• facebook
  • whatsapp
  • telegram

 పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు - చట్టాలు

మాదిరి ప్రశ్నలు

1. తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఎవరు?
ఎ) జోగు రామన్న బి) అజ్మీరా చందూలాల్ సి) జూపల్లి కృష్ణారావు డి) కొప్పుల ఈశ్వర్
జ: (ఎ)

 

2. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ ఎవరు?
ఎ) బహుగుణ బి) రాజీవ్‌శర్మ సి) అనురాగ్‌శర్మ డి) ఎ.కె.చాందా
జ: (బి)

 

3. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 2014, జులై 6 బి) 2015, జులై 6 సి) 2014, ఆగస్టు 6 డి) 2015, ఆగస్టు 6
జ: (ఎ)

 

4. ప్రాంతీయ సామాజిక ఉద్యమాలు ఏ దశకం నుంచి ప్రారంభమయ్యాయి?
ఎ) 1980 బి) 1990 సి) 2000 డి) 1970
జ: (ఎ)

 

5. తెలంగాణలో యురేనియం నిక్షేపాలున్న జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి బి) మహబూబ్‌నగర్ సి) నల్గొండ డి) మెదక్
జ: (సి)

 

6. 'సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్' అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 1986 బి) 1987 సి) 1988 డి) 1989
జ: (ఎ)

 

7. 'ఛత్రీ, గమన, పుకార్, చెలిమి' అనేవి ఏమిటి?
ఎ) వ్యాపార సంస్థలు బి) ప్రకటన సంస్థలు సి) స్వచ్ఛంద సంస్థలు డి) ప్రభుత్వ సంస్థలు
జ: (సి)

 

8. మూసీనది కాలుష్య వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇచ్చిన పర్యావరణవేత్త ఎవరు?
ఎ) బాబా ఆమ్టే బి) మేధా పాట్కర్ సి) రాజేంద్ర సింగ్ డి) బహుగుణ
జ: (బి)

 

9. 2000, జూన్ 24న ఏర్పడిన 'ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్' కన్వీనర్ ఎవరు?
ఎ) ఎం.వేదకుమార్ బి) డాక్టర్ కిషన్‌రావు సి) కె.పురుషోత్తంరెడ్డి డి) రామారావు
జ: (ఎ)

 

10. నల్గొండలో యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమానికి మద్దతునిచ్చిన గిరిజన సమాఖ్య నాయకుడు ఎవరు?
ఎ) రవీంద్రనాయక్ బి) నాగేశ్వర్‌రావు సి) వీరేంద్రనాయక్ డి) ధరేంద్రసింగ్
జ: (ఎ)

 

11. నల్గొండ జిల్లాలో 'యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం' అనే స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 2005 బి) 2006 సి) 2007 డి) 2008
జ: (బి)

 

12. మూసీ నది వెంబడి ఉద్యానవనం అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన ప్రాజెక్టు ఏది?
ఎ) హరితపత్రం బి) నందనవనం సి) మిత్రవనం డి) జలవనమండలి
జ: (బి)

 

13. 2006 నవంబరు 21న హైదరాబాద్‌లో కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు 'హైదరాబాద్ బచావో' అనే నినాదంతో పాదయాత్ర ఎక్కడ నిర్వహించారు?
ఎ) మియాపూర్ నుంచి ఎల్బీనగర్ బి) జూబ్లీహిల్స్ నుంచి ఫలక్‌నుమా సి) పురానా పూల్ నుంచి అంబర్‌పేట డి) అంబర్‌పేట నుంచి మలక్‌పేట
జ: (సి)

 

14. 'వాటర్ మెన్ ఆఫ్ ఇండియా, జోహడ్ వాలా బాబా' అనే బిరుదులు ఎవరివి?
ఎ) వందనా శివా బి) సునీతా నారాయణ్ సి) అన్నాహజారే డి) రాజేంద్రసింగ్
జ: (డి)

 

15. టైమ్ మ్యాగజైన్ 'పర్యావరణ హీరో'గా ఎవరిని అభివర్ణించింది?
ఎ) సునీతా బి) అన్నాహజారే సి) వందనాశివ డి) మాధవ్ ప్రియదాస్
జ: (సి)

 

16. 'జలమందిర్ యాత్ర' పేరుతో గుజరాత్‌లో ప్రజలను చైతన్యపరిచిన జానపద గాయకుడు ఎవరు?
ఎ) రామ్‌బియా బి) మాధూరిప్రియ సి) రామ్‌లీలావాలా డి) మనోహర్‌బియా
జ: (ఎ)

 

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణలో  ప్ర‌భుత్వ ప‌థ‌కాలు

* కాలుష్య నియంత్రణ చర్యలు
* 'స్వచ్ఛ' కార్యక్రమాల అమలు
* అడవుల పెంపకానికి కార్యాచరణ


కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం నవ సామాజిక, ఆర్థిక నిర్మాణంలో ముందడుగు వేస్తున్న క్రమంలో కొన్ని సామాజిక, ఆర్థిక అడ్డంకులను ఎదుర్కోవడం సహజం. ఆ కోణంలో పరిశీలిస్తే తెలంగాణ ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుని ఉంది. కాలుష్యాన్ని నివారించే క్రమంలో ప్రభుత్వం రాష్ట్రంలో జలహారం, స్వచ్ఛ తెలంగాణ, హరితహారం, మన ఊరు-మన ప్రణాళిక లాంటి అనేక కార్యక్రమాలను ప్రజలందరి భాగస్వామ్యంలో అమలు చేస్తూ ప్రణాళికలను రూపొందించింది.
మనచుట్టూ ఆవరించి ఉన్న జీవ, నిర్జీవ సమూహాల మొత్తాన్ని పర్యావరణం అంటారు. ఈ పర్యావరణం కాలుష్యం బారిన పడటానికి కారణమయ్యే పరిశ్రమలు అత్యధికంగా హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. వీటిద్వారా వెలువడే వ్యర్థాల వల్ల పర్యావరణం బాగా కలుషితమవుతోంది. పారిశ్రామిక, రసాయనిక, జీవ వ్యర్థాల వల్ల పర్యావరణం దెబ్బతిని, వరుసగా భూమి, జల, వాయు కాలుష్యాలు ఏర్పడుతున్నాయి. ఇందులో ఎక్కువశాతం భూగర్భజలం కలుషితమవుతోంది. రసాయన, క్రిమి సంహారక, ఔషధ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు దాదాపు 75 శాతం నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయని పర్యావరణ పరిశోధన సంస్థ అధ్యయనంలో తేలింది.
మూసీ నదీపరివాహక ప్రాంతాలైన రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో చిన్న కార్ఖానాలు (పరిశ్రమలు) చాలా ఉన్నాయి. వీటి ద్వారా కూడా వ్యర్థ పదార్థాలు ఎక్కువ మోతాదులో విడుదలవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో జనాభా కూడా చాలా ఎక్కువ. దీంతో ఈ కలుషితాల వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌లోని కలుషిత నీటి వల్ల చుట్టూ ఉండే ప్రజలు తీవ్రమైన పర్యావరణ కాలుష్య ప్రభావానికి గురవుతున్నారు.
పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకే రకంగా లేవు. అత్యధిక పర్యావరణ కాలుష్యానికి గురిచేసే పరిశ్రమలు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉండటం వల్ల అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
2015లో ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సర్వే కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమల వివరాలు, శాతాలను ఇటీవల పేర్కొంది. ఆ వివరాలు..

చట్ట వ్యతిరేకంగా అధిక కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలు రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉన్నాయి. ఇవి ఎక్కువగా రసాయన, జీవ వ్యర్థ పదార్థాలను సమీపంలోని కాలువలు, నదులు, డ్రైనేజీల్లోకి విడుదల చేస్తున్నాయి. దాంతో ఈ జిల్లాల పరిసర ప్రాంతాల్లోని దాదాపు 5 వేల గ్రామాల్లో ధ్వని, వాయు, రేడియోధార్మిక కాలుష్యాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కలుషితమైన భూగర్భ జలాలను వినియోగిస్తున్న ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ రకమైన కలుషిత పదార్థాల వల్ల చర్మ, శ్వాస, గుండె, నేత్ర, ఊపిరితిత్తులు, కాలేయ సంబంధిత వ్యాధులతోపాటు అల్సర్లు, కీళ్లనొప్పులు వంటివాటి బారిన పడుతున్నారు. భయంకరమైన క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా గురవుతున్నారు.
రాష్ట్రంలో కాలుష్య నివారణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలు..


స్వచ్ఛ తెలంగాణ
భారత ప్రభుత్వం 2014, అక్టోబరు 2న స్వచ్ఛభారత్ అభియాన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 4,041 పట్టణాల్లో క్లీన్ - స్ట్రీట్, రోడ్ లాంటి కార్యక్రమాలను చేపట్టారు. దీనికంటే ముందు యూపీఏ ప్రభుత్వం రూ.37,159 కోట్లతో గ్రామీణ శానిటేషన్ కోసం 'నిర్మల్ భారత్ అభియాన్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వచ్ఛభారత్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2015, మే 16న 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్‌'ను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. 'స్వచ్ఛ తెలంగాణ' కార్యక్రమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో 68 పట్టణాల్లో అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. రాబోయే అయిదేళ్లలో కాలుష్యరహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడానికి దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. బడ్జెట్‌లో రూ. 979 కోట్లు కేటాయించారు.
ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 'స్వచ్ఛభారత్' కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 476 నగరాలను సర్వే చేయగా మైసూరు (కర్ణాటక) మొదటిస్థానంలో నిలిచింది. రాజధానులవారీగా చేసిన సర్వేలో ప్రథమ స్థానంలో బెంగళూరు, చివరిస్థానంలో పట్నా(బిహార్) ఉన్నాయి. హైదరాబాద్ 275, వరంగల్ 33 స్థానాల్లో ఉన్నాయి.


జలహారం
ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమమే జలహారం. దీన్నే 'వాటర్ గ్రిడ్' పథకం అంటారు. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి వ్యక్తికి 100 లీటర్లు, పట్టణాల్లో 130 లీటర్ల చొప్పున నీటిని అందించాలనేది లక్ష్యం. దీన్ని మొదట నల్గొండ జిల్లా చౌటుప్పల్ వద్ద ఏర్పాటు చేశారు. దీనికి జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'హడ్కో అవార్డు' లభించింది.


మన ఊరు - మన ప్రణాళిక
తెలంగాణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా 'మన ఊరు - మన ప్రణాళిక' పేరుతో అయిదేళ్లపాటు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రూ. 22,500 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇలా చెరువులను పునరుద్ధరించడం ద్వారా జీవవైవిధ్యాన్ని సమతౌల్యం చేయడానికి వీలవుతుంది. దీనివల్ల చెరువుల పరిసర ప్రాంతాల్లో పచ్చదనం, వివిధ జీవాలను పెంచడం సాధ్యమవుతుంది.


జీవవైవిధ్యం
పర్యావరణాన్ని పెంపొందించడానికి 2002లో రాష్ట్ర అటవీ పథకాన్ని (స్టేట్ ఫారెస్ట్ పాలసీ) తిరిగి ప్రారంభించారు. దీని ప్రకారం విజన్-2020లో వివిధ రకాల అటవీ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫారెస్ట్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రాష్ట్రంలో 3 అంచెల పద్ధతిని ప్రవేశపెట్టారు.
1) రాష్ట్ర స్థాయి - స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎస్ఎఫ్‌డీఏ)
2) డివిజన్ స్థాయి - ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎఫ్‌డీఏ)
3) గ్రామ స్థాయి - వన సంరక్షణ సమితి (వీఎస్ఎస్)

 

పర్యావరణంపై అవగాహన
నేటి తరానికి పర్యావరణం పట్ల అవగాహన కలిగించడంలో పర్యావరణ పరిరక్షణ సమూహాలు (ఇకో క్లబ్స్) ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. వీటిని దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు; విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టారు. ఇవి చేపట్టే వివిధ పర్యావరణ సానుకూల చర్యల కోసం కేంద్ర పర్యావరణ శాఖ నిధులను మంజూరు చేస్తుంది.


సమూహ కార్యక్రమాలు
* పర్యావరణం కలుషితమైన ప్రదేశాలు, పతనావస్థలో ఉన్న ప్రాంతాలు, వన్యప్రాణులున్న జంతు ప్రదర్శన శాలలను దర్శించడం.
* వివిధ సంస్థల్లో పర్యావరణ సమస్యలు / అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సమావేశాలు, చర్చలు, ప్రముఖుల ప్రసంగాలు ఏర్పాటు చేయడం.
* బాణాసంచా, లౌడ్ స్పీకర్లు, ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం.
* కాలుష్య నియంత్రణలో వినూత్న మార్గాలను అన్వేషించి, వాటిని అమలు పరిచే సంస్థలకు అందించడం.
* రహదారుల అందాన్ని, పరిశుభ్రతను పెంచేందుకు చెట్లు, పూల మొక్కలు పెంచడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం.


హరితహారం
మిశ్రమ మొక్కల పథకం కింద తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ సమతౌల్యం సాధించడానికి ప్రస్తుతం ఉన్న 25 శాతం అడవులను 33 శాతానికి పెంచడం ఈ పథకం ఉద్దేశం. 'మన ప్రణాళిక' అనే కార్యక్రమం కింద రాష్ట్రంలో 3,889 నర్సరీలను గుర్తించారు. 2015 నాటికి 40 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించారు.
మొదటగా ఈ పథకాన్ని 2015, జులై 3-7 వరకు చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం 2014-15లో సీఏఎమ్‌పీఏ (కాంపన్సేటరీ ఎఫారిస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) కార్యక్రమాన్ని చేపట్టింది.


ముఖ్యాంశాలు
* అంతర్జాతీయ బయో డైవర్సిటీ దినోత్సవాన్ని మే 22న నిర్వహిస్తారు.
* ప్రపంచంలో మొత్తం 170 బయోడైవర్సిటీ బోర్డులుండగా.. తెలంగాణలోని 10 జిల్లాలోని 66 మండలాల్లోను, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ బయో డైవర్సిటీ బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* తెలంగాణలో (2014-15) 3 జాతీయ పార్కులు, 9 వన్యప్రాణి కేంద్రాలు, 4 జింకల పార్కులు, 2 జంతు ప్రదర్శన శాలలు, 65 సాక్రెడ్ గ్రూవ్స్ ఉన్నాయి.
* కేంద్ర పర్యావరణ, అటవీశాఖ 2015లో తెలంగాణలో 'ప్రాణహిత'ను పర్యావరణ పరిరక్షణ పార్కుగా ప్రకటించింది. ఈ ప్రాంతం చుట్టూ 5 కి.మీ. పరిధిలో పలురకాల జంతువులను పెంచాలని నిర్ణయించింది.


మాదిరి ప్రశ్నలు

1. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ) జూన్ 5      బి) మార్చి 21      సి) మార్చి 8     డి) మే 22
జ: (డి)


2. ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలంగాణలో ఏ ప్రాంతాన్ని పర్యావరణ పరిరక్షణ పార్కుగా ప్రకటించింది?
ఎ) మంజీర     బి) ప్రాణహిత     సి) అలీసాగర్     డి) కిన్నెరసాని
జ: (బి)


3. కిందివాటిలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో పర్యావరణంతో సంబంధం లేనిది ఏది?
ఎ) ఆసరా     బి) జలహారం      సి) స్వచ్ఛ తెలంగాణ     డి) హరితహారం
జ: (ఎ)


4. తెలంగాణలో అత్యధిక పారిశ్రామిక, రసాయన కేంద్రాలు ఉన్న జిల్లాలు ఏవి?
ఎ) రంగారెడ్డి     బి) మెదక్     సి) హైదరాబాద్     డి) పైవన్నీ
జ: (డి)


5. తెలంగాణ పర్యావరణ పరిశోధన సంస్థ అధ్యయనంలో 75% నుంచి 80% రసాయన, క్రిమి, ఔషధ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు ఏ రకమైన కాలుష్యానికి కారణమవుతున్నాయని తెలిపింది?
ఎ) నీటి     బి) వాయు     సి) ధ్వని     డి) రేడియోధార్మిక
జ: (ఎ)


6. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ) మే 22     బి) మార్చి 21     సి) డిసెంబరు 10    డి) జూన్ 21
జ: (బి)


7. 'ఫ్లోరైడ్ (F2)' సమస్య అధికంగా ఉన్న తెలంగాణ జిల్లా ఏది?
ఎ) మెదక్     బి) రంగారెడ్డి     సి) నల్గొండ     డి) వరంగల్
జ: (సి)


8. తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిశ్రమల మొత్తంలో కాలుష్యం లేని పరిశ్రమల శాతం ఎంత?
ఎ) 29.58%      బి) 64.98%     సి) 5.43%    డి) 0.033%
జ: (సి)


9. తెలంగాణలో 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్' కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?
ఎ) ఈఎస్ఎల్ నరసింహన్         బి) కె.చంద్రశేఖర్ రావు   
సి) కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా       డి) రాజీవ్ శర్మ
జ: (ఎ)


10. తెలంగాణలో 'స్వచ్ఛ తెలంగాణ - హైదరాబాద్' కార్యక్రమాన్ని ఏ రోజున చేపట్టారు?
ఎ) 2015, మే 10 - 14     బి) 2015, మే 16 - 20     సి) 2015, మే 20 - 24     డి) 2015, మే 1 - 4
జ: (బి)


11. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'హడ్కో అవార్డు' కిందివాటిలో దేనికి లభించింది?
ఎ) హరితహారం    బి) స్వచ్ఛ తెలంగాణ    సి) జలహారం    డి) మన ఊరు - మన ప్రణాళిక
జ: (సి)


12. 'క్లీన్ ఇండియా మిషన్‌'లో ఇటీవల భారతదేశ 476 నగరాల్లో తెలంగాణలోని గ్రేటర్ వరంగల్ నగరం ఎన్నో స్థానం దక్కించుకుంది?
ఎ) 275      బి) 34      సి) 33      డి) 13
జ: (సి)


13. తెలంగాణలో హరితహారం కార్యక్రమం ఎప్పుడు చేపట్టారు?
ఎ) 2015, జులై 3 - 7             బి) 2015, జులై 7 - 10
సి) 2015, ఆగస్టు 3 - 7          డి) 2015, సెప్టెంబరు 7-10
జ: (ఎ)

Posted Date : 08-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తుపాను

* సముద్రంపైన ఉష్ణోగ్రత, పీడనాల్లో తేడా వల్ల వేగంగా వీచేగాలిని తుపాను అంటారు. దీని వల్ల అధిక వర్షపాతం సంభవిస్తుంది. సముద్రంలో కెరటాల ఉధృతి పెరుగుతుంది. దీంతో సముద్ర తీరప్రాంతాలకు అధిక నష్టం వాటిల్లుతుంది. వేగంగా వీచే గాలుల వల్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోతాయి. జనావాసాలు దెబ్బతింటాయి. పండ్ల తోటలకూ అపార నష్టం.
* తుపాను వల్ల కలిగే వర్షంతో వరదలు సంభవించి ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తుపాను ప్రభావం తీవ్రతను బట్టి వందల సంఖ్య నుంచి వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుంది. పశుసంపదకు నష్టం వాటిల్లుతుంది. వరదల వల్ల ఆవరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.
* తుపానులను ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. అట్లాంటిక్ సముద్రంపైన వచ్చే తుపానులను హరికేన్‌లనీ; పసిఫిక్ మహా సముద్రంపై కలిగే వాటిని టైఫూన్‌లనీ, ఆస్ట్రేలియాలో సంభవించే వాటిని విల్లి - విల్లిలనీ పిలుస్తారు. ప్రపంచంలో తుపాన్లు ఎక్కువగా సంభవించే 6 ప్రాంతాల్లో భారతదేశం కూడా ఒకటి. భారతదేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపానులు సంభవిస్తాయి. బంగాళాఖాతం తీరప్రాంతంలోని పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సాలకు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ తుపాను ముప్పు పొంచి ఉంది. అరేబియా తీరప్రాంతంలో ఉండే గుజరాత్, మహారాష్ట్రల్లో మిగతా వాటి కంటే ముప్పు కొద్దిగా ఎక్కువ. భారతదేశంలో 8.5 % ప్రాంతానికి తుపాను ముప్పు ఉంది.


భారతదేశంలో 7516 కి.మీ. ప్రాంతానికి తుపాను ముప్పు పొంచి ఉంది. పాండిచ్చేరితోపాటు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లు తుపాను ప్రభావానికి గురవుతున్నాయి. వీటితోపాటుగా అండమాన్ నికోబార్, లక్ష ద్వీప్ కూడా తుపాను తాకిడికి గురయ్యే ప్రాంతాలు. ఏటా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో దాదాపుగా 5 నుంచి 6 తుపానులు సంభవిస్తాయి.

* వీటిలో 2 నుంచి 3 ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి. అరేబియా సముద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలో ఎక్కువ తుపానులు వస్తాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో సంభవించే తుపానుల నిష్పత్తి 4 : 1. సాధారణ తుపాను సమయంలో గాలి సరాసరి వేగం గంటకు 65 కి.మీ. నుంచి 117 కి.మీ. వరకు ఉండవచ్చు. 
* తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటే గాలివేగం గంటకు 119 కి.మీ. నుంచి 164 కి.మీ. వరకు, అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. 1999 అక్టోబరు 29 న ఒరిస్సాలో సంభవించిన సూపర్‌సైక్లోన్‌లో గంటకు 250 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.


నష్టాన్ని తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యలు
* తీరప్రాంతాల్లో ముఖ్యంగా తుపానులు తరచుగా సంభవించే ప్రాంతాల్లో చెట్లను పెంచాలి. ఇక్కడి అడవులను పరిరక్షించాలి. తీర ప్రాంతాల్లో ఉండే మాంగ్రూవ్ అడవులు (మడ అడవులు), ఎత్తయిన వృక్షాలు తుపాను తీవ్రతను తగ్గిస్తాయి. దీనివల్ల వరదలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. సముద్రపు ఒడ్డుకు దగ్గరలో ఉన్న వృక్షసంపద సహజ కవచంలా పనిచేసి తుపాను నష్టాన్ని తగ్గిస్తుంది. తీరప్రాంతాల్లో అడవులను పూర్తిగా కొట్టివేయడం వల్ల తుపాను ముప్పు పెరిగి సహజ విపత్తు కాస్తా మానవ సంబంధ విపత్తుగా మారుతోంది.
* తరచుగా తుపాన్లు సంభవించే ప్రాంతాలను గుర్తించి పటాలను తయారుచేయాలి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత చర్యలను చేపట్టవచ్చు. తుపానులను ఉపగ్రహాల సహాయంతో ముందుగానే గుర్తించవచ్చు. గాలి వీచే దిశ, వేగాన్ని బట్టి అక్కడి ప్రజలను హెచ్చరించి తుపాను నష్టాన్ని తగ్గించవచ్చు.
* తుపాను సంభవించే ప్రాంతాల్లో తక్కువ నష్టతీవ్రత ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ నివాసాలు, వసతులను, ఏర్పాటు చెయ్యాలి. తుపాను తాకిడికి ఎక్కువగా గురయ్యే ప్రదేశాల్లో ఇళ్లు, భవనాల నిర్మాణాల్లో మార్పులు చెయ్యాలి. ఇవి తుపానును తట్టుకునే విధంగా ఉండాలి. గృహాలను నేలమట్టం నుంచి ఎత్తుగా నిర్మించాలి, పైకప్పు వేలాడినట్టుగా కాకుండా మూసినట్టుగా ఉండాలి. ఇంటి చుట్టూ చెట్లను నాటడం వల్ల అవి సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి. సమాచార, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినకుండా ఉండేందుకు వాటిని భూగర్భ కేబుల్స్ ద్వారా సరఫరా చెయ్యాలి. తుపాన్లు సంభవించేటప్పుడు వరదలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని ఎదుర్కొనే చర్యలను కూడా చేపట్టాలి.  
* భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) రుతుపవనాలు, వర్షపాతం, తుపాన్ల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాడార్‌లు, ఉపగ్రహాల ద్వారా గ్రహించి అందజేస్తోంది. ఈ సమాచారం అందుకున్న ఏరియా సైక్లోన్ వార్నింగ్ సెంటర్స్ (ACWCs) తగిన హెచ్చరికలను జారీ చేస్తాయి. భారతదేశ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఐ) తుపాన్ల గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది.
* తుపాన్ల వల్ల జరిగే నష్ట తీవ్రతను తగ్గించడానికి, భారత పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 1990 జులైలో బిల్డింగ్ మెటీరియల్స్, టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. తీర ప్రాంతాల్లో ఉన్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీల ద్వారా తగిన సమాచారాన్ని అందిస్తూ రక్షణ చర్యలను చేపడుతున్నాయి.
* ఇన్‌శాట్ ఉపగ్రహాలు, 10 రాడార్‌ల సహాయంతో కేంద్రం తుపాను ముప్పులను గమనించి తీర ప్రాంతాల ప్రజలను 48 నుంచి 24 గంటల ముందుగా హెచ్చరిస్తోంది. స్థానిక భాషల్లో తుపాను హెచ్చరిక సూచనలు అందిస్తోంది.


జాతీయ తుపాను ముప్పు నియంత్రణా ప్రాజెక్ట్
   భారతదేశంలోని తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలను తుపాను బారి నుంచి రక్షించడానికి, వారి ఆస్తులను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. దీన్ని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రారంభించింది. దీన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) అమలు చేస్తోంది. హోంమంత్రిత్వశాఖ, ఎన్‌డీఎంఏ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నాయి.
* 2011 నుంచి 2015 మధ్య ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తారు. ప్రపంచ బ్యాంక్ దీనికి నిధులను సమకూరుస్తుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం రూ. 626.87 కోట్లు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 165.13 కోట్లను సమకూర్చుకుంది. 
* ఇదేవిధంగా ఒరిస్సాకు కేంద్ర ప్రభుత్వం రూ. 520.93 కోట్లు కేటాయించగా ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 132.85 కోట్లు సమకూర్చుకుంది.
మొదట విడతగా ఈ ప్రాజెక్ట్‌ను ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ల్లో అమలు చేయనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ నిధులతో తుపాను సమయంలో తలదాచుకునే భవనాలు నిర్మిస్తారు. తుపాను వల్ల దెబ్బతిన్న రహదారులను, కరకట్టలను మరమ్మత్తు చేస్తారు. తుపాను విపత్తు గురించిన అవగాహనను ప్రజలకు కలిగిస్తారు.

 

ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ (ఐసీజడ్ఎంపీ): కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల సూచన మేరకు భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీనిలో భాగంగా గుజరాత్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌ల తీర ప్రాంతాల రక్షణకు చర్యలు చేపడతారు. ఈ రాష్ట్రాల్లో తుపాను ముప్పు ప్రాంతాలను గుర్తించడం, మ్యాపింగ్ చేయడం, రాష్ట్రంలో తుపానును ఎదుర్కొనేందుకు పని చేస్తున్న శాఖలకు, సంస్థలకు నిధులను అందజేయడం ఈ ప్రాజెక్ట్ విధి. ఈ ప్రాజెక్టు కింద పశ్చిమ బెంగాల్‌కు రూ. 1425 కోట్లను కేటాయించారు.
 

కోర్‌గ్రూప్ ఆన్ సైక్లోన్ మిటిగేషన్: తుపాను ముప్పును గమనించడానికి, నివారణకు జాతీయస్థాయిలో ముఖ్యమైన వ్యక్తులతో ఒక గ్రూపును ఏర్పరిచారు. దీనిలో భారత వాతావరణ శాఖ, కేంద్ర జల సంఘం, నేషనల్ రిమోట్‌సెన్సింగ్ ఏజెన్సీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన నిపుణులు ఉంటారు. వీరితోపాటుగా తుపాను కార్యక్రమాలను పర్యవేక్షించే వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ఉంటారు. వీరు తుపాను, వరదలకు సంబంధించిన హెచ్చరికలను జారీచేయడం; రాష్ట్ర, జాతీయస్థాయిలో వివిధ శాఖలు, సంస్థలను సమన్వయపరచడం లాంటి పనులను చేస్తారు.

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు నిర్వహణ చట్టం - 2005

2005, మే 30న కార్యనిర్వహక ఉత్తర్వు ద్వారా ప్రధాని ఛైర్మన్‌గా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటుచేశారు. దీన్ని యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం 'ప్రకృతి వైపరీత్యాల నష్ట నివారణ' అనే పేరుతో 2005, డిసెంబరు 23న పార్లమెంట్‌లో ఆమోదించింది. ఈ చట్టంపై 2006, జనవరి 9న రాష్ట్రపతి సంతకం చేశారు.
* 2006, సెప్టెంబరు 27న ఛైర్మన్, తొమ్మిది మంది సభ్యులతో కూడిన 'జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ - NDMA' లాంఛనంగా అమల్లోకి వచ్చింది.
* జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మొదటి ఛైర్మన్ డాక్టర్ మన్మోహన్ సింగ్, వైస్ ఛైర్మన్ డాక్టర్ మర్రి శశిధర్ రెడ్డి. వీరు 2014లో రాజీనామా చేశారు.
* 2014 డిసెంబరులో ఎన్‌డీఏ ప్రభుత్వం నూతన విపత్తు నిర్వహణలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్యులను తగ్గించింది. ప్రస్తుతం ఒక ఛైర్మన్, అయిదుగురు సభ్యులు ఉన్నారు.
* ప్రస్తుత NDMA ఛైర్మన్ నరేంద్ర మోదీ; సభ్యులు కమల్ కిశోర్, డి.ఎన్. శర్మ, ఎన్.సి. మర్వా, ఆర్.కె. జైన్.
* విపత్తు నిర్వహణ చట్టాన్ని 2009, అక్టోబరు 22న కేంద్రమంత్రి మండలి ఆమోదించి దేశ వ్యాప్తంగా అమలు చేసింది. దీన్నే జాతీయ విపత్తు నిర్వహణ విధానం (నేషనల్ పాలసీ ఫర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ - NPDM) అంటారు.
* జాతీయ విపత్తు మొదటి సమావేశాన్ని 2006, నవంబరు 29న; రెండో సమావేశాన్ని 2009, నవంబరు 6న దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించారు. విపత్తు పరిహారాన్ని 2015, ఏప్రిల్ 1 నుంచి అందిస్తున్నారు. నూతన విధానం ప్రకారం ఒక వ్యక్తి విపత్తు వల్ల మరణిస్తే రూ.4 లక్షలు, 60% గాయాలైతే రూ.2 లక్షలు నష్ట పరిహారంగా ఇస్తారు.

జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ - NDMP):
            2016, జూన్ 1న దిల్లీలో నూతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను నరేంద్ర మోదీ ప్రభుత్వం విడుదల చేసింది ఈ ప్ర‌ణాళిక‌ను కింది స‌ద‌స్సుల ల‌క్ష్యాల‌కు అనుగుణంగా రూపొందించారు.
a) 2015 మార్చి - జపాన్ (సెండాయ్) - అంతర్జాతీయ విపత్తు కుదింపు సదస్సు (DRR - Disaster Risk Reduction)
b) 2015 సెప్టెంబరు - అమెరికా (న్యూయార్క్) - సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సదస్సు (SDG - Sustainable Development Goals)
c) 2015 డిసెంబరు - ఫ్రాన్స్ (పారిస్) - వాతావరణ మార్పు సదస్సుల (COP - 21)
            ఈ ప్రణాళిక 2015 - 2030 వరకు స్పల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికల్లో మొత్తం 14 లక్ష్యాలను సాధించాలని నిర్ణయించింది. స్పల్పకాలిక 5 సంవత్సరాలు, మధ్యకాలిక 10 సంవత్సరాలు, దీర్ఘకాలిక 15 సంవత్సరాలుగా నిర్ణయించారు.       

* 2005 విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 11 ప్రకారం జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP) దేశం మొత్తానికి చట్ట/న్యాయ బద్ధమైంది. సెక్షన్ 37 ప్రకారం దేశంలోని అన్ని మంత్రిత్వ శాఖలకు ఇది వర్తిస్తుంది.
విపత్తు నిర్వహణ స్థాయి (Levels of Disasters):
            విపత్తు నిర్వహణ అత్యున్నతాధికారి కమిటీ (HPC) - 2001 నివేదిక ప్రకారం 2016లో జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికలో విపత్తు దుర్బలత్వాన్ని తగ్గించడానికి వివిధ కేటగిరీలుగా విభజించారు. ఒక సాధారణ కేటగిరీని కూడా రూపొందించారు.
స్థాయి - 1 (L1) - జిల్లా స్థాయిలో విపత్తు ప్రణాళికలను నిర్వహిస్తూ, రాష్ట్రస్థాయి విపత్తు నిర్వహణ సహాయాన్ని కలిగి ఉండటం
స్థాయి - 2 (L2) - రాష్ట్రస్థాయి విపత్తు నిర్వహణ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ నిర్వహణ సహాయాన్ని కలిగి ఉండటం
స్థాయి - 3 (L3) - రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఒకే సమయంలో దీర్ఘకాలిక విపత్తు సంభవించినప్పుడు
స్థాయి - 0 (L0) - ఒక ప్రాంతం సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు
* జాతీయ విపత్తు నిర్వహణ కో ఆర్డినేటర్ - కేంద్ర హోంమంత్రి.

జాతీయ విపత్తు నిర్వహణ విధాన నిర్ణయ కమిటీలు (National Level Decision Making bodies for DM) 

 

 

విపత్తు ఉపశమనం/నోడల్ మంత్రిత్వ నిర్వహణ (Nodel Ministry for Management/Mitigation of Disasters)  

 

జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం (NDRF)
           2005 విపత్తు చట్టం సెక్షన్ 44 ప్రకారం 2006లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని ఏర్పాటు చేశారు. ఇది హోంమత్రి నిర్వహణలో ఉంటుంది. దీనికి ఒక డైరెక్టర్ జనరల్ ఉంటాడు. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ (ఐపీఎస్). ప్రస్తుతం దేశంలో మొత్తం 5 దళాల్లో 12 బెటాలియన్లు, ప్రతి బెటాలియన్‌లో 1149 మంది ఉంటారు. ఈ బెటాలియన్లకు ప్రకృతి, రేడియోలాజికల్, న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ విపత్తులపై బాధ్యత ఉంటుంది. ఇందులో BSF-3, ITBP-2, CRPF-3, CISF-2, SSB-2 ఉంటాయి. 


 

 

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సునామీ

* తీవ్ర భౌగోళిక వైపరీత్యం
* తీర ప్రాంతాల్లో విధ్వంసం

సునామీ.. పేరు చెప్పగానే భయకంపితులను చేసేంత తీవ్రమైన విధ్వంసకర విపత్తు. మీటర్ల కొద్దీ ఎత్తులో.. ఒకదాని వెంబడి మరొకటిగా.. ఊహకు అందనంత వేగంగా.. దూసుకొచ్చే సముద్రపు అలలు తీర ప్రాంతాల్లో విలయాన్ని సృష్టిస్తాయి. ఒకేసారి కొన్ని దేశాలపై ప్రభావం చూపించగలిగేంత తీవ్ర శక్తిమంతమైన ఈ సునామీలు ఎలా పుడతాయి? ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? వీటిని ముందుగా గుర్తించగలమా? తీవ్రతను తగ్గించడానికి ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలి? ఎదుర్కోవడం ఎలా? - తెలుసుకుందాం..
అత్యంత ఎక్కువగా ఆస్తి, ప్రాణ నష్టాలను మిగిల్చి.. తీవ్ర విధ్వంసాన్ని సృష్టించి.. పర్యావరణానికి తీవ్రహాని కలిగించే భౌగోళిక వైపరీత్యాల్లో సునామీ ఒకటి. ప్రధానంగా భూకంపాల కారణంగా ఏర్పడే సునామీలను ముందుగా ఊహించగలిగినా వాటివల్ల వచ్చే నష్టాన్ని మాత్రం పూర్తిగా తగ్గించలేకపోతున్నాం. సాధారణ భాషలో 'రాకాసి అలలుగా వీటిని పిలుస్తుంటారు. భారీ పరిమాణంలో స్థానభ్రంశం చెందిన నీటి వల్ల ఉవ్వెత్తున ఎగిసిపడే నీటి తరంగాల వరుసను సునామీ అంటారు. మహా సముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు... చివరకు ఈత కొలను (స్విమ్మింగ్ పూల్)ల్లో కూడా సునామీలు ఏర్పడవచ్చు. 2015 ఏప్రిల్ 25న నేపాల్‌లో భూకంపం సంభవిచ్చినప్పుడు ఒక స్విమ్మింగ్‌పూల్‌లో ఏర్పడిన సునామీని మీడియా ద్వారా చూడగలిగాం.


ఒకటి కాదు.. పదికి పైగా..
బలమైన భూకంపాల వల్ల సముద్రపు అగాధాల్లో ఏర్పడిన సునామీ కెరటాలు వందల కిలోమీటర్ల పొడవునా (సుమారుగా 800 కి.మీ. వేగంతో) ప్రయాణిస్తుంటాయి. సునామీ అంటే ఒక పెద్ద తరంగం కాదు. పది లేదా అంతకంటే ఎక్కువ తరంగాలు ఉండొచ్చు. వాటిని 'సునామీ తరంగ రైలు అంటారు. ఒక్కో తరంగం ఒకదాని తర్వాత ఒకటి 5 నిమిషాల నుంచి 90 నిమిషాల వ్యవధిలో మరొకదాన్ని అనుసరిస్తాయి.
సునామీ మహాజల కుడ్యం (Huge wall of water) తీరానికి చేరిన తర్వాత ఒక వ్యక్తి పరుగెత్తే వేగం కంటే చాలా ఎక్కువ వేగంగా (50 కి.మీ.ల వేగంతో) ప్రయాణిస్తుంది. ఈ దూరాన్ని 'రన్ అప్ అంటారు. ఇది తీరాన్ని బట్టి కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. సునామీ ప్రారంభ ప్రాంతంలో తరంగాల ఎత్తు కొన్ని సెంటీమీటర్లుగా ఉండి, తీరానికి చేరే కొద్దీ 30 మీటర్ల ఎత్తువరకు కూడా ఉండొచ్చు. అందువల్ల సముద్రంపై ఓడలో ప్రయాణిస్తున్న వారికి సునామీ గురించి తెలియదు.
సునామీ తీరాన్ని చేరుతున్నప్పుడు వేగం తగ్గుతూ అల ఎత్తు పెరుగుతుంది. దీన్నే 'షోలింగ్ ప్రభావం అంటారు. సునామీ ప్రారంభమైన చోట తక్కువ డోలన పరిమితితో ఉంటుంది. తీరానికి చేరే కొద్దీ డోలన పరిమితి పెరుగుతుంది. కొన్నిసార్లు తీరం వద్ద నీరు వెనక్కు తగ్గి సముద్ర తీరం భూతలం బయటకు కనిసిస్తుంది. దీన్ని సునామీ రావడానికి అవకాశం ఉన్న సహజ సిద్ధమైన హెచ్చరికగా భావించవచ్చు.


జపాన్ సునామీ విలయం
2011, మార్చి 11వ తేదీ మధ్యాహ్నం 2.46 గంటల సమయంలో జపాన్‌లోని ఈశాన్యప్రాంతంలోని తోహోకు ప్రాంతానికి 130 కి.మీ.ల దూరంలో (పసిఫిక్ మహాసముద్రంలో రిక్టర్ స్కేలుపై 9 తీవ్రత కూడిన పెను భూకంపం వల్ల) సునామీ సంభవించింది. దీంతో ఫుకిషిమా దైచీలోని అణువిద్యుత్తు ప్లాంటులో విస్ఫోటం జరిగింది. కొన్ని పరిశ్రమల్లో మంటలు రేగాయి. ఇలా ఈ భూకంపం వల్ల అనేక గొలుసు కట్టు విపత్తులు సంభవించాయి.


11 దేశాలపై ప్రభావం
2004, డిసెంబరు 26న ఇండోనేషియాలోని జావా, సుమత్రా దీవుల మధ్య సుండా అగాధంలో సునామీ ఏర్పడింది. ఇది చుట్టూ ఉన్న 11 దేశాలను నష్టపరిచింది. మన దేశంలో తమిళనాడు తీరంలోని నాగపట్నం ఎక్కువగా దెబ్బతింది. దీంతోపాటు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి; కేరళ రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించాయి.


భారత్ తీరరేఖకూ..
ఒకచోట ఏర్పడిన సునామీ కెరటాల ప్రభావం వాటి తీవ్రతను బట్టి అన్ని మహాసముద్రాల్లోనూ కనిపించవచ్చు. భారతదేశ తీరరేఖ మొత్తం సునామీ ముప్పును కలిగి ఉంది. మనదేశ భూపటల పలక (క్రస్ట్ ప్లేట్) ఆస్ట్రేలియన్ పలక నుంచి దూరంగా జరుగుతున్నందున మన దేశానికి తరచుగా సునామీలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. భారతదేశానికి దూరంగా రెండు చోట్ల ఏర్పడుతున్న భూకంపన అధికేంద్రాల వద్ద సునామీలు ఏర్పడి మనదేశ తీరాన్ని తాకుతున్నాయి.
1. అండమాన్ నికోబార్ దీవులు, సుమత్రాదీవి వంపు దగ్గర ఏర్పడిన సునామీలు భారత్‌తో సహా ప్రధాన దేశాలను చేరడానికి 3 నుంచి 5 గంటల వ్యవధి పడుతుంది.
2. అరేబియన్ మైక్రో పలక భారత్ భూపటల పలకను ఢీ కొడుతున్నందున అరేబియా సముద్రంలోని మక్రాన్ ప్రాంతంలో సునామీ ఏర్పడుతుంది. ఇది ప్రధాన భారత తీరానికి అంటే గుజరాత్ తీరాన్ని చేరడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది.


అంతర్జాతీయ హెచ్చరిక వ్యవస్థ
సునామీ ఏ తీరాన్నైనా తాకే ప్రమాదం ఉంది. అలాగే అవి ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతుంటాయి. ఈమేరకు అంతర్జాతీయ సునామీ హెచ్చరిక వ్యవస్థను హవాయి దీవుల్లోని హోనలూలు వద్ద 1946లో ఏర్పాటు చేశారు. దీన్ని పసిఫిక్ సునామీ వార్నింగ్ (Pasific Tsunamy Warning System - PTWS)సెంటర్ అంటారు. ఇది సునామీ రావడానికి గంటల ముందు సంబంధిత దేశాలను అప్రమత్తం చేస్తుంది. కొన్ని దేశాల్లో ప్రాంతీయ హెచ్చరిక కేంద్రాలు కూడా ఉన్నాయి.


భారత్‌లోనూ...
గతంలో జరిగిన భూకంపాల సమాచారం ఆధారంగా ప్రస్తుత భూకంపం వల్ల సునామీ ముప్పును అంచనా వేసేవారు. ఈ సమాచారం 15 నిమిషాల ముందు మాత్రమే హెచ్చరిక జారీ చేయడానికి పరిమితం అయ్యేది. తర్వాత సర్వే ఆఫ్ ఇండియా తీరం వెంబడి టైడ్‌గేజ్ విధానాన్ని అమలు చేసింది. ఇది కూడా చాలా ఆలస్యంగానే సమస్య తీవ్రతను తెలియజేసేది.
2004లో ఏర్పడిన సునామీని రాడార్ల సహకారంతో తెలుసుకున్నారు. ఇది భూకంపం వచ్చిన రెండు గంటల తర్వాత మాత్రమే తరంగాల ఎత్తును నమోదు చేయగలిగింది.
2007, అక్టోబరు 15న ఐఎన్‌సీవోఐఎస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్)లో సత్వర సునామీ హెచ్చరిక కేంద్రాన్ని (సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ - టీఈడబ్ల్యూసీ) ఏర్పాటు చేశారు. ఇది హైదరాబాద్‌లో ఉంది.


తీవ్రతను తగ్గించాలంటే..
* తీరం వెంబడి జపాన్‌లా గోడలు నిర్మించి సునామీ తీవ్రతను తగ్గించవచ్చు. మడ అడవులను పెంచడం ద్వారా కూడా ప్రయోజనం ఉంటుంది.
* తీరం సమీపంలో నిర్మాణాలను దృఢంగా, ఎత్తయిన ప్రాంతాల్లో నిర్మించాలి.
* విపత్తు సమయంలో సహాయ కేంద్రాలుగా పనిచేసే కమ్యూనిటీ హాల్స్‌ను ఎత్తయిన ప్రాంతంలో నిర్మించాలి.
* సరైన వరద నివారణ చర్యలు ముందుగానే కలిగి ఉండాలి.
* సరైన భూ వినియోగ ప్రణాళిక అవసరం.


