మాదిరి ప్రశ్నలు
1. వర్ణాశ్రమ ధర్మ పరిరక్షకుడనే బిరుదున్న శాతవాహన చక్రవర్తి ఎవరు?
ఎ) శ్రీముఖుడు బి) గౌతమీపుత్ర శాతకర్ణి సి) హాలుడు డి) యజ్ఞశ్రీ శాతకర్ణి
జ: (బి)
2. వైదిక మతంతోపాటు శాతవాహనులు ఆదరించిన మరో మతం?
ఎ) బౌద్ధం బి) జైనం సి) శైవం డి) పైవన్నీ
జ: (ఎ)
3. శాతవాహనుల కాలంలో సామాన్య ప్రజలు అనుసరించిన మతం?
ఎ) హిందూ బి) బౌద్ధం సి) జైనం డి) ఏదీకాదు
జ: (బి)
4. 'సుహృల్లేఖ'ను రచించింది ఎవరు?
ఎ) హాలుడు బి) గుణాఢ్యుడు సి) నాగార్జునుడు డి) బాణుడు
జ: (సి)
5. మలి శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండ ఏ మత కేంద్రంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది?
ఎ) మహాయానం బి) హీనయానం సి) వజ్రాయానం డి) జైనమతం
జ: (ఎ)
6. శ్రీపర్వతం స్తూపాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు?
ఎ) యజ్ఞశ్రీ శాతకర్ణి బి) గౌతమీపుత్ర శాతకర్ణి సి) హాలుడు డి) శ్రీముఖుడు
జ: (ఎ)
7. మహాయాన బౌద్ధ మతానికి కరదీపికగా భావించే గ్రంథం?
ఎ) ప్రజ్ఞాపారమిత బి) గాథాసప్తశతి సి) బృహత్కథ డి) సుహృల్లేఖ
జ: (ఎ)
8. ఇక్ష్వాకుల రాజధాని ఏది?
ఎ) శ్రీపర్వతం బి) విజయపురి సి) అమరావతి డి) ఎ, బి
జ: (డి)
9. అశ్వమేధ, రాజసూయాది యాగాలు చేసిన ఇక్ష్వాక రాజు ఎవరు?
ఎ) శ్రీశాంతమూలుడు బి) వీరపురుషదత్తుడు
సి) ఎహూవుల చాంతమూలుడు డి) ఎవరూ కాదు
జ: (ఎ)
10. వీరగళ్ల ఆరాధన సంప్రదాయం ఎవరి కాలం నుంచి ప్రారంభమైంది?
ఎ) శాతవాహనులు బి) ఇక్ష్వాకులు సి) విష్ణుకుండినులు డి) చాళుక్యులు
జ: (బి)
11. పదకొండు అశ్వమేధ యాగాలు చేసిన విష్ణుకుండిన పాలకుడు ఎవరు?
ఎ) గోవింద వర్మ బి) రెండో మాధవవర్మ
సి) రెండో విక్రమేంద్ర వర్మ డి) నాలుగో మాధవ వర్మ
జ: (బి)
12. విష్ణు కుండినుల కాలంలో ప్రసిద్ధి చెందిన శివ-విష్ణు-శక్తి కేంద్రం ఏది?
ఎ) మంచికల్లు బి) విజయపురి సి) నాగార్జున కొండ డి) ఏదీకాదు
జ: (ఎ)
13. దేవాలయాలను నిర్మించే సంప్రదాయాన్ని ప్రారంభించింది ఎవరు?
ఎ) ఇక్ష్వాకులు బి) విష్ణుకుండినులు సి) చాళుక్యులు డి) శాతవాహనులు
జ: (బి)
14. చాళుక్య పాలకులు ప్రోత్సహించి ప్రాచుర్యం కల్పించిన మతం?
ఎ) బౌద్ధ బి) జైన సి) వైష్ణవం డి) శైవం
జ: (డి)
15. శ్రీశైల క్షేత్రానికి నాలుగు ద్వారాలుగా ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లో కింద ఇచ్చిన ఏ జత సరైంది?
ఎ) త్రిపురాంతకం-తూర్పు బి) ఆలంపూర్-దక్షిణం
సి) సిద్దవటం-ఉత్తరం డి) ఉమామహేశ్వరం-పడమర
జ: (ఎ)
16. బుద్ధుడు యోగముద్రలో ఉండి, చుట్టూ విష్ణువు దశావతారాలు చెక్కిన శిల్పాలున్న ప్రసిద్ధ క్షేత్రం ఏది?
ఎ) ఆలంపూర్ బి) శ్రీశైలం సి) అమరావతి డి) విజయపురి
జ: (ఎ)
17. బౌద్ధమతం క్రమంగా ఆదరణ కోల్పోవడం ఎవరి కాలం నుంచి ప్రారంభమైంది?
ఎ) ఇక్ష్వాకులు బి) విష్ణుకుండినులు సి) చాళుక్యులు డి) కాకతీయులు
జ: (సి)
18. జైన మతాన్ని విశేషంగా ఆదరించిన చక్రవర్తులు?
ఎ) చాళుక్యులు బి) కాకతీయులు
సి) విష్ణుకుండినులు డి) శాతవాహనులు
జ: (ఎ)
19. చాళుక్యుల కాలంలో తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం?
ఎ) ఆలంపూర్ బి) శ్రీశైలం సి) కాళేశ్వరం డి) వేములవాడ
జ: (డి)
20. 'త్రిభువన తిలక' అనేది ఒక ... ?
ఎ) జైన వసతి బి) బౌద్ధారామం
సి) చాళుక్య ప్రభువు పేరు డి) ఏదీకాదు
జ: (ఎ)