1. ప్రణాళికా అభివృద్ధి విభాగాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1944
2. భారత్లో పారిశ్రామిక విధాన ప్రకటనను చేయని సంవత్సరం ..........
1) 1945 2) 1956 3) 1991 4) 1960
జ: 4(1960)
3. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిన పారిశ్రామిక తీర్మానం ..........
జ: 1948
4. 1948 పారిశ్రామిక తీర్మానం ప్రధాన లక్ష్యం కానిది ..........
1) జీవన ప్రమాణ స్థాయి పెంపు 2) సమాన అవకాశాల కల్పన
3) సమ న్యాయం 4) ఆదాయ అసమానతల పెంపు
జ: 4(ఆదాయ అసమానతల పెంపు)
5. పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రణాళిక ఏది?
జ: 2వ
6. సామ్యవాదరీతి సమాజ స్థాపనకు ప్రాధాన్యం ఉన్న పారిశ్రామిక తీర్మానం చేసిన సంవత్సరం ..........
జ: 1956
7. 1956 పారిశ్రామిక తీర్మానంలోని జాబితా Aలోని పరిశ్రమల సంఖ్య ..........
జ: 17
8. సంయుక్త రంగం భావనను ప్రవేశ పెట్టిన తీర్మానం ..........
జ: 1970 తీర్మానం
9. జనతా ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిన రంగం ..........
1) భారీ పరిశ్రమలు 2) చిన్న పరిశ్రమలు 3) బ్యాంకింగ్ రంగం 4) ఏదీకాదు
జ: 2(చిన్న పరిశ్రమలు)
10. 1980 పారిశ్రామిక తీర్మానం ముఖ్యాంశం ..........
ఎ) ఆర్థిక ఫెడరలిజం బి) న్యూక్లియస్ సంస్థలు
సి) పారిశ్రామిక రుగ్మత హెచ్చరించే విధానం డి) పర్యావరణ సమతౌల్య భావన
జ: ఎ, బి, సి, డి
11. 1991 పారిశ్రామిక తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జ: జులై 24