సునామీలెలా ఏర్పడతాయి?
జలాశయాల్లో ఆకస్మిక చలనం వల్ల సునామీ తరంగాలు ఏర్పడతాయి. ఇవి ముఖ్యంగా సముద్ర తీరాల వద్ద ఎక్కువ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. సునామీల వల్ల వాటిల్లే నష్టం, అవి ఏర్పడే స్థానం, ప్రయాణం చేసే దూరం, తాకే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. అవి ఏర్పడే ప్రాంతం నుంచి 30 నిమిషాల్లో తీరాన్ని తాకే సునామీలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి.
* సముద్రం దగ్గర లేదా లోపల బలమైన భూకంపాలు వచ్చినప్పుడు ఏర్పడిన భ్రంశ చలనాల వల్ల సునామీలు సర్వసాధారణంగా సంభవిస్తాయి. పెద్దఎత్తున ఏర్పడిన సునామీ తరంగాలు మహాసముద్రాలను కూడా దాటే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 1960 చిలీలో రిక్టర్ స్కేలుపై 9.5 గా నమోదైన భూకంపం వల్ల ఏర్పడిన సునామీ తరంగాలు జెట్ వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రం అవతల ఉన్న జపాన్ తీరంలోని మత్స్య పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించాయి. సాధారణంగా సముద్ర గర్భంలో భూకంపం వచ్చినప్పుడు దాని తీవ్రత రిక్టర్ స్కేలు మీద 7.5 గా నమోదైనప్పుడు సునామీలు సంభవిస్తాయి.
* సముద్రం కింద లేదా సముద్రానికి దగ్గరలో భూపాతం (ల్చ్థ్టి ళ్ద్ట్ఠీౖ) జరిగి కొండచరియలు నీటిలో పడినప్పుడు సునామీ ఏర్పడవచ్చు. 1958లో అలస్కాలోని లిటుయా బేలో సంభవించిన భూపాతం వల్ల 50-150 మీటర్లు ఎత్తున సముద్ర కెరటాలు తీరాన్ని తాకాయి.
* సముద్రాల్లో అగ్నిపర్వతాల విస్ఫోటం జరిగినప్పుడు కూడా సునామీలు ఏర్పడవచ్చు. 1883లో ఇండోనేషియాలోని కాక్రటోవా అగ్నిపర్వతం విస్ఫోటం చెందినప్పుడు జావా, సుమత్రా దీవుల్లో 40 మీటర్ల ఎత్తున సునామీ ఏర్పడింది.
సునామీ (Tsunami) అనేది జపాన్ పదం. జపాన్ భాషలో గ్బ్యి అంటే హార్బర్ (ఓడరేవు), nami అంటే వేవ్ (కెరటం) అని అర్థం. ఈ రెండు పదాల కలయికే సునామీ. తమిళంలో సునామీని ఆఝి పెరలై (Aazhi peraial) అని కూడా అంటారు.


మాదిరి ప్రశ్నలు

1. ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీల శాతం ఎంత?
జ: 8%


2. భారతదేశంలో సునామీలు ఎక్కడ వస్తున్నాయి?
జ: బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో


3. ఇటీవల బంగాళాఖాతంలో సునామీ ఎప్పుడు ఏర్పడింది?
జ: 2004, డిసెంబరు 26


4. సునామీ అంటే ...?
జ: తీరాన్ని ముంచేసిన పెద్ద అలలు


5. సునామీ అనేది ఎలాంటి విపత్తు?
జ: భౌగోళిక


6. అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది?
జ: హోనలూలు


7. సునామీలు ఎక్కడ ఏర్పడతాయి?
ఎ) పసిఫిక్ మహాసముద్రం బి) అంట్లాటిక్ మహాసముద్రం
సి) హిందూ మహాసముద్రం డి) పైవన్నీ
జ: డి


8. సునామీలు ఏర్పడటానికి ప్రధాన కారణం?
జ: సముద్రాల్లో భూకంపాలు సంభవించడం


9. సునామీలు అధికంగా ఏర్పడే సముద్రం ఏది?
జ: పసిఫిక్ మహాసముద్రం


10. సునామీలు ఎలా ఏర్పడతాయంటే...?
ఎ) సముద్రాల్లో భూకంపాలు బి) సముద్రాల్లో అగ్నిపర్వత విస్ఫోటం
సి) సముద్రాల్లో భూపాతం డి) పైవన్నీ
జ: డి


11. సునామీ ఎప్పుడు సంభవిస్తుంది?
జ: రాత్రి, పగలు సమయాల్లో

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - జీవ వైవిధ్యం

* జీవులు, వాటి ఆవాసాల మధ్య ఉండే సంబంధాల అధ్యయనాన్ని ఆవరణ శాస్త్రం (Ecology) అంటారు.  ఈ పదం Oekos (ఆవాసం), Logos (అధ్యయనం) అనే రెండు గ్రీకు పదాల నుంచి ఆవిర్భవించింది.
* ఆవరణ శాస్త్రం అనే పదాన్ని మొదటిసారిగా ఎర్నెస్ట్ హెకెల్ ఉపయోగించారు.
* భూమిపై ఉన్న జీవులు, అవి విస్తరించిన ప్రాంతాలన్నింటితో కలిపి జీవావరణం ఏర్పడింది.
* IUCN (International Union For Conservation of Nature & Natural Resources) ప్రకారం ప్రతిజాతి జీవులు, విభిన్న జాతి జీవులు, అవి నివసిస్తున్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న వైవిధ్యాన్ని జీవ వైవిధ్యం (Bio Diversity) అంటారు.
* ప్రపంచంలో బ్రెజిల్, చైనా, కొలంబియా, ఆస్ట్రేలియా, కాంగో, ఈక్వెడార్, ఇండోనేషియా, మడగాస్కర్, మలేషియా, మెక్సికో, పపువా న్యూగినియా, పెరూ, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెనెజులా, భారతదేశం మెగా డైవర్స్ కంట్రీస్ (అత్యధిక జీవ వైవిధ్యత ఉన్న దేశాలు)గా ప్రసిద్ధిగాంచాయి.
* ప్రపంచ భూభాగంలో 2.4% భూభాగాన్ని ఆక్రమిస్తున్న భారతదేశం ఇప్పటివరకు గుర్తించిన వాటిలో సుమారు 7.8% జీవ జాతులను కలిగి జీవ వైవిధ్యంతో అలరారుతోంది.  దీనిలో 45000 రకాలకు పైగా వృక్ష జాతులు (వీటిలో 15000కు పైగా పూల మొక్కలు), సుమారు 2500 రకాలకుపైగా చేప జాతులు, 1200కు పైగా పక్షి జాతులు భారతదేశంలో ఉన్నాయి.
* భారతదేశంలో ప్రధానంగా పశ్చిమ కనుమలు, నల్లమల కొండలు, శేషాచల కొండలు, హిమాలయాలు, భారతదేశ ఈశాన్య ప్రాంతం విభిన్న జీవ జాతులకు నిలయంగా ఉన్నాయి.
* ఇప్పటికీ ఏటా పశ్చిమ కనుమలు, ఈశాన్య ప్రాంతంలో అనేక కొత్త జీవ జాతులను కనుక్కుంటున్నారు.
* ఈ ఆవరణ వ్యవస్థలు ఇదివరకెప్పుడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో ప్రమాదాలను ఎదుర్కొంటున్నట్లు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ గుర్తించింది.
* సహజ వనరుల అధిక దుర్వినియోగం ద్వారా ప్రధానంగా కలప కోసం అడవుల నరికివేత, వ్యవసాయ భూముల విస్తరణ, మైనింగ్, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, రోడ్డు, రైలు మార్గాలు, డ్యామ్‌లు, విద్యుత్ అవసరాలను తీర్చడానికి విద్యుత్ కేంద్రాల నిర్మాణం లాంటి మానవ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఆవరణ వ్యవస్థలు ఎన్నో ఒడుదుడుకులకు లోనవుతున్నాయి. 
* భారతదేశంలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి.

 

భారతదేశంలోని బయోస్పియర్ రిజర్వులు

భారతదేశంలో జీవవైవిధ్యత పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు
* వన్యజీవుల పర్యవేక్షణ, పరిరక్షణ కోసం 1952లో Indian Board for Wildlife ను ఏర్పాటు చేశారు.  1972లో వన్య మృగ సంరక్షణా చట్టం చేశారు.
* 1982లో డెహ్రాడూన్ కేంద్రంగా Wildlife Institute of India ను ప్రారంభించారు.
*  1983లో ప్రభుత్వం National Wildlife Action Plan ను ప్రారంభించింది. 
* 2002లో జీవ వైవిధ్య పరిరక్షణ కోసం జీవ వైవిధ్య చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీన్ని అమలుచేయడానికి చెన్నై కేంద్రంగా National Bio Diversity Authority ని ఏర్పాటు చేశారు.

 

జీవ సమాజంలోని జీవుల మధ్య ఉండే విభిన్నతను 'జీవ వైవిధ్యం' అంటారు. ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన జీవుల సంఖ్య, భిన్నత్వ ం, మార్పు చెందే తత్వాలన్నీ జీవ వైవిధ్యానికి సంబంధించినవే. అందుకే ప్రకృతిని గమనిస్తే విభిన్న రకాల వృక్షాలు, జంతువులు, జీవులు కనిపిస్తాయి.
 

జీవ వైవిధ్య స్థాయులు
జీవ వైవిధ్య క్రమానుగత స్థాయి ప్రకారం ప్రధానంగా 3 రకాలు. అవి.. 
1. జన్యుపర జీవ వైవిధ్యం (జెనిటిక్ బయోడైవర్సిటీ)
2. జాతిపర జీవవైవిధ్యం (స్పీసిస్ బయోడైవర్సిటీ)
3. ఆవరణ వ్యవస్థల జీవవైవిధ్యం (ఇకో సిస్టమ్ బయోడైవర్సిటీ)

 

జన్యుపర జీవవైవిధ్యం
ఇది ఒక జాతిలో ఉండే జీవవైవిధ్యం. అంటే ఒకే జాతికి చెందిన జీవుల మధ్య ఉన్న విభిన్నతలకు సంబంధించింది. జీవుల జీవకణాల్లోని క్రోమోజోముల్లోని జన్యువులు ఆ జీవి వ్యక్తిగత లక్షణాలను నిర్ధారిస్తాయి.
ఉదా: జన్యుపర జీవవైవిధ్యం కారణంగా కొందరు సన్నగా, లావుగా, పొడవుగా, పొట్టిగా, తెల్లటి చర్మంతో, వివిధ రంగుల్లో ఉండటం; ఒకే జాతికి చెందిన కుక్కలు, పిల్లులూ, పుష్పాలు మొదలైనవి.

 

జాతిపర జీవ వైవిధ్యం
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించినా, నేటికీ భూగోళంపై కచ్చితంగా ఎన్ని జాతులకు చెందిన జీవులున్నాయో ఎవరికీ తెలియదు.
* భూమ్మీద 10-14 మిలియన్ల జాతులు/ జీవులున్నట్లు అంచనా. ఇవి చాలావరకు కీటకాలు, సూక్ష్మజీవులే.

 

ఆవరణ వ్యవస్థల జీవ వైవిధ్యం

దీనిలో ఒక భౌగోళిక ప్రాంతంలోని అరణ్యాలు, పచ్చిక బయళ్లు, ఎడారులు లాంటి భౌమావరణ వ్యవస్థలు; నదులు, సరస్సులు, నదీ ముఖద్వారాలు, తీర ప్రాంతాలు, మహా సముద్ర ప్రాంతాలు లాంటి జలావరణానికి చెందిన విభిన్న ఆవాసాలకు సంబంధించిన జీవ వైవిధ్యం ఉంటుంది. ఇందులో శీతోష్ణస్థితి ప్రముఖ పాత్ర వహిస్తుంది.
ఉదా: భూమధ్యరేఖ వర్షారణ్యంలో జీవ వైవిధ్యం అధికస్థాయిలో ఉండగా, అందుకు భిన్నంగా ఉష్ణ ఎడారులు, ధ్రువ ప్రాంతాల్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.
* ఆహారం, నివాసం, ఆరోగ్యం కోసం అనాదిగా మానవులు భూగోళపు జీవ వైవిధ్యంపై ఆధారపడుతున్నారు.

 

కాలుష్య ప్రభావం
జీవ వైవిధ్యం సహజ, వ్యవసాయ వ్యవస్థల ఉత్పాదకతలను పెంపొందిస్తుంది. ఆధునిక నాగరకత ఫలితంగా ఉత్పన్నమవుతున్న కాలుష్యం మానవుడు నివసిస్తున్న ప్రాంతాలన్నింటిలోని జీవ వైవిధ్యంపై అనేక రకాల వ్యతిరేక ప్రభావాలను చూపుతోంది.
ఉదా: అటవీ ప్రాంతాలను పంట భూములు, రహదారులు, క్వారీలు, గనులుగా మారుస్తున్నారు.
జీవావరణ సమతౌల్యం

ఒక జీవ సంఘంలో కాలానుగుణంగా జీవావరణం ద్వారా క్రమంగా సంభవించే మార్పులుంటాయి. ఇవి మినహా జన్యుపరమైన.. జాతులు, ఆవరణ వ్యవస్థల మధ్య ఉండే జీవ వైవిధ్యం స్థిరంగా ఉండి, అది సహజసిద్ధమైన క్రియాశీల సమతాస్థితిలో ఉంటే, అలాంటి స్థితిని జీవావరణ సమతౌల్యం అంటారు.
* ఈ సమతౌల్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ ప్రభావం మరీ ముఖ్యమైంది.
* భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరగడం, హిమ సంపాతాలు, వరదలు, కరవు కాటకాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఆయా ప్రభావిత ప్రాంతాల్లో జీవావరణ సమతౌల్యాన్ని ప్రభావితం చేస్తాయి.
* జీవావరణ సమతౌల్య పరిరక్షణ కోసం అనుసరణీయ, దీర్ఘకాలిక, శాస్త్రీయ అవలోకనంతో వెంటనే చర్యలు చేపట్టాలి.

 

జాతిపర జీవ వైవిధ్యంలో మ్యాపింగ్
బ్రిట్స్, పాల్ విలియమ్స్, డికీయిర్‌రైట్, చారిస్ హంప్ రేజర్ శాస్త్రవేత్తలు ప్రపంచంలో జీవవైవిధ్య పటాలను మొదటిసారి తయారు చేశారు. వీరు జీవ వైవిధ్య మ్యాప్‌లో 'వరల్డ్ మ్యాప్‌'ను అభివృద్ధి చేశారు. దీనిలో మూడు రకాలున్నాయి.


1. ఆల్ఫా పటాలు (ఆల్ఫా మ్యాప్స్): ఇందులో ప్రత్యేక ప్రాంతాల్లో మొత్తం జాతిపర సంఖ్యలను పొందుపరిచి, విశ్లేషణాత్మకమైన వివిధ ప్రాంతాల్లో జీవ వైవిధ్య అధ్యయన పటాల్లో గుర్తించారు.
 

2. బీటా పటాలు (బీటా మ్యాప్స్): ఇందులో జీవ వైవిధ్య నిర్మాణాలు, జాతిపర నిర్మాణాలు, పోలికలు, సంఘాలు, కొలతలు, ఆవరణ సమతౌల్యంలో జాతిపర మార్పులను ఈ పటాల్లో గుర్తించారు.
 

3. గామా పటాలు (గామా మ్యాప్స్): ఇందులో భౌగోళిక ప్రాంతాల్లో జాతిపర మార్పుల గణాంకాలు, వాటికి అయిన ఖర్చుల్లాంటి వివరాలను ఈ పటాల్లో పొందుపరిచారు.
 

తడి భూభాగాలు (వెట్ ల్యాండ్స్): భూమి ఉపరితలంపై నీటితో ఉన్న ప్రాంతాల్లో ఆవరణ వ్యవస్థలను సంరక్షించడానికి, వివిధ జీవులను, వృక్షాలను, నేలలను, వన్య ప్రాణులను కాపాడటానికి ఈ ప్రాంతాలు ఉపయోగపడతాయి.
రామ్‌సర్ సమావేశం (రామ్‌సర్ కన్వెన్షన్): ఇరాన్‌లో 1971, ఫిబ్రవరి 2న అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యత్వం ఉన్న దేశాలు రామ్‌సర్ ఒప్పందంపై సంతకం చేశాయి. 1975, డిసెంబరు 21న ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కొన్ని తడి ప్రాంతాలను గుర్తించారు. 

 

వన్యమృగ సంరక్షణపై అంతర్జాతీయ సమావేశం
ప్రపంచంలో జరిగిన 5 ప్రధాన అంతర్జాతీయ వన్యప్రాణి సమావేశాల్లో భారత్ పాల్గొంది. మనదేశంలో పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
* అంతర్జాతీయ వ్యాపార అటవీ వృక్ష జాతులు (Flora), జంతు జాతులు (Fauna) సమావేశంలో 1976, జులై 20న భారతదేశం సంతకం చేసింది.
* మానవ, జీవావరణ కార్యక్రమాన్ని (ఎంఏబీ- మ్యాన్ అండ్ బయోడైవర్సిటీ) యునెస్కో 1971లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 2012 నాటికి 117 దేశాల్లో 598 బయోస్ఫియర్ సంస్థలు సభ్యత్వం తీసుకున్నాయి.
* జీవవైవిధ్య సమావేశం 1992, జూన్ 5న రియో డీ జెనీరోలో జరిగింది.

 

భారతదేశంలో జీవవైవిధ్యం
ప్రపంచంలో భారతదేశం 12వ మెగా జీవవైవిధ్య దేశం. మన దేశం ప్రపంచంలో 2.5 శాతం భౌగోళిక వైశాల్యం కలిగి ఉంది. ప్రపంచంలో 7.8 శాతం జాతిపర వైవిధ్యం భారత్ సొంతం. ఇదో రికార్డు. ప్రపంచంలో ఇండో-మళాయన్ అత్యంత విస్తీరణ ప్రాంతం.
* మన దేశంలో వృక్ష సంబంధ జాతులు 46,000 ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 7 శాతం. ఇందులో 33 శాతం వ్యాధుల బారిన పడుతున్నాయి.
* మన దేశంలో సుమారు 15,000 రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 6 శాతం. ఇందులో 1500 రకాలు జాతిపర వ్యాధుల బారిన పడుతున్నాయి.
* దేశంలో సుమారు 81,000 జంతుపర జాతులున్నాయి. ప్రపంచ జంతు సంపదలో ఇది 6.5 శాతం. 

 

* భారత్ 1972లో వన్య మృగ సంరక్షణ చట్టాన్ని చేసింది. అంతకు ముందు 5 జాతీయ హోదా కలిగిన పార్కులు ఉండేవి.
* వన్యమృగ సంరక్షణ సవరణ చట్టాన్ని 2006లో చేశారు. అదే ఏడాది సెప్టెంబరు 4 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా జాతీయ పులుల అటవీ అథారిటీ, వన్యమృగ క్రైమ్ కంట్రోల్ బ్యూరోలను ఏర్పాటు చేశారు.

 

జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళిక
జాతీయ వన్యమృగ బోర్డును 1982లో కేంద్రం ఏర్పాటు చేసింది. మొదటి జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళికను 1983లో ప్రారంభించారు.

 

జాతీయ జీవ వైవిధ్య చట్టం
ఈ చట్టాన్ని 2002లో చేశారు. 2003, అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కిందకు
1. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ (ఎన్‌బీఏ),
2. జాతీయ జీవ వైవిధ్య బోర్డ్(ఎస్‌బీబీ),
3. జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ (బీఎంసీ) వస్తాయి. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ సంస్థను చట్టబద్ధ హోదాతో చెన్నై (2003)లో ఏర్పాటు చేశారు. భారత్‌లోని పలు జీవ వైవిధ్య సంస్థల వివరాలివి..
* వన్యమృగ సంస్థ - 1996లో డెహ్రాడూన్‌లో ఏర్పాటు.
* భారత వన్యమృగ బోర్డు - 2001 డిసెంబరు 7న పునర్‌నిర్మాణం
* జంతు సంక్షేమ డివిజన్లు - 2002 జులై నుంచి అమలు
* జంతు సంక్షేమ జాతీయ సంస్థ (ఎన్ఐఏడబ్ల్యూ) - ఫరీదాబాద్ (1960 చట్టం ప్రకారం ఏర్పడింది)
* బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1890 ఫిబ్రవరి 13న స్థాపించారు
* జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1916 (కోల్‌కతా)లో ఏర్పాటు

 

భారతదేశంలో జీవ వైవిధ్య సంరక్షణలు

ఎలిఫెంట్ ప్రాజెక్టు
1992 ఫిబ్రవరిలో ఎలిఫెంట్ ప్రాజెక్టును స్థాపించారు. దేశంలో ప్రస్తుతం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 32 ఎలిఫెంట్ ప్రాజెక్టులున్నాయి. ఇవి ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉన్నాయి. 

టైగర్ ప్రాజెక్టు
భారత ప్రభుత్వం 1973, ఏప్రిల్ 1న పులుల (టైగర్ రిజర్వ్) ప్రాజెక్టును ప్రారంభించింది. దేశంలో మొదటి ప్రాజెక్టు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్.  

 

బయోస్ఫియర్ రిజర్వ్
ప్రాదేశిక, తీర ప్రాంత ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి యునెస్కో చట్రం కింద మానవ, జీవావరణ కార్యక్రమంలో భాగంగా మనదేశంలో 1986లో బయోస్ఫియర్‌ను స్థాపించారు. దేశంలో మొదటి బయోస్ఫియర్ నీలగిరి. ప్రస్తుతం దేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వ్‌లున్నాయి. వీటిలో 9 ప్రపంచ బయోస్ఫియర్ నెట్‌వర్క్‌లో ఉన్నాయి. దేశంలోని 7 బయోస్ఫియర్‌లను యునెస్కో దత్తత తీసుకుంది. 

 

 

మెరైన్ నేషనల్ పార్క్‌లు

మన దేశంలో 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గుజరాత్ ప్రభుత్వం అటవీశాఖ ఆధ్వర్యంలో గల్ఫ్ ఆఫ్ కచ్‌లో; జామ్‌నగర్ జిల్లా ఓకా, జోదియాల వద్ద 1982లో 270 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో మెరైన్ నేషనల్ పార్కు ప్రారంభించింది. ఇది దేశంలోనే మొదటి జాతీయ మెరైన్ పార్కు.
దేశంలో ప్రధాన ప్రవాళభిత్తిక (కోరల్ రీఫ్) కోసం గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ అఖాతం, గల్ఫ్ ఆఫ్ కచ్, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో ఏర్పాటు చేశారు. వివరాలివి..
1. పాక్ అఖాతం - తమిళనాడు (రామేశ్వరం)
2. గల్ఫ్ ఆఫ్ మన్నార్ - తమిళనాడు (ట్యూటికోరిన్)
3. అండమాన్, నికోబార్ - బంగాళాఖాతం
4. గల్ఫ్ ఆఫ్ కచ్ - గుజరాత్
5. లక్షద్వీప్ - అరేబియా సముద్రం

 

భారతదేశంలోని ప్రవాళ భిత్తికల పరిశోధనా సంస్థలు

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్‌మెంట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్- అహ్మదాబాద్
జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - కోల్‌కతా
కేంద్ర మెరైన్ ఫిషరీస్ పరిశోధన సంస్థ - మదురై
సెంటర్ ఫర్ ఎర్త్ స్టడీస్ - త్రివేండ్రం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ - గోవా

 

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో భారత జాతీయ జలచరం (అక్వాటిక్ ఆనిమల్) ఏది?
ఎ) డాల్ఫిన్ బి) తాబేలు సి) తిమింగలం డి) ఏదీకాదు
జ: (ఎ)

 

2. సమాజంలో అన్ని స్థాయి జీవుల మధ్య విభిన్నతను ఏమంటారు?
ఎ) పర్యావరణం బి) జీవ వైవిధ్యం సి) సమాజం డి) వైవిధ్యం
జ: (బి)

 

3. జీవ వైవిధ్య క్రమానుగత స్థాయులు ఎన్ని రకాలు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
జ: (బి)

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆవరణ వ్యవస్థ - పర్యావరణ క్షీణత

మాదిరి ప్రశ్నలు

1. మేఘమథనం లేదా కృత్రిమ వర్షం కురిపించడానికి వాడే మిశ్రమాలు
    1) డ్రై ఐస్     2) సిల్వర్ అయోడైడ్     3) సాల్ట్ పౌడర్     4) అన్నీ
జ: 4 (అన్నీ)


2. జీవావరణం అత్యధికంగా ఉండే ఆవరణం?
జ: జలావరణం


3. కిందివాటిలో సరైంది.
    a) ఎన్విరాన్ అనే పదం ఫ్రెంచ్ భాష నుంచి వచ్చింది.
    b) ఎన్విరాన్ అంటే చుట్టూ జీవులతో కూడిన ప్రాంతం అని అర్థం.
జ: a, b సరైనవి


4. ఇకాలజీ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన శాస్త్రవేత్త?
జ: హెకెల్


5. కిందివాటిలో స్వయం పోషకాలు?
   1) వినియోగదారులు     2) విచ్ఛిన్నకారులు    3) ఉత్పత్తిదారులు     4) ఏదీకాదు
జ: 3 (ఉత్పత్తిదారులు)


6. పత్రాలు, పుస్తకాలు పసుపు రంగులోకి మారడానికి కారణం?
జ: సల్ఫర్ డై ఆక్సైడ్


7. జీవావరణ పిరమిడ్‌ను తయారుచేసిన శాస్త్రవేత్త
జ: చార్లెస్ హెల్టన్


8. అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించే ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంది?
జ: స్ట్రాటో ఆవరణం


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడటానికి కారణం? (పోలీస్ కానిస్టేబుల్ 2016, సబ్ ఇన్‌స్పెక్టర్ 2018)
జ: క్లోరోఫ్లోరో కార్బన్లు


2. ఆవరణ వ్యవస్థ ఆహార గొలుసు పిరమిడ్ మొదటి మెట్టులో ఉండేది? (గ్రూప్-1, 2017)
జ: ఉత్పత్తిదారులు


3. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఉపయోగించినవారు? (ఏఈ, 2015)
జ: ట్రాన్స్‌లే


4. కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి.
    a) అతినీలలోహిత కిరణాలు సూర్యుడి నుంచి భూఉపరితలానికి చేరతాయి.
    b) పరారుణ కిరణాలు భూఉపరితలం నుంచి పరావర్తనం చెందుతాయి.
జ: a, b సరైనవి


5. ఆమ్ల వర్షానికి కారణమయ్యే వాయువు (గ్రూప్-4, 2012; డీఎస్సీ 2017)
జ: సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్


 

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూకంపాలు - భూపాతాలు

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భూకంపాలు అతి తీవ్రంగా సంభవించే జోన్ -V లో ఉన్న ప్రాంతం ఏది? (ఏఎస్‌వో - 2017)
జ: షిల్లాంగ్

 

2. ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీల శాతం ఎంత? (గ్రూప్ - 4, 2012)
జ: 8 శాతం

 

3. హిమాలయ ప్రాంతంలో భూకంపాలు రావడానికి కారణం? (గ్రూప్ - 1, 2017, ఏపీ)
జ: భూపటంలో పలకలు ఢీకొట్టడం

 

4. భూకంప సమయంలో ఏ నేల ఎక్కువగా ప్రకంపిస్తుంది? (హాస్టల్ వెల్ఫేర్ - 2017)
జ: మెత్తటి నేల

 

5. కొండ చరియలు తరచుగా ఏ రాష్ట్రంలో విరిగి పడతాయి? (గ్రూప్ - 2, 2016)
జ: ఉత్తరాఖండ్

 

మాదిరి ప్రశ్నలు

 

1. భారత ప్రాదేశిక విస్తీర్ణంలో ఎంత శాతం భూకంప దుర్బలత్వం ఉంది?
జ: 59%

 

2. ఉరుములు, మెరుపులను గుర్తించే సాధనం?
జ: లైట్నింగ్ డిటెక్టర్

 

3. దిల్లీ, హైదరాబాద్‌లు ఏ భూకంప జోన్‌లలో ఉన్నాయి?
జ: జోన్ - 4, 2

 

4. కిందివాటిలో దేన్ని నియంత్రించడానికి 'లాండ్ స్త్లెడ్ జోనేషన్ మ్యాపింగ్ పద్ధతి'ని ఉపయోగిస్తారు?
     1) భూకంపాలు       2) కొండచరియలు విరిగిపడటం      3) హిమపాతాలు      4) సహజ అటవీ కార్చిచ్చు
జ: 2 (కొండచరియలు విరిగిపడటం)

 

5. హిమలయ ప్రాంతాల్లో తరచుగా హిమపాతాలు ఎక్కడ సంభవిస్తాయి?
     1) జమ్మూకశ్మీర్      2) హిమాచల్‌ ప్రదేశ్      3) ఉత్తరాఖండ్      4) అన్నీ

జ: 4 (అన్నీ)            

                                                 

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చక్రవాతాలు - సునామీ

ప్రపంచంలో చక్రవాతాల ప్రభావం 21% ఉండి ఆయాదేశాల్లో అధిక నష్టాన్ని కలిగిస్తుంది. భూ ఉపరితలంపై ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి (1970) పరిశీలిస్తే గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అమెరికా, చైనా, ఫిలిప్పీన్స్ దేశాలు అత్యధిక చక్రవాతాలకు గురవుతున్నాయి. అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టం ఆసియా ఖండంలోని బంగ్లాదేశ్‌లో సంభవించింది. 1970, నవంబరు 12న బంగ్లాదేశ్‌లో సంభవించిన 'బోలా' తుపాన్ వల్ల 5 లక్షల మంది మరణించారు.
* భూ ఉపరితలం 71% నీటితో విస్తరించి 5 మహాసముద్రాలుగా విభజితమైంది. ఈ మహాసముద్రాల పరిధిలో 177 దేశాలు తీరప్రాంతాలతో విస్తరించి ఉండటం వల్ల వాటిపై చక్రవాతాల ప్రభావం అధికంగా ఉంటుంది. చక్రవాతాలను అల్పపీడన ద్రోణి లేదా వాయుగుండం అంటారు. ఇవి 98% సముద్రాలు, 2% భూ ఉపరితలంపై నుంచి ప్రయాణిస్తాయి.

చక్రవాతం
       చక్రవాతాన్ని సైక్లోన్ అంటారు. ఈ పదాన్ని మొదటగా హెన్రీ పిడింగ్‌టన్ ఉపయోగించారు. సైక్లోన్ గ్రీకు భాషా పదమైన 'కైక్లోన్' నుంచి వచ్చింది. కైక్లోన్ అంటే తిరుగుతున్న నీరు లేదా చుట్టుకున్న పాము అని అర్థం.

చక్రవాతం/సైక్లోన్ ఏర్పడే విధానం
       సముద్రాలపై అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడే ప్రాంతంలో నీరు వేడెక్కి, వ్యాకోచించి అల్పపీడనంగా మారుతుంది. ఈ అల్పపీడనం వైపు నలు దిశల నుంచి అధిక పీడన వ్యవస్థలు కేంద్రీకృతం కావడాన్ని చక్రవాతం అంటారు. చక్రవాతాలు జేర్కిన్ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటాయి.
జేర్కిన్ సిద్ధాంతం ప్రకారం చక్రవాతాలు 2 రకాలు
అవి: 1) ఉష్ణమండల చక్రవాతాలు
       2) సమశీతోష్ణ చక్రవాతాలు  

 

ఉష్ణమండల చక్రవాతాలు (Tropical Cyclones): ఇవి 0o - 23o  కర్కట, మకరరేఖల మధ్య అధిక ఉష్ణోగ్రతల వల్ల సంభవిస్తాయి. ప్రపంచంలో వీటి ప్రభావం 90% వరకు ఉంటుంది.
సమశీతోష్ణ చక్రవాతాలు (Temperate Cyclones): ఇవి 35o - 66o  ఆర్కిటిక్, అంటార్కిటిక్ మధ్య ప్రాంతంలో సంభవిస్తాయి.
* ఈ విధంగా భూమధ్య రేఖ నుంచి ఉష్ణ వాయురాశులు, ధృవాల నుంచి శీతల వాయురాశులు వీస్తాయి. ఈ ఉష్ణ, శీతల వాయురాశులు కలిసే ప్రాంతాన్నే 'వాతాగ్రం' అంటారు. దీని వద్ద గాలి అవ్యవ్యాకోచం చెంది ఉరుములు, మెరుపులు ఏర్పడే ప్రాంతాన్ని 'కేంద్రకుడ్యం' అంటారు. అది తీర ప్రాంతంలో తుపాన్‌గా మారడాన్ని 'లాండ్‌ఫాల్' అంటారు. చక్రవాతం ఏర్పడే ప్రాంతం వద్ద వ్యాసం 30 కి.మీ. - 370 కి.మీ., గాలివేగం గంటకు 31 కి.మీ. - 221 కి.మీ. వరకు ఉంటుంది.

* అమెరికాలో 2017, సెప్టెంబరులో ఇర్మా తుపాన్ 279 కి.మీ./గంట; ఒడిశాలో 1999, అక్టోబరులో 268 కి.మీ./గంట వేగంతో సైక్లోన్ సంభవించింది.

సైక్లోన్ మండలాలు
        ప్రపంచంలో ప్రతి ఏడాది సగటున 97 తుపాన్లు సంభవిస్తున్నాయి. వీటి ఉద్ధృతి మే, నవంబరు నెలల మధ్య ఉంటుంది. ఉద్ధృతిని బట్టి ఆయా దేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.

టోర్నడో: ఇది ప్రపంచంలోనే అత్యంత భయానకమైంది. 98% టోర్నడోలు అట్లాంటిక్ మహాసముద్రం, అమెరికాలో సంభవిస్తాయి. స్పానిష్ భాషలో టోర్నడో అంటే 'ఉరుముల తుపాన్' అని అర్థం. దీని వేగాన్ని, తీవ్రతను 'ఫుజితా స్కేలు' తో కొలుస్తారు.

తుపాన్
భారతదేశానికి మూడువైపుల సముద్రం ఉండి, 7516 కి.మీ. మేర తీరరేఖ వ్యాపించి ఉంది. దేశ భౌగోళిక వైశాల్యంలో ప్రధాన తీర ప్రాంత భూభాగం 5400 కి.మీ., అండమాన్ నికోబార్ దీవులు 1900 కి.మీ., లక్షదీవులు 132 కి.మీ. మేర తుపాన్ తీవ్రతను కలిగి ఉన్నాయి.
       ప్రపంచ ఉష్ణమండల తుపాన్లలో భారత తీరప్రాంతంలో సంభవించే తుపాన్లు 10% కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి. మన దేశంలో సగటున ఏటా 6 తుపాన్లు సంభవిస్తున్నాయి. వీటి తీవ్రత మే - జూన్; అక్టోబరు - నవంబరు మధ్య ఎక్కువగా ఉంటుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపాన్ల తీవ్రత 4 : 1 నిష్పత్తిలో ఉంటుంది. ప్రధానంగా బంగాళాఖాతం పరిధిలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బంగలోనూ; పుదుచ్చేరి తూర్పు తీరంలోనూ; పశ్చిమ తీర ప్రాంతం (అరేబియా సముద్రం) పరిధిలోని గుజరాత్‌లోనూ తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తుపాన్ వచ్చినప్పుడు సముద్రంలోని అలలు 6 మీ. ఎత్తుకు లేస్తాయి. వీటిని గుర్తించడానికి టైడ్‌గేజ్ నెట్‌వర్క్ లేదా రాడార్‌లను ఉపయోగిస్తారు.
       ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లో 974 కి.మీ. మేర బంగాళాఖాత తీరరేఖ వ్యాపించి ఉంది. ఈ ప్రాంతంలోని 44% భూభాగం తుపాన్ ప్రభావానికి గురవుతుంది. వీటి వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో అక్టోబరు డిసెంబరు మధ్య అధిక నష్టం వాటిల్లుతుంది. తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రం కాబట్టి దీనిపై తుపాన్ ప్రభావం ఉండదు.

ఇటీవల ఏర్పడిన తుపాన్లు
* 2017 సెప్టెంబరులో ఫ్లోరిడా, క్యూబా దేశాల్లో - ఇర్మా హరికేన్,
* 2016 డిసెంబరులో దక్షిణ భారత్, అండమాన్, థాయిలాండ్‌లలో - వార్ధా తుపాన్,
* 2015 ఆగస్టులో భారత్, బంగ్లా, బర్మా దేశాల్లో - కొమెన్ తుపాన్,
* 2014 అక్టోబరులో విశాఖపట్నం, నేపాల్‌లో - హుద్‌హుద్ తుపాన్ సంభవించాయి.

సునామీ
      సముద్ర అంతర్భాగంలో భూకంపాలు ఏర్పడినప్పుడు అలలు తీరప్రాంతాన్ని చేరి తుపానుగా మారడాన్నే 'సునామీ' అంటారు. ఆ సమయంలో అలలు పదుల అడుగుల ఎత్తులో పైకి ఎగసి తీరప్రాంతంలోని భూభాగాన్ని తీవ్ర నష్టానికి గురిచేస్తాయి. ఒక పెద్ద భూకంపం తర్వాత సునామీ ముప్పు అనేక గంటలపాటు ఉంటుంది. ఆ సమయంలో ప్రమాదకరమైన పెద్ద అలలు ఏర్పడతాయి.
* సునామీ అనే పదం జపనీస్ భాష నుంచి వచ్చింది. జపాన్ భాషలో 'సు' (Tsu) అంటే రేవు/సముద్రం, 'నామి' (Nami) అంటే అలలు/తరంగం/కెరటాలు అని అర్థం. సముద్ర ఉపరితల నీరు తరంగాల ద్వారా ఉప్పొంగడాన్నే సునామీగా భావిస్తారు.
* సునామీలను జపాన్‌లో హర్బర్ వేవ్, ఆంగ్లంలో సిస్మిక్ సీ వేవ్, తెలుగులో సముద్ర ఉప్పెన, తమిళంలో అజిహిపెరాలై అని అంటారు.
* సునామీ వచ్చినప్పుడు సముద్ర ఉపరితలంపై రెండు శృంగాల మధ్య దూరం 100 కి.మీ., తరంగాల ఎత్తు 30 మీ., తరంగ ప్రయాణ వేగం 800 కి.మీ./గంట ఉంటుంది. మైదాన ప్రాంతంలో సునామీ గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఇవి ఏ సమయంలోనైనా సంభవించవచ్చు.

కారణాలు:
1. సముద్రంలో భూకంపాలు ఏర్పడటం.
2. అగ్ని పర్వతాలు పేలడం.
3. కొండ చరియలు (భూపాతాలు) విరిగిపడటం.

     వీటిలో 80% సునామీలు భూకంపాల వల్ల వస్తాయి. ఈ కారణాల వల్ల పెద్దపెద్ద అలలు ఏర్పడి తీరప్రాంతాలను అతలాకుతలం చేయడాన్ని 'సునామీ' అంటారు.

విస్తరణ:
* 75% సునామీలు పసిఫిక్ మహాసముద్రం, దాని దీవుల్లో సంభవిస్తున్నాయి. అందువల్ల పసిఫిక్‌ను 'అగ్నివలయం' (Ring Fire) అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో అధికంగా సుగామీచే, హవాయి దీవులు, జపాన్, ఓషియానీయ దీవులు ఉంటాయి.
* 25% మధ్యదరా, కరేబియన్, పశ్చిమ, తూర్పు పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రంలో సంభవిస్తున్నాయి.
ఉదా: అమెరికాలోని అలస్కా, హవాయి దీవుల్లోని 'హిలో' అనే ప్రాంతంలో ఎత్తయిన అలలతో తీవ్రమైన సునామీలు సంభవిస్తాయి.


భారతదేశంలో సునామీ
       మనదేశంలో సునామీ తీవ్రత హిందూ మహాసముద్ర ప్రభావం వల్ల 1% మాత్రమే ఉంటుంది. దేశం మొత్తం తీరప్రాంతంలో 300 కి.మీ. పొడవున దీని ప్రభావం ఉంది.
* తూర్పుతీర బంగాళాఖాతంలో తమిళనాడు నుంచి అండమాన్ - నికోబార్, ఇండోనేషియా దీవుల వరకు; పశ్చిమ తీర అరేబియాలో గుజరాత్, పాక్ మాక్రీన్ దీవుల నుంచి మాల్దీవుల వరకు ఉంటుంది.
ఉదా: 2004, డిసెంబరు 26న రిక్టర్ స్కేలుపై 9.0 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల హిందూ మహాసముద్రంలో సునామీ ఏర్పడింది. దీని వల్ల 11 దేశాల్లో మొత్తం 2,30,000 ప్రాణనష్టం జరిగింది. భారత్‌లో అండమాన్ దీవులు, తమిళనాడులోని కడలూర్ జిల్లా అత్యధిక నష్టానికి గురయ్యాయి.
* 2011, మార్చి 11న జపాన్‌లో ఫుకుషిమా వద్ద పెద్ద సునామీ వచ్చింది.

నివారణ చర్యలు:
* 1920లో మొదటిసారిగా హవాయి దీవుల్లో సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
* 1946లో 'పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్‌'ను హవాయి దీవుల్లోని హోనొలులు సమీపాన ఏర్పాటు చేశారు.
* 1999లో హైదరాబాద్ కేంద్రంగా ఎర్త్ మినిష్టర్ ఆధ్వర్యంలో 'ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్‌మేషన్ సర్వీస్' (INCOIS) ను ప్రారంభించారు. ఇది పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్ర సమాచారాన్ని అందిస్తుంది.
* సునామీలను ముందుగా గుర్తించడానికి ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో హెచ్చరికలు జారీ చేయవచ్చు. కేబుళ్ల ద్వారా భూమికి అనుసంధానం చేసిన సునామీ డిటెక్టర్లను సముద్రంలో 50 కి.మీ. అడుగున ఉంచుతారు. ఇవి ఉపరితల అలజడులను గుర్తించి ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.
* 2015 డిసెంబరులో తొలి విపత్తు ఎఫ్ఎం (107.8) రేడియోను తమిళనాడులోని కడలూర్‌లో ప్రారంభించారు.

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చక్రవాతాలు - సునామీ

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
a) స్పానిష్ భాషలో టోర్నడో అంటే 'ఉరుముల తుపాన్' అని అర్థం.
b) గ్రీకు భాషలో కైక్లోన్ అంటే 'తిరుగుతున్న నీరు' అని అర్థం.
జ: a, b సరైనవి

 

2. కిందివాటిని జతపరచండి.
ప్రాంతాలు                              సైక్లోన్

a) జపాన్, చైనా                      i) బ్లిజార్డ్స్

b) ఆస్ట్రేలియా                       ii) హరికేన్లు

c) వెస్టిండీస్                        iii) విల్లీ - విల్లీ

d) అంటార్కిటికా                    iv) టైఫూన్లు

                                    v) టోర్నడోలు

జ: a-iv, b-iii, c-ii, d-i

 

3. దేశంలో తొలి విపత్తు రేడియోను ఎక్కడ ఏర్పాటు చేశారు?
జ: కడలూర్

 

4. ప్రపంచ చక్రవాతాల్లో భారతదేశ తీర ప్రాంతంలో ఎంత శాతం తుపాన్లు సంభవిస్తున్నాయి?
జ: 10%

 

5. సునామీలు ఎక్కువగా ఎప్పుడు సంభవిస్తాయి?
  1) పగలు         2) రాత్రి       3) పగలు, రాత్రి         4) అన్ని వేళల్లో
జ: 4 (అన్ని వేళల్లో)

 

6. పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ఎక్కడ ఉంది?
జ: హోనొలులు

 

7. 2017 సెప్టెంబరులో ఫ్లోరిడా, క్యూబాను తీవ్రంగా నష్టపరిచిన హరికేన్?
జ: ఇర్మా

 

8. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుపాన్లు ఏ నిష్పత్తిలో సంభవిస్తాయి?
జ: 4 : 1

 

గత పోటీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. 2011, మార్చి 11న ఏ దేశంలో సంభవించిన సునామీ వల్ల వేలాది మంది మరణించారు?  (గ్రూప్ - 4, 2012)

జ: జపాన్
 

2. భారతదేశంలో ఎంత మేర తీరప్రాంతం తుపాన్లు, గాలివానలు, సునామీలకు గురవుతుంది? (గ్రూప్ - 4, 2012)
జ: 5700 కి.మీ.

