మాదిరి ప్రశ్నలు
1. రామప్ప దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారు?
ఎ) క్రీ.శ.1206 బి) క్రీ.శ.1208 సి) క్రీ.శ.1211 డి) క్రీ.శ.1213
జ: (డి)
2. ఓరుగల్లులో 1500 మంది చిత్రకారుల ఇళ్లు ఉన్నట్లు తెలిపే ఆధారం ఏది?
ఎ) కాకతీయ చరిత్ర బి) ప్రతాపచరిత్ర సి) బసవపురాణం డి) సిద్ధేశ్వర చరిత్ర
జ: (బి)
3. 'సిద్ధేశ్వర చరిత్ర' గ్రంథ రచయిత ఎవరు?
ఎ) శ్రీగిరీశుడు బి) మల్లప సి) కాసె సర్వప్ప డి) బద్దెన
జ: (సి)
4. భాస్కర రామాయణాన్ని ఎంతమంది కవులు రచించారు?
ఎ) ఇద్దరు బి) ముగ్గురు సి) నలుగురు డి) అయిదుగురు
జ: (డి)
5. 'క్రీడాభిరామం' కింది ఏ అంశాన్ని తెలుపుతుంది?
ఎ) పరిపాలన బి) సాహిత్యం సి) పన్నుల విధానం డి) సాంఘిక జీవనం
జ: (డి)
6. గౌతమేశ్వరాలయం ఎక్కడ ఉంది?
ఎ) మంథని బి) పానగల్లు సి) గణపవరం డి) చందుపట్ల
జ: (ఎ)
7. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నృత్యం ఏది?
ఎ) భరతనాట్యం బి) జక్కిణి సి) పేరిణి డి) చిందూ
జ: (సి)
8. రామప్ప దేవాలయంలోని శిల్పాలు, నాట్య చిత్రాల రూపకల్పనకు ఏ గ్రంథం ఆధారం?
ఎ) గీత రత్నావళి బి) నృత్త రత్నావళి సి) వాద్య రత్నావళి డి) నృత్త రత్నాకరం
జ: (బి)
9. కింది ఏ ఆలయం మొదట్లో జైన దేవాలయంగా ఉండేది?
ఎ) రామప్ప దేవాలయం బి) స్వయంభూ దేవాలయం సి) నేలశంభువు దేవాలయం డి) పద్మాక్షి దేవాలయం
జ: (డి)
10. 'ప్రతాపరుద్ర యశోభూషణం' అనే అలంకార గ్రంథాన్ని ఎవరు రచించారు?
ఎ) రుద్రదేవుడు బి) కొలనిదేవుడు సి) విద్యానాథుడు డి) మారన
జ: (సి)
11. కిందివాటిలో త్రికూట ఆలయం ఏది?
ఎ) ఎరుకేశ్వర ఆలయం బి) స్వయంభూ ఆలయం సి) నామేశ్వర ఆలయం డి) రుద్రేశ్వర ఆలయం
జ: (డి)