మాదిరి ప్రశ్నలు
1. 'దరిశనం' అంటే ఏమిటి?
ఎ) భూమిశిస్తు
బి) దేవతలను దర్శించినప్పుడు చెల్లించే సుంకం
సి) రాజును దర్శించినప్పుడు చెల్లించే కానుక
డి) సామంతుల కప్పాలు
జ: (సి)
2. ఏ కాలంలో దేవాల యాలకు దేవదాసీలను, నాట్యగత్తెలను బహూకరించే ఆచారముండేది?
ఎ) విష్ణుకుండినులు బి) కాకతీయులు సి) ఇక్ష్వాకులు డి) శాతవాహనులు
జ: (బి)
3. తొలి కాకతీయులు అనుసరించిన మతం ఏది?
ఎ) బౌద్ధం బి) శైవం సి) వైష్ణవం డి) జైనం
జ: (డి)
4. జినేంద్ర ప్రార్థనతో ప్రారంభమయ్యే శాసనం ఏది?
ఎ) హనుమకొండ శాసనం బి) కాజీపేట శాసనం సి) బీదర్ శాసనం డి) పద్మాక్షి దేవాలయ శాసనం
జ: (ఎ)
5. కాకతీయుల కాలంలో పంటలోని ఎన్నో వంతును భూమిశిస్తుగా వసూలు చేసేవారు?
ఎ) 1/3 బి) 1/6 సి) 1/2 డి) 1/4
జ: (బి)
6. జైనులను గణపతిదేవుడు హింసించినట్లు తెలిపే ఆధారం ఏది?
ఎ) బసవపురాణం బి) ముద్రామాత్యం సి) సకలనీతిసమ్మతం డి) సిద్ధేశ్వర చరిత్ర
జ: (డి)
7. కాకతీయుల కాలం నాటి రాజభాష ఏది?
ఎ) తెలుగు బి) ప్రాకృతం సి) సంస్కృతం డి) పాళీ
జ: (సి)
8. యుద్ధదేవుడిగా వీరులు ఆరాధించే దేవత ఎవరు?
ఎ) మైలారుదేవుడు బి) ఇంద్రుడు సి) యముడు డి) అర్జునుడు
జ: (ఎ)
9. మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిందెవరు?
ఎ) రుద్రమదేవి బి) ప్రతాపరుద్రుడు సి) ప్రోలరాజు డి) గణపతిదేవుడు
జ: (డి)
10. విద్యా మండపాల స్థితిగతులను తెలిపే ఆధారం ఏది?
ఎ) ఉప్పరపల్లి శాసనం బి) మల్కాపురం శాసనం సి) కరీంనగర్ శాసనం డి) బీదర్ శాసనం
జ: (బి)
11. కిందివాటిలో కాకతీయుల కాలంనాటి బంగారు నాణెం ఏది?
ఎ) గద్యాణం బి) రూక సి) వరాహం డి) ఏదీకాదు
జ: (ఎ)