 

3. సముద్రాల్లో సునామీ సంభవించినప్పుడు దాని తరంగ/అలల ప్రయాణ వేగం ఎంత? (పంచాయతీ సెక్రటరీ, 2013)
జ: 800 కి.మీ./గంట

 

4. 1999లో ఒడిశాలో సంభవించిన తీవ్ర తుపాన్ వేగం ఎంత? (హాస్టల్ వెల్ఫేర్, 2017)
జ: 260 - 270 కి.మీ./గంట

 

5. కిందివాటిలో విపత్తు కానిది? (ఏఎస్‌వో - 2017, ఏపీ)
     1) ప్రాణ నష్టంలేని తుపాన్              2) ఆర్థిక నష్టంలేని తుపాన్
     3) ప్రాణ, ఆర్థిక నష్టంలేని తుపాన్     4) గాలి లేని, వర్షాలకు కారణమయ్యే అల్పపీడన ద్రోణి
జ: 4 (గాలి లేని, వర్షాలకు కారణమయ్యే అల్పపీడన ద్రోణి)

 

6. ఉష్ణమండల తుపాన్లను గుర్తించడానికి ఉపయోగించే సాధనం? (ఏఎస్‌వో - 2017)
జ: తీరప్రాంత రాడార్‌లు

 

7. 2014లో విశాఖపట్టణాన్ని తీవ్రంగా నష్టపరిచిన తుపాన్? (డీఎల్ - 2017)
జ: హుద్‌హుద్

 

8. జపాన్ భాషలో సునామీ అంటే? (డిప్యూటీ సర్వేయర్ - 2017)
జ: హర్బర్ వేవ్


 

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు నిర్వహణ చట్టం - 2005

మాదిరి ప్ర‌శ్న‌లు

1. పారిశ్రామిక రసాయన విపత్తులు ఏ నోడల్ మంత్రి నిర్వహణలో ఉంటాయి?
జ: పర్యావరణ, అటవీ మంత్రి

 

2. ఆసియా విపత్తుల ప్రతిస్పందన సంస్థ ఎక్కడ ఉంది?
జ: బ్యాంకాక్

 

3. NDRF 10వ బెటాలియన్ ఎక్కడ ఉంది?
జ: విజయవాడ

 

4. విపత్తుల్లో జిల్లా ప్రణాళిక విపత్తు అభివృద్ధి స్థాయి
జ: L1

 

5. 2015, సెప్టెంబరు 25న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సదస్సు (SDG)ను ఎక్కడ నిర్వహించారు?
జ: న్యూయార్క్

 

6. 2015 - 2030 వరకు జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక విపత్తు కుదింపులో ఎన్ని లక్ష్యాలను పేర్కొంది?
జ: 14

 

7. కిందివారిలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీలో (NDMA) సభ్యులు కానివారు?
1) జె.సి. పంత్                 2) డి.ఎన్. శర్మ
3) ఎన్.సి మర్వా             4) కమల్ కిశోర్
జ: 1 (జె.సి. పంత్)

 

8. NRSA భూతల కేంద్రం (ఎర్త్ స్టేషన్) ఎక్కడ ఉంది?
జ: షాద్‌నగర్

 

9. ఇటీవల 2015 అంతర్జాతీయ (UNO) విపత్తు కుదింపు సదస్సు ఎక్కడ జరిగింది?
జ: జపాన్ - సెండాయ్

 

10. ఇటీవల విపత్తు నిర్వహణలో నూతనంగా ఏర్పాటు చేసిన NDRF దళం
జ: SSB

 

11. జాతీయ నిర్వహణ విపత్తు కమిటీ ఛైర్మన్
జ: హోంశాఖ కార్యదర్శి

 

12. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ ఛైర్మన్
జ: క్యాబినేట్ కార్యదర్శి

 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారతదేశంలో ఎన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు విపత్తులను ఎదుర్కొంటున్నాయి? (2011, గ్రూప్ 1)
జ: 25

 

2. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎక్స్ అఫీషియో ఛైర్మన్? (2011, గ్రూప్ 2)
జ: ప్రధానమంత్రి

 

3. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) ఎవరి నిర్వహణలో ఉంటుంది? (2016, గ్రూప్ 2)
జ: హోంమంత్రి

 

4. జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP)ను ప్రధాని ఎప్పుడు విడుదల చేశారు? (2016 డిప్యూటీ సర్వేయర్)
జ: 2016, జూన్ 1

 

5. సార్క్ విపత్తు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (2012, గ్రూప్ 4)
జ: కాఠ్‌మాండూ

 

6. నేషనల్ సివిల్ డిఫెన్స్ సర్వీస్ కాలేజ్ ఎక్కడ ఉంది? (2012, గ్రూప్ 4; 2013, పంచాయతీ సెక్రటరీ)
జ: నాగ్‌పుర్

 

7. జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? (2011, గ్రూప్ 1)
జ: 2005, డిసెంబరు 23

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప‌ర్యావ‌ర‌ణ ఉద్యమాలు

పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యాలుగా తెలంగాణలో పలు సామాజిక ఉద్యమాలు జరిగాయి. వీటిలో నల్గొండ జిల్లాలో యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా.. రాజధాని నగరంలో మూసీ నది ప్రక్షాళన దిశగా నిర్వహించిన ఉద్యమాలు ప్రధానమైనవి. స్థానికుల నుంచి వ్యక్తమైన నిరసనలు ఉద్యమాలుగా మారాయి. వీటికి పలు సంస్థలు, ప్రముఖుల నుంచి మద్దతు లభించడంతో కొంతమేర విజయవంతమయ్యాయి. 
                   మన దేశంలో పర్యావరణ ఉద్యమాలు గ్రామస్థాయి నుంచి 1970లలోనే ప్రారంభమయ్యాయి. 1980వ దశకం నుంచి తెలంగాణలో సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. 1990వ దశకం నుంచి ఉద్యమాలు తీవ్రమయ్యాయి. ప్రపంచీకరణ, నయా ఉదారవాదం పేర్లతో చోటు చేసుకున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పర్యావరణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. ప్రాంతీయంగా కూడా పర్యావరణం, మానవ హక్కుల పరిరక్షణ దిశగా సాగిన సామాజిక ఉద్యమాలు అనేక అంశాలను లేవనెత్తాయి. ఇలాంటి ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా.. ఒక ఆశయం కోసం పనిచేస్తాయి. ప్రజాస్వామిక విధానాల్లోనే కార్యక్రమాలను రూపొందిస్తాయి.

 

యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం
భారత యురేనియం సంస్థ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - యూసీఐఎల్) తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జున జలాశయం సమీపంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు గుర్తించింది. దీని సమీప గ్రామాల్లో సుమారు 1303 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు యూసీఐఎల్ నిర్ధారించింది. 2001 ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం మైనింగ్, శుద్ధి కర్మాగారాన్ని స్థాపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది.
* 2002 సెప్టెంబరులో నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంభాపురం గ్రామాల్లో యురేనియం గనుల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద 795 ఎకరాల్లో సుమారు రూ.315 కోట్లతో దాదాపు 20 ఏళ్ల వరకు తవ్వకాలు చేయడానికి నిర్దేశించింది. అనుమతుల అనంతరం నమూనాల కోసం తవ్వకాలను ప్రారంభించడంతో అప్పట్లో స్థానికులు దీన్ని వ్యతిరేకించారు.
* 2005లో దేవరకొండ పరిధిలో యురేనియం తవ్వకాలకు ప్రయత్నించగా అక్కడి స్థానికుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో తవ్వకాలను నిలిపివేశారు. 2006లో 'యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం' అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పెద్దఎత్తున స్థానికులు ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమానికి గిరిజన సమాఖ్య అధ్యక్షుడు రవీంద్రనాయక్ మద్దతు తెలిపారు. పర్యావరణవేత్తలు, జన విజ్ఞాన వేదిక, పౌరహక్కుల సంఘం నాయకులు కూడా మద్దతిచ్చారు.
* 2007లో లంభాపురం, పెద్దగట్టు, శేరుపల్లి, చిట్రియాల, పెద్దమూల, కాచరాజుపల్లి గుట్టల్లోని అటవీ ప్రాంతంలో దేశ రక్షణ, అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే యురేనియం నిక్షేపాలున్నట్లు యురేనియం సంస్థ పరిశోధనలో తేలింది. దీంతో 2007లో మళ్లీ యురేనియం శుద్ధి కర్మాగార నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులను అక్కడి స్థానికులు పెద్దఎత్తున అడ్డుకున్నారు. ప్రజలకు మద్దతుగా 20 స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఇది చివరికి ప్రజా ఉద్యమంగా మారి నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనుకంజ వేసి పనులను వాయిదా వేసింది.

 

మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమం
1980వ దశకం నుంచి హైదరాబాద్ నగర శివార్లలో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించాయి. దీంతో పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలన్నీ మూసీ నదిలో కలవడం వల్ల అది ఒక మురికి కాలువగా మారింది. వాస్తవంగా.. మూసీ నది హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తుండటం వల్ల నగర ప్రజల తాగునీటి అవసరాలకు ఉద్దేశించి దీని ఉపనదిపై హుస్సేన్‌సాగర్ సరస్సును పూర్వకాలంలో నిర్మించారు. అయితే కాలక్రమేణా ఈ నీరు కలుషితమైంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రతిరోజూ జంట నగరాల నుంచి 350 మిలియన్ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్థ పదార్ధాలు కలుస్తున్నట్లు గత పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో 1986లో డాక్టర్ కిషన్‌రావు, కె.పురుషోత్తమ్‌రెడ్డిల ఆధ్వర్యంలో 'సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్' అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి స్థానిక ప్రజలను కూడగట్టారు. ఇతర పర్యావరణ సంఘాలతో కలిసి మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజల జీవించేహక్కును కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1988లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఫలితంగా కొన్ని పరిష్కారాలను కనుక్కున్నారు. 1989లో హానికరమైన వ్యర్థపదార్ధాల నిర్వహణ, నిల్వ, పరిష్కారాల కోసం 'హానికరమైన వ్యర్థపదార్థాల' నియమావళిని ప్రభుత్వం రూపొందించింది. ఈమేరకు ఉద్యమం కొంత విజయం సాధించింది.
* 2000లో మూసీ నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీట్ కాలువ ద్వారా ప్రవహింపజేసి.. నదీ జలాల ప్రాంతాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించి తెలుగుదేశం ప్రభుత్వం 'నందనవనం' అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది సమీపంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించింది. దీంతో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 'మూసీ బచావో ఆందోళన్' అనే నినాదంతో స్థానిక సామాజిక సంస్థలు ఉద్యమం చేపట్టాయి. దీనికి పర్యావరణవేత్త మేధా పాట్కర్ మద్దతు ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది.
* 2000, జూన్ 24న 'ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్' అనే సంస్థను ప్రారంభించారు. ఈ ఫోరమ్ కన్వీనర్ ఎం.వేదకుమార్ ఆధ్వర్యంలో 'హైదరాబాద్ బచావో' అనే పర్యావరణ ఉద్యమం మొదలైంది. 2006, నవంబరు 21న కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు పురానా పూల్ వంతెన నుంచి అంబర్‌పేట వరకు పాదయాత్ర చేపట్టారు. వీరితో పాటు నగరంలోని ఛత్రీ, గమన అనే రెండు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి.
* 2007లో మూసీనదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ జలమండలి మూసీ నది పొడవునా దశలవారీగా మురుగు శుద్ధి, ప్రక్షాళన పనులను చేపట్టడానికి 10 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను సిద్ధం చేసింది. అయితే వీటివల్ల అక్కడి జనావాసాలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయని 'సేవ్ మూసీ రివర్ క్యాంపైన్' పేరుతో స్థానిక పర్యావరణ సెల్ 2009, జూన్ 2న ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమానికి మద్దతుగా సేవ్ లేక్స్ సొసైటీ, సేవ్ రాక్స్ సొసైటీ, అక్షర, ప్రజా చైతన్య వేదిక, పుకార్, చెలిమి ఫౌండేషన్, హెరిటేజ్ వాచ్ లాంటి పర్యావరణ సంఘాలు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచాయి.
* 2009 నుంచి నగరం వేగంగా విస్తరిస్తున్న కొద్దీ మూసీ నది పరివాహక ప్రాంతాలు రియాల్టర్లు, కబ్జాదారుల ఆక్రమణలకు గురవుతూ వస్తున్నాయి. మలక్‌పేట, హిమాయత్‌నగర్, అజ్గంపురా, కాచీగూడ ప్రాంతాల్లో మూసీ నది ఆక్రమణలకు గురైంది. ముఖ్యంగా ఒక సంస్థ నదీ పరివాహ ప్రాంతాన్ని కబ్జాచేసి వేసిన వెంచర్ చుట్టూ ప్రహరీగోడను నిర్మించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు 'మూసీ బచావో' పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు. పలువురు నాయకులు, ప్రజా సంఘాలు దీనికి మద్దతు తెలిపాయి. ఈ ఉద్యమకారుల డిమాండ్‌కు స్పందించి జీహెచ్ఎంసీ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది.
* తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించడానికి పర్యావరణ నిర్వహణ ద్వారా ఆర్ధిక వృద్ధి సాధించడమే లక్ష్యం. - టీఎస్ పీసీబీ విజ‌న్‌

 

మాదిరి ప్రశ్నలు

1. తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఎవరు?
ఎ) జోగు రామన్న బి) అజ్మీరా చందూలాల్ సి) జూపల్లి కృష్ణారావు డి) కొప్పుల ఈశ్వర్
జ: (ఎ)

 

2. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ ఎవరు?
ఎ) బహుగుణ బి) రాజీవ్‌శర్మ సి) అనురాగ్‌శర్మ డి) ఎ.కె.చాందా
జ: (బి)

 

3. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 2014, జులై 6 బి) 2015, జులై 6 సి) 2014, ఆగస్టు 6 డి) 2015, ఆగస్టు 6
జ: (ఎ)

 

4. ప్రాంతీయ సామాజిక ఉద్యమాలు ఏ దశకం నుంచి ప్రారంభమయ్యాయి?
ఎ) 1980 బి) 1990 సి) 2000 డి) 1970
జ: (ఎ)

 

5. తెలంగాణలో యురేనియం నిక్షేపాలున్న జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి బి) మహబూబ్‌నగర్ సి) నల్గొండ డి) మెదక్
జ: (సి)

 

6. 'సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్' అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 1986 బి) 1987 సి) 1988 డి) 1989
జ: (ఎ)

 

7. 'ఛత్రీ, గమన, పుకార్, చెలిమి' అనేవి ఏమిటి?
ఎ) వ్యాపార సంస్థలు బి) ప్రకటన సంస్థలు సి) స్వచ్ఛంద సంస్థలు డి) ప్రభుత్వ సంస్థలు
జ: (సి)

 

8. మూసీనది కాలుష్య వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇచ్చిన పర్యావరణవేత్త ఎవరు?
ఎ) బాబా ఆమ్టే బి) మేధా పాట్కర్ సి) రాజేంద్ర సింగ్ డి) బహుగుణ
జ: (బి)

 

9. 2000, జూన్ 24న ఏర్పడిన 'ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్' కన్వీనర్ ఎవరు?
ఎ) ఎం.వేదకుమార్ బి) డాక్టర్ కిషన్‌రావు సి) కె.పురుషోత్తంరెడ్డి డి) రామారావు
జ: (ఎ)

 

10. నల్గొండలో యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమానికి మద్దతునిచ్చిన గిరిజన సమాఖ్య నాయకుడు ఎవరు?
ఎ) రవీంద్రనాయక్ బి) నాగేశ్వర్‌రావు సి) వీరేంద్రనాయక్ డి) ధరేంద్రసింగ్
జ: (ఎ)

 

11. నల్గొండ జిల్లాలో 'యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం' అనే స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 2005 బి) 2006 సి) 2007 డి) 2008
జ: (బి)

 

12. మూసీ నది వెంబడి ఉద్యానవనం అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన ప్రాజెక్టు ఏది?
ఎ) హరితపత్రం బి) నందనవనం సి) మిత్రవనం డి) జలవనమండలి
జ: (బి)

 

13. 2006 నవంబరు 21న హైదరాబాద్‌లో కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు 'హైదరాబాద్ బచావో' అనే నినాదంతో పాదయాత్ర ఎక్కడ నిర్వహించారు?
ఎ) మియాపూర్ నుంచి ఎల్బీనగర్ బి) జూబ్లీహిల్స్ నుంచి ఫలక్‌నుమా సి) పురానా పూల్ నుంచి అంబర్‌పేట డి) అంబర్‌పేట నుంచి మలక్‌పేట
జ: (సి)

 

14. 'వాటర్ మెన్ ఆఫ్ ఇండియా, జోహడ్ వాలా బాబా' అనే బిరుదులు ఎవరివి?
ఎ) వందనా శివా బి) సునీతా నారాయణ్ సి) అన్నాహజారే డి) రాజేంద్రసింగ్
జ: (డి)

 

15. టైమ్ మ్యాగజైన్ 'పర్యావరణ హీరో'గా ఎవరిని అభివర్ణించింది?
ఎ) సునీతా బి) అన్నాహజారే సి) వందనాశివ డి) మాధవ్ ప్రియదాస్
జ: (సి)

 

16. 'జలమందిర్ యాత్ర' పేరుతో గుజరాత్‌లో ప్రజలను చైతన్యపరిచిన జానపద గాయకుడు ఎవరు?
ఎ) రామ్‌బియా బి) మాధూరిప్రియ సి) రామ్‌లీలావాలా డి) మనోహర్‌బియా
జ: (ఎ)

 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సామాజిక ఉద్యమాలు

సామాజిక ఉద్యమాల ప్రధాన లక్ష్యం మార్పు. అంటే.. ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి మార్పును ఆశించడం. మన దేశంలో ఇలాంటి సామాజిక ఉద్యమాల పరిధి విస్తృతం. దానికి ప్రధాన కారణం మన దేశ సామాజిక వ్యవస్థ స్వభావం. ప్రపంచంలోని చాలా దేశాల కంటే భిన్నమైన సామాజిక నిర్మాణం మనది.
1960వ దశకం నుంచి అమెరికా, యూరప్ దేశాల్లో కొత్త తరహా ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ కాలంలో వచ్చిన పర్యావరణ, శాంతి, స్త్రీవాద ఉద్యమాలను నూతన ఉద్యమాలుగా వర్గీకరించవచ్చు. భారతదేశంలో తలెత్తిన దళిత, ఆదివాసీ, స్త్రీవాద, మానవ హక్కుల, పర్యావరణ ఉద్యమాలను కూడా 'నూతన సామాజిక ఉద్యమాలు'గానే పేర్కొనవచ్చు. అయితే ఈ ఉద్యమాల లక్ష్యం రాజ్యాధికారం కాదు. 

 

పర్యావరణం - సంవేదన దశ
భారతదేశంలో అనేక సామాజిక ఉద్యమాలు పర్యావరణ సమస్యలను తమ అజెండాలో చేర్చాయి. పర్యావరణ అంశాలు సామాజిక ఉద్యమాల్లో 20వ శతాబ్దపు రెండోభాగంలో.. 1970 దశకం తర్వాత వచ్చినప్పటికీ, వాటి మూలాలు వలస పాలన కాలంలోనే ఉన్నాయి.
* అడవులు - అటవీ ఉత్పత్తులు, సముద్ర సంపదపై హక్కులు..
* చేపల చెరువుల పెంపకం, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, పెద్ద ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకించడం..
* అణు విద్యుత్తు, అణుశక్తి కేంద్రాల ఏర్పాటు, అణుయుద్ధాలను వ్యతిరేకించడం..
ఇలాంటి పర్యావరణ అంశాలను వివిధ సామాజిక ఉద్యమాలు తమ అజెండాలో చేర్చాయి. సామాజిక ఉద్యమాలైన గిరిజన, మహిళ, పౌరహక్కుల, రైతుల, కార్మిక ఉద్యమాల అజెండాలో పర్యావరణ అంశాలు కనిపిస్తాయి.

 

అటవీ హక్కుల కోసం
గిరిజన ఉద్యమాల్లో చిప్కో, అప్పికో ముఖ్యమైనవి. గిరిజనుల అవసరాలు, మనుగడ.. అటవీ ఉత్పత్తులు, అటవీ సంపదపై ఆధారపడి ఉన్నందున గిరిజనులకు వాటిపై హక్కులు ఉండాలని ఈ ఉద్యమాలు పేర్కొన్నాయి.

 

చిప్కో ఉద్యమం
చారిత్రక నేపథ్యం: చిప్కో ఉద్యమం ప్రాచీన భారతీయ సంస్కృతి నుంచి ఉద్భవించింది. చారిత్రకంగా, తాత్వికంగా గాంధేయ సత్యాగ్రహ విధానాల్లోనే నడిచినందున ఈ ఉద్యమాన్ని ఆ రోజుల్లో 'అడవి సత్యాగ్రహం అని పిలిచేవారు. గిరిజనులు అడవులను రక్షించుకోవాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం మొదలైంది. మొదట చెట్లను రక్షించే ఉద్యమంగా, తర్వాత ఆర్థిక ఉద్యమంగా మారి చివరకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. బ్రిటిష్ పరిపాలనలో 1927లోని అటవీ చట్టం వల్ల గ్రామ ప్రజల హక్కులను నిరాకరించడం, గ్రామీణ జీవనోపాధి లేకపోవడం, వాణిజ్యం కోసం అడవులను కొల్లగొట్టడంతో దేశమంతటా ఈ ఉద్యమం వ్యాపించింది.
చిప్కో అంటే.. : చిప్కో అనే పదం హిందీ నుంచి వచ్చింది. ఇది ఆలింగనం చేసుకోవడం/హత్తుకుపోవడం అనే అర్థాన్ని ఇస్తుంది. ప్రస్తుత ఉత్తరాఖండ్ అడవుల్లో నివసించే బిష్నోయ్ తెగకు చెందిన గిరిజన మహిళలు అక్కడి అడవులను నరకకుండా వాటిని రక్షించుకోవడానికి చేపట్టిన ఉద్యమమే చిప్కో ఉద్యమం. వృక్ష ఆలింగన పద్ధతి ద్వారా చెట్లను హత్తుకుని వాటిని నరకకుండా కాపాడుకున్నారు.

 

స్వాతంత్య్రానంతరం: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చిప్కో ఉద్యమం గాంధేయ విధానంతో 'మీరా బెహన్, సరళ బెహన్' లాంటి గాంధేయవాదులతో సాగింది. వీరు మొదలుపెట్టిన పర్యావరణ ఉద్యమాలు ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ కొండల్లో వ్యాపించాయి. తర్వాత కాలంలో చండీ ప్రసాద్ భట్, సుందర్‌లాల్ బహుగుణ ద్వారా ఈ ఉద్యమం విస్తృతమై ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది.
 

సర్వోదయ మండల్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గిరిజనులు సరళ బెహన్ ఆధ్వర్యంలో 1961లో 'ఉత్తరాఖండ్ సర్వోదయ మండల్‌'ను నెలకొల్పారు. తర్వాత గోపేశ్వర్ జిల్లాలోని 'దషోలి' గ్రామంలో చండీ ప్రసాద్ భట్ నాయకత్వంలో 'దషోలి గ్రామ్ స్వరాజ్ మండల్' అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. వీరు పర్యావరణ పరిరక్షణ కోసం శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. హిమాలయాల్లోని వివిధ అటవీ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం, అక్కడి వృక్షాలను నరకడాన్ని వ్యతిరేకిస్తూ చిప్కో పద్ధతిని చేపట్టారు. ఈ విషయంపై 1972, 1973లో విస్తృత ఉద్యమాలు సాగాయి.
 

సుందర్‌లాల్ బహుగుణ  
1973లో ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో గోపేశ్వర్ గ్రామంలో చండీప్రసాద్ భట్ నాయకత్వంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 1989లో కర్ణ ప్రయోగ్ దగ్గర అడవుల్లో చెట్లను కొట్టివేసి 'ఫైన్' చెట్లను పెంచుదామని ప్రభుత్వ అధికారులు ప్రయత్నించినప్పుడు అక్కడి ప్రజలతో కలిసి సుందర్‌లాల్ బహుగుణ ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా నిరోధించగలిగారు. ఇలా బహుగుణ నేతృత్వంలో ఈ ఉద్యమం ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ అంతటా వ్యాపించింది. అంతకు ముందు పర్యావరణవేత్తగా ఉన్న ఆయన 1981 నుంచి 1983 దాకా హిమాలయ ప్రాంతంలో దాదాపు 5000 కి.మీ.ల మేర పాదయాత్ర చేశారు. చివరకు దిల్లీ చేరి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి అటవీ వినియోగ పద్ధతులు మార్చాలని కోరారు. ఫలితంగా ప్రధాని ఆజ్ఞానుసారం అప్పటి నుంచి 15 సంవత్సరాల దాకా హిమాలయ ప్రాంతాల్లో చెట్లు కొట్టడాన్ని నిషేధించారు.
 

కర్ణాటకలో అప్పికో
1983 సెప్టెంబరులో కర్ణాటక రాష్ట్రంలో చిప్కో ఉద్యమానికి బదులు 'అప్పికో' ఉద్యమంగా ప్రారంభమైంది. ఈ ఉద్యమకారులు కూడా చెట్లను కౌగిలించుకుని చెట్టుని నరికే ప్రయత్నాన్ని ఆపు చేశారు.

 

'చిప్కో' విజయాలు
* ప్రజల హక్కులను కాపాడి, అడవులకు ప్రకృతికి ఉన్న తాత్విక సామీప్యాన్ని రక్షించి శాస్త్రీయంగా వీటికి కొత్త రచన చేయడమే చిప్కో ఉద్యమ లక్ష్యం.
* ఈ ఉద్యమం గిరిజనుల ఐక్యతను చాటిచెప్పి ఇతర రాష్ట్రాల ప్రజలకు మార్గదర్శకంగా నిలిచింది.
* ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాలయాలతోపాటు రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక వరకు ఈ ఉద్యమం వ్యాపించింది.
* నిరక్షరాస్యులైన గిరిజనులు నడిపిన ఉద్యమ స్ఫూర్తి అక్షరాస్యులు, నగరవాసులతోపాటు ప్రజలందరిలో పర్యావరణ జాగృతిని కలిగించింది.

 

నర్మదా బచావో
పర్యావరణ పరిరక్షణ కోసం.. వనరుల విధ్వంసానికి వ్యతిరేకంగా దేశంలో చెలరేగిన ఉద్యమాలన్నింటిలోకి 'నర్మదా బచావో ఆందోళన్ తలమానికమైంది.
1961లో నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నర్మద, దాని ఉపనదులపైన సుమారు 3000 చిన్న, 135 మధ్య తరహా, 30 పెద్దతరహా ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించారు. వీటన్నింటిని కలిపి 'సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్' అంటారు. ఇందులో భాగంగా గుజరాత్, దక్షిణ రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 1964లోనే కేంద్ర ప్రభుత్వం నర్మదానదిపై 'సర్దార్ సరోవర్ పేరుతో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే క్షామ ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని ప్రభుత్వం భావించింది. అలాగే తాగునీరు, సాగునీరుతో పాటు 12,200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పిత్తి జరుగుతుందని భావించి నర్మదానదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. 1969లో కేంద్రం మూడు రాష్ట్రాలకు నదీ జలాల వినియోగం అంటే పంపిణీ నిమిత్తం 'నర్మద జలవివాద న్యాయ ట్రైబ్యునల్‌'ను నియమించింది.
1987లో ప్రపంచ బ్యాంకు ఈ భారీ ప్రాజెక్టుకు 450 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేయడంతో డ్యామ్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ఆనకట్ట నిర్మాణాన్ని నిలిపి వేయాలని 1988లో ప్రముఖ పర్యావరణవేత్త మేధా పాట్కర్ నాయకత్వలో 'నర్మదా బచావో ఆందోళన్' అనే పర్యావరణ పరిరక్షణ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో మేధా పాట్కర్‌తోపాటు సుందర్‌లాల్ బహుగుణ, బాబా ఆమ్టే (ప్రముఖ సంఘ సేవకులు), అరుంధతీ రాయ్ (ప్రముఖ రచయిత్రి) ఉన్నారు.

 

'ఆందోళన్' ఎందుకంటే..?
* పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని అడవులు నశించిపోతాయి.
* భూకంపాలు సంభవించవచ్చు.
* నదీ పరివాహక ప్రాంతాల్లో జీవావరణం దెబ్బతిని నేల నాణ్యత తగ్గిపోతుంది.
* లక్షల మంది ఆదివాసులు నిరాశ్రయులవుతారు.
ఈ దుష్ఫలితాలను వివరిస్తూ 1989 నాటికి వీరు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. దీంతో ప్రపంచ బ్యాంకు రుణ మొత్తాన్ని ఇవ్వకుండా వెనక్కి తీసుకుంది.

 

ప్రముఖుల మద్దతు
* 1989లో హర్యుద్ నగరంలో మేధాపాట్కర్, బాబా ఆమ్టే, సుందర్ లాల్ బహుగుణ ఆధ్వర్యంలో నర్మదా ఆనకట్ట నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.  
* 1990, డిసెంబరు 25న బాబా ఆమ్టే ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌గాట్ నగరం నుంచి గుజరాత్ సరిహద్దుల్లోని ఫెర్కునా గ్రామం (సర్దార్ సరోవర్ డ్యామ్) వరకు 250 కి.మీ. మార్గంలో 'సంఘర్ష్ యాత్ర' పేరుతో పాదయాత్ర చేసి సంచలనం సృష్టించారు. 

* 1991 జనవరిలో మేధాపాట్కర్, ఆమ్టే అమరణ నిరాహార దీక్ష తలపెట్టారు. అయితే ఆరోగ్య దృష్ట్యా దీక్షను 1991, జనవరి 28న విరమింపజేశారు.
* 1991లో స్వీడన్ దేశం మేధా పాట్కర్ సేవలకు గుర్తింపుగా 'రైట్ లైవ్లీహుడ్ అవార్డ్' అనే అత్యున్నత పురస్కారంతో గౌరవించింది.
* 'ది ఫ్రెండ్స్ ఆఫ్ రివర్ నర్మదా' అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది.
* ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ 'ది గ్రేటర్ కామన్ గుడ్' అనే తన పుస్తకం ద్వారా మద్దతు పలికి, భారీ ఆనకట్టల వల్ల కలిగే నష్టాలు, విధ్వంసాల గురించి ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు.
* డ్యామ్ ఎత్తును 122 మీటర్లకు పెంచాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 2006 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఆనకట్ట ఎత్తును 90 మీటర్ల కంటే ఎక్కువ పెంచరాదని తీర్పునిచ్చింది.
* 2006 సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా గుజరాత్ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ప్రాజెక్టు ప్రారంభించింది.

 

తెహ్రీ డ్యామ్ ఉద్యమం
ఉత్తరాఖండ్‌లోని గడ్వాల్ జిల్లా తెహ్రీ గ్రామానికి సమీపంలో భగీరథ, భిలాం గంగా నదులపై రష్యా సాంకేతిక సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా డ్యామ్ నిర్మాణానికి తలపెట్టాయి. ఇది భూకంప జోన్ పరిధిలో ఉంది. దీని ఎత్తు 260.5 మీటర్లు. ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్దది. 1988 జులైలో రష్యా ఆర్థిక సహకారం (రూ. 3000 కోట్లు)తో 'తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (టీహెచ్‌డీసీ)' నెలకొల్పింది. ఈ డ్యామ్ వల్ల 2,70,000 హెక్టార్ల భూమికి సాగునీరు.. 346 మెగావాట్ల విద్యుత్తు.. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు తాగునీటిని సమకూర్చవచ్చని అంచనా వేశారు. చేపల పెంపకం, వలస పక్షులకు కూడా కేంద్రమవుతుంది.
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సుందర్‌లాల్ బహుగుణ నాయకత్వంలో 'తెహ్రీ బాంధ్ విరోధి సంఘర్ష్ సమితి' ఆధ్వర్యంలో తెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని ఆపాలని ఉద్యమం నడిపిస్తున్నప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెహ్రీ గ్రామంతోపాటు 96 గ్రామాలు పాక్షికంగా మునిగిపోతాయని, 85 వేల మంది ప్రజలు నిర్వాసితులవుతారని అంచనా వేశారు.

 

నిశ్శబ్ద లోయ ఉద్యమం
కేరళలోని పశ్చిమ కనుమల్లోని నీలగిరి పర్వతాల్లో నిశ్శబ్ద లోయ (Silent Valley) ఆవరించి ఉంది. ఈ ప్రాంతంలో కీచురాళ్లు లేకపోవడం వల్ల నిశ్శబ్దంగా ఉంటుంది. అందువల్ల దీనికి నిశ్శబ్దలోయ అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉన్నవి సతత హరిత వనాలు. వేల సంవత్సరాల నుంచి ఈ అడవులు అరుదైన, అతి విలువైన జంతు, వృక్ష జాతులకు నిలయంగా ఉన్నాయి. దేశంలోనే అపురూప సంపదగా ఈ లోయను భావిస్తారు.
1976లో కేరళ ప్రభుత్వం 240 మెగావాట్ల జల విద్యుత్తు కేంద్రాన్ని నీలగిరి పర్వతాల సమీపంలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ నిర్మాణం వల్ల 1000 హెక్టార్ల అరణ్యం నశించిపోతుందని, దీనివల్ల పర్యావరణ సమతౌల్యానికి విఘాతం కలుగుతుందని, అరుదైన వృక్ష సంపద నశించి పోతుందని, అరణ్య సంపదను నాశనం చేసుకోవడం సమర్థనీయం కాదని కేరళ ప్రజలు 'శాస్త్ర సాహిత్య పరిషత్' అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో పెద్ద ఉద్యమం నడిపారు. ఈ ఉద్యమం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేరళ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేసింది. అంతేకాకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ లోయను జాతీయపార్కుగా ప్రకటించారు.

 

మాదిరి ప్రశ్నలు
 

1. పర్యావరణం, అడవులు అనే పదాలను మొదట ఆదేశిక సూత్రాల్లో 48(ఎ) అధికరణంలో చేర్చారు. ఈ పదాలు ఏ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
ఎ) 42వ సవరణ - 1972 బి) 42వ సవరణ - 1976 సి) 44వ సవరణ - 1976 డి) 44వ సవరణ - 1978
జ: (బి)

 

2. 1960 దశకం నుంచి ఏ దేశాల్లో కొత్త తరహా ఉద్యమాలు రూపుదిద్దుకున్నాయి?
ఎ) అమెరికా బి) యూరప్ సి) 1, 2 డి) ఆఫ్రికా
జ: (సి)

 

3. మన దేశంలో పర్యావరణ అంశాలు సామాజిక ఉద్యమాల్లో ఏ దశకం తర్వాత ముందుకు కొనసాగాయి?
ఎ) 1960 బి) 1980 సి) 1990 డి) 1970
జ: (డి)

 

4. సామాజిక ఉద్యమాలు పర్యావరణ అంశాలను తమ అజెండాలో చేర్చి విస్తృతపరిచాయి. అయితే కిందివాటిలో పర్యావరణ అంశం కానిది ఏది?
ఎ) అడవులు - అటవీ ఉత్పత్తులు బి) సముద్ర సంపదపై హక్కులు సి) భారీనీటిపారుదల ప్రాజెక్టులు డి) దళిత ఉద్యమాలు
జ: (డి)

 

5. బ్రిటిష్ పాలనలో అటవీ చట్టం ఎప్పుడు చేశారు?
ఎ) 1927 బి) 1937 సి) 1947 డి) 1957
జ: (ఎ)

 

6. పర్యావరణ సామాజిక ఉద్యమాల్లో ప్రధాన అజెండా అంశాలు?
ఎ) గిరిజన, మహిళా ఉద్యమాలు బి) పౌరహక్కుల ఉద్యమాలు సి) రైతుల, కార్మిక ఉద్యమాలు డి) పైవన్నీ
జ: (డి)

 

7. గాంధేయ విధానాల్లో చిప్కో ఉద్యమాన్ని ఏమని పిలిచేవారు?
ఎ) అడవి సత్యాగ్రహం బి) ఉప్పు సత్యాగ్రహం సి) గిరిజన సత్యాగ్రహం డి) మహిళా సత్యాగ్రహం
జ: (ఎ)

 

8. 'చిప్కో' అంటే ... ?
ఎ) చెట్లను నరికివేయడం బి) చెట్లను పెంచడం సి) చెట్లను పరిరక్షించడం డి) చెట్లను ఆలింగనం చేసుకోవడం
జ: (డి)

 

9. మొదట చిప్కో ఉద్యమాన్ని చేపట్టిన గిరిజన తెగ ఏది?
ఎ) తాడలు బి) గోండులు సి) బిష్నోయ్ డి) బిల్లులు
జ: (సి)

 

10. 1961లో 'ఉత్తరాఖండ్ సర్వోదయ మండల్‌'ను ఎవరు నెలకొల్పారు?
ఎ) మీరా బెహన్ బి) సరళ బెహన్ సి) చండీ ప్రసాద్ భట్ డి) సుందర్‌లాల్ బహుగుణ
జ: (బి)


 

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జలావరణ వ్యవస్థ

జీవజాలం.. జలాధారం!

 

సముద్రాలు, నదులు, కాలువలు, సరస్సులు, హిమనీనదాలు, మంచు, గాలిలోని నీటి ఆవిరి సహా  భూమండలంపై నీరు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా అది జలావరణం కిందికే వస్తుంది.  ఎన్నో రకాల జీవరాశులు ఇందులో మనుగడ సాగిస్తుంటాయి. పర్యావరణాన్ని పరిరక్షించడం, వాతావరణాన్ని సమతౌల్యం చేయడంలో ఈ ఆవరణ వ్యవస్థ అత్యంత కీలకంగా పనిచేస్తుంది. ఈ అంశాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 


ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో జీవ, నిర్జీవ కారకాల మధ్య శక్తి, పోషకాల మార్పిడి జీవ, భూ రసాయన వలయాల వల్ల జరుగుతుంది. ఇలాంటి నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని ఆవరణ వ్యవస్థగా పిలుస్తారు. జలం ఆవాసంగా ఉన్న ఆవరణ వ్యవస్థను జలావరణ వ్యవస్థ అంటారు. దీన్ని మూడు రకాలుగా విభజించవచ్చు.


మంచినీటి ఆవరణ వ్యవస్థ: మంచినీటిలో లవణీయత తక్కువగా ఉంటుంది (5% కంటే తక్కువ). 

ఉదా: సరస్సులు, కొలనులు/చెరువులు, నీటి బుగ్గలు, నదులు.


సముద్ర ఆవరణ వ్యవస్థ: సముద్ర నీటిలో లవణీయత అత్యధికంగా (35% కంటే ఎక్కువ) ఉంటుంది. వీటిలో నివసించే జీవజాతుల వ్యవస్థ ప్రత్యేకమైంది.

ఉదా: సముద్రాలు, మహాసముద్రాలు


పరివర్తన ఆవరణ వ్యవస్థ: దీనిలో లవణీయత మధ్యస్థంగా  (5% నుంచి 35%) ఉంటుంది. ఎస్చ్యురీలు, లాగూన్లు, సముద్ర వెనుక జలాలు, మాంగ్రూవ్స్‌లలో నివసించే జీవజాతులు దీని కిందకు వస్తాయి. 

 

ప్రభావితం చేసే అంశాలు

సూర్య కాంతి: సమస్త జీవరాశికి మూలాధారమైన సూర్యకాంతి సాధారణంగా జలాల ఉపరితలం నుంచి 200 మీటర్ల లోతు వరకు మాత్రమే ప్రసరిస్తుంది. ఈ కాంతి ప్రసరించే లోతును బట్టి వృక్ష, జంతుజాలాల ఉనికి ఆధారపడి ఉంటుంది. 


జలాల పారదర్శకత: నీటి పారదర్శకతను తగ్గించే బంకమన్ను, పూడికలు, వృక్ష ప్లవకాల వల్ల నీరు బురదమయమవుతుంది. నీటి పారదర్శకత తగ్గిన మేరకు లోతుకు వెళ్లే కొద్దీ కాంతి ప్రసరణ తగ్గుతుంది. అందువల్ల కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గి జలావరణ వ్యవస్థ ఉత్పాదనా సామర్థ్యం తగ్గిపోతుంది.


ఉష్ణోగ్రత: పరిసర ఉష్ణోగ్రత మార్పులకు నీరు చాలా నెమ్మదిగా ప్రభావితమవుతుంది. అంటే నీటి ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతుంది లేదా తగ్గుతుంది. అందువల్ల జలచర జీవరాశులకు ఉష్ణోగ్రతా సహనస్థాయి పరిధి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే నీటి ఉష్ణోగ్రతలో ఏ మాత్రం మార్పు వచ్చినా జలచర జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.

 

వివిధ మండలాలు 

 కొలను ఆవరణ వ్యవస్థ అనేది ఒక స్వయంసమృద్ధ జీవనాధార వ్యవస్థ. తీరం నుంచి లోతుకు వెళ్లే కొద్దీ జీవజాతుల ఆవాసాన్ని బట్టి దీన్ని వివిధ మండలాలుగా విభజించవచ్చు. 

యూఫోటిక్‌ మండలం: ఇది జలాల ఉపరితల ప్రాంతం. ఇక్కడ సూర్యకాంతి సమృద్ధిగా ప్రసరించడం వల్ల కిరణజన్యసంయోగక్రియ రేటు అధికంగా ఉంటుంది. మొక్కల శ్వాసక్రియ చర్య కూడా ఎక్కువే. ఆక్సిజన్‌ పుష్కలంగా లభిస్తుంది.

లిట్టోరల్‌ మండలం: దీన్ని వేలాంచల మండలం అంటారు. ఇది తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ కాంతి అడుగు భాగం వరకు చేరుతుంది. అందువల్ల కిరణజన్య సంయోగక్రియ అధికంగా జరిగి ఆక్సిజన్‌ సమృద్ధిగా లభిస్తుంది. ఈ ప్రాంతంలో పెరిగే మొక్కల వేర్లు నీటి అడుగు భాగంలో ఉంటాయి. వాటి పత్రాలు నీటి ఉపరితలంపై తేలియాడుతుంటాయి. 

ఉదా: నీటి లిల్లీలు, నీటిలో పూర్తిగా మునిగి ఉన్న మొక్కలు హైడ్రిల్లా, వృక్ష ప్లవకాలు లాంటి డయాటమ్స్, జంతు ప్లవకాలైన డాఫ్నియా రోటెఫర్‌లు లాంటివి జీవిస్తాయి. మొక్కలను అంటిపెట్టుకునే నత్తలు, కీటక డింభకాలు, హైడ్రాలు నివసిస్తాయి. వేలాంచల అడుగు భాగంలో సంచరించే జీవులను బెంథాస్‌ జీవులు అంటారు. ఎర్రటి అనెలిడ్‌లు, క్రే చేపలు వీటికి ఉదాహరణ.

లిమ్నెటిక్‌ మండలం: ఇది తీరానికి దూరంగా ఉండే జలాశయ ప్రాంతం. కొలనులో అతిపెద్ద మండలం. కాంతి సమృద్ధిగా లోపలికి వెళ్లగలిగే ప్రాంతం వరకు ఇది కొనసాగుతుంది. ఈ మండలంలో సమయానుకూలంగా ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ లభ్యతలు వేగంగా మారుతుంటాయి. ఈ ప్రాంతం ఉపరితల జలానికే పరిమితం. సరస్సు అడుగు భాగం వరకు లిమ్నెటిక్‌ మండలం విస్తరించదు. దీని కింద ప్రొఫండల్‌ మండలం ఉంటుంది. లిమ్నెటిక్‌ మండలంలో యూగ్లినాయిడ్స్, డయాటమ్స్, ఆకుపచ్చని శైవలాలు లాంటి స్వయంపోషక జీవులు అధికంగా నివసిస్తాయి. వీటితోపాటు జంతుప్లవకాలు, చేపలు, కప్పలు, నీటి సర్పాలు లాంటి వినియోగదారులూ జీవిస్తాయి. వేలాంచల మండలం, ప్రొఫండల్‌ మండలాలను వేరుచేస్తూ ఉన్న ఊహాజనిత రేఖను పరిహర మండలం లేదా కాంతి పరిహర మండలం అంటారు. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ రేటు, శ్వాసక్రియ రేటు సమానంగా ఉంటాయి. 


ప్రొఫండల్‌ మండలం: ఇది లిమ్నెటిక్‌ మండలానికి కిందనున్న లోతయిన నీటి ప్రదేశం. ఈ ప్రాంతంలో కాంతి ప్రసరణ ఉండదు. ఈ నీటిలో ఆక్సిజన్‌ తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇందులో కిరణజన్యసంయోగక్రియ జరిపే జీవులు ఉండవు. ఇక్కడ అవాయు శ్వాసక్రియ జరిపే, కుళ్లిన ఆహార పదార్థాలను తినే విచ్ఛిన్నకారులు/పూతికాహార (డెట్రిటస్‌) జీవులు ఉంటాయి.

 

సరస్సు జీవావరణ వ్యవస్థ

జలావరణ వ్యవస్థల్లో సరస్సు జీవావరణ వ్యవస్థ ఒక ఉన్నత స్థాయి జీవావరణ వ్యవస్థ. ఇందులో జీవగోళంలో మాదిరి అన్ని విధులూ జరుగుతాయి. సౌరశక్తి సహాయంతో స్వయం పోషకాలు అకర్బన పదార్థాలను కర్బన పదార్థాలుగా మారుస్తాయి. విచ్ఛిన్నకారులు చనిపోయిన జీవులను విచ్ఛిన్నం చేసి పోషక పదార్థాలు, ఖనిజాలు విడుదల చేయడం, అది తిరిగి స్వయంపోషకాల ద్వారా వినియోగంలోకి రావడం లాంటి ప్రక్రియలన్నీ జరుగుతాయి. 

 

చిత్తడి ప్రాంత ఆవరణ వ్యవస్థ 

తేమ, బురదతో కూడిన క్షార స్వభావం ఉన్న ప్రాంతాల్లో భౌమ, జల వనరుల మధ్య ఏర్పడిన సంక్లిష్ట ఆవరణ వ్యవస్థనే చిత్తడి ప్రాంత ఆవరణ వ్యవస్థగా పిలుస్తారు. ఇవి విలక్షణమైన జీవజాతులకు నిలయాలు. వలస పక్షులకు అనువైన ప్రదేశాలు. పోషకాల పరిమాణాన్ని పెంపొందిస్తాయి. కలుషిత జలాలను శుద్ధి చేస్తాయి. నేల క్రమక్షయాన్ని నియంత్రిస్తాయి. అందువల్ల చిత్తడి నేలలను పర్యావరణానికి కిడ్నీలుగా భావిస్తారు. 


