• facebook
  • whatsapp
  • telegram

  భారత రాజ్యాంగ రచన - స్వభావం

సేకరించి.. మథించి.. సవరించి!


ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలను శోధించి, సేకరించి, అందులోని ఆదర్శ విధానాలను, అనుసరణీయ లక్షణాలను అధ్యయనం చేసి, మథించి, అవసరమైన సవరణలు చేసి మన రాజ్యాంగంలో చేర్చారు. స్వాతంత్య్ర పోరాట లక్ష్యాలను, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలకు నిర్దేశకాలుగా మార్చారు. దేశ పరిస్థితులకు తగిన పాలనా ఏర్పాట్లను సంస్థాగతంగా సమకూర్చారు. వీటిపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రధాన దేశాల నుంచి గ్రహించిన లక్షణాలు, రాజ్యాంగ నిర్మాణ సభ స్వరూపం, గొప్పతనం గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

 

1. కిందివాటిలో సరికానిది?

1) ముసాయిదా రాజ్యాంగానికి 7,635 సవరణలు ప్రతిపాదించారు.

2) ముసాయిదా రాజ్యాంగాన్ని లార్డ్‌ మౌంట్‌బాటన్‌ ధ్రువీకరించారు.

3) ముసాయిదా రాజ్యాంగానికి ఎక్కువ సవరణలు ప్రతిపాదించినవారు హెచ్‌.వి.కామత్‌

4) రాజ్యాంగ సభ చర్చల్లో 7 రోజుల పాటు 24 మంది అమెరికన్లు పాల్గొన్నారు.

 

2. కింద పేర్కొన్న అంశాల్లో సరికానిది?

1) రాజ్యాంగ సభ 11 సమావేశాలు కలిపి 165 రోజులు జరిగాయి.

2) ముసాయిదా రాజ్యాంగంపై 114 రోజులు సమగ్రమైన చర్చ జరిగింది.

3) ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949, నవంబరు 26న (శనివారం) ఆమోదించింది.

4) ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించే సమయంలో గాంధీజీ పాల్గొన్నారు.

 

3. మన దేశంలో 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తున్నారు?

1) జనవరి 26 2) డిసెంబరు 3) నవంబరు 26 4) ఏప్రిల్‌ 14


4. 1949, నవంబరు 26న ఆమోదించిన రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమల్లోకి రావడానికి ప్రధాన కారణం?

1) లాహోర్‌లో ఆమోదించిన సంపూర్ణ స్వరాజ్‌ తీర్మానం

2) జవహర్‌లాల్‌ నెహ్రూ ఉద్దేశాల తీర్మానం

3) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సూచన

4) స్వాతంత్య్రం ఇచ్చే సమయంలో ఆంగ్లేయుల శ్వేతపత్రం

 

5.  1949, నవంబరు 26న ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన వెంటనే అమల్లోకి వచ్చిన అంశాల్లో లేనిది?

1) పౌరసత్వం, తాత్కాలిక పార్లమెంటు

2) ఎన్నికల నిర్వహణ ప్రక్రియ

3) అత్యవసర పరిస్థితి అధికారాలు

4) స్వదేశీ సంస్థానాలకు కల్పించిన రక్షణలు

 

6.  1950, జనవరి 26 (గురువారం) నుంచి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలోని అంశాలకు సంబంధించి సరికానిది?

1) ఆర్టికల్స్‌ 395 2) షెడ్యూల్స్‌ 12 3) షెడ్యూల్స్‌ 8 4) భాగాలు 22

 

7.  రాజ్యాంగ సభ చివరి సమావేశం (12వ) ఎప్పుడు జరిగింది?

1) 1950, జనవరి 24 2) 1950, జనవరి 26

3) 1949, నవంబరు 26 4) 1949, జనవరి 26

 

8.  రాజ్యాంగ సభ చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయం?

1) జాతీయ గీతంగా ‘జనగణమన’ ఎంపిక

2) జాతీయ గేయంగా ‘వందేమాతరం’ ఎంపిక

3) భారతదేశ తొలి ప్రధానిగా జవహర్‌లాల్‌ నెహ్రూ నియామకం

4) 1, 2 సరైనవి


9.  రాజ్యాంగ సభ చివరి సమావేశంలో ఎంత మంది ప్రతినిధులు హాజరై రాజ్యాంగ రాతప్రతులపై సంతకాలు చేశారు?

1) 266 2) 284 3) 299 4) 389

 

10.  భారత రాజ్యాంగంపై ప్రముఖుల వ్యాఖ్యానానికి సంబంధించి సరికానిది?

1) భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య - కె.సి.వేర్‌

2) భారత రాజ్యాంగాన్ని ఇంద్రుడి వాహనమైన ఐరావతంతో పోల్చవచ్చు - హెచ్‌.వి.కామత్‌

3) భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత - గాన్‌విల్‌ ఆస్టిన్‌

4) భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం - దామోదర్‌ స్వరూప్‌సేథ్‌

 

 

11.  ‘భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అసాధారణ పరిస్థితుల్లో ఏక కేంద్రంగా వ్యవహరిస్తుంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

1) ఐవర్‌ జెన్నింగ్స్‌

2) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

3) జవహర్‌లాల్‌ నెహ్రూ

4) ప్రమథ్‌ రంజన్‌ ఠాగూర్‌


12. రాజ్యాంగంలోని ప్రతిపేజీని శాంతినికేతన్‌లోని చిత్రకారుల సహకారంతో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా కళాత్మకంగా రూపొందించినవారు?

1) నందలాల్‌ బోస్‌ 2) ప్రేమ్‌బిహారీ నారాయణ్‌ రైజాదా

3) జితేంద్రనాథ్‌ బెనర్జీ 4) సత్యేంద్రనాథ్‌ ఠాగూర్‌

 

 

13.  మన రాజ్యాంగ నిర్మాతలు ‘భారత ప్రభుత్వ చట్టం - 1935 ’ నుంచి గ్రహించిన అంశాల్లో లేనిది?

1) అత్యవసర పరిస్థితి అధికారాలు, గవర్నర్‌ వ్యవస్థ

2) కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు

3) స్వేచ్ఛా, వాణిజ్య, వ్యాపార చట్టాలు

4) అఖిల భారత సమాఖ్య అనే భావన

 

 

14.  రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్‌ నుంచి గ్రహించిన అంశాల్లో లేనిది?

1) పార్లమెంటరీ ప్రభుత్వ విధానం, శాసన నిర్మాణ ప్రక్రియ

2) అటార్నీ జనరల్‌ వ్యవస్థ, కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వ్యవస్థ

3) న్యాయస్థానాలు రిట్స్‌ జారీ చేసే విధానం, చట్టసభల సభ్యుల హక్కులు

4) దేశాధినేత పేరుమీదుగా పరిపాలన నిర్వహించడం


15. రాజ్యాంగ నిర్మాతలు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి గ్రహించిన అంశాల్లో లేనిది?

1) రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగ ఆధిక్యత, ఉపరాష్ట్రపతి వ్యవస్థ

2) రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం

3) అంతర్‌రాష్ట్ర వర్తక వాణిజ్యం

4) న్యాయస్థానాలకు ఉండే న్యాయసమీక్ష అధికారం, న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి

 

16.  రాజ్యాంగ నిర్మాతలు కెనడా దేశ రాజ్యాంగం నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి సరికానిది?

1) అవశిష్ట అధికారాలు కేంద్రానికి లభించడం, బలమైన కేంద్ర ప్రభుత్వం

2) రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు విశిష్ట వ్యక్తుల నియామకం

3) రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహాను పొందడం

4) రాష్ట్రపతి ద్వారా రాష్ట్రాల గవర్నర్‌ల నియామకం

 

17.  రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి సరైన జత?

a) ఉమ్మడి జాబితా i) దక్షిణాఫ్రికా

b) న్యాయమూర్తుల తొలగింపు ii) జపాన్‌

c) చట్టం నిర్ధారించిన పద్ధతి iii) అమెరికా

d) రాజ్యాంగ సవరణ విధానం iv) ఆస్ట్రేలియా

1) a - ii, b - iv, c - i, d - iii
2) a - iv, b - iii, c - ii, d - i
3) a - iv, b - iii, c - i, d - ii
4) a - iii, b - iv, c - ii, d - i

18.  రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి సరైన జత?

a) ప్రొటెం స్పీకర్‌ నియామకం i) ఐర్లాండ్‌

b) ఆదేశిక సూత్రాలు ii) ఫ్రాన్స్‌

c) రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం iii) జపాన్‌

d) జీవించే హక్కు iv) దక్షిణాఫ్రికా

1) a - ii, b - i, c - iv, d - iii
2) a - iii, b - i, c - iv, d - ii
3) a - ii, b - i, c - iii, d - iv
4) a - ii, b - iii, c - iv, d - i


19.  రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి సరైన జత?

a) రాజ్యాంగ ప్రవేశికలోని గణతంత్ర అనే భావన i) కెనడా

b) సుప్రీంకోర్టు సలహా రూపక అధికార పరిధి ii) ఫ్రాన్స్‌

c) దేశాధినేత పేరు మీదుగా దేశ పరిపాలన నిర్వహణ iii) ఆస్ట్రేలియా

d) పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం iv) అమెరికా

1) a - iii, b - i, c - iv, d - ii
2) a - ii, b - iii, c - iv, d - i
3) a - ii, b - i, c - iv, d - iii
4) a - ii, b - i, c - iii, d - iv

 

20.  కిందివాటిలో భారత రాజ్యాంగం స్వతహాగా ఏర్పాటు చేసుకున్న లక్షణం?

1) రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణం (Electoral college)

2) పంచాయతీరాజ్‌ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులు

3) అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక రక్షణలు

4) పైవన్నీ

 

21.  మన దేశ సాంఘిక, ఆర్థిక లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ సభ అనుసరించిన ‘యూరో - అమెరికన్‌’ నమూనాలో లేని అంశం?

1) ఉదార ప్రజాస్వామ్య విధానాలు

2) కేంద్రీకృత రాజ్యాంగం

3) పరోక్ష ఎన్నిక విధానం

4) పార్లమెంటు ఆధిక్యత

 

22.  రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభ సర్వసమ్మతి, సమన్వయ పద్ధతులను ఉపయోగించిందని ‘ది ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌ కార్నర్‌ స్టోన్‌ ఆఫ్‌ ఏ నేషన్‌’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?

1) గాన్‌విల్‌ ఆస్టిన్‌ 2) కె.ఎం.మున్షీ 3) శిఖర్‌ మిశ్రా 4) నానిపాల్కీవాలా

 

23.  రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభ ‘సర్దుబాటు పద్ధతిని’ (Method of Adoption) ఉపయోగించిందని ‘ఇండియన్‌ గవర్నమెంట్‌ అండ్‌ పాలిటిక్స్‌’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?

1) మారిస్‌జోన్స్‌ 2) ఐవర్‌ జెన్నింగ్స్‌ 3) ఒ.పి.గోయెల్‌ 4) అవస్తీ, మహేశ్వరి

 

24.  ‘ప్రాచీన కాలం నాటి సాంఘిక, ఆర్థిక నిర్మాణాన్ని తిరస్కరించి ముందుకు కదులుతూ కొత్త వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఉంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ

2) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌

3) అనంతశయనం అయ్యంగార్‌

4) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌


సమాధానాలు

1-2; 2-4; 3-3; 4-1; 5-3; 6-2; 7-1; 8-4; 9-2; 10-4; 11-2; 12-1; 13-3; 14-4; 15-3; 16-2; 17-2; 18-1; 19-3; 20-4; 21-3; 22-1; 23-3; 24-1.

 

భారత రాజ్యాంగ రచన - స్వభావం - 2

అది ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ!

భారత రాజ్యాంగ రచన వెనుక ఎందరో మేధావుల అపారమైన కృషి ఉంది. అంబేడ్కర్‌ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ రచనా సంఘం అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, ఎన్నో చర్చలు, జరిపి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఏర్పాటైన వివిధ కమిటీలు విస్తృత పరిశీలన, మేధోమథనంతో ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఆధునిక, అభ్యుదయ, పురోగామి అంశాలతో రాజ్యాంగ స్వరూప స్వభావాలను మలిచాయి. ఈ మహాక్రతువు జరిగిన క్రమం, వివిధ కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రముఖులు, వారి అభిప్రాయాలు, వ్యాఖ్యల గురించి పోటీ పరీక్షార్థులు వివరంగా తెలుసుకోవాలి.


1. కింద పేర్కొన్న వాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభకు కార్యదర్శి హెచ్‌.వి.ఆర్‌.అయ్యంగార్‌

2) రాజ్యాంగ సభకు తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్‌ సచ్చిదానంద సిన్హా

3) రాజ్యాంగ సభకు ముఖ్య లేఖకుడు ఎస్‌.ఎన్‌.ముఖర్జీ

4) రాజ్యాంగ సభకు గౌరవ సలహాదారుడు జవహర్‌లాల్‌ నెహ్రూ

2. బెనగళ నరసింగరావు (బి.ఎన్‌.రావు)కు సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభకు సలహాదారుడిగా వ్యవహరించారు.

2) చిత్తు రాజ్యాంగ రూపకర్తగా పేరొందారు.

3) రాజ్యాంగ సభకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.

4) అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన తొలి భారతీయుడు.

3. రాజ్యాంగ రూపకల్పనలో ‘రాజ్యాంగ సభ’ నిర్వహించిన విధులకు సంబంధించి కిందివాటిలో సరైంది?

1) 1946, డిసెంబరు 9 నుంచి 1947, ఆగస్టు 15 మధ్య రాజ్యాంగ రచనా విధులను మాత్రమే నిర్వహించింది.

