. సంగం కాలంలో కృష్ణుడిని పూజించిన వర్గం?
జ: గొర్రెల కాపరులు
35. ఉరయూర్ ఏ వ్యాపారానికి ప్రసిద్ధిగాంచింది?
జ: నూలు వస్త్రాలు
36. సంగం యుగంనాటి తమిళులు ఏ దేశంతో విదేశీ వ్యాపారం నిర్వహించలేదు?
జ: చైనా
37. సంగం యుగంలో దక్షిణ భారతదేశాన్ని సందర్శించిన గ్రీకు, రోమన్ వర్తకులను తమిళ సాహిత్యంలో ఏమని పేర్కొన్నారు?
జ: యవనులు
38. సంగం సాహిత్యంలో గొప్ప పురాణ గ్రంథం కానిది?
జ: పత్తుప్పాట్టు
39. సంగం యుగం చివరి కాలంలో చేర రాజులతో నిరంతరం యుద్ధాలు చేసిన రాజవంశం ఏది?
జ: పాండ్య
40. సంగం యుగంనాటి గూఢచారులను ఏమని పిలిచేవారు?
జ: ఒర్రర్
41. మండలాన్ని ఎలా విభజించారు?
జ: నాడు
42. చోళరాజు కరికాలుడు కావేరి నదిపై నిర్మించిన ఆనకట్ట వల్ల నీటిపారుదల సౌకర్యం పొందిన ప్రాంతం ఏది?
జ: దక్షిణ తంజావూర్
43. సంగం యుగ కాలంలో రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతి చేసిన జంతువు/ పక్షి ఏది?
జ: నెమలి
44. క్రీ.పూ.20లో రోమన్ చక్రవర్తి అగస్టస్ ఆస్థానానికి రాయబారిని పంపిన తమిళ రాజు ఏ రాజ్యానికి చెందినవాడు?
జ: పాండ్య
45. కిందివాటిలో ప్రధానంగా దిగుమతి చేసుకున్నది?
ఎ) బంగారం, వెండి బి) కుండలు సి) మద్యం డి) వస్త్రాలు
జ: ఎ (బంగారం, వెండి)
46. కన్నగి విగ్రహాన్ని రూపొందించడానికి హిమాలయాల నుంచి రాయిని తీసుకువచ్చినట్లుగా ఏ చేర రాజు గురించి చెబుతారు?
జ: సెంగుట్టవాన్
47. రోమన్లు ఏ విషయంలో భారతీయ జీవనాన్ని, సంస్కృతిని పెద్దగా ప్రభావితం చేయలేదు?
జ: అలంకరణ
48. కింది సంగం యుగం నాటి గ్రంథాల్లో బౌద్ధ మతం గురించి గొప్పగా పేర్కొన్నది?
ఎ) మణిమేఖలై బి) శిలప్పధికారం సి) కురల్ డి) తొల్కప్పియం
జ: ఎ (మణిమేఖలై)
49. పుహార్లో ఏ దేవుని గౌరవార్థం గొప్ప పండుగను నిర్వహించినట్లు సంగం పురాణాల్లో పేర్కొన్నారు?
జ: ఇంద్రుడు
50. ఎక్కడ నిర్వహించిన పురావస్తు తవ్వకాలు దక్షిణ భారతదేశంతో రోమన్ల వ్యాపారం గురించి తెలియజేయడం లేదు?
జ: పల్లవనేశ్వరం
51. పుహార్లోని మత్స్యకారుల జీవితం గురించి తెలియజేసే గ్రంథం ఏది?
జ: పట్టినప్పాలై
52. సంగం యుగం నాటి ప్రధాన ఎగుమతుల్లో ఒకటి కానిది?
జ: ఉల్లిపాయలు