చిత్తడి జలాల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1971, ఫిబ్రవరి 2న ఇరాన్‌లోని రాంసార్‌ వద్ద అంతర్జాతీయ పల్లపు భూముల (చిత్తడి నేలల) పరిరక్షణ సమావేశం జరిగింది. మనదేశంలో సుమారు 153 లక్షల హెక్టార్లలో ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. ఇవి దేశ వైశాల్యంలో 4.7%. 

మనదేశం నుంచి ఇప్పటి వరకు రాంసార్‌ కన్వెన్షన్‌లో చేర్చిన చిత్తడి నేలలు 49. 

* మొదట 1981లో చిల్కా సరస్సు (ఒడిశా), కియోలాడియో (రాజస్థాన్‌) లను తీసుకున్నారు.

దేశంలో:

* పెద్ద వెట్‌ల్యాండ్‌ - సుందర్‌బన్స్‌ (పశ్చిమ బంగా)

* చిన్న వెట్‌ల్యాండ్‌ - రేణుక (హిమాచల్‌ప్రదేశ్‌)

* అత్యధిక వెట్‌ల్యాండ్స్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నాయి.

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం - ఫిబ్రవరి 2

 

మాదిరి ప్రశ్నలు 


1. తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువగా ఉన్న నీటి ఆవరణ వ్యవస్థను ఏమంటారు?

1) లిమ్నెటిక్‌ మండలం     2) వేలాంచల మండలం     3) ప్రొఫండల్‌ మండలం     4) యూఫోటిక్‌ మండలం


2. జలావరణ వ్యవస్థలో ఆక్సిజన్‌ సమృద్ధిగా లభించే ప్రాంతాన్ని ఏమంటారు?

1) యూఫోటిక్‌ మండలం     2) ఎఫోటిక్‌ మండలం       3) ఫోటిక్‌ మండలం       4) ఏదీకాదు


3. లిమ్నెటిక్‌ మండలం అంటే?

1) తీరానికి దూరంగా ఉన్న ఉపరితల జలాల మండలం     2) తీరానికి దగ్గరగా ఉన్న లోతయిన నీటి మండలం

3) తీరానికి దూరంగా ఉన్న లోతయిన నీటి మండలం       4)  కాంతి ప్రసరించని ప్రాంతం


4. నీటిపై తేలియాడే మొక్కలున్న ప్రాంతం?

1) లిట్టోరల్‌ ప్రాంతం     2) ప్రొఫండల్‌ ప్రాంతం      3) లిమ్నెటిక్‌  ప్రాంతం        4) ఏదీకాదు


5. అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

1) జనవరి 2     2) ఫిబ్రవరి 2      3) ఆగస్టు 4      4) అక్టోబరు 3


6. రాంసార్‌ కన్వెన్షన్‌ ఎప్పుడు జరిగింది?

1) 1971       2) 1981       3) 1969      4) 1975


7. బురదతో కూడి క్షార స్వభావం ఉండే జీవావరణ వ్యవస్థ?

1) మంచి నీటి ఆవరణ వ్యవస్థ           2) సముద్ర ఆవరణ వ్యవస్థ

3) చిత్తడి నేల ఆవరణ వ్యవస్థ            4) భౌమ ఆవరణ వ్యవస్థ


8. అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని శరీర నిర్మాణంలో అనుకూలతలున్న జీవులు?

1) యూరిథర్మల్‌ జీవులు     2) స్టీనో థర్మల్‌ జీవులు     3) ఎకో థర్మల్‌ జీవులు     4) ఏదీకాదు


9. తీరాంచల మండల అడుగు భాగంలో జీవించే అనెలిడ్‌లు, క్రే చేపలను ఏమంటారు?

1) బెంథాస్‌ జీవులు      2) సూక్ష్మజీవులు     3) డయాటమ్స్‌     4) శైవలాలు


10. పర్యావరణ కిడ్నీలు అని ఏ జీవావరణ వ్యవస్థను పిలుస్తారు?

1) చిత్తడి ప్రాంత ఆవరణ వ్యవస్థ         2) సముద్ర ఆవరణ వ్యవస్థ

3) అమెజాన్‌ అడవుల ఆవరణ వ్యవస్థ       4) భూమధ్యరేఖా అటవీ ఆవరణ వ్యవస్థ 

 

సమాధానాలు

1-2,    2-1,    3-1,    4-1,    5-2,    6-1,    7-3,    8-1,    9-1,    10-1.

రచయిత: జల్లు సద్గుణరావు

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  చక్రవాతాలు - సునామీ

‣ పర్యావరణం - జీవ వైవిధ్యం

‣ వరద విపత్తులు

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 06-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవవైవిధ్యం

జీవ సమాజంలోని జీవుల మధ్య ఉండే విభిన్నతను 'జీవ వైవిధ్యం' అంటారు. ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన జీవుల సంఖ్య, భిన్నత్వ ం, మార్పు చెందే తత్వాలన్నీ జీవ వైవిధ్యానికి సంబంధించినవే. అందుకే ప్రకృతిని గమనిస్తే విభిన్న రకాల వృక్షాలు, జంతువులు, జీవులు కనిపిస్తాయి.
 

జీవ వైవిధ్య స్థాయులు
జీవ వైవిధ్య క్రమానుగత స్థాయి ప్రకారం ప్రధానంగా 3 రకాలు. అవి.. 
1. జన్యుపర జీవ వైవిధ్యం (జెనిటిక్ బయోడైవర్సిటీ)
2. జాతిపర జీవవైవిధ్యం (స్పీసిస్ బయోడైవర్సిటీ)
3. ఆవరణ వ్యవస్థల జీవవైవిధ్యం (ఇకో సిస్టమ్ బయోడైవర్సిటీ)

 

జన్యుపర జీవవైవిధ్యం
ఇది ఒక జాతిలో ఉండే జీవవైవిధ్యం. అంటే ఒకే జాతికి చెందిన జీవుల మధ్య ఉన్న విభిన్నతలకు సంబంధించింది. జీవుల జీవకణాల్లోని క్రోమోజోముల్లోని జన్యువులు ఆ జీవి వ్యక్తిగత లక్షణాలను నిర్ధారిస్తాయి.
ఉదా: జన్యుపర జీవవైవిధ్యం కారణంగా కొందరు సన్నగా, లావుగా, పొడవుగా, పొట్టిగా, తెల్లటి చర్మంతో, వివిధ రంగుల్లో ఉండటం; ఒకే జాతికి చెందిన కుక్కలు, పిల్లులూ, పుష్పాలు మొదలైనవి.

 

జాతిపర జీవ వైవిధ్యం
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించినా, నేటికీ భూగోళంపై కచ్చితంగా ఎన్ని జాతులకు చెందిన జీవులున్నాయో ఎవరికీ తెలియదు.
* భూమ్మీద 10-14 మిలియన్ల జాతులు/ జీవులున్నట్లు అంచనా. ఇవి చాలావరకు కీటకాలు, సూక్ష్మజీవులే.

 

 

ఆవరణ వ్యవస్థల జీవ వైవిధ్యం
దీనిలో ఒక భౌగోళిక ప్రాంతంలోని అరణ్యాలు, పచ్చిక బయళ్లు, ఎడారులు లాంటి భౌమావరణ వ్యవస్థలు; నదులు, సరస్సులు, నదీ ముఖద్వారాలు, తీర ప్రాంతాలు, మహా సముద్ర ప్రాంతాలు లాంటి జలావరణానికి చెందిన విభిన్న ఆవాసాలకు సంబంధించిన జీవ వైవిధ్యం ఉంటుంది. ఇందులో శీతోష్ణస్థితి ప్రముఖ పాత్ర వహిస్తుంది.
ఉదా: భూమధ్యరేఖ వర్షారణ్యంలో జీవ వైవిధ్యం అధికస్థాయిలో ఉండగా, అందుకు భిన్నంగా ఉష్ణ ఎడారులు, ధ్రువ ప్రాంతాల్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.
* ఆహారం, నివాసం, ఆరోగ్యం కోసం అనాదిగా మానవులు భూగోళపు జీవ వైవిధ్యంపై ఆధారపడుతున్నారు.

 

కాలుష్య ప్రభావం
జీవ వైవిధ్యం సహజ, వ్యవసాయ వ్యవస్థల ఉత్పాదకతలను పెంపొందిస్తుంది. ఆధునిక నాగరకత ఫలితంగా ఉత్పన్నమవుతున్న కాలుష్యం మానవుడు నివసిస్తున్న ప్రాంతాలన్నింటిలోని జీవ వైవిధ్యంపై అనేక రకాల వ్యతిరేక ప్రభావాలను చూపుతోంది.
ఉదా: అటవీ ప్రాంతాలను పంట భూములు, రహదారులు, క్వారీలు, గనులుగా మారుస్తున్నారు.
జీవావరణ సమతౌల్యం

ఒక జీవ సంఘంలో కాలానుగుణంగా జీవావరణం ద్వారా క్రమంగా సంభవించే మార్పులుంటాయి. ఇవి మినహా జన్యుపరమైన.. జాతులు, ఆవరణ వ్యవస్థల మధ్య ఉండే జీవ వైవిధ్యం స్థిరంగా ఉండి, అది సహజసిద్ధమైన క్రియాశీల సమతాస్థితిలో ఉంటే, అలాంటి స్థితిని జీవావరణ సమతౌల్యం అంటారు.
* ఈ సమతౌల్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ ప్రభావం మరీ ముఖ్యమైంది.
* భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరగడం, హిమ సంపాతాలు, వరదలు, కరవు కాటకాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఆయా ప్రభావిత ప్రాంతాల్లో జీవావరణ సమతౌల్యాన్ని ప్రభావితం చేస్తాయి.
* జీవావరణ సమతౌల్య పరిరక్షణ కోసం అనుసరణీయ, దీర్ఘకాలిక, శాస్త్రీయ అవలోకనంతో వెంటనే చర్యలు చేపట్టాలి.

 

జాతిపర జీవ వైవిధ్యంలో మ్యాపింగ్
బ్రిట్స్, పాల్ విలియమ్స్, డికీయిర్‌రైట్, చారిస్ హంప్ రేజర్ శాస్త్రవేత్తలు ప్రపంచంలో జీవవైవిధ్య పటాలను మొదటిసారి తయారు చేశారు. వీరు జీవ వైవిధ్య మ్యాప్‌లో 'వరల్డ్ మ్యాప్‌'ను అభివృద్ధి చేశారు. దీనిలో మూడు రకాలున్నాయి.


1. ఆల్ఫా పటాలు (ఆల్ఫా మ్యాప్స్): ఇందులో ప్రత్యేక ప్రాంతాల్లో మొత్తం జాతిపర సంఖ్యలను పొందుపరిచి, విశ్లేషణాత్మకమైన వివిధ ప్రాంతాల్లో జీవ వైవిధ్య అధ్యయన పటాల్లో గుర్తించారు.
 

2. బీటా పటాలు (బీటా మ్యాప్స్): ఇందులో జీవ వైవిధ్య నిర్మాణాలు, జాతిపర నిర్మాణాలు, పోలికలు, సంఘాలు, కొలతలు, ఆవరణ సమతౌల్యంలో జాతిపర మార్పులను ఈ పటాల్లో గుర్తించారు.
 

3. గామా పటాలు (గామా మ్యాప్స్): ఇందులో భౌగోళిక ప్రాంతాల్లో జాతిపర మార్పుల గణాంకాలు, వాటికి అయిన ఖర్చుల్లాంటి వివరాలను ఈ పటాల్లో పొందుపరిచారు.
 

తడి భూభాగాలు (వెట్ ల్యాండ్స్): భూమి ఉపరితలంపై నీటితో ఉన్న ప్రాంతాల్లో ఆవరణ వ్యవస్థలను సంరక్షించడానికి, వివిధ జీవులను, వృక్షాలను, నేలలను, వన్య ప్రాణులను కాపాడటానికి ఈ ప్రాంతాలు ఉపయోగపడతాయి.
రామ్‌సర్ సమావేశం (రామ్‌సర్ కన్వెన్షన్): ఇరాన్‌లో 1971, ఫిబ్రవరి 2న అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యత్వం ఉన్న దేశాలు రామ్‌సర్ ఒప్పందంపై సంతకం చేశాయి. 1975, డిసెంబరు 21న ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కొన్ని తడి ప్రాంతాలను గుర్తించారు. 

 

వన్యమృగ సంరక్షణపై అంతర్జాతీయ సమావేశం
ప్రపంచంలో జరిగిన 5 ప్రధాన అంతర్జాతీయ వన్యప్రాణి సమావేశాల్లో భారత్ పాల్గొంది. మనదేశంలో పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
* అంతర్జాతీయ వ్యాపార అటవీ వృక్ష జాతులు (Flora), జంతు జాతులు (Fauna) సమావేశంలో 1976, జులై 20న భారతదేశం సంతకం చేసింది.
* మానవ, జీవావరణ కార్యక్రమాన్ని (ఎంఏబీ- మ్యాన్ అండ్ బయోడైవర్సిటీ) యునెస్కో 1971లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 2012 నాటికి 117 దేశాల్లో 598 బయోస్ఫియర్ సంస్థలు సభ్యత్వం తీసుకున్నాయి.
* జీవవైవిధ్య సమావేశం 1992, జూన్ 5న రియో డీ జెనీరోలో జరిగింది.

 

భారతదేశంలో జీవవైవిధ్యం
ప్రపంచంలో భారతదేశం 12వ మెగా జీవవైవిధ్య దేశం. మన దేశం ప్రపంచంలో 2.5 శాతం భౌగోళిక వైశాల్యం కలిగి ఉంది. ప్రపంచంలో 7.8 శాతం జాతిపర వైవిధ్యం భారత్ సొంతం. ఇదో రికార్డు. ప్రపంచంలో ఇండో-మళాయన్ అత్యంత విస్తీరణ ప్రాంతం.
* మన దేశంలో వృక్ష సంబంధ జాతులు 46,000 ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 7 శాతం. ఇందులో 33 శాతం వ్యాధుల బారిన పడుతున్నాయి.
* మన దేశంలో సుమారు 15,000 రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 6 శాతం. ఇందులో 1500 రకాలు జాతిపర వ్యాధుల బారిన పడుతున్నాయి.
* దేశంలో సుమారు 81,000 జంతుపర జాతులున్నాయి. ప్రపంచ జంతు సంపదలో ఇది 6.5 శాతం. 

 

* భారత్ 1972లో వన్య మృగ సంరక్షణ చట్టాన్ని చేసింది. అంతకు ముందు 5 జాతీయ హోదా కలిగిన పార్కులు ఉండేవి.
* వన్యమృగ సంరక్షణ సవరణ చట్టాన్ని 2006లో చేశారు. అదే ఏడాది సెప్టెంబరు 4 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా జాతీయ పులుల అటవీ అథారిటీ, వన్యమృగ క్రైమ్ కంట్రోల్ బ్యూరోలను ఏర్పాటు చేశారు.

 

జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళిక
జాతీయ వన్యమృగ బోర్డును 1982లో కేంద్రం ఏర్పాటు చేసింది. మొదటి జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళికను 1983లో ప్రారంభించారు.
 

జాతీయ జీవ వైవిధ్య చట్టం
ఈ చట్టాన్ని 2002లో చేశారు. 2003, అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కిందకు
1. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ (ఎన్‌బీఏ),
2. జాతీయ జీవ వైవిధ్య బోర్డ్(ఎస్‌బీబీ),
3. జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ (బీఎంసీ) వస్తాయి. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ సంస్థను చట్టబద్ధ హోదాతో చెన్నై (2003)లో ఏర్పాటు చేశారు. భారత్‌లోని పలు జీవ వైవిధ్య సంస్థల వివరాలివి..
* వన్యమృగ సంస్థ - 1996లో డెహ్రాడూన్‌లో ఏర్పాటు.
* భారత వన్యమృగ బోర్డు - 2001 డిసెంబరు 7న పునర్‌నిర్మాణం
* జంతు సంక్షేమ డివిజన్లు - 2002 జులై నుంచి అమలు
* జంతు సంక్షేమ జాతీయ సంస్థ (ఎన్ఐఏడబ్ల్యూ) - ఫరీదాబాద్ (1960 చట్టం ప్రకారం ఏర్పడింది)
* బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1890 ఫిబ్రవరి 13న స్థాపించారు
* జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1916 (కోల్‌కతా)లో ఏర్పాటు

 

భారతదేశంలో జీవ వైవిధ్య సంరక్షణలు

ఎలిఫెంట్ ప్రాజెక్టు
1992 ఫిబ్రవరిలో ఎలిఫెంట్ ప్రాజెక్టును స్థాపించారు. దేశంలో ప్రస్తుతం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 32 ఎలిఫెంట్ ప్రాజెక్టులున్నాయి. ఇవి ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉన్నాయి. 

టైగర్ ప్రాజెక్టు
భారత ప్రభుత్వం 1973, ఏప్రిల్ 1న పులుల (టైగర్ రిజర్వ్) ప్రాజెక్టును ప్రారంభించింది. దేశంలో మొదటి ప్రాజెక్టు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్.  

 

బయోస్ఫియర్ రిజర్వ్
ప్రాదేశిక, తీర ప్రాంత ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి యునెస్కో చట్రం కింద మానవ, జీవావరణ కార్యక్రమంలో భాగంగా మనదేశంలో 1986లో బయోస్ఫియర్‌ను స్థాపించారు. దేశంలో మొదటి బయోస్ఫియర్ నీలగిరి. ప్రస్తుతం దేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వ్‌లున్నాయి. వీటిలో 9 ప్రపంచ బయోస్ఫియర్ నెట్‌వర్క్‌లో ఉన్నాయి. దేశంలోని 7 బయోస్ఫియర్‌లను యునెస్కో దత్తత తీసుకుంది. 

 

 

మెరైన్ నేషనల్ పార్క్‌లు

మన దేశంలో 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గుజరాత్ ప్రభుత్వం అటవీశాఖ ఆధ్వర్యంలో గల్ఫ్ ఆఫ్ కచ్‌లో; జామ్‌నగర్ జిల్లా ఓకా, జోదియాల వద్ద 1982లో 270 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో మెరైన్ నేషనల్ పార్కు ప్రారంభించింది. ఇది దేశంలోనే మొదటి జాతీయ మెరైన్ పార్కు.
దేశంలో ప్రధాన ప్రవాళభిత్తిక (కోరల్ రీఫ్) కోసం గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ అఖాతం, గల్ఫ్ ఆఫ్ కచ్, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో ఏర్పాటు చేశారు. వివరాలివి..
1. పాక్ అఖాతం - తమిళనాడు (రామేశ్వరం)
2. గల్ఫ్ ఆఫ్ మన్నార్ - తమిళనాడు (ట్యూటికోరిన్)
3. అండమాన్, నికోబార్ - బంగాళాఖాతం
4. గల్ఫ్ ఆఫ్ కచ్ - గుజరాత్
5. లక్షద్వీప్ - అరేబియా సముద్రం

 

భారతదేశంలోని ప్రవాళ భిత్తికల పరిశోధనా సంస్థలు

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్‌మెంట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్- అహ్మదాబాద్
జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - కోల్‌కతా
కేంద్ర మెరైన్ ఫిషరీస్ పరిశోధన సంస్థ - మదురై
సెంటర్ ఫర్ ఎర్త్ స్టడీస్ - త్రివేండ్రం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ - గోవా

 

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో భారత జాతీయ జలచరం (అక్వాటిక్ ఆనిమల్) ఏది?
ఎ) డాల్ఫిన్ బి) తాబేలు సి) తిమింగలం డి) ఏదీకాదు
జ: (ఎ)

 

2. సమాజంలో అన్ని స్థాయి జీవుల మధ్య విభిన్నతను ఏమంటారు?
ఎ) పర్యావరణం బి) జీవ వైవిధ్యం సి) సమాజం డి) వైవిధ్యం
జ: (బి)

 

3. జీవ వైవిధ్య క్రమానుగత స్థాయులు ఎన్ని రకాలు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
జ: (బి)

 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తులు 

* విపత్తు (Disaster) అనే పదం ఫ్రెంచ్‌భాషకు చెందింది. Desaster అనే ఫ్రెంచ్ పదం నుంచి Disaster అనే ఆంగ్ల పదం వచ్చింది. దీనికి 'చెడ్డ నక్షత్రం (Bad star)'అని అర్థం.
* పర్యావరణం, సమాజం, సామాన్య ప్రజలకు ఆర్థికంగా అధిక నష్టం కలిగించి, సాధారణ కార్యకలాపాలను కూడా అడ్డుకునే తీవ్రమైన పరిస్థితిని 'విపత్తుగా' పరిగణించవచ్చు. ప్రకృతి వైపరీత్యాల (Natural Hazards) వల్ల అధిక మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టాలుంటాయి. జరిగిన నష్టం ఆధారంగా విపత్తు తీవ్రతను అంచనా వేస్తారు. ప్రజలకు హానికలిగే పరిస్థితి (Vulnerability) ఉన్నప్పుడు, వైపరీత్యాలను ఎదుర్కొనే ముందస్తు సమర్థ చర్యలు లేనప్పుడు విపత్తు తీవ్రత అధికంగా ఉంటుంది.


         విపత్తు సందర్భంలో ప్రజలు ప్రమాదకర లేదా సున్నితమైన స్థితిలో ఉన్నప్పుడు నష్టం ఎక్కువగా ఉంటుంది. విపత్తును ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువగా ఉండి, తక్షణ రక్షణ చర్యలు తీసుకున్నప్పుడు దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఒక ప్రాంత ప్రజలకు హానికలిగే పరిస్థితి (Vulnerability), వయసు, పేదరికం, నిరక్ష్యరాస్యత, సరైన శిక్షణ లేకపోవడం, పర్యావరణ క్షీణత, నియంత్రించలేని అభివృద్ధి, సరైన వసతులు లేకపోవడం, ప్రమాదకర ప్రదేశాలు, నివాసాలు, ఆర్థికంగా పటిష్టంగా లేకపోవడం, పట్టణీకరణం, జనాభా పెరుగుదల లాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.  
వైపరీత్యం వల్ల అతి తక్కువ ప్రభావం ఉండి, ఆర్థిక, ప్రాణ నష్టాలు లేకపోతే అది విపత్తుగా మారే అవకాశం లేదు. ఉదాహరణకు ప్రాణులు, ఆవాసాలులేని ఏదైనా ఎడారి ప్రాంతంలో భూకంపం సంభవిస్తే, దాన్ని విపత్తుగా భావించలేం.


    వైపరీత్యాలను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి:
1) సహజ వైపరీత్యాలు (Natural Hazards)
2) మానవకారక వైపరీత్యాలు (Man made Hazards).


సహజ వైపరీత్యాలు: ఇవి ప్రకృతిలో సహజంగా సంభవిస్తాయి. తుపానులు, భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలుకావడం, సునామీ, కొండచరియలు విరిగిపడటం, వరదలు, కరవు, చీడపీడలు ఎక్కువ కావడం లాంటివాటిని సహజ వైపరీత్యాలుగా పేర్కొనవచ్చు.


మానవకారక వైపరీత్యాలు: సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం; ఆనకట్ట కూలిపోవడం (Dam Failure); యుద్ధాలు; పరిశ్రమల నుంచి విషవాయువులు, హానికర పదార్థాలు వెలువడటం లాంటి మానవ చర్యల వల్ల మానవకారక వైపరీత్యాలు సంభవిస్తాయి.


* వైపరీత్యాలను అవి సంభవించే ప్రదేశం, కారణమయ్యే స్థితి ఆధారంగా కిందివిధంగా విభజించవచ్చు.
1) భౌగోళిక సంబంధ వైపరీత్యాలు (Geological Hazards): భూకంపాలు, సునామీ, అగ్ని పర్వతాలు బద్దలుకావడం, గనుల్లో మంటలు రావడం, ఆనకట్ట బద్దలు కావడం, కొండచరియలు విరిగిపడటం (Land side) లాంటివాటిని భౌగోళిక సంబంధ విపత్తులుగా పేర్కొనవచ్చు.


2) నీరు, వాతావరణ సంబంధ వైపరీత్యాలు (Water & Climatic Hazards): తుపానులు, టోర్నడోలు, హరికేన్లు, వరదలు, కరవు, వేడి గాలులు, మంచు చరియలు విరిగిపడటం(Snow Avalanche), సముద్రం వల్ల కలిగే కోత (Sea erosion), వడగళ్ల వాన, గాలితో కూడిన వర్షం(Cloud burst) లాంటివాటిని నీరు, వాతావరణ సంబంధ వైపరీత్యాలుగా పేర్కొనవచ్చు.


3) పర్యావరణ సంబంధ వైపరీత్యాలు (Environmental Hazards): పర్యా వరణ కాలుష్యం, ఎడారి విస్తరించడం (Desertification), చీడపీడల సంక్రమణ (Pest Infection), అడవులు నశించడం లాంటివి వీటికి ఉదాహరణ.


4) జీవన సంబంధ విపత్తులు: చీడపీడలు వ్యాపించడం (Pest Attacks), ఆహారం కలుషితమవడం, మానవులు, జంతువుల నుంచి అంటు వ్యాధులు (Human/ Animal Epidemics) వ్యాపించడం లాంటివి జీవసంబంధ వైపరీత్యాలకు ఉదాహరణ.


5) రసాయన, పారిశ్రామిక వైపరీత్యాలు: పెద్ద మొత్తంలో రసాయనాలు వెలువడటం, పారిశ్రామిక దుర్ఘటనలు, చమురు ఎక్కువగా ఒలికిపోవడం(Oil Spils), నూనెలవల్ల మంటలు చెలరేగడం, అణు దుర్ఘటనలు మొదలైనవాటిని వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు.


6) ప్రమాద సంబంధ వైపరీత్యాలు: రైలు, విమాన, వాహన, పడవ సంబంధ ప్రమాదాలు, జనావాసాల మధ్య మంటలు చెలరేగడం, ఒకేసారి అనేకచోట్ల బాంబులు పేలడం, అడవుల్లో కారుచిచ్చు, భవంతులు కూలిపోవడం, విద్యుత్ సంబంధ ప్రమాదాలు, పండగల సందర్భంలో జరిగే ప్రమాదాలు, గనుల్లోకి వరదరావడం లాంటివి ప్రమాద సంబంధ వైపరీత్యాలకు ఉదాహరణ. కొన్నిసార్లు సహజ, మానవ సంబంధ కారణాలు కలవడం వల్ల కూడా వైపరీత్యాలు రావచ్చు.


* ఇలాంటి వాటిని సాంఘిక - సహజ వైపరీత్యాలు (Socio-Natural Hazards) అంటారు. ఉదాహరణకు పట్టణ ప్రాంతాల్లోని మురికి కాలువల్లో చెత్త, చెదారం పేరుకుపోవడం వల్ల వరదలు రావడం. కొన్నిసార్లు కరవు, మంటలు చెలరేగడం లాంటివి సహజ, మానవ కారణాలు రెండింటి ఫలితంగా సంభవించవచ్చు.

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు-చట్టాలు

పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యాలుగా తెలంగాణలో పలు సామాజిక ఉద్యమాలు జరిగాయి. వీటిలో నల్గొండ జిల్లాలో యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా.. రాజధాని నగరంలో మూసీ నది ప్రక్షాళన దిశగా నిర్వహించిన ఉద్యమాలు ప్రధానమైనవి. స్థానికుల నుంచి వ్యక్తమైన నిరసనలు ఉద్యమాలుగా మారాయి. వీటికి పలు సంస్థలు, ప్రముఖుల నుంచి మద్దతు లభించడంతో కొంతమేర విజయవంతమయ్యాయి. 
                   మన దేశంలో పర్యావరణ ఉద్యమాలు గ్రామస్థాయి నుంచి 1970లలోనే ప్రారంభమయ్యాయి. 1980వ దశకం నుంచి తెలంగాణలో సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. 1990వ దశకం నుంచి ఉద్యమాలు తీవ్రమయ్యాయి. ప్రపంచీకరణ, నయా ఉదారవాదం పేర్లతో చోటు చేసుకున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పర్యావరణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. ప్రాంతీయంగా కూడా పర్యావరణం, మానవ హక్కుల పరిరక్షణ దిశగా సాగిన సామాజిక ఉద్యమాలు అనేక అంశాలను లేవనెత్తాయి. ఇలాంటి ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా.. ఒక ఆశయం కోసం పనిచేస్తాయి. ప్రజాస్వామిక విధానాల్లోనే కార్యక్రమాలను రూపొందిస్తాయి.

 

యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం
భారత యురేనియం సంస్థ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - యూసీఐఎల్) తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జున జలాశయం సమీపంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు గుర్తించింది. దీని సమీప గ్రామాల్లో సుమారు 1303 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు యూసీఐఎల్ నిర్ధారించింది. 2001 ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం మైనింగ్, శుద్ధి కర్మాగారాన్ని స్థాపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది.
* 2002 సెప్టెంబరులో నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంభాపురం గ్రామాల్లో యురేనియం గనుల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద 795 ఎకరాల్లో సుమారు రూ.315 కోట్లతో దాదాపు 20 ఏళ్ల వరకు తవ్వకాలు చేయడానికి నిర్దేశించింది. అనుమతుల అనంతరం నమూనాల కోసం తవ్వకాలను ప్రారంభించడంతో అప్పట్లో స్థానికులు దీన్ని వ్యతిరేకించారు.
* 2005లో దేవరకొండ పరిధిలో యురేనియం తవ్వకాలకు ప్రయత్నించగా అక్కడి స్థానికుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో తవ్వకాలను నిలిపివేశారు. 2006లో 'యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం' అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పెద్దఎత్తున స్థానికులు ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమానికి గిరిజన సమాఖ్య అధ్యక్షుడు రవీంద్రనాయక్ మద్దతు తెలిపారు. పర్యావరణవేత్తలు, జన విజ్ఞాన వేదిక, పౌరహక్కుల సంఘం నాయకులు కూడా మద్దతిచ్చారు.
* 2007లో లంభాపురం, పెద్దగట్టు, శేరుపల్లి, చిట్రియాల, పెద్దమూల, కాచరాజుపల్లి గుట్టల్లోని అటవీ ప్రాంతంలో దేశ రక్షణ, అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే యురేనియం నిక్షేపాలున్నట్లు యురేనియం సంస్థ పరిశోధనలో తేలింది. దీంతో 2007లో మళ్లీ యురేనియం శుద్ధి కర్మాగార నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులను అక్కడి స్థానికులు పెద్దఎత్తున అడ్డుకున్నారు. ప్రజలకు మద్దతుగా 20 స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఇది చివరికి ప్రజా ఉద్యమంగా మారి నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనుకంజ వేసి పనులను వాయిదా వేసింది.

 

మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమం
1980వ దశకం నుంచి హైదరాబాద్ నగర శివార్లలో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించాయి. దీంతో పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలన్నీ మూసీ నదిలో కలవడం వల్ల అది ఒక మురికి కాలువగా మారింది. వాస్తవంగా.. మూసీ నది హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తుండటం వల్ల నగర ప్రజల తాగునీటి అవసరాలకు ఉద్దేశించి దీని ఉపనదిపై హుస్సేన్‌సాగర్ సరస్సును పూర్వకాలంలో నిర్మించారు. అయితే కాలక్రమేణా ఈ నీరు కలుషితమైంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రతిరోజూ జంట నగరాల నుంచి 350 మిలియన్ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్థ పదార్ధాలు కలుస్తున్నట్లు గత పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో 1986లో డాక్టర్ కిషన్‌రావు, కె.పురుషోత్తమ్‌రెడ్డిల ఆధ్వర్యంలో 'సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్' అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి స్థానిక ప్రజలను కూడగట్టారు. ఇతర పర్యావరణ సంఘాలతో కలిసి మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజల జీవించేహక్కును కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1988లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఫలితంగా కొన్ని పరిష్కారాలను కనుక్కున్నారు. 1989లో హానికరమైన వ్యర్థపదార్ధాల నిర్వహణ, నిల్వ, పరిష్కారాల కోసం 'హానికరమైన వ్యర్థపదార్థాల' నియమావళిని ప్రభుత్వం రూపొందించింది. ఈమేరకు ఉద్యమం కొంత విజయం సాధించింది.
* 2000లో మూసీ నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీట్ కాలువ ద్వారా ప్రవహింపజేసి.. నదీ జలాల ప్రాంతాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించి తెలుగుదేశం ప్రభుత్వం 'నందనవనం' అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది సమీపంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించింది. దీంతో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 'మూసీ బచావో ఆందోళన్' అనే నినాదంతో స్థానిక సామాజిక సంస్థలు ఉద్యమం చేపట్టాయి. దీనికి పర్యావరణవేత్త మేధా పాట్కర్ మద్దతు ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది.
* 2000, జూన్ 24న 'ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్' అనే సంస్థను ప్రారంభించారు. ఈ ఫోరమ్ కన్వీనర్ ఎం.వేదకుమార్ ఆధ్వర్యంలో 'హైదరాబాద్ బచావో' అనే పర్యావరణ ఉద్యమం మొదలైంది. 2006, నవంబరు 21న కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు పురానా పూల్ వంతెన నుంచి అంబర్‌పేట వరకు పాదయాత్ర చేపట్టారు. వీరితో పాటు నగరంలోని ఛత్రీ, గమన అనే రెండు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి.
* 2007లో మూసీనదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ జలమండలి మూసీ నది పొడవునా దశలవారీగా మురుగు శుద్ధి, ప్రక్షాళన పనులను చేపట్టడానికి 10 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను సిద్ధం చేసింది. అయితే వీటివల్ల అక్కడి జనావాసాలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయని 'సేవ్ మూసీ రివర్ క్యాంపైన్' పేరుతో స్థానిక పర్యావరణ సెల్ 2009, జూన్ 2న ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమానికి మద్దతుగా సేవ్ లేక్స్ సొసైటీ, సేవ్ రాక్స్ సొసైటీ, అక్షర, ప్రజా చైతన్య వేదిక, పుకార్, చెలిమి ఫౌండేషన్, హెరిటేజ్ వాచ్ లాంటి పర్యావరణ సంఘాలు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచాయి.
* 2009 నుంచి నగరం వేగంగా విస్తరిస్తున్న కొద్దీ మూసీ నది పరివాహక ప్రాంతాలు రియాల్టర్లు, కబ్జాదారుల ఆక్రమణలకు గురవుతూ వస్తున్నాయి. మలక్‌పేట, హిమాయత్‌నగర్, అజ్గంపురా, కాచీగూడ ప్రాంతాల్లో మూసీ నది ఆక్రమణలకు గురైంది. ముఖ్యంగా ఒక సంస్థ నదీ పరివాహ ప్రాంతాన్ని కబ్జాచేసి వేసిన వెంచర్ చుట్టూ ప్రహరీగోడను నిర్మించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు 'మూసీ బచావో' పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు. పలువురు నాయకులు, ప్రజా సంఘాలు దీనికి మద్దతు తెలిపాయి. ఈ ఉద్యమకారుల డిమాండ్‌కు స్పందించి జీహెచ్ఎంసీ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది.
* తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించడానికి పర్యావరణ నిర్వహణ ద్వారా ఆర్ధిక వృద్ధి సాధించడమే లక్ష్యం. - టీఎస్ పీసీబీ విజ‌న్‌


 

నదీ జలాల్లో 'విష' ప్రవాహం

మానవ మనుగడ దేనిపై ఆధారపడి ఉందో ఆ పర్యావరణం కాలుష్యం దెబ్బకు విషతుల్యంగా మారుతోంది. పారిశ్రామికీకరణ ప్రభావంతో వెదజల్లుతున్న కాలుష్యం పౌర సమాజాన్ని ఊపిరి సలపనీయడం లేదు. నదీ జలాలు, పరిసర ప్రాంతాల్లో చిమ్ముతున్న విష ప్రభావానికి మూగజీవాలు చనిపోతున్నాయి. మనుషులు కూడా బలై పోతున్నారు. ఈ విపత్కర పరిస్థితిని రూపుమాపాలంటూ ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా సాగిన ప్రధాన ఉద్యమాలేమిటో చూద్దాం..


పౌరహక్కుల ఉద్యమాలు తమ అజెండాలో పర్యావరణ సమస్యలకు తొలి ప్రాధాన్యం ఇచ్చాయి. కాలుష్యం లేని పర్యావరణంలో జీవించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని ఈ ఉద్యమాలు భావించాయి. ఈమేరకు పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అణుశక్తి వినియోగం, అణు విద్యుత్ కర్మాగారాల ఏర్పాటు, అణు యుద్ధాలు లాంటివాటిని వ్యతిరేకిస్తూ పౌర హక్కుల ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అలాగే భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, భారీ పరిశ్రమల ఏర్పాటు, మైనింగ్ తదితర కార్యకలాపాలకు భూసేకరణ జరిపే క్రమంలో.. కొన్ని కుటుంబాలు తమ భూములను కోల్పోతున్నాయి. ఇలాంటి నిరాశ్రయుల హక్కుల సాధన కోసం పోరాటాలు జరుగుతున్నాయి.


కాలుష్య వ్యతిరేక ఉద్యమాలు: మన దేశంలో శతాబ్దాలుగా నదులు, వాగులు, ఏరులు.. ప్రజలకు తాగునీటిని అందిస్తున్నాయి. పరిశ్రమల వాణిజ్య అవసరాలు తీరుస్తున్నాయి. మత్స్య సంపదలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే పారిశ్రామికీకరణ వల్ల ఇవి చాలామేర కలుషితం అయ్యాయి. ప్రత్యేకంగా ఉత్తరాన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ్‌బంగ రాష్ట్రాలకు చెందిన నగరాల్లో గంగానది పొడవునా ఉన్న పంచదార, కాగితం, ఎరువులు, రసాయనాలు, రబ్బరు, పెట్రోకెమికల్స్ పరిశ్రమల నుంచి వచ్చే కలుషితాలన్నీ నదిలో కలుస్తున్నాయి. దక్షిణాన కూడా పలు పరిశ్రమలు గోదావరి, కావేరి, తుంగభద్ర నదులను కలుషితం చేస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో కాలుష్య వ్యతిరేక ఉద్యమాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వాలు కొన్ని చర్యలతోపాటు పలు చట్టాలను కూడా రూపొందించాయి.


'సోన్'లో గరళం: మధ్యప్రదేశ్‌లోని షోడోల్ జిల్లాలో సోన్ నది పక్కనున్న అమ్లాయ్ నగరంలో 1965లో ఓరియంటల్ పేపర్ మిల్స్ అనే కాగితం పరిశ్రమ ఏర్పాటైంది. ఇది పెట్టిన రెండేళ్లకే కలుషిత పదార్థాల వల్ల నదిలోని చేపలు, పరిసర ప్రాంతాల్లో పశువులు మరణించాయి. 1970 నుంచి నది చుట్టుపక్కల ప్రాంతాల్లోని 20 గ్రామాల ప్రజలు పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం వల్లే నదీ జలాలు విషపూరితం అయ్యాయంటూ అధికారులకు, కలెక్టరుకు, మంత్రులకు విన్నవించుకున్నారు. అయినా యాజమాన్యం దీనిపై స్పందించలేదు. 1973లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ, దిల్లీ) బృందం ఈ ప్రాంతంలో సర్వే జరిపింది. పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల పశువుల్లో పాల దిగుబడి తగ్గిందని; నదిలోని చేపలు, గ్రామాల్లోని పశువులు క్రమంగా చనిపోతున్నాయని తెలిపింది. దీంతో అక్కడి ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమం చేపట్టారు. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 1974లో నీటి కాలుష్య నియంత్రణ చట్టాన్ని రూపొందించింది.


'చాలియార్' కలుషితం: కేరళలోని చాలియార్ నది పక్కన 1958లో బిర్లా సంస్థ గ్వాలియర్ రేయాన్స్ పరిశ్రమను స్థాపించింది. దీని నుంచి విడుదలయ్యే కాలుష్యం వల్ల ఆ నదిలోని చేపలన్నీ చనిపోయాయి. నది నుంచి నీరు వెళ్లే పంట పొలాలు నాశనమయ్యాయి. పరిసర గ్రామాల ప్రజలకు చర్మ రోగాలు సోకాయి. దీంతో వీరంతా 1963లో కాలుష్యాన్ని అదుపు చేయాలని కోరుతూ పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపారు. 1975లో ఇది భారీ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఫలితంగా 1981లో కాలుష్య నియంత్రణ మండలి కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టింది.
గోవాలో ఉద్యమం: 1973లో గోవాలో జువారి ఆగ్రో కెమికల్స్ లిమిటెడ్ అనే ఎరువుల పరిశ్రమను ప్రారంభించారు. పని ప్రారంభించిన 3 నెలలకే కాలుష్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లు కూడా మాడిపోయాయి. దీంతో 1974 మార్చి 31న సలదాన్హా అనే ఉపాధ్యాయుడు స్థానిక ప్రజలతో కలిసి కాలుష్య వ్యతిరేక సంఘాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా పరిశ్రమకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.


కాలుష్య కర్మాగారం: ముంబయికి గాలి వచ్చే నైరుతి దిశలోని అలీబాగ్ ప్రాంతంలో ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు స్థాపించాయి. ఈ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల పర్యావరణం దెబ్బతిని, ప్రజలు కాలుష్యానికి గురవుతున్నారని అక్కడి ప్రజలు గుర్తించారు. వీరంతా దీన్ని వేరే ప్రాంతానికి తరలించాలని ఉద్యమం చేపట్టారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం దీన్ని మరోచోటుకు తరలించింది.


భోపాల్ దుర్ఘటన
* 1984, డిసెంబరు 2 అర్ధరాత్రి భోపాల్‌లోని 'యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్' (అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ) అనే ఎరువుల తయారీ పరిశ్రమ నుంచి 'మిథైల్ ఐసోసైనేట్' అనే ప్రమాదకర విషవాయువు వెలువడింది. ఇది 3 వేల మంది మరణానికి కారణమైంది. భారతదేశంలో సంభవించిన పారిశ్రామిక దుర్ఘటనల్లో అతి భయానక విపత్తుగా ఇది చరిత్ర పుటల్లో నిలిచింది. అనంతర కాలంలో ఈ వాయువు దుష్ప్రభావం ఫలితంగా దాదాపు 15 వేల మంది మరణించారు. 5 లక్షల మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురయ్యారు. లక్షలాది మంది ప్రజలు వికలాంగులు, అంధులుగా మారారు. జీవచ్చవాలుగా మిగిలిన వారు చాలామంది ఉన్నారు.
* ఈ సంఘటనలో ప్రధాన నిందితుడైన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ సీఈవో వారెన్ ఆండర్సన్‌ను 1985 ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. అయితే అతడు బెయిల్‌పై అమెరికా వెళ్లాడు. 1986లో రషీదాబీ, చంపాదేవి శుక్లా భోపాల్ బాధితులకు న్యాయం చేయాలని పెద్దఎత్తున ఉద్యమం నడిపారు. దేశప్రజల నుంచి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
* 1989లో రషీదాబీ, చంపాదేవి ఆధ్వర్యంలో 'భోపాల్ హతశేషుల ఉద్యమం' నడిచింది. దిల్లీలో వేలాది ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తమకు న్యాయం చేయమని కోరుతూ నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి వినతి పత్రం సమర్పించారు.
* 1999లో చంపాదేవి ఇతర ఉద్యమకారులతో కలిసి న్యూయార్క్ కోర్టులో 'యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్'పై ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. 2002లో రషీదాబీ, చంపా కలిసి న్యూఢిల్లీలో 19 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. భోపాల్ బాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.
* రషీదాబీ, చంపా చేసిన సేవలకు గుర్తింపుగా 2004లో వారికి 'గోల్డ్‌మన్ పర్యావరణ బహుమతి' లభించింది. ఈ పురస్కారాన్ని పర్యావరణ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. వీరి పోరాటానికి కొన్ని అంతర్జాతీయ సంస్థలు మద్దతు ఇచ్చాయి. అవి..
* ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ - బ్రిటన్
* భోపాల్ మెడికల్ అప్పీల్ - బ్రిటన్
* గ్రీన్‌పీస్ ఇంటర్నేషనల్ - బ్రిటన్
* అసోసియేషన్ ఫర్ ఇండియన్ - అమెరికా
* కోర్ వాచ్ - అమెరికా
* పెస్టిసైడ్ యాక్షన్ నెట్‌వర్క్ - అమెరికా
* భోపాల్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ - జపాన్
* విషయం మళ్లీ 2010లో వార్తల్లోకి వచ్చింది. 2011లో కేంద్రం బాధితులకు రూ.1500 కోట్ల అదనపు ప్యాకేజీని సిఫారసు చేసింది. ఇటీవల ఈ కేసును కొట్టేశారు.
* కేంద్ర ప్రభుత్వం 1984లో 'పర్యావరణ పరిరక్షణ చట్టం'ను రూపొందించింది. 1986లో పారిశ్రామిక కాలుష్య నియంత్రణ చట్టాలను అమలు చేసింది.