2) 1947, ఆగస్టు 15 నుంచి 1949, నవంబరు 26 మధ్య రాజ్యాంగ రచనా విధులతోపాటు దేశపాలనకు అవసరమైన శాసన రూపకల్పన విధులను నిర్వర్తించింది.

3) 1949, నవంబరు 26 నుంచి 1952, మే 13 మధ్య శాసన విధులను నిర్వర్తిస్తూ దేశానికి తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది.

4) పైవన్నీ

4. రాజ్యాంగ రచన కోసం ‘రాజ్యాంగ సభ’ ఏర్పాటు చేసిన విషయ నిర్ణాయక కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జత?

a) కేంద్ర రాజ్యాంగ కమిటీ i) సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

b) రాజ్యాంగ సలహా సంఘం ii) జవహర్‌లాల్‌ నెహ్రూ

c) రాజ్యాంగ ముసాయిదా కమిటీ iii) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

d) ఆర్థిక అంశాలపై ఏర్పడిన కమిటీ iv) నళినీ రంజన్‌ సర్కార్‌

1) a - ii, b - i, c - iii, d - iv 2) a - i, b - ii, c - iii, d - iv

3) a - iv, b - i, c - iii, d - ii 4) a - ii, b - iv, c - iii, d - i

5. రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన విషయ నిర్ణాయక కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జత?

a) కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ i) జవహర్‌లాల్‌ నెహ్రూ

b) భాషా ప్రయుక్త ప్రాంతాలపై ఏర్పడిన కమిటీ ii) ఎస్‌.కె.థార్‌

c) సుప్రీంకోర్టుపై ఏర్పడిన కమిటీ iii) ఎస్‌.వరదాచారి అయ్యర్‌

d) జాతీయ పతాకంపై ఏర్పడిన కమిటీ iv) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌

1) a - iii, b - i, c - ii, d - iv 2) a - i, b - ii, c - iv, d - iii

3) a - i, b - ii, c - iii, d - iv 4) a - iv, b - ii, c - iii, d - i

6. రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన విధాన నిర్ణాయక కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జత?
a) ఆర్డర్‌ ఆఫ్‌ బిజినెస్‌ కమిటీ i) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌
b) సభా కమిటీ ii) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌
c) క్రెడెన్షియల్‌ కమిటీ iii) భోగరాజు పట్టాభి సీతారామయ్య
d) సాంఘిక, ఆర్థిక కమిటీ iv) కె.ఎం.మున్షీ

1) a - iv, b - iii, c - ii, d - i 2) a - iii, b - iv, c - ii, d - i

3) a - iv, b - iii, c - i, d - ii 4) a - ii, b - iii, c - iv, d - i

7. 1947, జనవరి 24న ఏర్పడిన రాజ్యాంగ సలహా సంఘానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) దీనికి అధ్యక్షుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌.

2) ఈ కమిటీలోని సభ్యుల సంఖ్య 54.

3) ఈ కమిటీని 4 ఉప కమిటీలుగా వర్గీకరించారు.

4) కమిటీ తన నివేదికను 1949, నవంబరు 26న సమర్పించింది.

8. రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన వివిధ ఉప కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జత?

a) ప్రాథమిక హక్కుల ఉప కమిటీ i) హెచ్‌.సి.ముఖర్జీ

b) అల్ప సంఖ్యాక వర్గాల ఉప కమిటీ ii) ఎ.వి.ఠక్కర్‌

c) ఈశాన్య రాష్ట్రాల ఉప కమిటీ iii) జె.బి.కృపలాని

d) అస్సాం ప్రాంతం మినహాయించి ఇతర ప్రాంతాలపై ఏర్పడిన ఉప కమిటీ iv) గోపీనాథ్‌ బార్డోలోయ్‌

1) a - ii, b - iv, c - i, d - iii 2) a - iii, b - i, c - iv, d - ii

3) a - iii, b - i, c - ii, d - iv 4) a - iv, b - ii, c - i, d - iii

9. 1947, ఆగస్టు 29న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కానివారు?

1) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కె.ఎం.మున్షీ

2) ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్, బి.ఎల్‌.మిట్టల్‌

3) సయ్యద్‌ మహ్మద్‌ సాదుల్లా, డి.పి.ఖైతాన్‌

4) కె.టి.షా, హెచ్‌.సి.ముఖర్జీ

10. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ ‘ముసాయిదా రాజ్యాంగాన్ని’ రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టింది?

1) 1947, డిసెంబరు 28 2) 1948, నవంబరు 4

3) 1948, డిసెంబరు 21 4) 1949, జనవరి 22

11. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ బృందం రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంలోని అంశాన్ని గుర్తించండి.