 

 

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

దుర్బలత్వం - వైపరీత్యాల సంభావ్యత

మాదిరి ప్రశ్నలు

 

1. విపత్తు నిర్వహణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే చర్యలను ఏ స్థాయిలో పరిగణించాలి?

1) మొదటి    2) రెండో    3) మూడో    4) ఉన్నత 

 

2. సముద్రం ఒడ్డున నివసించే పేదవాడు సరైన కాంక్రీట్‌ భవనాన్ని నిర్మించుకోలేకపోవడం అనేది-

1) భౌతిక దుర్బలత్వం 2) సామాజిక ఆర్థిక దుర్బలత్వం

3) భౌతిక సామర్థ్యం కలిగి ఉండటం

4) ఏదీకాదు

 

3. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాలు?

1) దుర్బలత్వాన్ని పెంచే స్థితిని తెలియజేస్తాయి 

2) వైపరీత్యాన్ని పెంచుతాయి

3) సామర్థ్యాన్ని పెంచుతాయి 

4) పైవన్నీ సరైనవి

 

4. ముప్పు లేదా అపాయాన్ని ఎలా కొలుస్తారు?

1) వైపరీత్యాలు, దుర్బలత్వాల మధ్య ఉండే పరస్పర చర్యలను బట్టి

2) వైపరీత్యాలు, విపత్తుల మధ్య ఉండే పరస్పర చర్యలను బట్టి

3) వైపరీత్యాలు, సామర్థ్యాల మధ్య ఉండే పరస్పర చర్యలను బట్టి 

4) పైవన్నీ 

 

5. వరదలు వచ్చే ప్రాంతంలో ఎత్తయిన మిద్దె మీద ఇల్లు కట్టుకుని నివసించడం?

1) వైపరీత్యాన్ని పెంచడం    2) విపత్తును పెంచడం 

3) వైపరీత్యాన్ని తగ్గించడం    4) దుర్బలత్వాన్ని తగ్గించడం

 

6. ఒక విపత్తుకు, మరొక విపత్తుకు మధ్య సమయం మీద ఆధారపడి తీసుకున్న చర్యలు దేన్ని తెలియజేస్తాయి?

1) సంసిద్ధత    2) తీవ్రతను తగ్గించడం  

3) పునర్నిర్మాణం    4) పునరావాసం

 

7. వ్యక్తులకు ముందుగానే శిక్షణ ఇవ్వడం, శోధన రక్షణ చర్యలు చేపట్టడం అనేది కింది ఏ చర్య?

1) ప్రతిస్పందన చర్య    2) ఉపశమన చర్య

3) సంసిద్ధ చర్య    4) పునర్నిర్మాణ చర్య

 

8. విపత్తులో ఇళ్లు కూలిపోయిన వారికి శాశ్వత ఇల్లు కట్టించి ఇవ్వడం అనేది?

1) పునరావాస, పునర్నిర్మాణ చర్య    2) సంసిద్ధ చర్య

3) తీవ్రతను తగ్గించే చర్య    4) ఉపశమన చర్య

 

9. విపత్తులను తట్టుకునే భవనాలు నిర్మించడం, వరదలు ఆపడానికి నదికి దూరంగా గట్లు వేయడం అనేది విపత్తు నిర్వహణా వలయంలో దేనిలో భాగం?

1) విపత్తు ముందస్తు చర్యలు    2) విపత్తు తర్వాత చర్యలు

3) విపత్తు జరుగుతున్నప్పుడు చర్యలు    4) పైవన్నీ

 

10. విపత్తు నిర్వహణ దశల్లో ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలంలో జరిగే కార్యకలాపాలు దేనికోసం?

1) సంసిద్ధత    2) తీవ్రతను తగ్గించడం

3) పునరావాసం    4) ప్రతిస్పందన 

 

సమాధానాలు

1-3, 2-2, 3-1, 4-1, 5-4, 6-1, 7-3, 8-1, 9-1, 10-2.

Posted Date : 27-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆవరణ వ్యవస్థ - పర్యావరణ క్షీణత

భూఉపరితలంపై క్రీ.పూ.10 వేల సంవత్సరాల కిందట వ్యవసాయం ప్రారంభమైనప్పుడు కేవలం 40 లక్షల జనాభా ఉండేది. క్రమానుగతంలో 1750 నాటికి 50 కోట్లు, 1900 నాటికి 100 కోట్లు, 1950 నాటికి 250 కోట్లు ఉంటే ప్రస్తుతం 700 కోట్లకు పెరిగింది. ఇది 2100 సంవత్సరం నాటికి 1000 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా. ఈ విధంగా జనాభా విస్ఫోటనం వల్ల మానవ అవసరాలు పెరగడంతో అనేక పరిశ్రమలను స్థాపించారు. వీటి నుంచి వెలువడే ఉద్గారాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది.
        భూగోళంపై శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం అనే నాలుగు ఆవరణాలు ఉన్నాయి. ఈ ఆవరణాల మధ్య భూఉపరితలంపై అత్యధికంగా జలావరణంలో జీవావరణం ఆవరించి ఉంది. ఇది జంతు, వృక్ష, ప్రాణులను కలిగి ఉంటుంది.
* జీవుల ఆధారంగా జీవావరణాన్ని 3 వర్గాలుగా విభజించవచ్చు. అవి:
1) ఉత్పత్తిదారులు (Producers)
2) వినియోగదారులు (Consumers)
3) విచ్ఛిన్నకారులు (Decomposers)

ఉత్పత్తిదారులు: కిరణజన్య సంయోగక్రియ (సూర్యరశ్మి, నీరు) ద్వారా తమంతట తామే ఆహారాన్ని తయారు చేసుకొని స్వయం పోషకంగా జీవించే వాటిని ఉత్పత్తిదారులు అంటారు.
ఉదా: మొక్కలు, గడ్డి, లెగ్యుమినేసి జాతులు

వినియోగదారులు: ఉత్పత్తిదారులు తయారుచేసిన వాటిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడి జీవించే వాటిని వినియోగదారులు అంటారు. ఇవి నాలుగు రకాలు.

1) శాఖాహారులు (Herbivores): ఇవి ఉత్పత్తిదారులపై ఆధారపడి ఉంటాయి.
ఉదా: మిడత, చిమ్మెట, ఉడుత, కుందేలు, జిరాఫీ, పశువులు.

2) మాంసాహారులు (Carnivores): ఇవి శాఖాహారులపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: తేలు, పాము, చిరుత, పులి, సింహం.

3) సర్వభక్షకులు (Omnivores): ఇవి శాఖాహార, మాంసాహారులపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: ఎలుక, పిల్లి, కుక్క, డేగ, మానవుడు (అతి ప్రధాన సర్వభక్షకుడు).

4) పూతికాహారులు (Detritivores): ఇవి మలిన జీవులపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: చెదపురుగులు, చీమలు.

విచ్ఛిన్నకారులు: ఇవి విగత జీవులు (మరణించిన), వ్యర్థాలపై ఆధారపడి జీవిస్తాయి.
ఉదా: బ్యాక్టీరియా, శిలీంద్రాలు.

 

ఆవరణ వ్యవస్థ
        ఆవరణ శాస్త్రాన్ని ఆంగ్లంలో ఇకాలజీ (Ecology) అంటారు. ఇది గ్రీకు భాషలోని ఓయికస్ (ఇల్లు), లోగోస్ (అధ్యయనం) అనే రెండు పదాల నుంచి వచ్చింది. అంటే మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను అధ్యయనం చేయడం అని అర్థం. ఇకాలజీ అనే పదాన్ని మొదట 1866లో జర్మనీకి చెందిన హెర్నెస్ట్ హెకెల్ అనే జీవ శాస్త్రవేత్త ఉపయోగించాడు. ఆ తర్వాత బ్రిటన్‌కు చెందిన ట్రాన్స్‌లే ఆవరణ వ్యవస్థను వెలుగులోకి తెచ్చాడు. భౌతిక పరిసరాల్లోని జీవుల మధ్య సంబంధాన్ని తెలియజేసేదే ఆవరణ వ్యవస్థ అని పేర్కొన్నాడు.

పర్యావరణం
        పరిసరాల నుంచి పర్యావరణం అనే పదం వచ్చింది. పర్యావరణం 'ఎన్విరాన్' (Environ) అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం మనచుట్టూ ఉన్న ప్రాంతం. మానవుడి జీవనం, మొక్కలు, జంతు, వృక్ష; జీవ, నిర్జీవ అంశాలను అధ్యయనం చేసేదే పర్యావరణం.
* పర్యావరణంలో రెండు అణుఘటకాలు ఉంటాయి.
     1) నిర్జీవ అణుఘటకాలు (Abiotic Compounds)
     2) జీవ అణుఘటకాలు (Biotic Compounds)

నిర్జీవ అణుఘటకాలు: ఇవి ప్రకృతి నుంచి ఉద్భవించిన సహజ వనరులు.
ఉదా: గాలి, నీరు, నేల, ఆకాశం, అగ్ని.

 

జీవ అణుఘటకాలు: ఇవి సహజ వనరులపై ఆధారపడతాయి.
ఉదా: వీటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, శిఖరాగ్ర వినియోగదారులు ఉంటాయి.

జీవావరణ పిరమిడ్
        చార్లెస్ హెల్టన్ ఆహార గొలుసు ఆధారంగా జీవావరణ పిరమిడ్‌ను తయారుచేశాడు. దీనిలో కింది నుంచి పైస్థాయికి ఉత్పత్తి ప్రవాహం తగ్గుతుంది. అలాగే పై నుంచి కింది స్థాయికి సంపద సంఖ్య తగ్గుతుంది.
                                      

      

పర్యావరణ కాలుష్యాలు
        మానవుడి దైనందిన జీవన కార్యకలాపాల ద్వారా ఘన, ద్రవ, వాయు వ్యర్థాలు జీవావరణ సమతౌల్యం దెబ్బతినే స్థాయిలో విడుదలవడాన్ని పర్యావరణ క్షీణత లేదా కాలుష్యం అంటారు. రసాయనాలు, ఖనిజాలు, పేపర్, చక్కెర లాంటి భారీ మౌలిక పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యాలు అనేక సమస్యలకు కారణమవుతున్నాయి.

వాయు కాలుష్యం
        భూగోళాన్ని ఆవరించి ఉన్న గాలిపొరను వాతావరణం అంటారు. ఇది భూగోళం చుట్టూ 6 కి.మీ. ఎత్తులో అత్యధికంగా వ్యాపించి భూభ్రమణ, గురుత్వాకర్షణ వల్ల సంకోచం, వ్యాకోచం చెందుతుంది. సహజ వాతావరణంలో అనేక వాయువులు ఉన్నప్పటికీ ప్రధానంగా 17 వాయువుల మిశ్రమం ఉంటుంది. వీటిలో.......
       నత్రజని - 78.084%
       ఆక్సిజన్ - 20.947%
       కార్బన్ డై ఆక్సైడ్ - 0.0314%
       మీథేన్ - 0.002%
       హైడ్రోజన్ - 0.00005%

 

        ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, గ్జినాన్ అనే వాయువులు నామమాత్రంగా ఉంటాయి. నత్రజని జడవాయువు కొన్ని బ్యాక్టీరియాలకు తప్ప జీవకోటి అవసరాలకు పనికి రాదు. ఆమ్లజని (ఆక్సిజన్) జీవకోటికి అత్యంత అవసరమైన వాయువు. బొగ్గుపులుసు వాయువు (CO2) కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వృక్ష జాతుల్లో పిండి పదార్థాల తయారీకి ఉపయోగపడుతుంది. పరిశ్రమలు, ఖనిజాలు, బొగ్గు, చమురు లాంటివి వాడటం వల్ల కార్బన్లు, నైట్రోజన్, సల్ఫర్, ఫ్లోరైడ్, కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువులు గాలిలో అధిక పరిమాణంలో కేంద్రీకృతమై పర్యావరణానికి హాని కలిగించడాన్నే వాయు కాలుష్యం అంటారు.
        ప్రధానంగా గ్రీన్‌హౌస్ వాయువుల్లో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం; మాంసం, జీవవ్యర్థాల నుంచి వెలువడే మీథేన్ పెరగడం; భూఉపరితల ఉష్ణోగ్రత అధికమై మంచుకొండలు, కొండచరియలు, సముద్ర మట్టం పెరగడం, వరదలు, తుపాన్లు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రాణ నష్టం సంభవిస్తుంది. దీన్నే భూతాపం (గ్లోబల్ వార్మింగ్) అంటారు. అలాగే వాతావరణంలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ మిశ్రమాల వల్ల ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయి. సల్ఫర్ డై ఆక్సైడ్ పెరిగి వివిధ పత్రాలు, లైబ్రరీ పుస్తకాలు పసుపు రంగులోకి మారుతున్నాయి.
        భూఉపరితలానికి 30 - 35 కి.మీ. ఎత్తులో ఉన్న స్ట్రాటో పొర అతినీలలోహిత కిరణాల నుంచి జీవరాశిని రక్షిస్తుంది. దీన్నే ఓజోన్ పొర (O3) అంటారు. రిఫ్రిజిరేటర్లు, ఏసీ, మిక్సీలు, క్లీనింగ్ సాల్వెంట్లు, క్లోరోఫ్లోరో కార్బన్‌ల (CFCs) వల్ల ఓజోన్ పొర పలచబడి దానికి రంధ్రాలు ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు తీవ్రనష్టం జరుగుతుంది. వాయు కాలుష్యం వల్ల చర్మ, శ్వాసకోశ, మెదడు, గుండె, కంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయి.

 

నేల కాలుష్యం
        వివిధ వ్యర్థ పదార్థాల మిశ్రమం వల్ల భూమి యొక్క జీవ - భౌతిక - రసాయన ధర్మాల్లో మార్పులు ఏర్పడి, భూమి ఉత్పత్తి సామర్థ్యం తగ్గి నేల కాలుష్యం ఏర్పడుతుంది. భూ నాణ్యత కోల్పోవడాన్ని భూమి క్షీణత/కాలుష్యం అంటారు.
        భూమికోత, ఎడారీకరణ, లవణీకరణ, ఆమ్లీకరణ, అధిక పరిమాణంలో రసాయనాలు భూమిలోకి చొచ్చుకుపోయి భూసారం కోల్పోవడం వల్ల భూమి నాణ్యత క్షీణిస్తుంది. భూఉపరితలంపై ఉన్న సారవంతమైన పొర కొట్టుకుపోవడాన్ని భూమికోత అంటారు. విచక్షణా రహితంగా అడవులను నరికి పంటపొలాలుగా మార్చడం వల్ల ఇది ఏర్పడుతుంది.

ఎడారీకరణ
        ఎడారి భూములు నిస్సారంగా, ఇసుకతో ఉండి కఠినమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. పశువులు మేయడం, వృక్షాలను వంటచెరుకుగా ఉపయోగించడం, అడవులను నరకడం, క్షారీకరణ, లవణీకరణ వల్ల భూములు ఎడారులుగా మారుతున్నాయి.

లవణీకరణ
        భూమిలో లవణాలు కేంద్రీకృతమవడం సహజంగా లేదా మానవ చర్యల వల్ల జరుగుతుంది. సముద్ర తరంగాలు, వాయుగుండాలు, వరదల వల్ల నేల లవణీకరణం చెందుతుంది. దీనితో పాటు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం; కృత్రిమ నీటి సదుపాయాలైన కాలువలు, గొట్టపుబావుల ద్వారా సేద్యం చేయడం వల్ల లవణీకరణ ఏర్పడుతుంది.

 

ఆమ్లీకరణ
        వాతావరణంలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ పెరగడంతో ఆమ్లవర్షాలు కురిసి భూఉపరితలంపై ఆమ్లీకరణ జరుగుతుంది. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు భూమిలోకి చొచ్చుకుపోవడం, భూ నాణ్యతను కాపాడే బ్యాక్టీరియా, వానపాములు లాంటి సూక్ష్మజీవులు అంతరించడం వల్ల భూ కాలుష్యం ఏర్పడుతుంది.

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కరవులు - వరదలు

మాదిరి ప్రశ్నలు

1. జాతీయ వరద నియంత్రణ మండలిని (NFCB) ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1954

 

2. భారతదేశ భౌగోళిక వైశాల్యంలో ఎంత శాతాన్ని 'కరవు పీడిత' ప్రాంతంగా గుర్తించారు?
జ: 68%

 

3. భారత వాతావరణ శాఖ (IMD) న్యూదిల్లీ కరవును ఎన్ని రకాలుగా వర్గీకరించింది?
జ: 5

 

4. ఆకస్మిక వరదలు (Flash Floods) ఎప్పుడు వస్తాయి?
a) ఉరుములు, తుపాన్లు వచ్చినప్పుడు
b) అధిక వర్షం వల్ల నదులు ఉప్పొంగినప్పుడు
జ: a, b సరైనవి

 

5. 'జాతీయ వ్యవసాయ కమిషన్' ప్రకారం మృత్తిక తేమ కోల్పోవడం ఏ రకమైన కరవు?
జ: వ్యవసాయ కరవు

 

6. భారతదేశంలో ఆకస్మిక వరదలు ఎక్కువగా ఏ నది వల్ల సంభవిస్తుంటాయి?
జ: బ్రహ్మపుత్ర

 

7. 'హాలోజెన్' బిళ్లలను దేనికి ఉపయోగిస్తారు?
జ: నీటిని శుద్ధిచేయడానికి

 

8. వరదలు వస్తున్నప్పుడు భూజల తలాన్ని కొలవడానికి, ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడానికి ఉపయోగించే సాధనం?
జ: నైలో మీటర్

 

9. ఒక ప్రాంతంలో కరవును ఎంత శాతం వర్షపాతం నమోదైతే చాలా తక్కువ అని (-) గుర్తిస్తారు?
జ: సగటు కంటే 60% నుంచి 99% తక్కువ వర్షం

 

10. ప్రభుత్వం కరవు ప్రభావాన్ని తగ్గించడానికి కింది ఏ పథకాల ద్వారా కృషి చేస్తుంది?
(a) సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకం
(b) భూగర్భ జలాలను పెంచడానికి ఇంకుడు గుంతల పథకం
జ: a, b సరైనవి

 

11. పట్టణ వరదలు ఏ మంత్రిత్వ శాఖ నిర్వహణలో ఉంటాయి?
జ: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ

 

12. భూ ఉపరితలంపై ఎంత మొత్తం నీరు ఉప్పొంగినప్పుడు వరదగా నమోదు చేస్తారు?
జ: 12 అంగుళాలు

 

13. కరవు అనేది?
జ: నిదాన ప్రక్రియ


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. కిందివాటిలో నిదానంగా విస్తరించే విపత్తు? (ఏఎస్ఓ-2017)
1) రసాయనిక                            2) భూకంపం
3) కొండ చర్యలు విరగడం           4) కరవు
జ: 4 (కరవు)

 

2. కిందివాటిలో మానవ ప్రేరేపిత విపత్తు ఏది? (ఏఎస్ఓ-2017)
1) చెన్నై వరదలు              2) చెన్నై సునామీ
3) కేదార్‌నాథ్ వరద          4) తక్కువ వర్షం
జ: 1 (చెన్నై వరదలు)

 

3. క్షామం వల్ల ఎవరు ఎక్కువగా బాధపడతారు? (గ్రూప్-4, 2012)
జ: మహిళలు

 

4. భారతదేశంలో కరవు దేనితో ముడిపడి ఉంది? (పంచాయతీ కార్యదర్శి - 2013)
జ: రుతు పవనాలు

 

5. కిందివాటిలో ఏది కరవు నివారణా చర్య కాదు? (గ్రూప్-2, 2011)
1) చెక్‌డ్యామ్‌ల నిర్మాణం                            2) చెరువులు పూడిక తీయడం 
3) పొలంలో ఇంకుడు గుంత తవ్వడం         4) మొక్కలు నాటడం
జ: 4 (మొక్కలు నాటడం)

 

6. ''విపత్తులన్నీ ఆపదలే, కానీ ఆపదలన్నీ విపత్తులు కావు" ఈ ప్రకటన - (డిప్యూటీ సర్వేయర్-2017)
జ: నిజమైంది

 

7. భారతదేశంలో వరదలకు గురయ్యే ప్రదేశం సుమారు ఎంత శాతం ఉంది? (గ్రూప్-2, 2012)
జ: 12%

 

8. 2016 కరవు నిర్వహణ కరదీపిక ప్రకారం దీర్ఘకాలిక కరవును ఎంత వర్షపాతం ఉంటే ప్రకటిస్తారు? (గ్రూప్-1, 2017)
జ: 750 mm కంటే తక్కువ


 

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కాలుష్యం

యావత్తు భూమండలం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటి. మానవ జీవనం ప్రశాంతంగా సాగిపోవడానికి తోడ్పడే ప్రకృతిని దారుణంగా దెబ్బతీస్తున్న కాలుష్యం ఫలితంగా ఎన్నో దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. ప్రధాన జీవాధారాలైన గాలి, నీరు, పర్యావరణం తీవ్రంగా కలుషితం అవుతున్నాయి. ఇందుకు దారితీసిన పరిస్థితులు, అనంతర పరిణామాలపై టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం అందిస్తున్న అధ్యయన సమాచారం..


భూగోళం నాలుగు ఆవరణాలతో కూడి ఉంది. అవి శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. ఈ ఆవరణాలన్నింటిని కలిపి పర్యావరణం అంటారు. ఒక జీవి చుట్టూ ఉండే భౌతిక, రసాయనిక, జీవ పరిస్థితులను పర్యావరణం లేదా పరిసరాలు అని చెప్పవచ్చు. ఈ పర్యావరణాన్ని అనేక రకాల కాలుష్యాలు దెబ్బతీస్తున్నాయి.


కాలుష్యం అంటే..?
భౌతిక, థర్మల్, జైవిక, రేడియోధార్మిక ధర్మాల్లో సంభవించే మార్పులు జీవుల ఆరోగ్యం, భద్రతకు హాని కలిగించే విధంగా ఉంటే దాన్ని కాలుష్యంగా పరిగణిస్తారు. ప్రస్తుత సమాజంలో వేగంగా విస్తరిస్తున్న ఆరోగ్య సమస్యలకు కాలుష్యమే ప్రధానమైన కారణం. కాలుష్యానికి గురవుతున్నవారిలో మహిళలు, పిల్లలే ఎక్కువ. 1972 జూన్ 5న స్టాక్‌హోంలో ప్రపంచ పర్యావరణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగంలో పర్యావరణ ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రకృతి, పర్యావరణం గురించి చర్చించిన అధర్వణ వేదంలోని కొన్ని అంశాలను ప్రస్తావించారు. పూర్వీకులు ప్రకృతిని ఆరాధించేవారని.. భూమి, గాలి, నీరు, ఆకాశం, అంతరిక్షం - వీటిలోని సమస్త జీవ జాతులన్నింటిలోనూ శాంతి పరిఢవిల్లాలని ప్రార్థించేవారని తన ప్రసంగంలో పేర్కొన్నారు. పర్యావరణం కలుషితం కాకుండా చూడాలని, ప్రకృతి సమతౌల్యం సాధిస్తేనే భూమండలంపై ఉన్న సమస్త జీవులు సురక్షితంగా ఉండగలుగుతాయని పిలుపునిచ్చారు.


కాలుష్య కారకాలు
జనాభా విస్ఫోటమే అన్ని రకాల కాలుష్యానికి ప్రధాన కారణం. తారు, చెత్త లాంటి వ్యర్థ పదార్థాలు; సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, అమ్మోనియం, ఫ్లోరిన్, క్లోరిన్, హైడ్రోజన్ లాంటి వాయువులు; ఫ్లోరైడ్ లాంటి రసాయన పదార్థాలు; సీసం, ఇనుము, జింకు, పాదరసం లాంటి మూలకాలు; హెర్బిసైడ్లు, క్రిమిసంహారక మందులు, కృత్రిమ ఎరువులు, రేడియో ధార్మిక పదార్థాలు, శబ్దం, అధిక ఉష్ణం.. ఇవన్నీ కాలుష్య కారకాలే. జనాభా విపరీతంగా పెరగడంతో నీటి వినియోగం కూడా ఎక్కువైంది. ఇది కూడా కాలుష్యానికి కారణమవుతోంది.


జల కాలుష్యం
సమస్త జీవులకు నీరు ప్రాణాధారం. తాగడానికి, పంటలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు, మానవ నిత్యావసరాలకు నీరు చాలా అవసరం. జల కాలుష్యంతో నీటి స్వభావం మారిపోతోంది. ఉపయోగానికి పనికి రాకుండా పోతోంది. అంతేకాదు దాని ఉపయోగం ప్రమాదకరం కూడా. అన్ని ప్రాంతాల్లో కావాల్సినంత పరిమాణంలో మంచినీరు లభించడం లేదు.


ప్రాణకోటికి ప్రమాదకరమైన అదనపు పదార్థాలు నీటిలో కలవడాన్ని జల కాలుష్యంగా నిర్వచించవచ్చు. ఇది జీవరాశులకు తీవ్రమైన హాని కలిగిస్తుంది. స్వచ్ఛమైన నీటిలో ఆక్సిజన్, హైడ్రోజన్, సేంద్రీయ సమ్మేళనాలు, ఫాస్ఫేట్‌లు, ఒండ్రుమట్టి, సూక్ష్మజీవులు లాంటివి కలిసి ఉంటాయి. కాలుష్యం వల్ల వీటి మధ్య సమతౌల్యం దెబ్బతింటుంది.


జల కాలుష్య కారకాలు
1) మురుగు వ్యర్థ పదార్థాలు
2) అంటు వ్యాధుల ఏజెంట్లు
3) విదేశీ సేంద్రీయ రసాయనాలు
4) రసాయనిక ఖనిజ పదార్థాలు, సమ్మేళనాలు


పర్యావరణ సమస్యలు
పరాన్నజీవులు, సూక్ష్మజీవులను తనలో ఇముడ్చుకుని నీరు కలుషితమవుతుంది. వాస్తవానికి ఎన్నో వ్యాధులు, ఇతర పర్యావరణ ప్రమాదాల కంటే నీటి కాలుష్యమే ప్రధానమైంది. విపరీతంగా పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ వల్ల స్వచ్ఛమైన నీటికి కొరత ఏర్పడుతోంది. కలుషిత నీరు వివిధ రోగాలకు కారణమవుతోంది. భారతదేశంలో 80 శాతం వ్యాధులు జల కాలుష్యం వల్ల సంభవిస్తున్నాయి.


నీటి కాలుష్య దుష్ఫలితాలు
* కలరా, టైఫాయిడ్, విరోచనాలు లాంటి వ్యాధులు సంక్రమించడం.
* జలచరాలు.. ముఖ్యంగా చేపలు చనిపోవడం. దాంతో జల ఆహార నిల్వలు తగ్గిపోవడం.
* నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో దంతాలపై ఉండే ఎనామిల్ ఊడిపోవడం, గారకట్టడంతోపాటు ఎముకలు దెబ్బతినడం.
* నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటే చిన్నపిల్లల రక్తం నీలిరంగులోకి మారి ఒక రకమైన వ్యాధి బారిన పడటం.
* నీటిలో ఫాస్ఫేట్‌లు ఎక్కువై జలచరాలు చనిపోవడం.
* నీటిలో కొన్నిరకాల విష రసాయనాల ప్రమాణం ఎక్కువైన సందర్భాల్లో పిల్లలు కురూపులు, వికలాంగులుగా జన్మించడం.


నివారణ చర్యలు
* పారిశ్రామిక మురుగులో సేంద్రీయ పదార్థాలైన కర్బనం, నత్రజని, గంధకం, సీసం, పాదరసం లాంటి రసాయనాలు ఉంటాయి. ఈ మురుగు సహజ నీటివనరుల్లో కలిస్తే అవి కలుషితం అవుతాయి.
* పరిశ్రమలు విడుదల చేసే మురుగును శుద్ధిచేసే బాధ్యతను ఆయా పారిశ్రామిక యాజమాన్యాలే నిర్వహించి, మురుగు శుద్ధి కర్మాగారాలను నెలకొల్పాలి.
* ఇళ్లలోని మురుగుకోసం ఆక్సిడేషన్ సాండ్స్, సెప్టిక్ ట్యాంకులను ప్రతి ఇంటిలో నిర్మించుకోవాలి. మురుగునీటిని శుద్ధి చేయకుండా వదలడం శిక్షార్హమైన నేరం.
* కాలుష్య నియంత్రణ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించాలి.
* కాలుష్య నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి.


ధ్వని కాలుష్యం
మనం వినగలిగే శబ్దాల మోతాదుకు మించి వినే శబ్దాన్నే ధ్వని కాలుష్యం అనవచ్చు. వాహనాలు, పరిశ్రమలు, లౌడ్ స్పీకర్లు వంటివి ధ్వని కాలుష్య కారకాలు.
బహిరంగ ప్రదేశాల్లో ఉదయం 50 డెసిబుల్స్‌కి మించని ధ్వని ఆరోగ్యకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నివేదికలు తెలుపుతున్నాయి. పర్యావరణ నిపుణులు ధ్వని కాలుష్యం సుమారు 70 డెసిబుల్స్ స్థాయిని మించి ఉండరాదని చెబుతున్నారు. వివిధ పట్టణాలు, నగరాల్లో రద్దీ సమయాల్లో ప్రధాన రహదారుల్లో ధ్వని కాలుష్యం 90 నుంచి 110 డెసిబుల్స్ వరకు ఉంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాలు, పరిమితుల ప్రకారం.. ధ్వని తీవ్రత పారిశ్రామిక వాడల్లో రాత్రి 65 డెసిబుల్స్, పగలు 75 డెసిబుల్స్; నివాస ప్రాంతాల్లో రాత్రి 45 డెసిబుల్స్, పగలు 55 డెసిబుల్స్; ఆస్పత్రుల వద్ద రాత్రి 45 డెసిబుల్స్, పగలు 50 డెసిబుల్స్ మించి ఉండకూడదు.
* రైల్వేలు, పరిశ్రమలు, నిర్మాణ రంగ కార్యకలాపాలు, ప్రజా సమూహాలు, లౌడ్ స్పీకర్‌లు.. ఇవన్నీ ధ్వనిని వ్యాప్తి చేస్తాయి. ధ్వని ఎక్కువగా ఉన్నప్పుడు పర్యావరణంలో అసమతౌల్యం ఏర్పడుతుంది. ఇలా నిరంతర ధ్వని కాలుష్య ప్రభావం వల్ల శ్రామిక సామర్థ్యం, వారి వృత్తిపరమైన పనితీరు క్షీణిస్తుంది.


ధ్వని కాలుష్య సమస్యలు
* నిద్రలేమి
* తొందరగా అలసిపోవడం
* వికారం, అధిక రక్తపోటు
* అల్సర్లు, రక్తహీనత, నరాలపై తీవ్ర ప్రభావం
* తలనొప్పి, శ్వాస సంబంధ వ్యాధులు, వినికిడి సమస్యలు
* మెదడు, నాడీ వ్యవస్థ క్రమంగా దెబ్బతిని, చికాకు పెరగడం.


వాయు కాలుష్యం
వాతావరణంలో వాయువులు సాధారణ నిష్పత్తిలో ఉన్నంత వరకు కాలుష్యం ఉండదు. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, ధూళి కణాలు, పొగ, పొగమంచు లాంటివి గాలిలో అధికంగా చేరడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది.


వాయు కాలుష్య కారణాలు
* నిబంధనలను పాటించని వ్యవసాయ కార్యకలాపాలు
* పదార్థాల దహనం
* యంత్రాల సహాయంతో జరిగే ఉత్పత్తి ప్రక్రియలు
* ద్రావణాల ఉపయోగం
* అణుధార్మిక పదార్థాల వినియోగం


దుష్ప్రభావాలు
వాయు కాలుష్యం మానవుడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది శ్వాస, రక్త ప్రసరణ వ్యవస్థల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
* కార్బన్ మోనాక్సైడ్ రక్తంలోని హిమోగ్లోబిన్‌తో కలిసిపోయి శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది.
* సల్ఫర్ డై ఆక్సైడ్ ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపుతుంది. ఆస్తమాకు కారణమవుతూ, మరణాల రేటును పెంచుతుంది.
* నైట్రోజన్ డై ఆక్సైడ్ - బ్రాంకైటీస్, ఆస్తామా వ్యాధులను కలిగిస్తుంది.
* గాలిలో అధిక పరిమాణంలో ఉన్న సీసం ఎముకలు, కాలేయం, గుండె, మూత్రపిండాల పనితీరుపై చెడుప్రభావాన్ని చూపుతుంది.
* శిలాజ ఇంధనం అధికంగా వాడటం వల్ల గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగి హరితగృహ ప్రభావానికి దారితీస్తుంది.


నివారణ చర్యలు
* వాయు కాలుష్యాన్ని నివారించేందుకు బ్యాగ్ ఫిల్టర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్పిటేటర్స్ లాంటి నియంత్రణ పరికరాలను ఉపయోగించాలి.


రేడియో ధార్మిక కాలుష్యం
రేడియేషన్‌కు గురికావడం ప్రకృతి సహజమే అయినా అణువిద్యుత్తు, అణ్వస్త్రాల ఉత్పత్తి భారీస్థాయిలో చేపట్టడం వల్ల మానవులు భారీ పరిమాణంలో రేడియేషన్‌కు గురవుతున్నారు. ఆయా సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ప్రత్యక్షంగా రేడియో ధార్మికతకు గురవుతున్నారు. ఫలితంగా క్యాన్సర్, జన్యు సంబంధ వ్యాధులబారిన పడుతున్నారు. పిల్లలు అనారోగ్యంతో జన్మిస్తున్నారు.


ముఖ్యాంశాలు
* ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతున్న ప్రధాన సమస్యల్లో పర్యావరణ కాలుష్యం ఒకటి.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో తేలిందేమిటంటే.. ఒక్క భారతదేశంలోని ఆరు ప్రధాన నగరాల్లోనే ఏటా సుమారు 40-50 వేల మంది కాలుష్యం వల్ల చనిపోతున్నారు.
* భారతదేశంలోని సహజ నీటి వనరుల్లో సుమారు 80 శాతం నీరు కలుషితమై.. మనుషులు, జంతువులు, పశుపక్ష్యాదులకు కూడా తాగడానికి పనికిరావడం లేదని ఇటీవల ఒక సర్వేలో తేలింది.
* తెలంగాణలో గోదావరి నదీతీరం వెంబడి ఉన్న సిర్‌పూర్‌లో కాగితపు వ్యర్థాలు, అక్కడి ప్రజలు గోదావరిలోకి వదిలే కాలుష్యాలు ఏటూరునాగారం ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. ఈ రెండు ప్రాంతాల కలుషితాల ప్రభావం భద్రాచలం మీద ఉంటుంది.
* ప్రపంచం మొత్తం వాతావరణ కాలుష్యంలో సగానికి పైగా కాలుష్యానికి ఒక్క అమెరికాయే కారణమవుతోంది.


అత్యంత కలుషితమై'నది' గంగా
భారతదేశంలోని గంగానది సుమారు 1760 కి.మీ.ల మేర కలుషితమై ప్రపంచంలో అత్యంత పొడమైన కలుషిత నదిగా మారడంతో.. ఈ పరిస్థితిని నివారించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం రూ. 10 వేల కోట్లను కేటాయించింది. 'గంగానది ప్రక్షాళన' పేరుతో కేంద్ర జలవనరుల సంఘం నివారణ చర్యలు చేపడుతోంది. దీనికి ప్రధాన కారణం.. దేశ విస్తీర్ణంలో గంగానది పరివాహక ప్రాంతం 8.61 లక్షల చదరపు కిలోమీటర్లు (1/4వ వంతు) ఉండి.. 45 కోట్ల మంది ప్రజలు జీవిస్తుండటమే.

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం

అంత‌టా ఆవ‌రించి... స‌మ‌స్త జీవుల‌ను సంర‌క్షించి!


సమస్త జీవరాశుల మనుగడకు ఆధారం, ప్రకృతిని సమతౌల్య స్థితిలో నడిపించే సహజసిద్ధ చర్యల సమాహారం పర్యావరణం. అందరూ ఆరోగ్యంగా జీవించాలంటే పరిశుభ్రమైన పరిసరాలు ఎంతో అవసరం. అందుకే పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ వ్యాప్తంగా కృషి జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల సిలబస్‌లో ఈ విభాగానికి ప్రాధాన్యం ఉంది. దానిపై అభ్యర్థులు స్థూల అవగాహన ఏర్పరచుకోవాలి.

 

పర్యావరణం 

నిర్దిష్ట కాలవ్యవధిలో ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ఉన్న జీవ, నిర్జీవ ఘటకాల మొత్తాన్ని పర్యావరణం అంటారు. ఆంగ్లంలో ‘ఎన్విరాన్‌మెంట్‌’ అని వ్యవహరిస్తారు. ఎన్విరాన్‌ అనే ఫ్రెంచి పదం నుంచి దీన్ని గ్రహించారు. ఎన్విరాన్‌ అంటే ‘చుట్టూ ఆవరించి ఉన్న’ లేదా ‘చుట్టుకొని ఉండటం’ అని అర్థం.

 

లక్షణాలు:

* పర్యావరణంలో ఆవరణ వ్యవస్థ నిర్మాణం ప్రధానమైంది. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించే జీవుల్లో వైవిధ్యం, జీవుల ఆవాసాలు, ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న శక్తి వనరులన్నీ ఆవరణ వ్యవస్థ నిర్మాణంగా పేర్కొనవచ్చు.

* ఆవరణ వ్యవస్థ సమతౌల్యాన్ని కాపాడటం పర్యావరణ వ్యవస్థ ముఖ్య లక్షణం.

* పర్యావరణం ఒక గతిశీల వ్యవస్థ. ప్రాంతం, కాలాన్ని బట్టి అనేక మార్పులకు లోనవుతుంది. 

* జీవుల మధ్య విధిపూర్వక సంబంధాలు; జీవ, నిర్జీవ అంశాల మధ్య జరిగే అంతఃచర్యలపై పర్యావరణ మనుగడ ఆధారపడి ఉంటుంది.

* పర్యావరణ నిర్వహణ విధానం దానిలోని శక్తి ప్రవాహాలపై ఆధారపడి ఉంటుంది.

* పర్యావరణం దానికి కావాల్సిన పదార్థాలను ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే ఆ పదార్థాలు ప్రాంతం, శీతోష్ణస్థితి ఆధారంగా మారుతూ ఉంటాయి.

 

విధులు:

* మానవుడి మనుగడకు, ఆర్థిక వస్తువుల ఉత్పత్తికి అవసరమైన సహజ వనరులను అందిస్తుంది.

* ఆర్థిక కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యే వ్యర్థాలు, కాలుష్యాలను విలీనం చేసుకుంటుంది.

* జీవావరణ సమతౌల్యాన్ని కాపాడటానికి అవసరమైన ప్రాణాధార చర్యలు, సేవలను అందిస్తుంది.

* మానవుడి ప్రభావం లేనంత వరకు జీవవైవిధ్య సమతౌల్యాన్ని కాపాడుతుంది.

* జీవి మనుగడకు అనుగుణమైన ప్రకృతి సేవలను అందిస్తుంది.

జీవ, నిర్జీవ వనరుల మధ్య జీవ, భూరసాయన అంతఃచర్యల వల్ల జీవ జాతులకు కావాల్సిన ఆహారం, ఆవాసం, నీరు లాంటి ప్రాథమిక అవసరాలు అందుతున్నాయి. అందువల్ల పర్యావరణాన్ని సాధారణంగా రెండు అనుఘటకాలుగా విభజించవచ్చు.

జీవ అనుఘటకాలు: ప్రాణం ఉండి తమ జీవనచర్యల ద్వారా ప్రతి జీవి ప్రాథమిక అవసరాలు తీర్చేవి.

ఉదా: వృక్షాలు, మొక్కలు, గడ్డి (ప్రాథమిక ఉత్పత్తిదారులు), జంతువులు (వినియోగదారులు), సూక్ష్మజీవులు (విచ్ఛిన్నకారులు)

నిర్జీవ అనుఘటకాలు: ఇవి ప్రాణం లేనివి అయినా తమ చర్యల ద్వారా జీవుల మనుగడకు సహకరిస్తుంటాయి. 

ఉదా: భౌతికపరమైనవి - నేల, నీరు; శీతోష్ణపరమైనవి - కాంతి, ఉష్ణం, గాలి, వర్షపాతం; రసాయనపరమైనవి - సేంద్రియపరమైన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, లిపిడ్లు, నిరేంద్రియపరమైన కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం.

 

రెండు రకాలు

మానవుడి ప్రమేయం ఆధారంగా పర్యావరణాన్ని రెండు రకాలుగా పేర్కొంటున్నారు.

మానవ నిర్మిత పర్యావరణం: మనిషి మనుగడ సాగించడానికి సమాజం, కుటుంబం, వివాహ వ్యవస్థ లాంటి సాంఘిక పర్యావరణాన్ని ఏర్పరచుకుంటాడు. అలాగే పండుగలు, కట్టుబాట్లు లాంటి సాంస్కృతిక పర్యావరణాన్ని; వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమల స్థాపనకు సంబంధించిన ఆర్థిక పర్యావరణాన్ని; ఎన్నికల్లో పాల్గొనడం, చట్టాలు చేయడం లాంటి రాజకీయ పర్యావరణాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. దీన్నంతా కృత్రిమ పర్యావరణంగా పేర్కొనవచ్చు.

సహజసిద్ధ పర్యావరణం: దీన్ని ప్రకృతిసిద్ధ పర్యావరణం అని కూడా అంటారు. ఇది మానవుడి ప్రభావం లేకుండా భూమిపై సహజసిద్ధమైన అంశాలతో ఏర్పడిన పర్యావరణం. దీన్ని నాలుగు రకాలుగా విభజించారు. 

1) శిలావరణం (లిథో స్ఫియర్‌): భూఉపరితలం నుంచి సుమారుగా 60 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఘనస్థితిలోని భూమికి చెందిన మొదటి లేదా బాహ్యపొరనే శిలావరణం అంటారు. ఇది వివిధ భౌమ కాలాల్లో అంతర్గత, బహిర్గత బలాలకు లోనుకావడంతో పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు లాంటి భూస్వరూపాలు ఏర్పడతాయి. శిలావరణం భూమిపై సమస్త జీవరాశులకు ఆవాసాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మృత్తికలు, నీరు, అటవీ వనరులు, శక్తి వనరులు, ఖనిజ వనరులను అందించి మానవుడి సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి; జీవన మనుగడకు ఆధారంగా ఉంది.

2) జలావరణం: భూమి ఉపరితలంపై 71% నీరు ఆవరించి ఉంది. నీరు ఆవిరై మేఘాలుగా మారి తిరిగి భూమి మీదకు వర్షించే జలచక్రీయ ప్రక్రియ వల్లే సమస్త జీవులు మనుగడ సాగిస్తున్నాయి. 

*************

భూమిపై జలాల పంపిణీ

మహాసముద్రాలు, ఉప్పునీటి సరస్సులు - 97.20%

మంచు కప్పిన ప్రాంతాలు, గ్రేసియర్స్‌ - 2.15% 

భూగర్భజలాలు - 0.64% 

సరస్సులు, నదులు, సెలయేళ్లు - 0.0085%

వాతావరణం - 0.00015%

*************

3) వాతావరణం: భూమిపై జీవజాతి ఆవిర్భావం, జీవుల మనుగడకు కావాల్సిన అనువైన శీతోష్ణస్థితి ఏర్పరచడంలో వాతావరణం కీలకపాత్ర పోషిస్తుంది. భూమి ఉపరితలం నుంచి దాదాపు 1600 కి.మీ. వరకు భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలిపొరనే వాతావరణం అంటారు. దీన్ని ట్రోపో ఆవరణం,  స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం, ఐనో ఆవరణం, ఎక్సో ఆవరణం అని అయిదు రకాలుగా విభజించారు. భూమిని ఆవరించి ఉన్న మొదటి వాతావరణ పొర ట్రోపో ఆవరణం భూమి మీద పర్యావరణానికి అత్యంత ముఖ్యమైంది. దీనిలో వాయు పదార్థాలు, మేఘాలు ఏర్పడటం, వర్షాలు కురవడం, గాలులు వీయడం, ఉష్ణోగ్రత నియమాలు అన్నీ కలసి పర్యావరణానికి సహకరిస్తాయి. అందువల్ల దీన్ని మిశ్రమ ఆవరణం అని కూడా పిలుస్తారు. ట్రోపో ఆవరణంలో నైట్రోజన్‌ వాయువు 78.08%, ఆక్సిజన్‌ 20.95% ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో ఆర్గాన్, కార్బన్‌ డై ఆక్సైడ్, నియాన్‌ లాంటి వాయువులు విస్తరించి ఉన్నాయి.

4) జీవావరణం: భూమి మీద ఆవరించి ఉన్న సమస్త జీవరాశిని జీవావరణంగా పిలుస్తారు. ఇది శిలావరణం, జలావరణం, వాతావరణం కలుసుకునే సంధి ప్రాంతంలో జరిగే మార్పిడి వల్ల జీవజాతుల ఆవిర్భవానికి, వాటి మనుడగకు కావాల్సిన అనుకూల పరిస్థితులను ఏర్పరచుకుంటుంది. ఈ విధంగా ఒక ఆవరణ వ్యవస్థ నుంచి మరొక ఆవరణ వ్యవస్థకు, ఒక ఆవరణంలోనే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి జరిగే శక్తి బదిలీ ద్వారా పర్యావరణం తన ప్రక్రియలను నిర్ణయించుకుంటుంది.

రచయిత: జల్లు సద్గుణరావు

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  చక్రవాతాలు - సునామీ

‣ పర్యావరణం - జీవ వైవిధ్యం

‣ వరద విపత్తులు

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 29-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం

మాదిరి ప్రశ్నలు


1. గాలిలో సూక్ష్మ పరిమాణాల్లో ఉన్న వాయువులను ట్రేస్‌గ్యాసెస్‌ అంటారు. వాటిని అవరోహణ క్రమంలో అమర్చండి.
1) కార్బన్‌ డై ఆక్సైడ్, నియాన్, హీలియం      2) నియాన్, హీలియం, కార్బన్‌ డై ఆక్సైడ్‌
3) హీలియం, నియాన్, కార్బన్‌ డై ఆక్సైడ్‌      4) కార్బన్‌ డై ఆక్సైడ్, హీలియం, నియాన్‌

 

2. స్ట్రాటో ఆవరణలో విస్తరించి ఉన్న ఓజోన్‌ పొర విధి?
1) సూర్యుడి నుంచి వస్తున్న అతినీలలోహిత కిరణాలను వడపోసి భూమికి పంపిస్తుంది.
2) సూర్యుడి నుంచి వస్తున్న అతినీలలోహిత కిరణాలను శోషించుకుంటుంది.
3) సూర్యుడి నుంచి వస్తున్న అతినీలలోహిత కిరణాలను వెనుకకు పంపిస్తుంది.
4) సూర్యుడి నుంచి వస్తున్న అతినీలలోహిత కిరణాలను కార్బన్‌ డై ఆక్సైడ్‌గా మార్చి భూమి చుట్టూ వేడి పెంచుతుంది.

 

3. పర్యావరణ సమతౌల్యం కింది ఏ సందర్భంలో అవసరం?
1) జీవులు, వాటి పరిసరాలకు మధ్య సంబంధాలు అనుకూలంగా ఉన్నప్పుడు
2) జీవులు, వాటి పరిసరాలకు మధ్య సంబంధాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు
3) ప్రకృతి చర్యల వల్ల పర్యావరణం పరిరక్షించబడుతున్నప్పుడు
4) ఏదీకాదు

 

4. కిందివాటిలో సరైంది?  
ఎ) జలావరణం అనేది రసాయన సంఘటనం 
బి) శిలావరణం జీవుల ఆవాసం
సి) జీవావరణం అనేది జీవ, భూరసాయనాలు
1) ఎ, బి, సి     2) బి, సి       3) ఎ, బి      4) ఎ, సి

 

5. జీవావరణం ప్రక్రియ 
1) శిలావరణం, జలావరణం సంయోగ చర్య     2) జలావరణం, వాతావరణం సంయోగ చర్య
3) వాతావరణంతో మాత్రమే సంయోగ చర్య    4) శిలావరణం, జలావరణం, వాతావరణంతో సంయోగం చెందేది 

 

6. భూమిని కప్పి ఉన్న మంచు ప్రాంతాలు, హిమానీనదాల్లో ఎంత నీరు దాగి ఉంటుంది?
1) 21.5%      2) 2.15%      3) 20%      4) 97%

 

7. భూమి మీద ఉన్న మహాసముద్రాలను బ్లూ కార్బన్‌ సింక్‌గా, అడవులను గ్రీన్‌ కార్బన్‌ సింక్‌గా పిలుస్తారు. కిందివాటిలో పెద్ద గ్రీన్‌ కార్బన్‌ సింక్‌ ఏది?
1) అమెజాన్‌ నదీ పరీవాహక ప్రాంతం      2) రష్యాలోని సైబీరియా ప్రాంతం
3) హిమాలయాల అడవులు           4) ధ్రువ గడ్డిజాతులు

 

8. వాతావరణంలో అధిక శాతంలో ఉన్న జడవాయువు?
1) ఆర్గాన్‌      2) నియాన్‌      3) హీలియం      4) హైడ్రోజన్‌

 

9. భూమిని ఆవరించి ఉన్న వాతావరణ పొరలు ఉపరితలం నుంచి వాతావరణానికి ఏ క్రమంలో ఉంటాయి?
1) ట్రోపో, స్ట్రాటో, మీసో, ఐనో, ఎక్సో ఆవరణాలు 
2) ట్రోపో, మీసో, ఐనో, స్ట్రాటో, ఎక్సో ఆవరణాలు 
3) స్ట్రాటో, ట్రోపో, ఐనో, మీసో, ఎక్సో ఆవరణాలు 
4) ట్రోపో, స్ట్రాటో, థర్మో, మీసో, ఎక్సో ఆవరణాలు 

 

10. గాలిలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతం ఎంత?
1) 0.03%      2) 0.005%     3) 0.3%      4) 2.15% 

 

సమాధానాలు
1-1,   2-2,  3-2,   4-2,   5-4,   6-2,   7-1,   8-1,   9-1,   10-1.
 

Posted Date : 29-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు నిర్వహణ - భావ‌న‌లు

మాదిరి ప్రశ్నలు

1. డిజాస్టర్‌ అనే పదం కింది ఏ భాష నుంచి వచ్చింది?

1) లాటిన్‌     2) అరబ్‌    3) గ్రీకు     4) స్పానిష్‌


2. విపత్తు జరగడానికి అవకాశమున్న హానికరాల్లో కానిది ఏది?

1) పేదరికం     2) జనాభా విస్తృతి    3) ప్రదేశం    4) మతం


3. విపత్తు ఎప్పుడు సంభవిస్తుంది?

1) భగవంతుడి నిర్ణయం ప్రకారం    

2) సాధారణంగా రాత్రుల్లో 

3) ప్రజలు 25 ప్రమాద ఘటన ప్రభావాన్ని తట్టుకోలేనప్పుడు  

4) ఏదీకాదు


4. ఒక సమస్య విపత్తుగా మారకుండా ఉండటానికి తగిన చర్య ఏది?

1) వైపరీత్యా ప్రాంతానికి దూరంగా ఉండటం

2) వైపరీత్యా ప్రాంతంలో ఉండటం

3) వైపరీత్యానికి ఎదురుగా వెళ్లడం     4) పైవన్నీ


5. విపత్తుకు కొలమానం ఏది?

1) ఆస్తి నష్టం     2) ప్రాణ నష్టం    3) పర్యావరణ నష్టం     4) పైవన్నీ


6. కిందివాటిలో సామాజిక - సహజ వైపరీత్యం ఏది?

1) భూకంపాలు     2) సునామీలు     3) పట్టణ వరదలు    4) చక్రవాతాలు


7. కిందివాటిలో శీతోష్ణ సంబంధ విపత్తు ఏది?

 1) సునామీ     2) భూకంపం    3) భూపాతం    4) థండర్స్‌


8. కిందివాటిలో సరైంది?

1) అన్ని వైపరీత్యాలూ విపత్తులవుతాయి    2) అన్ని విపత్తులూ వైపరీత్యాలవుతాయి

3) ప్రతి వైపరీత్యం విపత్తుకు దారితీస్తుంది      4) పైవన్నీ 


9. విపత్తుల వల్ల ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, పర్యావరణ పరంగా దెబ్బతినకుండా ఉండాలంటే ఏంచేయాలి?

1) నష్టపరిధికి దూరంగా ఉండి, తగిన సామర్థ్యం కలిగి ఉండాలి.

2) నష్టపరిధికి దగ్గరగా ఉండి, తగిన సామర్థ్యం లేకుండా ఉండాలి.

3) నష్టపరిధి, తగిన సామర్థ్యం రెండూ ఉండాలి.

4) పైవన్నీ


10. అడవుల్లో కార్చిచ్చును కింది ఏ రకమైన విపత్తుగా పరిగణిస్తారు?

1) భౌగోళిక విపత్తు        2) జీవ సంబంధ విపత్తు

3) ప్రమాదభరిత విపత్తు     4) సామాజిక-సహజ విపత్తు

 

సమాధానాలు  

1-3,   2-4,   3-3,   4-1,   5-4,   6-3,   7-4,   8-2,   9-1,  10-3.
 

మ‌రికొన్ని ప్ర‌శ్న‌లు

 

1. అంతర్జాతీయ విపత్తు కుదింపు మూడో సదస్సు ఎక్కడ జరిగింది?
జ: 2015 మార్చి - సెండాయ్ ‌


2. కిందివాటిని జతపరచండి.

వాయువు

అంశం/ప్రభావం

i) మిథైల్‌ ఐసోసైనేట్‌

a) జైవిక వ్యవస్థ

ii) ఏజెంట్‌ ఆరెంజ్‌

b) కిరణ ధార్మిక

iii) రేడియో తరంగాలు

c) రసాయనిక

iv) మైకోటాక్సిన్స్‌

d) పారిశ్రామిక

       i    ii   iii   iv
జ:  d   c     b    a


3. రాస్టార్, వెక్టార్‌ నమూనాలు ఎందులో భాగాలు?
జ: భౌగోళిక సమాచార వ్యవస్థ


4. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ భూతల కేంద్రం (Earth Station) ఎక్కడ ఉంది?
జ: షాద్‌నగర్‌

 

5. కిందివాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగం కానిది?
1) పేదరికం, ఆకలిని నిర్మూలించడం         2) ఉత్పత్తి, వినియోగాన్ని పెంపొందించడం
3) క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం      4) లింగ సమానత్వం, మహిళా సాధికారత
జ: 3 (క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం)


6. గ్రీన్‌పీస్‌ ఉద్యమం మొదట దేనికి వ్యతిరేకంగా జరిగింది?
జ: అణు వ్యతిరేకత


7. కిందివాటిలో జల కాలుష్యం  వల్ల రాని వ్యాధి?
1) కలరా      2) కామెర్లు      3) మలేరియా      4) డయేరియా
జ: 3 (మలేరియా)


8. కిందివాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి.
1) జాతీయ హరిత ట్రైబ్యునల్‌      2) జీవ వైవిధ్య చట్టం
3) జాతీయ వన్యప్రాణి చట్టం      4) జల కాలుష్య నియంత్రణ చట్టం
జ: 3421


9. పర్యావరణంపై భారత పార్లమెంట్‌ చేసిన చట్టాల్లో సరికానిది.   
1) పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986        2) బయోస్ఫియర్‌ చట్టం - 1988
3) వాయు కాలుష్య నియంత్రణ చట్టం - 1981    4) హాట్‌స్పాట్‌ చట్టం - 2006
జ: 2 (బయోస్ఫియర్‌ చట్టం - 1988)

 

10. కిందివాటిలో సరైంది? 
a) క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం వాతావరణ మార్పునకు సంబంధించింది. 
b) మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఓజోన్‌ తరుగుదలకు సంబంధించింది.
జ: a, b సరైనవి


11. కిందివాటిలో సరికానిది? 
1) అంతర్జాతీయ సునామీ దినోత్సవం - నవంబరు 5     2) అంతర్జాతీయ అటవీ దినోత్సవం - మార్చి 20
3) అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం - ఏప్రిల్‌ 22         4) అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం - మే 22
జ: 2 (అంతర్జాతీయ అటవీ దినోత్సవం - మార్చి 20)


12. కిందివాటిని జతపరచండి.

సమావేశం

వేదిక

i) ఓజోన్‌ తగ్గుదల సదస్సు

a) న్యూదిల్లీ

ii) అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు

b) కిగాలి

iii) COP - 24 సదస్సు

c) న్యూయార్క్‌

iv) సుస్థిరాభివృద్ధి  లక్ష్యాల సదస్సు

d) కెటోవీస్‌

 

e) పారిస్‌

జ: i-,b ii-a, iii-d, iv-c

 

13. కిందివాటిలో సరైంది ఏది?
1) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2015 - 30 వరకు వర్తిసాయి 
2) SDG లో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు ఉన్నాయి
3) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2015, సెప్టెంబరు 25న ఆమోదించారు
జ: 1, 2, 3 సరైనవి


14. అప్పికో ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జ: కర్ణాటక


15. కిందివాటిలో పర్యావరణ ఉద్యమాలకు సంబంధించి సరికానిది?
1) క్షిపణులకు వ్యతిరేకంగా బాలియాపాల్‌ ఉద్యమం జరిగింది.
2) మేధాపాట్కర్‌ ‘నర్మద బచావో’ ఆందోళన చేపట్టారు.
3) ఝార్ఖండ్‌లో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా జంగిల్‌ బచావో ఉద్యమం జరిగింది. 
4) యురేనియం వ్యతిరేక ఉద్యమం నిశ్శ‌బ్ద లోయలో  జరిగింది.
జ: 4 (యురేనియం వ్యతిరేక ఉద్యమం నిశ్శ‌బ్ద లోయలో జరిగింది.)

 

16. కిందివాటిని జతపరచండి.

i) ధరిత్రీ సదస్సు

a) జోహెన్నస్ ‌బర్గ్‌ - 2002

ii) పర్యావరణ సదస్సు

b) హైదరాబాద్‌ - 2012

iii) జీవవైవిధ్య సదస్సు

c) స్టాక్‌హోం - 1972

iv) సుస్థిరాభివృద్ధి సదస్సు

d) రియో - 1992

      i   ii   iii   iv
జ: d   c    b    a


17. జీవావరణ పిరమిడ్‌లో మొదటి మెట్టులో ఉన్నదెవరు?
జ: ఉత్పత్తిదారులు


18. కిందివాటిలో జాతీయ విపత్తు నిర్వహణ సపోర్ట్‌ ప్రోగ్రాంను నిర్వహించేది?
1) ISRO      2) GIS      3) NRSA      4) NGRI
జ: 3 (NRSA)


19. క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
జ: 2005, ఫిబ్రవరి 16

 

20. జాతీయ కార్యాచరణ ప్రణాళిక వాతావరణ మార్పు కోసం 2016 డిసెంబరులో ఎన్ని జాతీయ ప్రణాళికలను అమలుపరిచింది?
జ: 8


21. కిందివాటిలో సరైనవి గుర్తించండి.  
1) 2016 కరవు నిర్వహణ కరదీపిక దీర్ఘకాలిక కరవు 33% ఉన్నట్లు పేర్కొంది.
2) కరవు పీడిత ప్రాంతం కింద 35% ఉన్నట్లు పేర్కొంది.
3) 10% కంటే ఎక్కువ అవపాతం లోపించినట్లయితే దాన్ని వాతావరణ కరవు అంటారు.
జ: 1, 2, 3 సరైనవి


22. కిందివాటిని జతపరచండి.

అంశం

శాతం

i) కరవు ప్రభావం 

a) 10%

ii) వరద ప్రభావం

b) 59%

iii) భూకంప ప్రభావం
iv) తుపాన్ల ప్రభావం

c) 12%
d) 68%

e) 15%

      i   ii   iii   iv
జ: d   c    b    a

 

23. నైలోమీటర్‌ సాధనాన్ని దేన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు?
జ: వరదలు


24. కిందివాటిలో ఉష్ణ మండల చక్రవాత వర్గీకరణ వేగానికి సంబంధించి సరికానిది. 
1) తుపాన్‌ స్ట్రోమ్‌ : 62 - 88 కేఎంపీహెచ్‌        2) వాయుగుండం : 31 - 49 కేఎంపీహెచ్‌ 
3) అల్పపీడన ద్రోణి : 50 - 61 కేఎంపీహెచ్‌      4) సూపర్‌ సైక్లోన్‌ : 221 కేఎంపీహెచ్‌ పైన
జ: 3 (అల్పపీడన ద్రోణి : 50 - 61 కేఎంపీహెచ్‌) 


25. కొరియాలీస్‌ ఎఫెక్ట్‌ ప్రకారం చక్రవాతాల గమనానికి సంబంధించి సరైంది.
1) ఉత్తరార్ధ గోళంలో చక్రవాతాలు సవ్య పద్ధతిలో వీస్తాయి. 
2) దక్షిణార్ధ గోళంలో అపసవ్య పద్ధతిలో వీస్తాయి.
జ: 1, 2 రెండూ సరైనవికావు


26. కిందివాటిలో సరైంది ఏది? 
1) హజార్డ్‌ అనే పదం అరబిక్‌ భాష నుంచి వచ్చింది. 
2) డిజాస్టర్‌ అనే పదం ఫ్రెంచ్‌ భాష నుంచి ఆవిర్భవించింది.
జ: 1, 2 సరైనవి

 

27. కిందివాటిలో ప్రకృతి విపత్తుల్లో భాగం కానిది?

1) హిమపాతాలు  2) ఉరుములు, పిడుగులు   3) వన నిర్మూలన   4) ఉష్ణశీతల గాలులు
జ: 3 (వన నిర్మూలన)


28. ప్రస్తుతం దేశంలోని ఎన్ని రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాయి?
జ: 27


29. భారతదేశంలో భౌగోళికంగా కరవులు ఎక్కువగా ఏ ప్రాంతంలో సంభవిస్తున్నాయి?
జ: పశ్చిమ - దక్షిణ భారత్‌


30. విపత్తు సంభవించినప్పుడు అవసరమైనవి?
1) అత్యవసర స్పందన, సహాయం      2) పునరావసం, పునర్నిర్మాణం
3) సంసిద్ధత                     4) అన్నీ
జ: 4 (అన్నీ)


31. కిందివాటిలో సరికానిది.  
1) జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని (NDRF) విపత్తు చట్టం సెక్షన్‌ 44 ప్రకారం ఏర్పాటు చేస్తారు.
2) NDRF కేంద్ర హోంమంత్రి నిర్వహణలో ఉంటుంది.
3) NDRF లో ప్రస్తుతం 12 బెటాలియన్లు ఉన్నాయి.
4) ప్రస్తుతం 10వ CRPF బెటాలియన్‌ విజయవాడలో ఉంది. 4
జ:  4  

 

32. ప్రపంచంలో సంభవించే వైపరీత్యాల్లో కిందివాటిలో సరికానిది? 

1) భూకంపాల వల్ల 8% నష్టం కలుగుతుంది         2) వరదల వల్ల 30% నష్టం కలుగుతుంది
3) చక్రవాతాల వల్ల 21% నష్టం కలుగుతుంది.       4) కరవుల వల్ల 20% నష్టం కలుగుతుంది.
జ: 4 (కరవుల వల్ల 20% నష్టం కలుగుతుంది.)


33. ఏదైనా భౌగోళిక ప్రాంతంలో లేదా ఒక కమ్యూనిటీలో సంభవించే వైపరీత్యాల వల్ల జరిగే నష్ట తీవ్రత, పరిధి, పరిస్థితులు దేనికి దారితీస్తాయి?
జ: దుర్బలత్వం


34. 1999, ఆగస్టు 20న విపత్తు నిర్వహణపై అత్యున్నతాధికార కమిటీని ఎవరి అధ్యక్షతన వేశారు?
జ: జె.సి. పంత్‌


35. విపత్తు తీవ్రతను సాధారణంగా దేన్ని బట్టి అంచనా వేస్తారు?
జ: ప్రాణ, ఆస్తి నష్టం

 

36. కిందివాటిలో విపత్తులు, వాటి నోడల్‌ మంత్రి బాధ్యతలను జతపరచండి.

      విపత్తు

మంత్రి

i) పరిశ్రమలు - రసాయనాలు

A) హోంమంత్రి

ii) హిమపాతాలు

B) వ్యవసాయ మంత్రి

iii) కరవులు

C) రక్షణ మంత్రి

iv) NDRF

D) పర్యావరణ - అటవీ మంత్రి

 

E) పరిశ్రమల మంత్రి

      i     ii   iii   iv
జ: D   C    B   A

 

37. కింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి.
1) జాతీయ విపత్తు నిర్వహణ మొదటి సమావేశం న్యూదిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో 2006, నవంబరు 29న జరిగింది.
2) జాతీయ విపత్తు నిర్వహణ సమావేశాలకు ప్రధాన మంత్రి అధ్యక్షత వహిస్తారు.
జ: 1, 2 సరైనవి


38. కిందివాటిని జతపరచండి.

      కమిటీ

ఛైర్‌పర్సన్‌

i) కేబినెట్‌ కమిటీ

A) కేంద్ర హోంమంత్రి

ii) జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ

B) హోం కార్యదర్శి

iii) జాతీయ కార్యనిర్వహణ కమిటీ

C) కేబినెట్‌ కార్యదర్శి

iv) విపత్తు సమన్వయ కమిటీ

D) ప్రధానమంత్రి

      i    ii    iii   iv
జ: D   C    B    A


39. అంతర్జాతీయ విపత్తు తగ్గింపు మూడో సదస్సు 2015, మార్చి 18న ఎక్కడ జరిగింది?
జ: సెండాయ్‌

 

40. నూతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP) ను 2016, జూన్‌ 1న న్యూదిల్లీలో ఎవరు విడుదల చేశారు? 
జ: ప్రధానమంత్రి 


41. కిందివాటిని జతపరచండి.

         సంస్థ

కార్యాలయం

i) అంతర్జాతీయ విపత్తు తగ్గింపు సంస్థ

A) బ్యాంకాక్‌ 

ii) ఆసియా విపత్తు ప్రతిస్పందన సంస్థ

B) జెనీవా

iii) సార్క్‌ విపత్తు తగ్గింపు సంస్థ

C) నాగ్‌పుర్‌

iv) నేషనల్‌ సివిల్‌ డిఫెన్స్‌ కాలేజీ

D) దిల్లీ

 

E) పుణె

      i    ii   iii   iv
జ: B   A   D   C


42. కింది అంశాల్లో సరైనవాటిని గుర్తించండి.
1) అంతర్జాతీయ సునామీ అవగాహన దినోత్సవం - నవంబరు 5
2) జాతీయ విపత్తు అవగాహన దినోత్సవం - అక్టోబరు 29
3) అంతర్జాతీయ విపత్తు కుదింపు దశాబ్దం - 1990 - 2000
జ: 1, 2, 3

 

43. దీర్ఘకాలిక విపత్తు ప్రణాళిక అభివృద్ధిని ఏ రకమైన విపత్తు స్థాయిలో సూచిస్తారు?
జ: L3


44. ‘జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక’ (NDMP)లో మొత్తం ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి?
జ: 14


45. కింది అంశాల్లో సరైనవి. 
1) విపత్తు సహాయ నిధిని ఏర్పాటుచేయాలని 9వ ఆర్థిక సంఘం మొదట సిఫారసు చేసింది.
2) 13వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు జాతీయ విపత్తు సహాయక నిధిని 2010, ఏప్రిల్‌ 1న ప్రారంభించారు.
3) 14వ ఆర్థిక సంఘం 2015-20కి గాను ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,489 కోట్లను సిఫారసు చేసింది.
జ: 1, 2, 3

Posted Date : 29-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు నిర్వహణ - భావనలు

 

కోలుకోలేని కష్టం... తీరనంత నష్టం!

 

మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత ప్రగతి సాధించినా వివిధ సందర్భాల్లో రకరకాల విపత్తులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. అవి అభివృద్ధికి విఘాతం కలిగించి  తిరోగమనానికి దారి తీస్తున్నాయి. విపత్తుల నివారణ, సంసిద్ధతల కోసం దేశీయంగా, అంతర్జాతీయంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ నష్టాన్ని పూర్తిగా తగ్గించలేకపోతున్నాం. ఈ నేపథ్యంలో విపత్తులు, వైపరీత్యాలు గురించి ప్రాథమికాంశాలను అభ్యర్థులు వివరంగా తెలుసుకోవాలి.

విపత్తు నిర్వహణ - భావనలు 

 

ఏదైనా ఒక ప్రదేశంలో నివసించే ప్రజలకు తీవ్రమైన ప్రాణహాని లేదా ఆస్తినష్టం కలిగించే భౌతిక సంఘటనను విపత్తుగా పిలుస్తారు. ఇలాంటి సమయంలో వీరికి ఇతర సమూహాల నుంచి అత్యంత సహాయ సహకారాలు అవసరమవుతాయి.

 

విపత్తులను ఆంగ్లంలో డిజాస్టర్‌గా పిలుస్తారు. ఇది గ్రీకు భాషకు చెందిన Des అంటే దుష్ట, aster అంటే నక్షత్రం అనే పదాల కలయిక ద్వారా వచ్చిన ఫ్రెంచ్‌ పదమైన Desastre, ఇటలీ పదమైన Disastro నుంచి Disaster అనే పదం పుట్టింది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం: ఏదైనా ఒక ప్రదేశంలోని సమూహానికి బయట నుంచి, ఇతర సమూహాల నుంచి సాయం పొందాల్సినంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఆరోగ్య సమస్యలు, పర్యావరణ సమస్య కలగజేసే సంఘటనలను విపత్తులు అంటారు. 

భారత్‌ విపత్తు నిర్వహణా చట్టం 2005 నిర్వచనం: ఏదైనా ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా లేదా మానవ నిర్లక్ష్యం లేదా ప్రమాదవశాత్తుగా తనకు తాను కోలుకోలేని విధంగా పెద్దఎత్తున ప్రాణ నష్టానికి, ఆస్తి విధ్వంసానికి, పర్యావరణ

నష్టానికి కారణమయ్యే ఉపద్రవం/ ప్రమాదం/ దుర్ఘటనను విపత్తుగా నిర్వచించింది. 

ఐక్యరాజ్య సమితి నిర్వచనం: అకస్మాత్తుగా లేదా పెద్ద దురదృష్టంగా సమాజ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే సంఘటనను విపత్తు అంటారు. 

 

విపత్తుల రకాలు

వివిధ కారణాలను అనుసరించి విపత్తులు రెండు రకాలు ఉన్నాయి.

ప్రకృతి సిద్ధమైన విపత్తులు: మానవ ప్రమేయం లేకుండా సహజంగా ఏర్పడి నష్టానికి దారితీసేవి. ఇవి భౌగోళిక, జల, ఖగోళ పరిస్థితుల వల్ల సంభవిస్తాయి. 

ఉదా: భూకంపాలు, సునామీలు, తుపాన్లు, అగ్నిపర్వతాల విస్ఫోటాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు, వేడిగాలులు, శీతల గాలులు లాంటివి. 

మానవ కారక విపత్తులు: మానవుడి నిర్లక్ష్యం, సాంకేతిక లోపం, ఆధిపత్య ధోరణులు లాంటి కారణాల వల్ల ఆస్తి, ప్రాణ, పర్యావరణ నష్టానికి దారితీసే వాటిని మానవకారక విపత్తులుగా పరిగణించవచ్చు.

ఉదా: పారిశ్రామిక, రసాయనిక ప్రమాదాలు. అగ్నిప్రమాదాలు, అల్లర్లు, ఘర్షణలు, తీవ్రవాద దాడులు, పౌరయుద్ధాలు, గ్లోబల్‌వార్మింగ్‌ లాంటివి.

 

వేగాన్ని బట్టి విపత్తులను రెండు రకాలుగా వర్గీకరించారు. 

నెమ్మదిగా సంభవించే విపత్తులు: కరవు, పౌరయుద్ధాలు, కొన్ని రకాల వ్యాధులు. ఇవి నెమ్మదిగా సంభవిస్తాయి. అయితే క్రమంగా విస్తరించి మానవుడి పైన విరుచుకుపడి భారీగా నష్టాన్ని కలగజేస్తాయి.

వేగంగా సంభవించే విపత్తులు: భూకంపాలు, సునామీలు, తుపాన్ల లాంటివి. ఇవి అకస్మాత్తుగా విరుచుకుపడి తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తాయి. 

భారత ప్రభుత్వం విపత్తుల అధ్యయనానికి 1999లో జె.సి.పంత్‌ ఆధ్వర్యంలో ఒక అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ  దేశంలో 31 రకాల విపత్తులు జరుగుతున్నాయని వివరించింది. 2004లో విపత్తు జాబితాలో సునామీని చేర్చడంతో ప్రస్తుతం వాటి సంఖ్య 32కి చేరింది. వీటిని అయిదు సబ్‌గ్రూపులుగా విభజించారు. 

 

 

I. జలవాతావరణ సంబంధ విపత్తులు: * వరదలు, నీటిముంపు * తుపాన్లు, చక్రవాతాలు, సైక్లోన్లు * టోర్నడోలు, హరికేన్లు * కరవు* సునామీలు * వేడిగాలులు, శీతలగాలులు * సముద్రకోత * ఉరుములు, మెరుపులు, పిడుగులు

* హిమపాతాలు * వడగళ్ల వాన* కుండపోత వాన

II. భౌగోళిక విపత్తు: * భూపాతం, పంక ప్రవాహాలు * భూకంపాలు * గని విపత్తులు * ఆనకట్టలు తెగిపోవడం/ కూలిపోవడం 

III. రసాయన, పారిశ్రామిక, అణుసంబంధ విపత్తులు: * రసాయన, పారిశ్రామిక విపత్తులు * అణు విపత్తులు

IV. ప్రమాదభరితమైన విపత్తులు:  * అడవుల్లో కార్చిచ్చు * పట్టణాల్లో అగ్నిప్రమాదాలు * గ్రామాల్లో అగ్నిప్రమాదాలు * గనుల్లో వరద ప్రమాదాలు * నూనె, చమురు ఒలికిపోవడం * భవంతులు కూలిపోవడం * వరుస బాంబు పేలుళ్లు * ఉత్సవాల్లో తొక్కిసలాటలు * విద్యుత్‌ కారణంగా అగ్నిప్రమాదాలు * పడవల మునక  * విమాన, రోడ్డు, రైలు ప్రమాదాలు

V. జీవ సంబంధ విపత్తులు:  * మహమ్మారి వ్యాధులు * కీటక దాడులు * పశువుల వ్యాధులు * ఆహారం కలుషితం, విషపూరితం

వీటితోపాటు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ (యూఎన్‌డీఆర్‌ఆర్‌- జెనీవా) ఎడారీకరణ, గ్లోబల్‌ వార్మింగ్, కీటకాల వ్యాప్తులను పర్యావరణ విపత్తుల జాబితాలో ఉంచింది. 

 

వైపరీత్యం

ఆస్తి, ప్రాణ నష్టానికి, పర్యావరణ విధ్యంసానికి, జీవనోపాధికి ఆటంకం కలిగించే ప్రకృతి, మానవ ప్రేరిత ప్రమాద ఘటనలను ‘వైపరీత్యం’ అంటారు. వైపరీత్యాన్ని ఆంగ్లంలో ‘హజార్డ్‌’ అంటారు. ఈ పదం ఫ్రెంచ్, అరబ్‌ పదాల నుంచి ఉద్భవించింది.

విపత్తుగా వైపరీత్యం: వైపరీత్యం అన్నది విపత్తుకు దారితీసే ఒక సంఘటన. అంటే ఒక వైపరీత్యం జరిగినప్పుడు దానివల్ల ప్రజలకు కోలుకోలేని ఆస్తి, ప్రాణనష్టం లాంటి నష్టాలు జరిగితే దాన్ని విపత్తుగా పరిగణిస్తారు.

ఉదా: మనుషులు నివసించని ఎడారిలో భూకంపం సంభవిస్తే దాన్ని విపత్తుగా పరిగణించరు. అందువల్ల అన్నీ వైపరీత్యాలు విపత్తులుగా మారకపోవచ్చు కానీ అన్ని విపత్తులు వైపరీత్యాలు అవుతాయి. 

 

వైపరీత్యాలను మూడు రకాలుగా పేర్కొంటున్నారు. 

ప్రకృతిసిద్ధ వైపరీత్యాలు: మానవుడి ప్రమేయం లేకుండా జరిగేవి. 

ఉదా: భూకంపాలు, సునామీలు, తుపాన్లు, అన్ని ప్రకృతి విస్ఫోటాలు.

మానవ కారక వైపరీత్యాలు: మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం, యాంత్రిక లోపం వల్ల జరిగే వైపరీత్యాలు.

ఉదా: రైలు, రోడ్డు, విమాన ప్రమాదాలు; పారిశ్రామిక పేలుళ్లు, పౌరయుద్ధాలు, ఘర్షణలు, అగ్నిప్రమాదాలు.

సామాజిక - సహజ వైపరీత్యాలు: ప్రకృతిసిద్ధం, మానవుడి ప్రమేయం ఈ రెండింటి కారణంగా జరిగే వైపరీత్యాలు.

ఉదా: ముందుగానే సరైన మురుగు నీటిపారుదల (డ్రైనేజ్‌) వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే కొద్దిపాటి వర్షాలకే వరదలు సంభవిస్తాయి. అలాగే కరవు, వ్యాధుల్లాంటివి.


రచయిత: జల్లు సద్గుణరావు

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  చక్రవాతాలు - సునామీ

‣ పర్యావరణం - జీవ వైవిధ్యం

‣ వరద విపత్తులు

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 29-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

దుర్బలత్వం- వైపరీత్యాల సంభావ్యత

సంసిద్ధతే నష్ట నివారణ సూత్రం!

  విపత్తు సంభవిస్తే కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. దాని ప్రభావం నుంచి కొందరు వెంటనే తేరుకుంటారు. మరికొందరిపై ఆ తీవ్రత ఎక్కువ కాలం పనిచేస్తుంది.  అలాగే విపత్తు నిర్వహణను ప్రభుత్వాలు వివిధ స్థాయుల్లో చేపడతాయి. ఇవన్నీ ఎలా జరుగుతాయి, వీటికి సంబంధించి ఉపయోగించే సాంకేతిక పదజాలంపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 

  

భూకంపాలు, సునామీలు, చక్రవాతాల్లాంటి సహజ వైపరీత్యాలను నివారించడం మానవుడి వల్ల కావడం లేదు. వాటి కారణాలు తెలుసుకుని నష్టాన్ని నివారించే సామర్థ్యాన్ని పెంచుకుని, దుర్బలత్వాన్ని తగ్గించే చర్యలు మాత్రమే చేపట్టగలుగుతున్నాడు. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో సంసిద్ధంగా ఉండటం, తీవ్రతను తగ్గించడం, ప్రతిస్పందించి ఉపశమనం ఇవ్వడం లాంటి చర్యలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి ఉంది. 

 

దుర్బలత్వం: భౌతిక, ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రక్రియలతో కూడిన ఒక కమ్యూనిటీ వైపరీత్యాలకు గురయ్యేటప్పుడు నష్ట తీవ్రత పెరిగే స్థితి లేదా సున్నితత్వ‌ స్థితిని దుర్బలత్వం అంటారు. ఒక కమ్యూనిటీ లేదా నిర్మాణం లేదా భౌతిక ప్రాంతం, దాని నిర్మాణ స్వభావం, అది విపత్తు ప్రాంతానికి లేదా ప్రమాదకర భూభాగానికి ఎంత దూరంలో ఉంది అనే అంశాల ఆధారంగా విధ్వంసానికి లేదా అంతరాయానికి గురయ్యే అవకాశం ఉన్న పరిధిని దుర్బలత్వం అంటారు.

ఉదా: 2001లో గుజరాత్‌ భుజ్‌ భూకంపం వల్ల పట్టణ శివారులో నివసించే వారి కంటే ఇరుకైన రోడ్లు, ఎత్తయిన భవనాల వల్ల పాత నగరానికి చెందినవారే ఎక్కువగా మరణించారు. 

 

* దుర్బలత్వాన్ని రెండు రకాలుగా వర్గీకరించారు.  

 

భౌతిక దుర్బలత్వం: భూకంపాలు, వరదల్లాంటి ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయే వ్యక్తులతోపాటు, వనరులు దీని పరిధిలోకి వస్తాయి. ఇది ఎవరెవరు దెబ్బతిన్నారు, ఏం నాశనమయ్యాయి అనే భావనపై ఆధారపడి నష్టాన్ని తెలియజేస్తుంది.

 

సామాజిక ఆర్థిక దుర్బలత్వం: సముద్ర తీరంలో నివసించే పేదలకు భవనాలు నిర్మించుకోవడానికి అవసరమైన డబ్బులేకపోవడంతో ఎక్కువ నష్టపోతున్నారు. అందువల్ల ప్రజల సామాజిక ఆర్థిక స్థితి కూడా నష్టం తీవ్రతను నిర్ధారిస్తుంది.

 

అపాయం లేదా ముప్పు: యూఎన్‌డీపీ 2004లో ఇచ్చిన నిర్వచనం ప్రకారం వైపరీత్యాలు, దుర్బల పరిస్థితుల మధ్య పరస్పర చర్యల కారణంగా ఆర్థిక కార్యకలాపాల్లో అంతరాయం, పర్యావరణ క్షీణత, మరణాలు, గాయాలు లాంటి ఊహించ‌దగిన నష్టాలు జరిగే సంభావ్యతను అపాయం అంటారు.

  విపత్తు నిర్వహణ అంటేనే మౌలికంగా విపత్తు ముప్పు నిర్వహణ. విపత్తు వల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించాలంటే వైపరీత్యం లేదా దుర్బలత్వం ఎదుర్కొనే అంశాలనైనా తగ్గించాలి. అపాయం స్థాయి కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.

* వైపరీత్యం ప్రభావం

* వైపరీత్య ప్రభావానికి గురయ్యే అంశాల దుర్బలత్వం

* వైపరీత్యాలకు గురయ్యే ఆర్థిక విలువ 

విపత్తులను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండటం, తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయడంలోనే ముప్పు నివారణ సాధ్యమవుతుంది. 

 

సామర్థ్యం: వ్యక్తులు లేదా సమూహం విపత్తులను ఎదుర్కొని నిలబడగలిగే శక్తిని కలిగి ఉండటాన్ని సామర్థ్యం అంటారు.  వైపరీత్యాల వల్ల నష్టపోయిన ఆస్తులు, వనరులు, జీవనోపాధిని పునరుద్ధరించుకోగలిగిన నైపుణ్యాన్నీ సామర్థ్యంగా పేర్కొనవచ్చు. విపత్తుల సమయంలో సర్వం కోల్పోయినప్పుడు అక్కడి ప్రజలు ఉపాధి కోసం తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం లేదా అదే ప్రాంతంలో వేరే వృత్తిపై ఆధారపడి జీవించడాన్ని భౌతిక సామర్థ్యంగా భావించాలి. ధనవంతుడు విపత్తుల నుంచి వెంటనే తేరుకోవడం, దుర్బలత్వానికి దూరంగా ఇల్లు కట్టుకొని ఉండటం అనేది సామాజిక ఆర్థిక సామర్థ్యం కలిగి ఉండటాన్ని తెలియజేస్తుంది. 

 

నిర్వహణ దశలు

విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం విపత్తు నిర్వహణలో ప్రభుత్వం తీసుకునే చర్యలు మొదటి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రెండో స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, మూడో స్థాయిలో జిల్లా కేంద్రాలు చేపట్టాల్సిన సంస్థాగత నిర్మాణం, వాటి విధులు లాంటి అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి. విపత్తు నిర్వహణ నాలుగు దశల్లో జరుగుతుంది. అవి:

ప్రతిస్పందన, ఉపశమనం: ఒక విపత్తు జరిగిన వెంటనే స్పందించి ప్రభుత్వాలు లేదా స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీవోలు), మత సంస్థలు అందించే తక్షణ చర్యలన్నీ ఇందులోకి వస్తాయి. ఫస్ట్‌ ఎయిడ్, ఆహారం, దుస్తులు, మందులు, ఆవాస సహాయక కేంద్రాల్లాంటి తక్షణం అందించే చర్యలు ఈ దశలో జరుగుతాయి. ఇవి విపత్తు జరిగిన వెంటనే అతి తక్కువ కాలంలో జరగాలి.

 

పునరావాసం, పునర్నిర్మాణం: ఉపశమనం అందిన తర్వాత కనీస జీవనోపాధికి అవసరమైన విద్యుత్, కమ్యూనికేషన్లను పునరుద్ధరించడం, రోడ్ల మరమ్మతుల్లాంటి పునరావాస చర్యలు ఈ దశలో జరుగుతాయి. వీటితోపాటు అన్ని రకాల సేవలను పూర్తిగా అందుబాటులోకి తేవడం, శాశ్వత ఇల్లు కట్టి ఇవ్వడం లాంటి పునర్నిర్మాణ చర్యలు కూడా ఇదే సమయంలో జరుగుతాయి. విపత్తు జరిగిన వారం లేదా నెల లోపు తీసుకున్న చర్యలు పునరావాస చర్యలుగానూ,  ఏడాది వరకు తీసుకున్న చర్యలను పునర్నిర్మాణ చర్యలుగా చెప్పొచ్చు.

 

తీవ్రతను తగ్గించడం: విపత్తులను తట్టుకునే భవనాలు నిర్మించడం, వరదలను ఆపడానికి దూరంగా గట్లు వేయడం లాంటి నిర్మాణాత్మక చర్యలు; విపత్తులపై అవగాహన కల్పించడం, హజార్డ్‌ మ్యాపింగ్‌ ఉంచడం, తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండటం లాంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టడాన్ని తీవ్రతను తగ్గించే చర్యలుగా భావించాలి. ఇవి ఏడాది కంటే ఎక్కువ సమయం తీసుకుంటాయి.

 

సంసిద్ధత: వైపరీత్యాలున్న ప్రదేశాల్లో ముందుగా విపత్తు నష్టాన్ని అంచనా వేసి ప్రణాళికలు తయారు చేసుకోవడం, అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం, జనాన్ని తరలించడం లాంటి సన్నాహాలను సంఘటితం చేసి పునరావృత విపత్తులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటాన్ని సంసిద్ధత అంటారు. ఇది ఒక విపత్తుకు, మరొక విపత్తుకు మధ్య సమయం మీద ఆధారపడి ఉంటుంది. 

 

విపత్తు నిర్వహణ వలయం 

విపత్తు నష్ట నివారణ అనేది అన్నిరకాల చర్యలు, కార్యకలాపాల సమాహారం. విపత్తు నిర్వహణ వలయాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు.

1. విపత్తు ముందస్తు చర్యలు: ఇవి విపత్కర వైపరీత్యాల వల్ల జరగబోయే ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను తెలియజేస్తాయి. ఇవి విపత్తు దశల్లోని తీవ్రతను తగ్గించడం, సంసిద్ధత అనే రెండు అంశాలతో ముడిపడి ఉంటాయి.

2. విపత్తు జరుగుతున్నప్పుడు చర్యలు: విపత్తు జరుగుతున్నప్పుడు దాని తీవ్రతని తగ్గించడానికి బాధితులకు అత్యవసరంగా అందించాల్సిన అవసరాలుంటాయి. ఇవి విపత్తు జరుగుతున్నప్పుడు అందించే ప్రతిస్పందన, ఉపశమనం అనే అంశాలకు చెందినవై ఉంటాయి. వీటిని ప్రభుత్వం, మతసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు లాంటివి అందిస్తుంటాయి.

3. విపత్తు తర్వాత చర్యలు: విపత్తు జరిగిపోయిన తర్వాత అక్కడి సమూహం తొందరగా కోలుకోవడానికి తీసుకున్న కార్యకలాపాలన్నీ విపత్తు తర్వాత చర్యలుగా భావించాలి. ఇవి పునరావాసం, పునర్నిర్మాణంపై ఆధారపడిన చర్యలు.

 

ఒక విపత్తు జరిగిన తర్వాత విపత్తు నిర్వహణా దశలు ఒకదాని తరువాత మరొకటి పైవిధంగా కొనసాగుతాయి.

 

 

రచయిత: జల్లు సద్గుణ రావు

Posted Date : 27-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆవరణ శాస్త్రం

అంతర చర్యల అనుబంధం!

జీవజాతులు తమ మనుగడకు చుట్టుపక్కల వాతావరణంతో సమతౌల్యత కొనసాగిస్తుంటాయి. ఆవాసం, ఆహార చక్రాలు, పునరుత్పత్తి ప్రక్రియ, అంతర్గత సంబంధాలను చుట్టూ ఉన్న ఆవరణ ఆధారంగానే నిర్ణయించుకుంటాయి. జీవజాతులు పర్యావరణంపై, అలాగే పర్యావరణం జీవజాతులపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలను చూపుతుంటాయి. వీటన్నింటి మధ్య జరిగే అంతర చర్యల గురించి తెలిపే ఆవరణ శాస్త్రంపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి.

 

పర్యావరణంలోని వివిధ జీవజాతుల్లో జీవులు, వాటి పరిసరాలకు మధ్య జరిగే అంతఃచర్యలను అధ్యయనం చేసే విజ్ఞానశాస్త్రమే ఆవరణ శాస్త్రం. దీన్ని ఆంగ్లంలో Ecology అంటారు. ఇది ఒక జీవి ఆవాసాన్ని తెలియజేసే OIKOS,  ఒక జీవి జీవన విధానాన్ని అధ్యయనం చేసే  LOGOS అనే రెండు గ్రీకు పదాల నుంచి వచ్చింది. ఎకాలజీ అనే పదాన్ని మొదట కార్ల్‌ రైటర్‌ 1868లో ఉపయోగించారు. ఎర్నెస్ట్‌ హెకెల్‌ దీన్ని విస్తృత ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆధునిక ఆవరణ శాస్త్ర పితామహుడు యూజీన్‌ ఓడమ్‌. భారత ఆవరణ శాస్త్ర పితామహుడు రామ్‌దేవ్‌ మిశ్రా.