1) షెడ్యూల్స్‌ - 8 2) ఆర్టికల్స్‌ - 315 3) 1, 2 4) భాగాలు - 20

12. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ను ఆధునిక మనువుగా, రాజ్యాంగ పితామహుడిగా ‘ది కాన్‌స్టిట్యూషనల్‌ గవర్నమెంట్‌ ఇన్‌ ఇండియా’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?

1) గాన్‌విల్‌ ఆస్టిన్‌ 2) నానీ పాల్కీవాలా 3) పాల్‌ ఆపిల్‌బీ 4) ఎం.వి.పైలీ

13. రాజ్యాంగ సభ సమావేశాల్లో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వారికి సంబంధించి సరికానిది?

1) భారత జాతీయ కాంగ్రెస్‌ - డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్, జవహర్‌లాల్‌ నెహ్రూ

2) ముస్లింలు - సయ్యద్‌ మహ్మద్‌ సాదుల్లా, మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌

3) హిందూ మహాసభ - శ్యాంప్రసాద్‌ ముఖర్జీ, ఎం.ఆర్‌.జయకర్‌

4) అల్పసంఖ్యాక వర్గాలు - కె.టి.షా, కె.ఎం.మున్షీ


14. రాజ్యాంగ సభ సమావేశాల్లో వివిధ వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులకు సంబంధించి సరైన జత?

a) పారశీకులు i) హెచ్‌.సి.ముఖర్జీ

b) యూరోపియన్లు ii) హెచ్‌.పి.మోదీ

c) అల్పసంఖ్యాక వర్గాలు iii) డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌

d) అఖిల భారత కార్మిక వర్గం iv) ఫ్రాంక్‌ ఆంటోని

1) a-iii, b-ii, c-iv, d-i 2) a-iv, b-i, c-iii, d-ii
3) a-ii, b-iv, c-i, d-iii 4) a-ii, b-iv, c-iii, d-i

15. కిందివాటిలో సరికానిది?

1) ప్రారంభంలో రాజ్యాంగ సభలో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం 69 శాతం.

2) రాజ్యాంగ సభ నుంచి ముస్లింలీగ్‌ వైదొలగడంతో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం 82 శాతానికి చేరింది.

3) రాజ్యాంగ సభ సమావేశాల్లో అఖిల భారత షెడ్యూల్డు కులాల వర్గానికి ప్రాతినిధ్యం వహించినవారు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

4) రాజ్యాంగ సభ సమావేశాల్లో జమిందారీ వర్గానికి ప్రాతినిధ్యం వహించినవారు రతన్‌ సింగ్‌.

16. రాజ్యాంగ సభ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?

1) 1946 డిసెంబరు 9 నుంచి 14 వరకు

2) 1946 డిసెంబరు 9 నుంచి 17 వరకు

3) 1946 డిసెంబరు 9 నుంచి 23 వరకు

4) 1946 డిసెంబరు 9 నుంచి 31 వరకు

17. కిందివాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షుడు డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌.

2) రాజ్యాంగ సభకు శాశ్వత ఉపాధ్యక్షులు హెచ్‌.సి.ముఖర్జీ, వి.టి.కృష్ణమాచారి.

3) రాజ్యాంగ సభ తొలి సమావేశానికి హాజరైన సభ్యులు 208 మంది.

4) రాజ్యాంగ సభలో ప్రారంభ ఉపన్యాసం చేసినవారు లార్డ్‌మౌంట్‌ బాటన్‌.

18. జవహర్‌లాల్‌ నెహ్రూ ‘ఉద్దేశాల తీర్మానం/చారిత్రక లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని’ రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1946, డిసెంబరు 11 2) 1946, డిసెంబరు 13

3) 1946, డిసెంబరు 23 4) 1946, డిసెంబరు 31

19. ఉద్దేశాల తీర్మానాన్ని ‘మనం ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ’ అని ఎవరు అభివర్ణించారు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ 2) మహాత్మా గాంధీ

3) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 4) కె.ఎం.మున్షీ

20. జవహర్‌లాల్‌ నెహ్రూ రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టిన ఉద్దేశాల తీర్మానానికి సంబంధించి సరైంది?

1) ఈ తీర్మానాన్ని రాజ్యాంగ సభ 1947, జనవరి 22న ఆమోదించింది.

2) భారతదేశం ప్రపంచ శాంతి, మానవాళి సంక్షేమం కోసం కృషి చేస్తుంది.

3) భారతదేశం సర్వసత్తాక గణతంత్ర దేశంగా అవతరించాలి.

4) పైవన్నీ


21. ‘డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ బృందం రూపొందించిన ముసాయిదా రాజ్యాంగం 1935, భారత ప్రభుత్వ చట్టానికి జిరాక్స్‌ కాపీలా ఉంది’ అని ఎవరు విమర్శించారు?

1) సర్‌ తేజ్‌ బహదూర్‌ సప్రూ 2) మహ్మద్‌ అలీ జిన్నా

3) మౌలానా హస్రత్‌ మొహాని 4) దామోదర్‌ స్వరూప్‌ సేథ్‌

 

సమాధానాలు

1-4; 2-3; 3-4; 4-1; 5-3; 6-1; 7-4; 8-2; 9-4; 10-2; 11-3; 12-4; 13-4; 14-3; 15-4; 16-3; 17-4; 18-2; 19-1; 20-4; 21-3.

 

పరిపాలనకు పరమ శాసనం

భారత రాజ్యాంగ రచన - స్వభావం - 1

ప్రజాస్వామ్య పాలనకు, అందరికీ ఆమోదనీయమైన, అనుకూలమైన చట్టాల రూపకల్పనకు, పౌర హక్కుల నిర్వచనానికి, సామాజిక న్యాయానికి, సంక్షేమానికి మౌలిక ఆధారం మన రాజ్యాంగం. ఎందరో మహానుభావుల మహోన్నత కృషితో రూపొందింది. దశాబ్దాల కాలపరీక్షలను దాటి ఇప్పటికీ, ఎప్పటికీ తిరుగులేని పరమ శాసనంగా నిలిచింది. అంతటి అత్యున్నతమైన ఆ రాజ్యాంగ రచన జరిగిన విధానం, దాని స్వభావంపై పోటీ పరీక్షల్లో తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. ఆ ప్రశ్నల సరళిపై అభ్యర్థులు తగిన అవగాహన పెంపొందించుకోవడానికి రకరకాల బిట్లను ప్రాక్టీస్‌ చేయాలి.

 

1. రాజ్యాంగానికి సంబంధించి కిందివాటిలో సరైంది?


ఎ) దేశ పరిపాలనను వివరించే అత్యున్నతమైన శాసనం.


బి) ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం అమెరికా.


సి) బ్రిటన్‌ దేశానికి లిఖిత రాజ్యాంగం లేదు.


డి) ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం భారత్‌.


1) ఎ, బి, సి 2) బి, సి, డి 3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి


2. ‘రాజ్యాంగం’ అనే భావనను తొలిసారిగా శాస్త్రీయంగా ప్రతిపాదించినవారు?


1) జార్జి వాషింగ్టన్‌ 2) అరిస్టాటిల్‌


3) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 4) ఎం.ఎన్‌.రాయ్‌


3. ‘స్వరాజ్‌’ అనేది బ్రిటిష్‌వారు ప్రసాదించే ఉచిత కానుక కాదని, అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణ అని 1922, జనవరి 5న గాంధీజీ ఏ పత్రికలో పేర్కొన్నారు?


1) యంగ్‌ ఇండియా 2) హరిజన్‌


3) వందేమాతరం 4) బెంగాల్‌ గెజిట్‌


4. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు ‘రాజ్యాంగ సభ’ను ఏర్పాటు చేయాలని 1934లో ఆంగ్లేయులను తొలిసారిగా డిమాండ్‌ చేసిన భారతీయుడు?


1) దాదాభాయ్‌ నౌరోజీ 2) మోతీలాల్‌ నెహ్రూ


3) మానవేంద్రనాథ్‌ రాయ్‌ 4) సుభాష్‌ చంద్రబోస్‌


5. జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశం రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని తొలిసారి అధికారికంగా ఆంగ్లేయులను డిమాండ్‌ చేసింది. అది ఎక్కడ జరిగింది?


1) లాహోర్‌ 2) ఫైజ్‌పుర్‌ 3) ముజఫరాబాద్‌ 4) కలకత్తా


6. భారతీయులతో కూడిన రాజ్యాంగ సభ ద్వారా రాజ్యాంగ రచన జరిగితే మన దేశం ఎదుర్కొంటున్న కుల, మత వర్గాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని 1939లో ‘హరిజన్‌’ అనే పత్రికలో ఎవరు పేర్కొన్నారు?


1) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 2) గోపాలకృష్ణ గోఖలే


3) బాలగంగాధర్‌ తిలక్‌ 4) మహాత్మా గాంధీ


7. ‘భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను, ఇలాంటి దేశంలో అంటరానితనం, మత్తు పానీయాలు, మత్తు మందులు అనే శాపం ఉండరాదు’ అని 1931లో గాంధీజీ ఏ పత్రికలో వ్యాఖ్యానించారు?


1) హరిజన్‌ 2) బాంబే సమాచార్‌


3) యంగ్‌ ఇండియా 4) హేరామ్‌


8. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు ‘రాజ్యాంగ సభ/రాజ్యాంగ పరిషత్‌’ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆంగ్లేయులు తొలిసారిగా దేని ద్వారా గుర్తించారు?