* జీవావరణంలోని వేర్వేరు ప్రాంతాల్లో వివిధ జాతుల మధ్య అంతర్గత సంబంధాలు; పర్యావరణం, జీవులకు మధ్య సంబంధాలను వాటి విధులు, నివాసం, పునరుత్పత్తి ప్రక్రియల ఆధారంగా  అధ్యయనం చేసే శాస్త్రమే ఆవరణ శాస్త్రం.  - రామ్‌దేవ్‌ మిశ్రా

 

పర్యావరణానికి, ఆవరణ శాస్త్రానికి మధ్య తేడా?

ఏదైనా జీవి లేదా జీవ సముదాయాన్ని ఆవరించి ఉన్న పరిసరాలను పర్యావరణం అంటారు. నిర్దిష్ట పర్యావరణంలోని జీవులు, వాటి చుట్టూ ఉన్న పరిసరాలకు మధ్య జరిగే అంతఃచర్యల గురించి అధ్యయనం చేసేది ఆవరణ శాస్త్రం.

 

జీవావరణ అనుక్రమం

భౌతిక పరిస్థితుల వల్ల కాలానుగుణంగా ఒక సమాజ స్థానాన్ని ఇతర సమాజాలు ఆక్రమించుకోవడాన్ని లేదా ప్రతిక్షేపించడాన్ని జీవావరణ అనుక్రమం అంటారు. ఇది నెమ్మదిగా అవిచ్ఛినంగా స్థిర సమాజం ఏర్పడేవరకూ కొనసాగుతూనే ఉంటుంది. ఈవిధంగా జీవావరణ అనుక్రమంలో మొదట ఏర్పడిన సమాజాన్ని ‘పయోనీర్‌’ సమాజం అంటారు. దీని తర్వాత అనేక మధ్యంతర సమాజాలు ఏర్పడతాయి. వాటిని సీరల్‌ (seral) దశలు అంటారు. జీవ అనుక్రమంలో చివరకు ఏర్పడిన సమాజాన్ని పరాకాష్ఠ (climax) సమాజం అంటారు. దీనిలో సమాజంలో స్థిరత్వం కనిపిస్తుంది.

 

జీవావరణ అనుక్రమంలో రకాలు ఉన్నాయి. 

హైడార్క్‌: కుంటలు, సరస్సులు, బురద ప్రదేశాల్లో జీవావరణ అనుక్రమాన్ని హైడార్క్‌ అంటారు. ఇది రెండు రకాలు. 

* మంచినీటిలో జరిగే అనుక్రమం - హైడ్రోసీర్‌

* ఉప్పు నీటిలో ప్రారంభమయ్యే అనుక్రమం - హాలోసీర్‌ 

జీరార్క్‌: ఎడారిలో జరిగే జీవావరణ అనుక్రమాన్ని జీరార్క్‌ అంటారు. ఇందులోని దశలను జీరోసీర్‌ అంటారు.

లిథోసియర్‌: శిలలపై జరిగే జీవావరణ అనుక్రమాన్ని లిథోసియర్‌ అంటారు.

సామోసియర్‌: ఇసుకను ఆధారంగా చేసుకొని జరిగే జీవావరణ అనుక్రమాన్ని సామోసియర్‌ అంటారు.

 

ఆవరణ వ్యవస్థ

జీవ, నిర్జీవ అంశాలతో కూడిన ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో జీవ, నిర్జీవ కారకాల మధ్య పరస్పరం జీవ భూరసాయన వలయాల ద్వారా శక్తి, పోషకాల మార్పిడి జరిగే నిర్దిష్ట భౌగోళిక ప్రాంతమే ఆవరణ వ్యవస్థ.  - ఎ.జి.టాన్‌స్లే

  ఉష్ణోగ్రత, గాలి, పీడనం, కాంతి లాంటి నిర్జీవ కారకాలు, ప్రాణం ఉన్న జీవ సముదాయాల మధ్య నిర్మాణాత్మక, క్రియాత్మక లక్షణాలతో రక్త ప్రసరణ, పోషక పదార్థాల చక్రీయ వినిమయం జీవావరణ వ్యవస్థలోని ప్రాథమిక ప్రక్రియ. ఆవరణ వ్యవస్థ రెండు రకాలు. అవి..

 

సహజసిద్ధ ఆవరణ వ్యవస్థ: పర్యావరణంలో అనేక రకాల ఆవరణ వ్యవస్థలు ఉంటాయి. అన్నిరకాల ఆవరణ వ్యవస్థలు జీవ, నిర్జీవ అనుఘటకాల పరస్పర చర్యల ఫలితంగా స్వయంసమృద్ధి కలిగి ఉంటాయి. జాతుల వైవిధ్యం, ఉత్పాదనా రేటులో తారతమ్యాలు ఉంటాయి. వీటిలో రెండు రకాలు ఉన్నాయి. 

ఖండ ఆవరణ వ్యవస్థ:  ఎ) అరణ్య ఆవరణ వ్యవస్థలు బి) గడ్డిమైదానాల ఆవరణ వ్యవస్థలు సి) పరివర్తన ఆవరణ వ్యవస్థలు డి) ఎడారి ఆవరణ వ్యవస్థలు ఇ) టండ్రా ఆవరణ వ్యవస్థలు ఎఫ్‌) టైగా ఆవరణ వ్యవస్థలు

జలావరణ వ్యవస్థ: ఇందులో మూడు రకాలు ఉన్నాయి.

1) సముద్ర ఆవరణ వ్యవస్థలు: ఎ) ఖండ తీరపు ఆవరణ వ్యవస్థ బి) సముద్ర వాలు/ఎబైసెల్‌ ఆవరణ వ్యవస్థ సి) సముద్ర అగాధ/ట్రెంచ్‌ ఆవరణ వ్యవస్థ డి) ముద్ర మైదాన ఆవరణ వ్యవస్థ

2) మంచి నీటి ఆవరణ వ్యవస్థలు: ఎ) నిలకడ మంచినీటి ఆవరణ వ్యవస్థ బి) ప్రవాహ నీటి ఆవరణ వ్యవస్థ.

3) తీరప్రాంత ఆవరణ వ్యవస్థలు: ఎ) ఉప్పునీటి కయ్యల ఆవరణ వ్యవస్థ బి) డెల్టా ఆవరణ వ్యవస్థలు సి) మడ అడవుల ఆవరణ వ్యవస్థ

 

కృత్రిమ ఆవరణ వ్యవస్థ: మానవుడు తన అవసరాల కోసం సాంఘిక, సాంస్కృతిక, పారిశ్రామిక అభివృద్ధి కోసం నిర్మించుకున్న ఆవరణ వ్యవస్థలను మానవ నిర్మిత/కృత్రిమ ఆవరణ వ్యవస్థలుగా పేర్కొంటారు. 

ఉదా: * పంట పొలాల ఆవరణ వ్యవస్థలు * నగర ఆవరణ వ్యవస్థలు * పారిశ్రామిక ఆవరణ వ్యవస్థలు * ప్రయోగశాలల ఆవరణ వ్యవస్థలు  * గ్రహాంతర ఆవరణ వ్యవస్థలు

 

ఆవరణ శాస్త్ర పారిభాషక పదాలు

జాతి: తమలో తాము అంతర ప్రజననం చెందుతూ సమాన లక్షణాలు ఉన్న జీవుల సమూహాన్ని జాతి అంటారు.

ఉదా: మానవ జాతి, జంతు జాతి, వృక్ష జాతి

జనాభా: ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవించే ఒకే జాతికి చెందిన జీవుల సంఖ్యను జనాభా అంటారు.

ఉదా: పులుల జనాభా ప్రతి నాలుగు సంవత్సరాలకు లెక్కిస్తారు. తాజా లెక్కల ప్రకారం 2018 నాటికి దేశంలో పులుల జనాభా 2,967 ఉంది. 2014 - 2018 మధ్యకాలంలో ఇవి 741 పెరిగాయి.

జీవ సమాజం: ఒక ప్రాంతంలోని వివిధ జాతుల జనాభాను కలిపి జీవ సమాజం అంటారు. అంటే ఒక నిర్దిష్ట ఆవాసంలోని జంతువులు, వృక్షాలు, సూక్ష్మజీవుల మొత్తం అని అర్థం.

ఎకలాజికల్‌ నిచ్‌: ఒక ఆవరణ వ్యవస్థలోని ఏదైనా ఆవాసంలో ఒక జాతి క్రియాత్మక స్థాయిని తెలియజేసే ప్రక్రియ. ఇది నిర్దిష్ట ఆవాసంలో ఒక జీవి తన విధులను నిర్వర్తించే ప్రదేశం. ఈ పదాన్ని మొదటిసారిగా గ్రిన్నెల్‌ అనే శాస్త్రవేత్త ఉపయోగించాడు.

ఉదా: మానవుడు సర్వభక్షక ఆహార అలవాట్లు కలిగి ఉండటం.

ఎకోటోన్‌: రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న పరివర్తన ప్రాంతాన్ని ఎకోటోన్‌ అంటారు. 

ఉదా: భౌమ‌, జలావరణ వ్యవస్థల మధ్య ఉండే మాంగ్రూవ్‌ ఆవరణ వ్యవస్థ, నదీ ముఖద్వార ఆవరణ వ్యవస్థ (ఎస్టురీ ఆవరణ వ్యవస్థ).

బయోమాగ్నిఫికేషన్‌: ఆహార‌ గొలుసులో కింది స్థాయి జీవులు స్వీకరించిన కొన్ని రకాల రసాయనాలపై పోషణ స్థాయి జీవుల్లో పేరుకుపోవడాన్ని బయోమాగ్నిఫికేషన్‌ లేదా బయోలాజికల్‌ ఎక్యుమ్యులేషన్‌ అంటారు.

ఉదా: రాబందులు పశువుల మృత కళేబరాలను తినడం వల్ల వాటిలోని డైక్లోఫినాక్‌ రసాయనం రాబందుల్లోకి చేరి క్రమంగా అవి అంతరించిపోతున్నాయి.

 

రచయిత: జల్లు సద్గుణరావు

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  చక్రవాతాలు - సునామీ

‣ పర్యావరణం - జీవ వైవిధ్యం

‣ వరద విపత్తులు

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 04-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆవరణ శాస్త్రం

మాదిరి ప్రశ్నలు


1. ఆవరణ వ్యవస్థలో ఒక జీవి నిర్వహించే పాత్రను ఏవిధంగా పిలుస్తారు? 

1) ఆవాసం     2) జీవజాలం       3) ఎకలాజికల్‌ నిచ్‌       4) బయోమ్‌

 

2. ఆవరణ శాస్త్రం అనే పదాన్ని మొదట ఉపయోగించిన శాస్త్రవేత్త? 

1) కార్ల్‌ రైటర్‌         2) యూజిన్‌ ఓడమ్‌          3) టేలర్‌          4) రామ్‌దేవ్‌ మిశ్రా

 

3. కుంటలు, సరస్సులు, బురద ప్రదేశాల్లో జీవావరణ అనుక్రమాన్ని ఏమంటారు? 

1) జీరార్క్‌        2) హైడార్క్‌        3) లిథోసియర్‌          4) ఏదీకాదు 

 

4. భూమండలంపై అతిపెద్ద ఆవరణ వ్యవస్థ? 

1) సముద్రాలు         2) అడవులు          3) గడ్డిభూములు          4) నదులు  

 

5. జీవావరణ అనుక్రమంలో అంతిమ జీవ సమాజాలను ఏమని పిలుస్తారు? 

1) పయోనీర్స్‌         2) ఎండీవర్స్‌        3) ఎచీవర్స్‌        4) క్లైమాక్స్‌

 

6. జీవావరణ వ్యవస్థల మనుగడకు కావాల్సిన శక్తి అవసరాల్లో ప్రధానమైంది? 

1) సూర్యశక్తి   2) సముద్ర పవనాలు     3) కిరణజన్య సంయోగక్రియ   4) రసాయన శక్తి  

 

7. వాతావరణ శాస్త్రం (ఎకాలజీ) అనేది ఏ భాషా పదం?  

1) ఫ్రెంచి       2) గ్రీకు          3) లాటిన్‌         4) స్పానిష్‌    

 

8. 2018 పులుల జనాభా లెక్కల ప్రకారం దేశంలోని పులుల సంఖ్య?  

1) 2,226        2) 1,706        3) 2,967        4) 2,900

 

9. సెనెకాలజీ అనే ఆవరణ శాస్త్ర విభాగం దేని గురించి అధ్యయనం చేస్తుంది? 

1) ఒకటి కంటే ఎక్కువ జాతులు   2) ఒక జాతి జీవులు  3) సూక్ష్మజీవులు       4) సముద్రాలు

 

10. ఒక జాతి జీవుల గురించి అధ్యయనం చేసే ఆవరణ శాస్త్ర విభాగం? 

1) ఆటో ఎకాలజీ        2) సెనెకాలజీ          3) సామోసియర్‌         4) జీరార్క్‌


సమాధానాలు

1-3,   2-1,  3-2,   4-1,   5-4,   6-1,   7-2,   8-3,   9-1,   10-1.

Posted Date : 04-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రపంచ విపత్తుల స్థితి

తగ్గించి.. తట్టుకొని నిలబడి!

  ఆధునిక కాలంలో విస్తృత ప్రగతితోపాటు విపత్తులూ పెరిగాయి. ఆపగలిగేంత శక్తిని పూర్తిగా సంతరించుకోలేకపోయినా వాటి తీవ్రతను, ప్రాణనష్టాన్నీ తగ్గించగలుగుతున్నారు. తట్టుకొని నిలబడగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో విపత్తులు ఎన్ని రకాలు, ఎలాంటి నష్టాన్ని కలిగిస్తున్నాయి, ఏయే నివేదికలు, సమావేశాలు ఏం చెబుతున్నాయి? ఏవిధమైన నిర్దేశాలు చేస్తున్నాయనే అంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

  మానవుడు ఎంత అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ అనేక సహజ, మానవ కారణాల వల్ల విపత్తుల సంఖ్య కాలంతో పాటు పెరుగుతూనే ఉంది. 1994 నుంచి 1998 మధ్య ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి సగటున 428 విపత్తులు సంభవిస్తే 1999 నుంచి 2003 మధ్య సగటున 707 విపత్తులు నమోదయ్యాయి. అంటే నాలుగేళ్ల వ్యవధిలో సగటున సంవత్సరానికి 60 శాతం విపత్తులు పెరిగాయి. వీటిలో మానవాభివృద్ధి అల్పంగా ఉన్న దేశాల్లో సగటున 142 శాతం పెరిగాయి. కాలానుగుణంగా విపత్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ముందుగానే సంసిద్ధంగా ఉండటం, తీవ్రత తగ్గించడం లాంటి చర్యలను చేపట్టడంతో ప్రాణ నష్టం తగ్గించగలుగుతున్నాం. కానీ విపత్తుల కారణంగా ఆర్థిక నష్టం పెరుగుతూనే ఉంది. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం విపత్తుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా సగటున 880 బిలియన్‌ డాలర్ల నష్టం జరుగుతుంది.

 

సహజ వైపరీత్యాల పరంగా ప్రపంచ విపత్తుల తీరు

వరదలు            - 30%

తుపాన్‌లు            - 21%

కరవు              - 19%

మహమ్మారి వ్యాధులు   - 15%

భూకంపాలు, సునామీలు - 8%

భూపాతాలు (కొండచరియలు విరిగిపడటం) - 4%

హిమపాతాలు         - 1%

అగ్నిపర్వత విస్ఫోటనాలు  - 1%

కీటక దాడులు         - 1%


                    ========

                      100%

                    ========


ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అన్నిరకాల విపత్తుల్లో ప్రాణ నష్టం తీరు

కరవు, దుర్బిక్షం    - 45%

వరదలు         - 16%

పారిశ్రామిక పేలుళ్లు, రోడ్డు ప్రమాదాలు లాంటి సాంకేతికపరమైన విపత్తులు   - 14%

భూకంపాలు           - 12%

తుపాన్‌లు            - 10%

ఇతర విపత్తులు     - 3%


            ===================

                     100%

          ====================

 

సహజ విపత్తులు

 

జల, వాతావరణ సంబంధ విపత్తులు: అత్యధికంగా ఆసియా, తర్వాత వరుసగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా, ఓషియానియా (ఆస్ట్రేలియా) ఖండాల్లో సంభవిస్తున్నాయి.

 

భౌగోళిక విపత్తులు: అత్యధికంగా ఆసియా, తర్వాత ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఓషియానియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లో  సంభవిస్తున్నాయి.

 

జైవిక విపత్తులు: అత్యధికంగా ఆఫ్రికా, తర్వాత ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఓషియానియా ఖండాల్లో  సంభవిస్తున్నాయి.

* ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితిల నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం విస్తరించిన విపత్తులు వరదలు, తుపాన్‌లు. ఆఫ్రికా దేశాల్లో మాత్రం తరచూ కరవు సంభవిస్తోంది. ఎల్లప్పుడూ కరవు, వరదలతో సతమతమవుతున్న దేశాలను ప్రపంచంలోనే అత్యంత ఆకలి దేశాలుగా పిలుస్తున్నారు.

* ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడ్‌క్రాస్‌ అండ్‌ రెడ్‌క్రెసెంట్‌ సొసైటీ (ఐఎఫ్‌ఆర్‌సీ, జెనీవా) ప్రచురించిన ప్రపంచ విపత్తుల నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా విపత్తుల ప్రభావానికి గురయ్యే వారిలో 85% ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాలకు చెందినవారే ఉంటున్నారు.

* యుఎన్‌ఐఎస్‌డీఆర్‌ గ్లోబల్‌ అసెస్‌మెంట్‌ రిపోర్ట్‌ (జీఏఆర్‌ - 2019) ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం విపత్తు మరణాల్లో 90% అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోనే జరుగుతున్నాయి. విపత్తుల్లో నాశనమవుతున్న గృహాల్లో 2/3వ వంతు జల, వాతావరణ వైపరీత్యాల వల్లే జరుగుతున్నాయి.

 

జీఏఆర్‌ - 2022 ప్రకారం

* గత 20 ఏళ్లలో ఏటా పెద్ద, మధ్య తరహా విపత్తులు 350 నుంచి 500 వరకు సంభవించాయి. 2030 నాటికి ఏటా సగటున 560 సహజ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

* గత పదేళ్లలో సంవత్సరానికి సరాసరిగా సహజ విపత్తుల వల్ల ప్రపంచం మొత్తం 170 బిలియన్‌ డాలర్ల నష్టం జరిగింది.

* విపత్తుల వల్ల అల్ప, మధ్య ఆదాయ దేశాలు ఏటా తమ జీడీపీలో 1% ఆదాయాన్ని కోల్పోతున్నాయి.

* అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ నష్టం 0.1% నుంచి 0.2% వరకు మాత్రమే ఉంటుంది.

* విపత్తులు, వాతావరణ మార్పుల వల్ల 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ల మంది తీవ్ర పేదరికంలోకి వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మయన్మార్, వియత్నాం, పాకిస్థాన్‌ లాంటి దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

 

అంతర్జాతీయ సమావేశాలు

విపత్తు ముప్పు కుదింపు కోసం ఇప్పటి వరకు మూడు అంతర్జాతీయ సమావేశాలు జరిగాయి.

 

సురక్షిత ప్రపంచం కోసం యొకహోమా సమావేశం (1994): ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు జపాన్‌లోని యొకహోమా నగరంలో 1994 మే 23 నుంచి 27 వరకు అయిదు రోజులు సమావేశమయ్యాయి. ఈ సమావేశాన్ని ‘ప్రకృతి విపత్తుల తగ్గింపు కోసం ప్రపంచ సమావేశం’ అని వ్యాఖ్యానించారు. ఇది విపత్తుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడుతున్న ప్రాణ నష్టం, పర్యావరణ హానిని అరికట్టి సుస్థిరŸ అభివృద్ధి సాధించడం కోసం కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది.

 

హ్యోగో కార్యచట్రం (2005 - 2015): ఇది జపాన్‌లోని హ్యోగో నగరంలోని కోబెలో 2005 జనవరి 18 నుంచి 22 వరకు జరిగింది. ఈ సమావేశంలో విపత్తుల ప్రభావాన్ని తట్టుకొని తిరిగి నిలబడగలిగే సామర్థ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో  పెంపొందించేందుకు అనుసరించాల్సిన వ్యూహం, విధాన మార్గదర్శకాలు, కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు.

 

విపత్తు కుదింపు కోసం సెండాయ్‌ కార్యాచరణ (2015 - 2030): హ్యోగో కార్యచట్రానికి కొనసాగింపుగా 2015 మార్చి 14 నుంచి 18 వరకు జపాన్‌లోని సెండాయ్‌ నగరంలో ఈ సమావేశం జరిగింది. హ్యోగో కార్యాచరణ అమల్లో ఉన్న 10 సంవత్సరాల కాలంలోనే విపత్తుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ సమావేశంలో కొన్ని ప్రపంచ లక్ష్యాలు నిర్ణయించారు.

* 2020 - 30 నాటికి ప్రపంచవ్యాప్త మరణాల సంఖ్య లక్ష లోపు ఉండేలా చర్యలు తీసుకోవాలి.

* 2020 - 30 నాటికి విపత్తుల బాధితులను లక్ష లోపు పరిమితం చేయాలి.

* 2030 నాటికి విపత్తుల నష్టాన్ని ప్రపంచ వ్యాప్తంగా జీడీపీలో గణనీయంగా తగ్గించాలి.

* 2030 నాటికి అవస్థాపనా సౌకర్యాలు, విద్య, ఆరోగ్య లాంటి అంశాల్లో నష్టాన్ని గణనీయంగా తగ్గించాలి.

* 2020 నాటికి అన్ని దేశాలు ప్రాంతీయంగా, జాతీయంగా విపత్తు కుదింపు వ్యూహాలను సమర్థంగా పెంచుకోవాలి.

* అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవాన్ని ఏటా అక్టోబరు 13న నిర్వహిస్తారు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. ప్రపంచ విపత్తులు, మరణాలు, ప్రభావితమైన వారిలో అత్యధిక శాతం వాటా ఏ ఖండంలో ఉంది?

1) ఆసియా   2) ఆఫ్రికా   3) ఐరోపా    4) ఓషియానియ

 

2. UNISDR ప్రకారం ప్రపంచ సహజ విపత్తుల్లో అత్యధికం దేనివల్ల సంభవిస్తున్నాయి?

1) కరవు     2) తుపాన్లు      3) వరదలు     4) సునామీలు

 

3. ప్రపంచవ్యాప్త విపత్తు మరణాల్లో అత్యధిక మరణాలకు కారణమయ్యే విపత్తు?

1) భూకంపాలు     2) కరవు    3) వరదలు    4) తుపాన్లు  


4. ప్రపంచవ్యాప్త జైవిక విపత్తుల్లో అత్యధిక శాతం ఏ ఖండంలో జరుగుతున్నాయి?

1) ఆఫ్రికా  2) ఆసియా   3) ఓషియానియా  4) ఐరోపా

 

5. ‘ప్రాకృతిక విపత్తు అనేది ఏదీ లేదు, కేవలం ప్రాకృతిక అపాయం తప్ప’ అనే వాక్యం?

1) సత్యం   2) అసత్యం    3) సత్యం కావచ్చు, అసత్యం కావచ్చు  4) అర్థరహితం

 

6. ప్రపంచ వ్యాప్తంగా విపత్తుల ప్రభావానికి గురైన వారిలో 85% ఏ ప్రాంతానికి చెందినవారు?

1) ఆసియా, పసిఫిక్‌    2) ఆసియా, ఆఫ్రికా     3) దక్షిణాసియా   4) ఉత్తర ఆసియా

 

7. ఎప్పుడూ కరవు, వరదలతో పీడించబడుతున్న దేశాలు?

1) అత్యంత పేద దేశాలు    2) అత్యంత ఆకలి దేశాలు    

3) అత్యంత పీడిత దేశాలు   4) అత్యంత పౌరుష దేశాలు

 

8. విపత్తుల కుదింపు కోసం సెండాయ్‌లో మూడో అంతర్జాతీయ సమావేశం ఎప్పుడు జరిగింది?

1) 2015 మార్చి     2) 2015 జనవరి    3) 2017 మార్చి     4) 2018 మే

 

9. అంతర్జాతీయ విపత్తుల కుదింపు దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

1) మార్చి 21     2) అక్టోబరు 13    3) నవంబరు 10   4) మే 22

 

10. సెండాయ్‌ సమావేశం లక్ష్యం?

1) 2020 - 30 నాటికి ప్రపంచ విపత్తు మరణాలు లక్షకి తగ్గించాలి.

2) 2020 - 30 నాటికి ప్రపంచ విపత్తు మరణాలు 5 లక్షలకు కుదించాలి.

3) 2020 - 30 నాటికి ప్రపంచ విపత్తు మరణాలు 50 వేలకు తగ్గించాలి.

4) ఏదీకాదు

 

సమాధానాలు

1-1; 2-3; 3-2; 4-1; 5-1; 6-1; 7-2; 8-1; 9-2; 10-1.

 

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 10-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆవరణ వ్యవస్థ విధులు

ఆ గొలుసులో ఉత్పత్తిదారులు.. విచ్ఛిన్నకారులు!

  భూమండలంపై ప్రతి జీవి ఆహారానికి మూలాధారం సూర్యుడి నుంచి లభించే శక్తి ప్రవాహం. దీని ఆధారంగానే పత్రహరితం తయారై శాకాహార, మాంసాహార జీవులకు ఆహారం లభిస్తుంది. దీనిలో భాగంగా శిలావరణం, వాతావరణం, జలావరణాల మధ్య చక్రీయ అనుసంధానంతో ఆవరణ వ్యవస్థ కొన్ని ముఖ్య విధులను నిర్వహిస్తోంది. పర్యావరణం అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వాటిపై అవగాహన కలిగి ఉండాలి.

 

  ప్రతి జీవికి నిరంతరం మనుగడ కల్పించడమే ఆవరణ వ్యవస్థ ప్రధాన విధి. ఆవరణ వ్యవస్థలోని జీవ, నిర్జీవ అనుఘటకాల మధ్య జరిగే చర్య, ప్రతి చర్యలను ఆవరణ వ్యవస్థ విధి నిర్వహణ అంటారు. దీని సమగ్ర విధి నిర్వహణ కింది అంశాల ద్వారా జరుగుతుంది.

 

ఉత్పాదన 

ఒక ప్రమాణ కాలం, వైశాల్యంలో ఆవరణ వ్యవస్థ నుంచి శ్వాసక్రియ, కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఉత్పత్తిదారులు (వృక్షజాతులు) తయారుచేసిన జీవ ద్రవ్యరాశి ఉత్పత్తి రేటును ఉత్పాదన అంటారు. వృక్ష, జంతు జాతుల ఉత్పాదనను ‘ఉత్పాదన ఆవరణ శాస్త్రం’ (ప్రొడక్షన్‌ ఎకాలజీ) అంటారు. వనరుల యాజమాన్యం దృష్ట్యా ఉత్పాదన శాస్త్ర విజ్ఞానానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.

  మానవుడి సంక్షేమం కోసం పర్యావరణం, తత్సంబంధమైన సంరక్షణా పద్ధతులను పెంపొందించడానికి ఇంటర్నేషనల్‌ బయోలాజికల్‌ ప్రోగ్రాం ఆధ్వర్యంలో సంస్థాగతంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. మొత్తం ఉత్పాదనకు కావాల్సిన కర్బన పదార్థాల పునరాభివృద్ధి రేటును టర్నోవర్‌ అంటారు.

టర్నోవర్‌ విలువ (T) = Bmax - Bmin

Bmax = సంవత్సరంలో గరిష్ఠ జీవ ద్రవ్యరాశి రేటు

Bmin = సంవత్సరంలో కనిష్ఠ జీవ ద్రవ్యరాశి రేటు

 

ప్రాథమిక ఉత్పాదన: ఒక నిర్ణీత ఆవరణ వ్యవస్థలోని ఉత్పత్తిదారులు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారుచేసుకునే పిండి పదార్థాలకు వినియోగపడిన సౌర వికిరణ శక్తి విలువల రేటును ప్రాథమిక ఉత్పాదన అంటారు.

 

ద్వితీయ ఉత్పాదన: నిర్ణీత ఆవరణ వ్యవస్థ నుంచి అభివృద్ధి చెందిన వినియోగదారుల పోషక స్థాయిల్లోని శక్తి విలువల రేటును ద్వితీయ ఉత్పాదన అంటారు.

 

శక్తి ప్రవాహం 

సూర్యుడి నుంచి భూమి వైపు ప్రసరించే సౌరశక్తిని సూర్యపుటం అంటారు. దీనిలో 51% మాత్రమే భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఈ శక్తిని జీవ, నిర్జీవ అనుఘటకాల ద్వారా శిలావరణం, వాతావరణం, జలావరణం మధ్య జీవ, భూరసాయన వలయాల ద్వారా చక్రీయంగా థర్మోడైనమిక్‌ సూత్రాలకు అనుగుణంగా బదిలీ చేయడం ఆవరణ వ్యవస్థ మరొక ముఖ్య విధి.

 

విచ్ఛిన్నత విధి 

ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారులుగా పిలిచే బ్యాక్టీరియా, శిలీంద్రాలు లాంటి సూక్ష్మజీవులు వృక్ష, జంతు జీవ జాతుల మృత కళేబరాలు, విసర్జకాలను విచ్ఛిన్నం లేదా కుళ్లిపోయేలా చేస్తాయి. ఈ విచ్ఛిన్నత వల్ల సంక్లిష్ట కర్బన పదార్థాలు సరళ అకర్బన పదార్థాలుగా మారి భూవాతావరణంలో విలీనమవుతాయి. ఆవరణ వ్యవస్థ విధుల్లో ఇది చాలా ముఖ్యమైంది.

 

జీవావరణ అనుక్రమం 

ఏదైనా ఆవరణ వ్యవస్థలో కాలం, ప్రాంతాన్ని బట్టి శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఒక జీవ సమాజ స్థానంలో మరొక జీవ సమాజం ఆక్రమించడాన్ని జీవావరణ అనుక్రమం అంటారు. ఇది నెమ్మదిగా, అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ చివరకు స్థిరమైన జీవ సమాజం ఉన్న ఒక సమాజ ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. దీన్ని పరాకాష్ఠ జీవ సమాజం అంటారు. 

* జీవావరణ అనుక్రమం కింది దశల్లో జరుగుతుంది.

 

అనాచ్ఛాదన: నేల స్థితి, జీవ సంబంధ, శీతోష్ణ కారకాల వల్ల ఒక భౌగోళిక ప్రాంతంలో అనేక మార్పులు వస్తాయి. దీని కారణంగా ఒకప్పటి వృక్ష, జంతు జాతులు నశించి ఆ ప్రదేశం క్రమంగా ఎలాంటి జీవజాతులు లేని బంజరు భూమిగా మారడాన్ని అనాచ్ఛాదనం అంటారు.

 

దురాక్రమణ: గాలి, నీటి ద్వారా కొన్ని విత్తనాలు, సిద్ధ బీజాలు లాంటివి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కొట్టుకుపోతాయి. కొన్ని జంతు జాతులు కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లి స్థిరపడతాయి. దీన్నే దురాక్రమణ అంటారు.

 

జాతుల మధ్య పోరాటం: ఒక ప్రాంతంలో జాతుల జనాభా పెరగడం వల్ల ఆవాస, ఆహార కొరత ఏర్పడుతుంది. దీనివల్ల జాతుల మధ్య పోరాటం జరిగి చివరకు కొన్ని జాతులు అక్కడి నుంచి తరలిపోవాల్సి వస్తుంది.

 

ప్రతిస్పందన: ఒక ప్రాంతంలో ఆదిపత్యం సాధించి స్థిరపడిన జాతులు పర్యావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం లేదా పర్యావరణానికి అనుకూలంగా తమ విధులను మార్చుకుంటూ మనుగడ సాగించడాన్ని ప్రతిస్పందన అంటారు.

 

ఆహార గొలుసు  

ఆవరణ వ్యవస్థలో ఒక జీవి మరొక జీవిని తినడం, ఆ జీవి ఇంకో జీవికి ఆహారంగా మారడం జరుగుతుంది. ఈ విధంగా శక్తి, ఆహార పదార్థాలు ఉత్పత్తిదారుల నుంచి పరాకాష్ఠ వినియోగదారులకు రేఖీయంగా బదిలీకావడం వల్ల ఏర్పడిన నిర్మాణాన్నే ఆహార గొలుసు అంటారు. ఇది విచ్ఛిన్నకారులతో అంతమవుతుంది. ఆహార గొలుసులో మొదటి పోషక స్థాయిలో ఉత్పత్తిదారులు, అంతిమ పోషక స్థాయిలో విచ్ఛిన్నకారులు ఉంటారు.

 

గడ్డిమైదాన ఆహార గొలుసు: గడ్డి మిడత కప్ప పాము గద్ద 

 

ఆకురాల్చే అడవుల ఆహార గొలుసు: గడ్డి కుందేలు నక్క తోడేలు ® పులులు/సింహాలు 

 

చిట్టడవి ఆవరణ ఆహార గొలుసు: గడ్డి కుందేలు గద్ద  

 

మానవ నిర్మిత ఆహార గొలుసు: గడ్డి గొర్రెలు/మేకలు మానవులు 

 

మంచినీటి ఆహార గొలుసు: వృక్ష ప్లవకాలు జంతు ప్లవకాలు చిన్న చేపలు పెద్ద చేపలు కొండలు

 

సముద్ర ఆవరణ ఆహార గొలుసు: వృక్ష ప్లవకాలు జంతు ప్లవకాలు చిన్న చేపలు పెద్ద చేపలు తిమింగలాలు/మొసళ్లు  

 

పరాన్నజీవి ఆహార గొలుసు: గడ్డి గొర్రె మానవుడు గుండ్రటి పురుగు 

 

పూతికాహారపు ఆహార గొలుసు: మృత కళేబరాలు బ్యాక్టీరియా/శిలీంధ్రాలు ఉడుతలు/కోళ్లు గద్దలు 

 

ఆహారపు వల: జీవులు వాటి ఆవాసాలు, ఆహారపు వనరులను కోల్పోయినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆహారాన్ని పొందే ప్రయత్నం చేస్తాయి. దీనిలో భాగంగా ఆవరణ వ్యవస్థలోని ఆహారపు గొలుసులను ఆక్రమిస్తాయి. ఇలాంటప్పుడు ఆహారపు గొలుసులు ఒకదాంతో మరొకటి అనుసంధానించగా ఏర్పడిన వల లాంటి క్రియాత్మక నిర్మాణాన్ని ఆహారపు వల లేదా ఆహారపు జాలం అంటారు.

 

మాదిరి ప్రశ్నలు 

 

1. ఆహారపు గొలుసులు దేంతో అంతమవుతాయి?

1) ప్రాథమిక ఉత్పత్తిదారులు   2) ద్వితీయ ఉత్పత్తిదారులు

3) పోషకాహారులు         4) విచ్ఛిన్నకారులు

 

2. ఆవరణ శాస్త్ర అధ్యయనంలో అతిచిన్న ప్రమాణం?

1) జీవి   2) జాతి  3) జనాభా  4) సమూహం

 

3. ఒకదాంతో మరొకటి అనుసంధానించిన ఒకటి కంటే ఎక్కువ ఆహార గొలుసుల సముదాయాన్ని ఏమని పిలుస్తారు?

1) ఆహార గొలుసు   2) ఆహార పిరమిడ్‌   

3) శక్తి పిరమిడ్‌     4) ఆహారపు జాలం

 

4. గడ్డి గొర్రె మానవుడు గుడ్రటి పురుగు (అస్కారిస్‌) దేన్ని తెలియజేస్తుంది? 

1) పూతికాహారపు ఆహార గొలుసు    2) పరాన్నజీవి ఆహార గొలుసు

3) మేత ఆహార గొలుసు           4) పైవన్నీ 

 

5. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు లాంటి వైపరీత్యాల వల్ల అక్కడి జీవులు నశించి నూతన జీవుల ఆవిర్భావం జరగడాన్ని ఏమంటారు?

1) అనాచ్ఛాదన    2) దురాక్రమణ   3) జీవావరణ అనుక్రమం    4) ప్రతిస్పందన

 

6. మానవుడు భూమి మీద శాశ్వతంగా నివసించని ప్రాంతాలను ఏమంటారు?

1) ఏక్యుమన్‌   2) ఎకోటైప్‌   3) పయోనీర్స్‌    4) ఆడ్‌మచ్‌

 

7. ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ ఏ విధంగా ఉంటుంది?

1) సమాంతరంగా    2) రేఖీయంగా   

3) చక్రీయంగా      4) జిగ్‌జాగ్‌గా

 

8. కిందివాటిలో సర్వభక్ష జీవి అని దేన్ని పిలుస్తారు?

1) పులి   2) దుప్పి   3) కాకి  4) తిమింగలం

 

9. ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారుల పాత్ర పోషించేవి?

1) వైరస్‌లు    2) బ్యాక్టీరియాలు    3) శిలీంధ్రాలు 4) 1, 2  

 

10. జలావరణ వ్యవస్థలో సుర్యకాంతి ప్రసరించని ప్రాంతం?

1) ప్రొఫండల్‌ మండలం    2) యూఫోటిక్‌ మండలం

3) జీరార్క్‌ మండలం       4) హైడార్క్‌ మండలం

 

సమాధానాలు 

1-4; 2-1; 3-4; 4-2; 5-3; 6-1; 7-2; 8-3; 9-2; 10-1.

 

రచయిత: జల్లు సద్గుణ రావు

Posted Date : 17-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో విపత్తులు

అంతా ఆపదలమయం!

  దేశంలో ఏటా ఎక్కడో ఒకచోట ఏదో ఒక విపత్తు ఏర్పడుతూనే ఉంటుంది. ప్రకృతి ప్రకోపానికి గురైనప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణలు కోల్పోతున్నారు. ఆస్తులు నష్టపోతున్నారు. మనుషులు తమ మనుగడ కోసం పర్యావరణ వనరులను వినియోగించుకోవడమూ వైపరీత్యాలకు దారితీస్తోంది. ఆ ఆపదలు ఎన్ని రకాలు? వాటికి కారణాలు ఏమిటి? ఏవిధమైన నష్టాలు సంభవిస్తున్నాయి? తదితర అంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

   విభిన్న భౌగోళిక, శీతోష్ణ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా భారతదేశం పెద్ద సంఖ్యలో ప్రకృతి, మానవకారక విపత్తులను ఎదుర్కొంటోంది. వీటికి తోడు అధిక జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అశాస్త్రీయ పద్ధతుల ఆచరణ లాంటి కారకాలు కూడా విపత్తుల దుర్భలత్వాన్ని పెంచుతున్నాయి. మన దేశంలో విపత్తులు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం దేశ భౌగోళిక నిర్మాణం.

 

భౌగోళిక దుర్భలత్వం 

విపత్తులకు గురయ్యే స్వభావాన్ని బట్టి భారతదేశాన్ని అయిదు ప్రత్యేక ప్రాంతాలుగా విభజించారు.

 

హిమాలయ ప్రాంతం: భారతీయ భూపటల పలక, యూరేషియన్‌ భూపటల పలక కిందకు క్రియాశీలకంగా భూఅంతర్భాగంలో ప్రవేశిస్తుండటం వల్ల అతి తీవ్రమైన భూకంపాలు సంభవిస్తాయి. పాకిస్థాన్‌ సరిహద్దు నుంచి తూర్పున మయన్మార్‌ సరిహద్దు వరకూ భూకంపాలు, వాటికి సంబంధించిన భూపాతాలు (శిలలు విరిగి పడటం) తరచుగా జరుగుతున్నాయి. అంతే కాకుండా హిమాలయాల్లో అధిక వర్షాలు కారణంగా నేల కోతకు గురవుతోంది. 

 

ఉత్తర మైదానం: ఇది హిమాలయ ప్రాంతానికి పక్కనే ఉన్నందున భౌగోళికంగా విరూపకారక లక్షణాలు (ఖండ పలకల చలనాలు) కలిగి భూకంపాలు, భూపాతాలు (శిలలు విరిగి పడటం) ఏర్పడుతున్నాయి. నైరుతీ రుతుపవన కాలంలో విపరీతమైన వరదలు సంభవిస్తాయి. దాంతో నేల క్రమక్షయానికి గురవుతుంది. 

 

ద్వీపకల్ప పీఠభూమి: ఈ ప్రాంతం వివిధ రకాల కొండలతో విస్తరించి స్థిరమైన భూభాగంగా పరిగణిస్తున్పటికీ ఒక మోస్తరు భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే కొండల వెనుక ప్రదేశాల్లో వర్షం తక్కువగా ఉండి వర్షచ్ఛాయా ప్రాంతాలుగా మిగిలిపోయి కరవు కాటకాలు సంభవిస్తున్నాయి.

ఉదా: రాజస్థాన్, గుజరాత్, మహరాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాలు.

 

తీరప్రాంత మండలం: భారత దేశానికి దీవులతో సహా మొత్తం తీరం 7,516 కిలోమీటర్లుగా ఉంది. ఇందులో 76 శాతం అంటే 5,700 కి.మీ తీరం తుపాన్లు, సునామీల ప్రమాదాలకు ఎక్కువగా గురవుతోంది. ఏటా తీర ప్రాంతం నదీ ముఖద్వారాల వద్ద (నదులు సముద్రంలో కలిసే ప్రాంతాలు) వరదలు సంభవిస్తున్నాయి. 

 

ఎడారి ప్రాంతం: ఈ ప్రాంతంలో అల్ప నుంచి అత్యల్ప వర్షం నమోదు కావడం వల్ల ప్రతి సంవత్సరం కరవు కాటకాలు ఏర్పడుతున్నాయి. ఒక్కోసారి వర్షపాతం సాధారణం కన్నా 50 శాతం తగ్గిపోయి విపత్కర కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ విధంగా భారతదేశ సహజ సిద్ధమైన భౌగోళిక నిర్మాణమే వివిధ విపత్తుల దుర్భలత్వానికి ప్రధాన కారణంగా ఉంది.

 

శీతోష్ణ దుర్భలత్వం 

  దేశంలో వార్షిక వర్షపాతంలో సుమారుగా 75 శాతం వర్షం కేవలం నైరుతి రుతుపవనాల (జూన్‌ - సెప్టెంబరు నెలల్లో) కాలంలోనే కురుస్తుంది. ప్రతి ఏడెనిమిదేళ్లకు దేశంలో తీవ్ర కరవు సంభవిస్తుంది. 1980 - 2010 మధ్యలో నాలుగుసార్లు కరవు కాటకాలు వచ్చాయి. 1876-78లో మధ్య దక్షిణ భారతదేశంలో మహాదుర్భిక్షం, 1896-97లో దేశంలో దుర్భిక్షం సంభవించాయి (కరవు ఎక్కువ కాలం కొనసాగి, ఎక్కువ మందిపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని దుర్భిక్షంగా పేర్కొంటారు).

  దేశంలో వర్షపాత వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అత్యధిక వర్షపాతం మేఘాలయ రాష్ట్రంలోని మాసిన్రాంలో ఏటా 1,187 సెం.మీ. ఉంటే రాజస్థాన్‌ జైసల్మేర్‌లో 12 సెం.మీ. మాత్రమే ఉంటుంది. తూర్పు, ఈశాన్య భారత దేశంలో అధిక వర్షాలు వల్ల గంగా, బ్రహ్మపుత్రా నదీ మైదానాల్లో ప్రతి సంవత్సరం వరదలు సంభవిస్తున్నాయి. 

 

సామాజిక, ఆర్థిక దుర్భలత్వం

  పేదలు తమ మనుగడ కోసం అనివార్య పరిస్థితుల్లో పర్యావరణ వనరులను ఉపయోగించుకోవడం వల్ల వరదలు, కరవు, భూపాతం లాంటి విపత్తుల తీవ్రత ఎక్కువవుతోంది. సరైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించకుండా తక్కువ వ్యయంతో కూడిన సామగ్రితో నిర్మించిన గృహాలు సులభంగా విపత్తులకు గురై మరింత సామాజిక వెనుకబాటుకు దారి తీస్తుంది. ఉదా: 2001-11 మధ్య వరదలు, చక్రవాతాలు, భూకంపాలు, భూపాతాల వల్ల సుమారుగా 1,50,23,870 ఇళ్లు ధ్వంసమయ్యాయి.

 

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వివరణ: ఈ సంస్థ నిర్వహిస్తున్న ఇండియన్‌ డిజాస్టర్‌ నాలెడ్జ్‌ నెట్‌వర్క్‌ (ఎన్‌ఐడీఎమ్‌) ప్రకారం దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5 ప్రాంతాలను అధిక విపత్తులకు గురయ్యే ప్రాంతాలుగా గుర్తించారు. 

* దేశంలో సాగు భూమిలో 68 శాతం భూమి కరవును ఎదుర్కొంటోంది. 58.6 శాతం భూభాగంలో భూకంపాలు ఏర్పడే ప్రమాదం ఉంది. 

* దేశం మొత్తం భూమిలో 12 శాతం భూభాగం వరదలు, 8 శాతం చక్రవాతాలు, 0.15 శాతం భూపాతాలు కలిగే అవకాశం ఉంది. 