1) భారత ప్రభుత్వ చట్టం - 1935


2) ఆగస్టు ప్రతిపాదనలు - 1940


3) క్రిప్స్‌ రాయబారం - 1942


4) కేబినెట్‌ మిషన్‌ - 1946


9. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తామని ఆంగ్లేయులు తొలిసారి అధికారికంగా ఎప్పుడు ప్రతిపాదించారు?


1) క్రిప్స్‌ రాయబారం - 1942


2) భారత స్వాతంత్య్ర చట్టం - 1947


3) వేవెల్‌ ప్రణాళిక - 1945


4) రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు (1930 - 1932)


10. మహాత్మా గాంధీ కింద పేర్కొన్న దేన్ని ‘పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌’గా అభివర్ణించి తిరస్కరించారు?


1) ఆగస్టు ప్రతిపాదనలు - 1940 2) క్రిప్స్‌ రాయబారం - 1942


3) మంత్రిత్రయ రాయబారం - 1946


4) సిమ్లా సమావేశం - 1944


11. త్వరలోనే రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికైన శాసన సభ్యులు రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకుంటారని 1945, సెప్టెంబరు 19న దిల్లీలోని ఆలిండియా రేడియో కేంద్రం నుంచి ప్రకటించినవారు?


1) లార్డ్‌ వేవెల్‌ 2) లార్డ్‌ లిన్‌లిత్‌గో


3) స్టాఫర్డ్‌ క్రిప్స్‌ 4) లార్డ్‌ మౌంట్‌బాటన్‌

 

12. బ్రిటన్‌ ప్రధాని క్లెమెంట్‌ అట్లీ మంత్రిత్రయ రాయబారం/కేబినెట్‌ మిషన్‌ను భారతదేశానికి ఎప్పుడు పంపారు?


1) 1945, ఆగస్టు 24 2) 1945, మార్చి 24


3) 1946, మార్చి 24 4) 1947, జనవరి 24

 

13. కిందివారిలో మంత్రిత్రయ రాయబారం/కేబినెట్‌ మిషన్‌లో లేని సభ్యులు?


1) పెథిక్‌ లారెన్స్‌  2) స్టాఫర్డ్‌ క్రిప్స్‌


3) బిర్కెన్‌హెడ్‌   4) ఎ.వి.అలెగ్జాండర్‌

 

14.  రాజ్యాంగ సభ ఎన్నికలకు సంబంధించి కిందివాటిలో సరికానిది?


1) కేబినెట్‌ మిషన్‌ సిఫార్సుల మేరకు 1946లో జరిగాయి.


2) ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి.


3) పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి.


4) పరిమిత ఓటింగ్‌తో ఎన్నికలు జరిగాయి.

 

15.  రాజ్యాంగ పరిషత్‌కు నిర్దేశించిన ప్రాతినిధ్యానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?


1) బ్రిటిష్‌ పాలిత రాష్ట్రాల నుంచి 292 మంది


2) స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది


3) కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నలుగురు


4) స్వయం ప్రతిపత్తి ప్రాంతాల నుంచి 9 మంది

 

16. రాజ్యాంగ పరిషత్‌/రాజ్యాంగ సభకు వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించిన వారికి సంబంధించి సరైన జతను గుర్తించండి.


a) స్వతంత్ర అభ్యర్థులు    i) 3


b) ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌    ii) 73


c) ముస్లిం లీగ్‌     iii) 7


d) యూనియనిస్ట్‌ మహ్మదీయ పార్టీ    iv) 202


1) a - iii, b - iv, c - ii, d - i 2) a - i, b - iv, c - iii, d - ii

3) a - i, b - ii, c - iii, d - iv 4) a - ii, b - iv, c - i, d - iii

 

17. రాజ్యాంగ సభ ఎన్నికలకు (1946) సంబంధించి కిందివాటిలో సరికానిది?


1) రాజ్యాంగ సభకు ఎన్నికైన మొత్తం సభ్యుల సంఖ్య - 389


2) ఎస్సీ వర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య - 26


3) ఎస్టీ వర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య - 23


4) రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళల సంఖ్య - 15


18. కిందివారిలో రాజ్యాంగ సభకు విశిష్ట వ్యక్తులుగా నామినేట్‌ అయిన వారిలో లేనివారు?


1) అనంతశయనం అయ్యంగార్‌ 2) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌


3) ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌ 4) కె.టి.షా


19. రాజ్యాంగ సభ ఎన్నికలకు సంబంధించి కిందివాటిలో సరికానిది?


1) రాజ్యాంగ సభకు ఎన్నికైన ఏకైక ముస్లిం మహిళ బేగం ఎయిజాజ్‌ రసూల్‌.


2) రాజ్యాంగ సభకు ఎన్నిక కాని ప్రముఖులు మహాత్మా గాంధీ, మహ్మద్‌ అలీ జిన్నా.


3) రాజ్యాంగ సభలో ప్రతి ప్రావిన్స్‌ నుంచి సుమారు 10 లక్షల మంది జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించారు.


4) స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్య 289.

 

20.  హైదరాబాద్‌ సంస్థానం నుంచి 15 మంది ప్రతినిధులను రాజ్యాంగ సభకు ఎప్పుడు నామినేట్‌ చేశారు?


1) 1946 నవంబరు 2) 1947 నవంబరు 3) 1948 నవంబరు 4) 1949 నవంబరు

 

21.  రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళలు, వారి ప్రత్యేకతలకు సంబంధించి సరైన జతను గుర్తించండి.


a) భారత్‌లో తొలి మహిళా గవర్నరు i) సరోజిని నాయుడు


b) భారత్‌లో తొలి మహిళా ముఖ్యమంత్రి ii) సుచేతా కృపలానీ


c) భారత్‌లో తొలి మహిళా కేబినెట్‌ మంత్రి iii) విజయలక్ష్మి పండిట్‌


d) యూఎన్‌ఓ సాధారణ సభకు తొలి మహిళా అధ్యక్షురాలు iv) రాజకుమారి అమృతకౌర్‌


1) a - ii, b - iv, c - i, d - iii    2) a - i, b - ii, c - iv, d - iii

3) a - i, b - iii, c - iv, d - ii    4) a - iv, b - ii, c - i, d - iii

 

22. రాజ్యాంగ సభకు ఎన్నికైన ఎవరు కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డ్‌కు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా వ్యవహరించారు?


1) దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ 2) అమ్ముస్వామినాథన్‌


3) పూర్ణిమా బెనర్జీ 4) దాక్షాయణి వేలాయుదన్‌

 

23. రాజ్యాంగ సభకు ఎన్నికైన ప్రముఖ మహిళ హంసామెహతాకు సంబంధించి కిందివాటిలో సరైంది?


1) రాజ్యాంగ సభ సమావేశాల్లో మహిళలకు ప్రాతినిధ్యం వహించారు.


2) 1947 జులై 22న రాజ్యాంగ సభలో జాతీయ పతాకాన్ని ప్రతిపాదించి ఎగురవేశారు.


3) 1, 2 4) రాజ్యాంగ సభకు రాజీనామా చేసిన ఏకైక మహిళ.


24. రాజ్యాంగ సభకు ఎన్నికైన ఎవరు ‘హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌’ గ్రంథాన్ని రాశారు?


1) భోగరాజు పట్టాభి సీతారామయ్య 2) కల్లూరు సుబ్బారావు


3) ఎం.తిరుమలరావు 4) మోటూరు సత్యనారాయణ

 

25. రాజ్యాంగ సభకు ఎన్నికైన ప్రముఖ తెలుగు వ్యక్తులు, వారి ప్రత్యేకతలకు సంబంధించి సరైన జతను గుర్తించండి.


a) టంగుటూరి ప్రకాశం పంతులు i) కర్నూలు సర్క్యులర్‌ రూపకర్త


b) నీలం సంజీవరెడ్డి ii) ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి


c) కళా వెంకట్రావు iii) ప్రముఖ రైతు ఉద్యమ నాయకులు


d) ఆచార్య ఎన్‌.జి.రంగా iv) ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి


1) a - ii, b - iv, c - i, d - iii 2) a - ii, b - i, c - iv, d - iii

3) a - i, b - iv, c - ii, d - iii 4) a - iii, b - iv, c - i, d - ii

 

26. రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభ జరిపిన ప్రయత్నాల్లో కిందివాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభ రాజ్యాంగ రచనకు నిర్వహించిన సమావేశాలు - 11

2) రాజ్యాంగ సభ రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసిన కమిటీలు - 22

3) రాజ్యాంగ సభ నిర్వహించిన మొత్తం సమావేశాలు - 13

4) రాజ్యాంగ రచనకు అయిన వ్యయం - రూ.64 లక్షలు

 

సమాధానాలు

1-3, 2-2, 3-1, 4-3, 5-2, 6-4, 7-3, 8-2, 9-1, 10-2, 11-1, 12-3, 13-3, 14-2, 15-4, 16-1, 17-3, 18-1, 19-4, 20-3, 21-2, 22-1, 23-3, 24-1, 25-1, 26-3.

Posted Date : 06-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