 

భారతదేశంపై ప్రపంచ బ్యాంకు వివరణ: భారతదేశ అభివృద్ధి మార్గానికి సహజ విపత్తులు ఒక ప్రధాన అవరోధంగా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 

* దేశంలో సహజ విపత్తుల వల్ల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రెండు శాతం నష్టం ఏర్పడుతోంది.

* విపత్తుల వల్ల ప్రభుత్వ ఆదాయంలో 12 శాతం,  వైపరీత్యాల వల్ల జీడీపీలో 3 శాతం నష్టం వాటిల్లుతోంది. 

* యునైటెడ్‌ నేషన్స్‌ డిజాస్టర్స్‌ రిస్క్‌ రిడక్షన్‌ (యూఎన్‌డీఆర్‌ఆర్‌) ప్రివెన్షన్‌ వెబ్‌ ప్రకారం భారతదేశంలో 1980-2010 మధ్య సహజ విపత్తులు వాటి ప్రభావాలు కింది విధంగా ఉన్నాయి. 

* విపత్తు ఘటనల సంఖ్య - 431

* మృతులు - 1,43,039 మంది

* ప్రభావిత ప్రజలు - 152,17,26,127 మంది

 

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్ట్స్‌ ప్రకారం

భారత దేశ విస్తీర్ణంలో సుమారుగా 85 శాతం భూభాగం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ విపత్తులకు గురయ్యే ప్రమాదం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది.

భారతదేశంలో సహజ విపత్తుల తీరు

వరదలు - 52 శాతం

తుపాన్లు - 23 శాతం

భూకంపాలు - 11 శాతం

భూపాతాలు - 11 శాతం

కరవు, ఇతరాలు - 3 శాతం 

 

సంవత్సరానికి సగటు మరణాలు (సుమారుగా)

* భూకంపాలు - 2,672 మంది

* వరదలు - 1,308 మంది

* తుపాన్లు - 1,219 మంది

* భూపాతాలు - 104 మంది

* కరవు - 8 మంది

 

మాదిరి ప్రశ్నలు

 

1. భారతదేశంలో జరుగుతున్న సహజ విపత్తుల్లో కింది వాటిలో ఏది అధిక స్థాయిలో ఉంది?

1) భూకంపాలు   2) వరదలు    3) కరవు    4) భూపాతాలు

 

2. భారతదేశంలో ద్వీపకల్ప ప్రాంతం కింది ఏ విపత్తులకు ఆలవాలం?

1) ఒక మాదిరి భూకంపాలు, కరవులు    2) కరవు, నేలకోత

3) తీవ్ర వరదలు, భూకంపాలు   4) తీవ్ర భూకంపాలు, భూపాతాలు

 

3. మనదేశంలో ఏ ప్రాంతంలో భూకంపాలు, భూపాతాలు, నేల క్రమక్షయం, విపత్తులు అధికంగా సంభవిస్తాయి?

1) తీరప్రాంత మండలం   2) ఎడారి ప్రాంతం     3) ఉత్తర మైదానం    4) ద్వీపకల్పం

 

4. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం దేశంలో ఎన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విపత్తులకు అధిక దుర్భలత్వం కలిగి ఉన్నాయి?

1) 27 ప్రాంతాలు       2) 30 ప్రాంతాలు    3) 36 ప్రాంతాలు   4) 25 ప్రాంతాలు

 

5. దేశంలో ఎంత శాతం సాగు భూమిలో కరవు ఏర్పడుతుంది?

1) 68 శాతం     2) 75 శాతం     3) 58 శాతం    4) 40 శాతం

 

6. దేశంలో ఏ సహజ విపత్తుల వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయి?

1) భూకంపాలు    2) వరదలు     3) తుపాన్లు     4) భూపాతాలు

 

7. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం సహజ విపత్తుల వల్ల దేశ జీడీపీలో ఎంత శాతం నష్టపోతున్నాం?

1) 2 శాతం   2) 5 శాతం    3) 10 శాతం   4) 12 శాతం  

 

8. దేశంలో తుపాన్లు, సునామీలకు ఎక్కువగా గురవుతున్న తీరరేఖ పొడవు?

1) 5,700 కి.మీ    2) 7,500 కి.మీ     3) 4,500 కి.మీ     4) 2,500 కి.మీ

 

9. దేశంలో అత్యధిక వర్షం కురిసే ప్రాంతం ఏది?

1) మాసిన్రాం   2) జైసల్మేర్‌    3) కొలంబై   4) కొచ్చిన్‌  

 

10. దేశ శీతోష్ణ స్థితిగతులపై ప్రతికూల ప్రభావం చూపించే దృగ్విషయం ఏది?

1) ఎల్‌నినో    2) లానినా     3) టోర్నడో     4) వాటర్‌ స్పాట్‌

 

సమాధానాలు 

1-2, 2-1, 3-3, 4-1, 5-1, 6-1, 7-1, 8-1, 9-1, 10-1.

 

రచయిత: జల్లు సద్గుణరావు

 

Posted Date : 29-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జలావరణ వ్యవస్థ

జీవజాలం.. జలాధారం!

 

సముద్రాలు, నదులు, కాలువలు, సరస్సులు, హిమనీనదాలు, మంచు, గాలిలోని నీటి ఆవిరి సహా భూమండలంపై నీరు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా అది జలావరణం కిందికే వస్తుంది.  ఎన్నో రకాల జీవరాశులు ఇందులో మనుగడ సాగిస్తుంటాయి. పర్యావరణాన్ని పరిరక్షించడం, వాతావరణాన్ని సమతౌల్యం చేయడంలో ఈ ఆవరణ వ్యవస్థ అత్యంత కీలకంగా పనిచేస్తుంది. ఈ అంశాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 


ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో జీవ, నిర్జీవ కారకాల మధ్య శక్తి, పోషకాల మార్పిడి జీవ, భూ రసాయన వలయాల వల్ల జరుగుతుంది. ఇలాంటి నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని ఆవరణ వ్యవస్థగా పిలుస్తారు. జలం ఆవాసంగా ఉన్న ఆవరణ వ్యవస్థను జలావరణ వ్యవస్థ అంటారు. దీన్ని మూడు రకాలుగా విభజించవచ్చు.


మంచినీటి ఆవరణ వ్యవస్థ: మంచినీటిలో లవణీయత తక్కువగా ఉంటుంది (5% కంటే తక్కువ). 

ఉదా: సరస్సులు, కొలనులు/చెరువులు, నీటి బుగ్గలు, నదులు.


సముద్ర ఆవరణ వ్యవస్థ: సముద్ర నీటిలో లవణీయత అత్యధికంగా (35% కంటే ఎక్కువ) ఉంటుంది. వీటిలో నివసించే జీవజాతుల వ్యవస్థ ప్రత్యేకమైంది.

ఉదా: సముద్రాలు, మహాసముద్రాలు


పరివర్తన ఆవరణ వ్యవస్థ: దీనిలో లవణీయత మధ్యస్థంగా  (5% నుంచి 35%) ఉంటుంది. ఎస్చ్యురీలు, లాగూన్లు, సముద్ర వెనుక జలాలు, మాంగ్రూవ్స్‌లలో నివసించే జీవజాతులు దీని కిందకు వస్తాయి. 

 

ప్రభావితం చేసే అంశాలు

సూర్య కాంతి: సమస్త జీవరాశికి మూలాధారమైన సూర్యకాంతి సాధారణంగా జలాల ఉపరితలం నుంచి 200 మీటర్ల లోతు వరకు మాత్రమే ప్రసరిస్తుంది. ఈ కాంతి ప్రసరించే లోతును బట్టి వృక్ష, జంతుజాలాల ఉనికి ఆధారపడి ఉంటుంది. 


జలాల పారదర్శకత: నీటి పారదర్శకతను తగ్గించే బంకమన్ను, పూడికలు, వృక్ష ప్లవకాల వల్ల నీరు బురదమయమవుతుంది. నీటి పారదర్శకత తగ్గిన మేరకు లోతుకు వెళ్లే కొద్దీ కాంతి ప్రసరణ తగ్గుతుంది. అందువల్ల కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గి జలావరణ వ్యవస్థ ఉత్పాదనా సామర్థ్యం తగ్గిపోతుంది.


ఉష్ణోగ్రత: పరిసర ఉష్ణోగ్రత మార్పులకు నీరు చాలా నెమ్మదిగా ప్రభావితమవుతుంది. అంటే నీటి ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతుంది లేదా తగ్గుతుంది. అందువల్ల జలచర జీవరాశులకు ఉష్ణోగ్రతా సహనస్థాయి పరిధి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే నీటి ఉష్ణోగ్రతలో ఏ మాత్రం మార్పు వచ్చినా జలచర జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.

 

వివిధ మండలాలు 

 కొలను ఆవరణ వ్యవస్థ అనేది ఒక స్వయంసమృద్ధ జీవనాధార వ్యవస్థ. తీరం నుంచి లోతుకు వెళ్లే కొద్దీ జీవజాతుల ఆవాసాన్ని బట్టి దీన్ని వివిధ మండలాలుగా విభజించవచ్చు. 

యూఫోటిక్‌ మండలం: ఇది జలాల ఉపరితల ప్రాంతం. ఇక్కడ సూర్యకాంతి సమృద్ధిగా ప్రసరించడం వల్ల కిరణజన్యసంయోగక్రియ రేటు అధికంగా ఉంటుంది. మొక్కల శ్వాసక్రియ చర్య కూడా ఎక్కువే. ఆక్సిజన్‌ పుష్కలంగా లభిస్తుంది.

లిట్టోరల్‌ మండలం: దీన్ని వేలాంచల మండలం అంటారు. ఇది తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ కాంతి అడుగు భాగం వరకు చేరుతుంది. అందువల్ల కిరణజన్య సంయోగక్రియ అధికంగా జరిగి ఆక్సిజన్‌ సమృద్ధిగా లభిస్తుంది. ఈ ప్రాంతంలో పెరిగే మొక్కల వేర్లు నీటి అడుగు భాగంలో ఉంటాయి. వాటి పత్రాలు నీటి ఉపరితలంపై తేలియాడుతుంటాయి. 

ఉదా: నీటి లిల్లీలు, నీటిలో పూర్తిగా మునిగి ఉన్న మొక్కలు హైడ్రిల్లా, వృక్ష ప్లవకాలు లాంటి డయాటమ్స్, జంతు ప్లవకాలైన డాఫ్నియా రోటెఫర్‌లు లాంటివి జీవిస్తాయి. మొక్కలను అంటిపెట్టుకునే నత్తలు, కీటక డింభకాలు, హైడ్రాలు నివసిస్తాయి. వేలాంచల అడుగు భాగంలో సంచరించే జీవులను బెంథాస్‌ జీవులు అంటారు. ఎర్రటి అనెలిడ్‌లు, క్రే చేపలు వీటికి ఉదాహరణ.

లిమ్నెటిక్‌ మండలం: ఇది తీరానికి దూరంగా ఉండే జలాశయ ప్రాంతం. కొలనులో అతిపెద్ద మండలం. కాంతి సమృద్ధిగా లోపలికి వెళ్లగలిగే ప్రాంతం వరకు ఇది కొనసాగుతుంది. ఈ మండలంలో సమయానుకూలంగా ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ లభ్యతలు వేగంగా మారుతుంటాయి. ఈ ప్రాంతం ఉపరితల జలానికే పరిమితం. సరస్సు అడుగు భాగం వరకు లిమ్నెటిక్‌ మండలం విస్తరించదు. దీని కింద ప్రొఫండల్‌ మండలం ఉంటుంది. లిమ్నెటిక్‌ మండలంలో యూగ్లినాయిడ్స్, డయాటమ్స్, ఆకుపచ్చని శైవలాలు లాంటి స్వయంపోషక జీవులు అధికంగా నివసిస్తాయి. వీటితోపాటు జంతుప్లవకాలు, చేపలు, కప్పలు, నీటి సర్పాలు లాంటి వినియోగదారులూ జీవిస్తాయి. వేలాంచల మండలం, ప్రొఫండల్‌ మండలాలను వేరుచేస్తూ ఉన్న ఊహాజనిత రేఖను పరిహర మండలం లేదా కాంతి పరిహర మండలం అంటారు. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ రేటు, శ్వాసక్రియ రేటు సమానంగా ఉంటాయి. 


ప్రొఫండల్‌ మండలం: ఇది లిమ్నెటిక్‌ మండలానికి కిందనున్న లోతయిన నీటి ప్రదేశం. ఈ ప్రాంతంలో కాంతి ప్రసరణ ఉండదు. ఈ నీటిలో ఆక్సిజన్‌ తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇందులో కిరణజన్యసంయోగక్రియ జరిపే జీవులు ఉండవు. ఇక్కడ అవాయు శ్వాసక్రియ జరిపే, కుళ్లిన ఆహార పదార్థాలను తినే విచ్ఛిన్నకారులు/పూతికాహార (డెట్రిటస్‌) జీవులు ఉంటాయి.

 

సరస్సు జీవావరణ వ్యవస్థ

జలావరణ వ్యవస్థల్లో సరస్సు జీవావరణ వ్యవస్థ ఒక ఉన్నత స్థాయి జీవావరణ వ్యవస్థ. ఇందులో జీవగోళంలో మాదిరి అన్ని విధులూ జరుగుతాయి. సౌరశక్తి సహాయంతో స్వయం పోషకాలు అకర్బన పదార్థాలను కర్బన పదార్థాలుగా మారుస్తాయి. విచ్ఛిన్నకారులు చనిపోయిన జీవులను విచ్ఛిన్నం చేసి పోషక పదార్థాలు, ఖనిజాలు విడుదల చేయడం, అది తిరిగి స్వయంపోషకాల ద్వారా వినియోగంలోకి రావడం లాంటి ప్రక్రియలన్నీ జరుగుతాయి. 

 

చిత్తడి ప్రాంత ఆవరణ వ్యవస్థ 

తేమ, బురదతో కూడిన క్షార స్వభావం ఉన్న ప్రాంతాల్లో భౌమ, జల వనరుల మధ్య ఏర్పడిన సంక్లిష్ట ఆవరణ వ్యవస్థనే చిత్తడి ప్రాంత ఆవరణ వ్యవస్థగా పిలుస్తారు. ఇవి విలక్షణమైన జీవజాతులకు నిలయాలు. వలస పక్షులకు అనువైన ప్రదేశాలు. పోషకాల పరిమాణాన్ని పెంపొందిస్తాయి. కలుషిత జలాలను శుద్ధి చేస్తాయి. నేల క్రమక్షయాన్ని నియంత్రిస్తాయి. అందువల్ల చిత్తడి నేలలను పర్యావరణానికి కిడ్నీలుగా భావిస్తారు. 


చిత్తడి జలాల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1971, ఫిబ్రవరి 2న ఇరాన్‌లోని రాంసార్‌ వద్ద అంతర్జాతీయ పల్లపు భూముల (చిత్తడి నేలల) పరిరక్షణ సమావేశం జరిగింది. మనదేశంలో సుమారు 153 లక్షల హెక్టార్లలో ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. ఇవి దేశ వైశాల్యంలో 4.7%. 

మనదేశం నుంచి ఇప్పటి వరకు రాంసార్‌ కన్వెన్షన్‌లో చేర్చిన చిత్తడి నేలలు 49. 

* మొదట 1981లో చిల్కా సరస్సు (ఒడిశా), కియోలాడియో (రాజస్థాన్‌) లను తీసుకున్నారు.

దేశంలో:

* పెద్ద వెట్‌ల్యాండ్‌ - సుందర్‌బన్స్‌ (పశ్చిమ బంగా)

* చిన్న వెట్‌ల్యాండ్‌ - రేణుక (హిమాచల్‌ప్రదేశ్‌)

* అత్యధిక వెట్‌ల్యాండ్స్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నాయి.

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం - ఫిబ్రవరి 2

 

మాదిరి ప్రశ్నలు 


1. తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువగా ఉన్న నీటి ఆవరణ వ్యవస్థను ఏమంటారు?

1) లిమ్నెటిక్‌ మండలం     2) వేలాంచల మండలం     3) ప్రొఫండల్‌ మండలం     4) యూఫోటిక్‌ మండలం


2. జలావరణ వ్యవస్థలో ఆక్సిజన్‌ సమృద్ధిగా లభించే ప్రాంతాన్ని ఏమంటారు?

1) యూఫోటిక్‌ మండలం     2) ఎఫోటిక్‌ మండలం       3) ఫోటిక్‌ మండలం       4) ఏదీకాదు


3. లిమ్నెటిక్‌ మండలం అంటే?

1) తీరానికి దూరంగా ఉన్న ఉపరితల జలాల మండలం     2) తీరానికి దగ్గరగా ఉన్న లోతయిన నీటి మండలం

3) తీరానికి దూరంగా ఉన్న లోతయిన నీటి మండలం       4)  కాంతి ప్రసరించని ప్రాంతం


4. నీటిపై తేలియాడే మొక్కలున్న ప్రాంతం?

1) లిట్టోరల్‌ ప్రాంతం     2) ప్రొఫండల్‌ ప్రాంతం      3) లిమ్నెటిక్‌  ప్రాంతం        4) ఏదీకాదు


5. అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

1) జనవరి 2     2) ఫిబ్రవరి 2      3) ఆగస్టు 4      4) అక్టోబరు 3


6. రాంసార్‌ కన్వెన్షన్‌ ఎప్పుడు జరిగింది?

1) 1971       2) 1981       3) 1969      4) 1975


7. బురదతో కూడి క్షార స్వభావం ఉండే జీవావరణ వ్యవస్థ?

1) మంచి నీటి ఆవరణ వ్యవస్థ           2) సముద్ర ఆవరణ వ్యవస్థ

3) చిత్తడి నేల ఆవరణ వ్యవస్థ            4) భౌమ ఆవరణ వ్యవస్థ


8. అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని శరీర నిర్మాణంలో అనుకూలతలున్న జీవులు?

1) యూరిథర్మల్‌ జీవులు     2) స్టీనో థర్మల్‌ జీవులు     3) ఎకో థర్మల్‌ జీవులు     4) ఏదీకాదు


9. తీరాంచల మండల అడుగు భాగంలో జీవించే అనెలిడ్‌లు, క్రే చేపలను ఏమంటారు?

1) బెంథాస్‌ జీవులు      2) సూక్ష్మజీవులు     3) డయాటమ్స్‌     4) శైవలాలు


10. పర్యావరణ కిడ్నీలు అని ఏ జీవావరణ వ్యవస్థను పిలుస్తారు?

1) చిత్తడి ప్రాంత ఆవరణ వ్యవస్థ         2) సముద్ర ఆవరణ వ్యవస్థ

3) అమెజాన్‌ అడవుల ఆవరణ వ్యవస్థ       4) భూమధ్యరేఖా అటవీ ఆవరణ వ్యవస్థ 

 

సమాధానాలు

1-2,    2-1,    3-1,    4-1,    5-2,    6-1,    7-3,    8-1,    9-1,    10-1.

రచయిత: జల్లు సద్గుణరావు

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  చక్రవాతాలు - సునామీ

‣ పర్యావరణం - జీవ వైవిధ్యం

‣ వరద విపత్తులు

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 07-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూకంపాలు

అంతర్భాగంలో అలజడులు!

కాలి కింద నేల కదిలిపోతుంది. ముక్కలుగా చీలిపోతుంది. కట్టడాలు కూలిపోతాయి. చెట్లు పడిపోతాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి. అదంతా భూ అంతర్భాగంలో కలిగే అత్యంత శక్తిమంతమైన అలజడుల ప్రభావం. భూమి లోపలి ప్రకంపనలతో ఏర్పడే విధ్వంసం. అలా ఎలా జరుగుతుంది? కారణాలు ఏమిటి? ఆ వైపరీత్యం గురించి ముందుగా ఏవిధంగా తెలుసుకుంటారు? ఈ అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 


భూఉపరితలం ఆకస్మికంగా కంపించడాన్ని భూకంపం అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైనది. అకస్మాత్తుగా సంభవించే ఈ విపత్తు, ముందస్తు హెచ్చరికలు జారీ చేసే సమయం కూడా ఇవ్వదు. రెప్పపాటులో అంతా జరిగిపోతుంది. భూమిలో పగుళ్లు ఏర్పడి, ప్రకంపనలు పుట్టి భూ ఉపరితలంపైకి క్షణాల్లో చేరి విధ్వంసం సృష్టిస్తాయి. దానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఖండపలకల (విరూపకారక) చలనాల వల్ల కలిగే భూకంపాలు అధిక శక్తిని కలిగి ఉంటాయి. ఇవి తీవ్రమైన ఆస్తి, ప్రాణనష్టాలను కలిగిస్తాయి.

భూకంపం వల్ల ఉద్భవించే అంతర భౌమ కేంద్రక బిందువును నాభి (హైపో సెంటర్‌) అంటారు. నాభికి లంబంగా భూఉపరితలంపై ఏర్పడే బిందువును అధికేంద్రం (ఎపీ సెంటర్‌)గా వ్యవహరిస్తారు. ఈ బిందువు నష్టం జరిగే ప్రాంతాన్ని సూచిస్తుంది. నాభి నుంచి ప్రారంభమైన చిన్న ప్రకంపనలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విధ్వంసకర అఘాత తరంగాలుగా రూపొందుతాయి. అవి నేలను కదిలించి వెంటనే పరాఘాతాలుగా మారి క్రమంగా తగ్గుముఖం పట్టే కంపనాలుగా తిరిగి భూమిలోకి అంతమవుతాయి.

 

కారణాలు

ఉపరితలంలో: కొండచరియలు, హిమశిఖరాలు, సొరంగాల పైకప్పులు విరిగిపడటం, అణుప్రయోగాలు జరగడం లాంటి సందర్భాల్లో చిన్నచిన్న ప్రకంపనలు రావచ్చు. ఇవి ప్రమాదకరమైనవి కావు.

అగ్నిపర్వతాల వల్ల: అగ్నిపర్వతాల నుంచి లావా వెలువడే సమయంలో భూమి పొరలు కదులుతాయి. ఈ క్రమంలో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. వీటివల్ల పెద్దనష్టం జరగదు.

పాతాళంలో: భూమి అంతర్భాగాల్లో ఉన్న యురేనియం, థోరియం లాంటి అణుధార్మిక పదార్థాలు వాటంతటవే విస్ఫోటానికి గురికావడం వల్ల ప్రకంపనలు ఏర్పడతాయి. ఇవి కూడా అంత నష్టాన్ని కలిగించవు.

సమస్థితి సర్దుబాటు: భూమి పొరల బరువు వల్ల వాటి మధ్య అప్పుడప్పుడు సర్దుబాటు జరిగినప్పుడు ప్రకంపనలు వస్తాయి. వీటి వల్ల ఎక్కువ నష్టం సంభవించదు.


విరూపకారక చలనాలు: అత్యంత ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీసే శక్తిమంతమైన భూకంపాలు విరూపకారక చలనాల కారణంగానే ఏర్పడతాయి. భూమి పైపొర (భూపటలం) విరూపకారక పలకలుగా పిలిచే అతి పెద్ద అంతర్బంధిత శిలాఖండాలతో నిర్మితమవుతుంది. ఈ శిలాఖండాలు వాటి దిగువన ఉన్న ‘అర్ధ ద్రవశిల’ అనే జిగురు లాంటి పొర పైన కదులుతూ ఉంటాయి. ఈ సమయంలో పలకల మధ్య తన్యత, సంపీడన బలాలు పనిచేస్తాయి. ఇవి ప్రకంపనాలను ఉత్పత్తి చేసి భూకంపాలకు కారణమవుతాయి. ఈ పలకలు ఒకదానికొకటి ఎదురెదురుగా లేదా ఒకదాని నుంచి ఇంకొకటి దూరంగా జరగడం లేదా ఒక పలకను మరొకటి తాకుతూ పక్కకు జరగడం.. ఇలా మూడు రకాల కదలికలు కలిగి ఉంటాయి. ఈ క్రమంలో పలకల అంచులు విరిగి పగుళ్ల ద్వారా సంచిత శక్తి విడుదలవుతుంది. ఇలా శక్తి విడుదలయ్యే ప్రతిబల (ఒత్తిడి) ప్రాంతాలను భ్రంశమండలాలు అంటారు. భూమిలో అతుకులు, పగుళ్లు ఉన్న ప్రాంతాల్లో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి.

 

భూకంపాల్లో పనిచేసే స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతం: భ్రంశ మండలాల వద్ద ఉన్న స్థితిస్థాపకత విరూప చలనం వల్ల నిరోధక స్థితిస్థాపకతగా మారడంతో ప్రకంపనాలు ఉత్పత్తయి భూకంప తరంగాలుగా మారతాయి. నిరోధక స్థితిస్థాపకత వల్ల భూమి పొరల లోపల వికృతీ బలం వృద్ధి చెంది భూకంపాలకు దారితీస్తుంది.

 

మూడు రకాలు


నాభిలోతు ఆధారంగా భూకంపాలను మూడు రకాలుగా విభజించారు.

గాధ భూకంపాలు: భూ ఉపరితలం నుంచి భూకంప నాభి లోతు 60 కి.మీ. కంటే తక్కువ లోతులో ఏర్పడిన భూకంపాలను గాధ భూకంపాలు అంటారు. ఇవి పలకలు దూరంగా జరిగే హద్దుల వద్ద ఎక్కువగా సంభవిస్తుంటాయి.

మాధ్యమిక భూకంపాలు: నాభి లోతు 60 - 300 కి.మీ. మధ్యలో ఉంటే వాటిని మాధ్యమిక భూకంపాలుగా పిలుస్తారు. ఇవి ఎక్కువ శాతం పలకలు ఎదురెదురుగా కలుసుకునే సరిహద్దుల్లో జరుగుతుంటాయి.

అగాథ భూకంపాలు: నాభి లోతు 300 - 700 కి.మీ. లోతు వరకు ఉండి ఏర్పడే భూకంపాలు. ఇవి ఎక్కువ శాతం పలకలు కలుసుకునే ప్రాంత సరిహద్దుల్లో జరుగుతుంటాయి. 1943లో ఇండోనేషియాలో జరిగిన భూకంప నాభి 720 కి.మీ. లోతులో నమోదైంది. నాభి లోతు పెరుగుతున్న కొద్దీ భూకంప తీవ్రత తగ్గుతుంది.


భూకంపన తరంగాలు

భూకంపాలు ఉత్పత్తి చేసే తరంగాలు మూడు రకాలు. అవి..


P - తరంగాలు: వీటిని ప్రాథమిక తరంగాలు అంటారు. ఇవి భూఉపరితలానికి అధిక వేగంతో చేరతాయి. ముందు వెనుకలకు కదులుతూ అన్నిరకాల పదార్థాల ద్వారా ప్రయాణిస్తాయి.


S - తరంగాలు: వీటిని ద్వితీయ తరంగాలు అంటారు. శి తరంగాల తర్వాత ఉపరితలానికి చేరతాయి. ద్రవ పదార్థాల ద్వారా ప్రయాణించలేవు. భూగర్భజలాలు విపరీతంగా వినియోగించడం వల్ల ఈ తరంగాలు చాలాదూరం ప్రయాణించి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇవి ప్రయాణించే మార్గానికి లంబ దిశగా పైకి, కిందకి కదులుతూ ప్రయాణిస్తాయి.


L - తరంగాలు: వీటిని దీర్ఘ తరంగాలు, ఉపరితల తరంగాలు అంటారు. P, S తరంగాల కలయిక కారణంగా ఏర్పడటం వల్ల తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. ఉపరితలానికి చేరితే తీవ్ర నష్టం కలిగిస్తాయి.

భూకంపాలను కొలవడం: భూకంపాల పరిమాణం, వాటి వల్ల విడుదలైన శక్తిని సిస్మోగ్రాఫ్‌ లేదా భూకంపలేఖిని అనే పరికరం ద్వారా కొలుస్తారు. ఈ పరికరంలో భూకంపాల తీవ్రతని కొలిచే స్కేలు, భూకంపన తరంగాల ప్రయోగాన్ని నమోదుచేసే సిస్మోగ్రామ్‌ లాంటి విడిభాగాలుంటాయి.

భూకంపాల తీవ్రతను కొలిచే స్కేల్స్‌: ఒమెరీ స్కేల్, రోసీ-ఫోరెల్‌ స్కేల్‌ లాంటి పురాతన స్కేల్స్‌ ఉన్నప్పటికీ రిక్టర్‌ స్కేల్, మోడిఫెడ్‌ మెర్కిలీ స్కేల్‌ లాంటి నవీన స్కేల్స్‌ వాడుకలో ఉన్నాయి. అమెరికాకు చెందిన భూకంప శాస్త్రవేత్త ఛార్లెస్‌ రిక్టర్‌ కనుక్కున్న రిక్టర్‌ స్కేల్‌ ఎక్కువగా ఆమోదంలో ఉంది. దీనిపై 0 - 9 ఏకాంకాలు ఉంటాయి. ఈ స్కేలు భూకంపాల తీవ్రతను, దాని నష్టాన్ని కొలుస్తుంది. అందువల్ల రిక్టర్‌ స్కేల్‌ను మాగ్నిట్యూడ్‌ స్కేల్‌ అంటారు. ఇటలీ శాస్త్రవేత్త తయారుచేసిన మెర్కిలీ స్కేల్‌ నష్టాన్ని మాత్రమే కొలుస్తుంది. అందుకే దీన్ని ఇంటెన్సిటీ స్కేల్‌ అంటారు. దీనిపై 1 నుంచి 12 వరకు రోమన్‌ అంకెలుంటాయి. రిక్టర్‌ స్కేల్‌ పైన 6 పాయింట్లు దాటితే ప్రాణ, ఆస్తి నష్టం నమోదవుతుంది. అదే మెర్కిలీ స్కేల్‌పై 8 పాయింట్లు నమోదైతే ప్రాణ, ఆస్తి నష్టం సూచిస్తుంది.

మాదిరి ప్రశ్నలు

1. భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?

1) సిస్మాలజీ     2) సైనాలజీ      3) ఎకాలజీ     4) సిస్మకాలజీ


2. భూకంప నష్టాన్ని నిర్ధారించే బిందువు?

1) పోపస్‌      2) అధికేంద్రం      3) అపకేంద్రం     4) అభికేంద్రం


3. భూకంపాల తీవ్రతను కొలిచేందుకు ఉపయోగించే పరికరం?

1) సిస్మో గ్రాఫ్‌      2) సిస్మో గ్రామ్‌      3) సిస్మిల్‌ గ్రాఫ్‌     4) సైనిక్‌ గ్రాఫ్‌


4. ప్రకృతి విపత్తుల్లో అంత్యంత భయంకరమైన విపత్తు?

1) వరదలు      2) సునామీలు      3) భూకంపాలు      4) భూపాతాలు


5. భూగర్భజలాలు తగ్గడం వల్ల ఎక్కువ నష్టాన్ని కలిగించే భూకంపన తరంగాలు?

1) L  - తరంగాలు      2) S - తరంగాలు      3) P - తరంగాలు     4) ఏదీకాదు


6. భూకంపనలు ప్రారంభమయ్యే భూమిలోని లోపలి బిందువును ఏమంటారు?

1) నాభి          2) అధికేంద్రం        3) భ్రంశం         4) పగులు


7. కింది ఏ తరంగాలు భూఉపరితలాన్ని చేరితే తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి?

1) S - తరంగాలు        2) L - తరంగాలు        3) P - తరంగాలు       4) అన్నీ


8. భూకంపన నాభి లోతు పెరిగితే భూకంపం తీవ్రత?

1) పెరుగుతుంది        2) తగ్గుతుంది         3) మార్పు ఉండదు  4) ఏదీకాదు


9. ఒక ప్రాంతంలో భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.5గా నమోదయితే దాని వల్ల సంభవించే పరిణామాలు?

1) ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది         2) ఆస్తి, ప్రాణ నష్టం జరగదు

3) ప్రజలు గుర్తించలేరు           4) నిద్రలో ఉండేవారు గుర్తించగలరు


10. భూకంపాలు వేటిని ఉత్పత్తి చేస్తాయి?

1) కంపనాలు       2) ప్రకంపనలు     3) కంపనాలు, ప్రకంపనలు      4) ప్రకంపనలు, మంటలు

 

సమాధానాలు: 1-1,    2-2,    3-1,    4-3,   5-2,    6-1,   7-2,   8-2,   9-1,    10-3.

రచయిత: జల్లు సద్గుణరావు

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  చక్రవాతాలు - సునామీ

 పర్యావరణం - జీవ వైవిధ్యం

 వరద విపత్తులు

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 02-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూకంపాలు - సంభవించే ప్రాంతాలు

కాళ్ల కింద భూమి కదిలిపోతే!

  కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కదిలిపోతుంది. పునాదులతో సహా నిర్మాణాలు కూలిపోతాయి. ఆస్తులు, ప్రాణాలకు అపారనష్టం సంభవిస్తుంది. ఇవన్నీ భూకంపాలు సృష్టించే విధ్వంసకర విపరీత పరిణామాలు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు ఆ విపత్తు పరిధిలోనే ఉన్నాయి. మన దేశంలోనూ అపాయం పొంచి ఉంది. ఆ వైపరీత్యాలకు కారణాలను, తీవ్రతను తగ్గించే వ్యూహాల గురించి అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 

 

  ప్రపంచంలో శక్తిమంతమైన భూకంపాలు ఖండపలక చలనాలు లేదా విరూపకారక చలనాల వల్ల సంభవిస్తున్నాయి. భూమి మొదటిపొర అయిన భూపటలం విరూపకారక పలకలుగా లేదా శిలాఖండాలుగా విడిపోయి ఉంటుంది. అవి వాటి దిగువనున్న అర్ధ ద్రవశిలా పదార్థంతో ఉన్న పొరపై మెల్లగా కదులుతూ ఉంటాయి. ఆ సమయంలో పలకల మధ్య సంపీడన, తన్యత బలాలు పనిచేస్తాయి. దాంతో పగుళ్ల ద్వారా శక్తిని విడుదలై కంపన తరంగాలుగా మారి భూమి ఉపరితలంపై ప్రభావం చూపిస్తాయి.

 

 

ప్రపంచంలో..

ఖండ పలకల కదలికల ఆధారంగా ప్రపంచంలో భూకంపాలు జరిగే ప్రదేశాలను మూడు మేఖలలుగా విభజించారు.

 

పసిఫిక్‌ పరివేష్టిత మేఖల: అమెరికన్‌ భూపటలం పలక పశ్చిమానికి జరుగుతుండగా నాజ్కా పలక, కోకోస్‌ పలకలు తూర్పు వైపు జరగడం వల్ల; పసిఫిక్‌ సముద్ర పలక పశ్చిమానికి జరుగుతూ ఫిలిప్పీన్స్, సోలోమాన్, ఫిజి పలకలను ఒత్తిడి చేయడం వల్ల పసిఫిక్‌ సముద్రం చుట్టూ 65% భూకంపాలు సంభవిస్తున్నాయి. అంతేకాకుండా పసిఫిక్‌ చుట్టూ ఎక్కువగా అగ్నిపర్వత విస్ఫోటాలు సంభవిస్తుంటాయి. అందువల్ల పసిఫిక్‌ పరివేష్టిత మేఖలను పసిఫిక్‌ అగ్నివలయం అంటారు. ఈ ప్రాంతంలో ఉన్న చిలీ, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, అర్జెంటీనా, హైతీ, హూండరస్, నికార్‌గువా, ఎల్‌సాల్వడార్, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో పశ్చిమతీరం, అమెరికా పశ్చిమతీరం (కాలిఫోర్నియా, అలస్కా రాష్ట్రాలు), రష్యా తూర్పు భాగం, జపాన్, ఫిలిప్పీన్స్, దక్షిణకొరియా, ఇండోనేషియా, బ్రూనై, తూర్పు తైమూర్, న్యూజిలాండ్, పపువా - న్యూగినియా, టోంగా, వనౌటు దేశాలు ఎక్కువగా భూకంపాలను ఎదుర్కొంటున్నాయి. న్యూజిలాండ్‌కు దగ్గరలో ఉన్న ఆస్ట్రేలియాకు భూకంపాల బెడద లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా భూమి అడుగు భాగంలో కంపనాలు ప్రయాణించే భ్రంశాలు లేవు.

 

ఆల్ఫ్‌ - మధ్యదరా సముద్రం - ఆసియన్‌ మేఖల: ఈ ప్రాంతంలో మధ్యదరా సముద్రంలో యురేషియన్‌ పలకతో ఆఫ్రికన్‌ పలక రాపిడి చేస్తుంది. ఇండియన్‌ క్రస్ట్‌ పలక ఉత్తరానికి జరుగుతూ టిబెట్‌ ప్రాంతంలో యురేషియన్‌ పలకను ఒత్తిడి చేస్తుంది. అరేబియన్‌ పలక, ఇరానియన్‌ చిన్న పలకలు ఒకదానికొకటి ఎదురుగా జరుగుతూ యురేషియన్‌ క్రస్ట్‌ పలకతో రాపిడి చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో 20% భూకంపాలు సంభవిస్తున్నాయి. పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, రొమేనియా, బల్గేరియా, మాసిడోనియా, సెర్బియా, మాంటెనెగ్రో, క్రొయేషియా, తుర్కియే (టర్కీ), ఆల్బేనియా, సైఫ్రస్, జార్జియా దేశాలతో పాటు ఆసియా ఖండంలో భారత్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, నేపాల్, భూటాన్, చైనా, మయన్మార్, తజకిస్థాన్, కజకిస్థాన్, ఆర్మేనియా, ఇరాన్, ఇజ్రాయెల్, జోర్డాన్‌ దేశాలు; ఆఫ్రికా ఖండంలో మధ్యదరా సముద్రపు అంచులోని అల్జీరియా, మొరాకో దేశాలు ఈ మేఖల పరిధిలో ఉన్నాయి

 

చిన్న మేఖల: అట్లాంటిక్‌ మహాసముద్ర భూతలంలో, హిందూ మహాసముద్రంలోని ఎర్రసముద్రం అంచు వెంబడి, తూర్పు ఆఫ్రికాలోని పగులులోయ వెంట ఉన్న ఈజిప్ట్, జిబౌటి, ఇథియోపియా, ఐస్‌లాండ్, ఆఫ్రికా పశ్చిమతీరంలోని హేప్‌వర్ది దీవులు ఇందులో ఉన్నాయి. ఈ ప్రాంతంలో 15% భూకంపాలు సంభవిస్తున్నాయి.

* ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన వాటిలో చిలీలో 1960, మే 22న వచ్చిన భూకంపం అతిపెద్దది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 9.25గా నమోదైంది. రెండో పెద్ద భూకంపం 1965లో అలాస్కాలో (9.1 తీవ్రత) వచ్చింది.

* ఒకే భూకంప తీవ్రత ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఐసోసిస్మల్‌ రేఖలు అంటారు. ఇవి సాధారణంగా కోడిగుడ్డు ఆకారంలో లేదా దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి.

 

భారత్‌లో

హిమాలయాలు ప్రపంచంలో అత్యంత చురుకైన ముడుత పర్వతాలు. హిమాలయాల అంతర్భౌమ ప్రాంతం భౌగోళికంగా చాలా చురుకుగా ఉండి భూకంపాల సంభ్యావత పెరగడానికి అనుకూలంగా ఉంది. హిమాలయాల తూర్పు ప్రాంతంలో మయన్మార్‌లోని అరకాన్‌యామో ముడత పర్వత మేఖల వద్ద, హిమాలయ పశ్చిమ భాగంలో పాకిస్థాన్‌లోని మక్రాన్‌ సముద్ర తీరం నుంచి అఫ్గానిస్థాన్‌ వరకు ఉన్న చమన్‌ భ్రంశ మండలంలో భూకంపాలు వస్తున్నాయి. ముఖ్యంగా టిబెట్‌ ప్రాంతంలో ఇండియన్‌ పలక ఉత్తరానికి జరుగుతూ యురేషియన్‌ పలకలను ఒత్తిడి చేస్తోంది. 

 

మన దేశంలో భూకంప భ్రంశ మండలాలను నాలుగు జోన్‌లుగా నిర్ణయించారు.

 

జోన్‌ 5: ఈ జోన్‌లో అత్యధిక అపాయం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఇవి రిక్టర్‌ స్కేల్‌పై 7 నుంచి 9 పాయింట్ల తీవ్రతను నమోదుచేస్తాయి. అన్ని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఉత్తర బిహార్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్‌లో కొంత ప్రాంతం, గుజరాత్‌లోని కచ్‌-భుజ్‌  ఈ జోన్‌లో ఉన్నాయి.

 

జోన్‌ 4: ఈ ప్రాంతంలో భూకంపాలు అధిక అపాయాన్ని కలిగిస్తాయి. రిక్టర్‌స్కేల్‌పై 6 నుంచి 7 పాయింట్ల తీవ్రత నమోదుకు అవకాశం ఉంది. దిల్లీ, సిక్కిం, దక్షిణ బిహార్, దక్షిణ ఉత్తరాఖండ్, గుజరాత్, జమ్మూకశ్మీర్, పశ్చిమ బెంగాల్‌ దక్షిణ భాగం; మహారాష్ట్రలోని కొయనా ప్రాంతాలు ఈ జోన్‌లో ఉన్నాయి.

 

జోన్‌ 3: ఇక్కడ మాధ్యమిక భూకంపాల అపాయం ఉంటుంది. రిక్టర్‌స్కేల్‌పై 4 నుంచి 6 పాయింట్ల తీవ్రత నమోదవుతుంది. ఇందులో పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, బెంగాల్‌ పశ్చిమ భాగం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గోవా, లక్షదీవులు, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. కోల్‌కతా, చెన్నై, ముంబయి మహానగరాలు కూడా ఈ జోన్‌లోకి వస్తాయి.

 

జోన్‌ 2: తక్కువ అపాయం లేదా అపాయం లేని చిన్న భూకంపాలు ఈ జోన్‌లో సంభవిస్తాయి. రిక్టర్‌స్కేల్‌పై 0 నుంచి 4 తీవ్రత నమోదవుతుంది. ఇందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ జోన్‌లోకి వచ్చే ప్రధాన నగరాలు హైదరాబాద్, బెంగళూరు. 

  మనదేశంలో 5, 4 జోన్లు భూకంపాల ప్రమాదం ఉన్నవి కాగా 3, 2 జోన్లు సురక్షిత ప్రాంతాలుగా చెప్పవచ్చు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎమ్‌ఏ) ప్రకారం భూకంపాల నష్టం ఎక్కువగా 5, 4 జోన్‌లలో ఉంది. దేశం మొత్తం భూభాగంలో 58.6% భాగానికి భూకంపాల ముప్పు ఉంది. 38 నగరాలు ఈ పరిధిలో ఉన్నాయి. ఇప్పటివరకు మనదేశంలో పెద్ద భూకంపం 1897లో షిల్లాంగ్‌లో వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 8.7గా నమోదైంది.

* ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3, 2 భూకంపాల జోన్లు మాత్రమే విస్తరించి ఉన్నాయి. అంటే భూకంపాల బెడద అంతగా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1969, ఏప్రిల్‌ 13న కిచ్చెన్నపల్లి గొల్లగూడెంలో పెద్ద భూకంపం సంభవించింది. దీన్ని భద్రాచలం భూకంపం అంటారు. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.7గా నమోదైంది.

 

భూకంపాల తీవ్రతను తగ్గించే వ్యూహాలు

* భూకంప ప్రభావం నుంచి ఉపశమనానికి కమ్యూనిటీ సంసిద్ధత ఎంతో కీలకం.

* భూకంపాలు సంభవించిన సమయంలో పరిగెత్తకుండా డ్రాప్, కవర్, హోల్డ్‌ విధానం పాటించాలి.

* భవన నిర్మాణాల్లో సరైన ఆర్కిటెక్ట్, నాణ్యమైన ఉపకరణాలు వినియోగించాలి.

* పెద్ద భవనాలకు మధ్యలో ఖాళీలు వదిలి, దీర్ఘచతురస్రాకార బ్లాకులుగా, ఆంగ్ల అక్షరాలు T, L, U, X ఆకారాల్లో భవంతులు నిర్మించాలి.

* గట్టి నేలపై భవనాలను నిర్మిస్తే దృఢంగా ఉంటాయి. బలహీనమైన నేలపై ఉండే భవనాలు తీవ్రంగా కంపిస్తాయి.

* గోడలకు చిన్న కిటికీలు నిర్మించాలి. గోడలు, మూలాలు కలిసే చోట రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ ఏర్పాటు చేయాలి.

 

మాదిరి ప్రశ్నలు

 

1. భారత జాతీయ భవన నిర్మాణ కోడ్‌ను మొదటిసారిగా ఎప్పుడు రూపొందించారు? 

1) 1970    2) 1960    3) 1980   4) 1990

 

2. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీని ఎక్కడ స్థాపించారు?

1) ముంబయి    2) లఖ్‌నవూ    3) నాగ్‌పుర్‌    4) నోయిడా

 

3. మనదేశంలో మొదటి భూకంప హెచ్చరిక వ్యవస్థను ఎక్కడ ఏర్పాటుచేశారు?

1) ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌      2) బిహార్‌లోని పట్నా

3) మహారాష్ట్రలోని కొయనా    4) ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా

 

4. భారతదేశంలో మొదటి భూకంప అధ్యయన కేంద్రాన్ని 1898లో ఎక్కడ స్థాపించారు?

1) ముంబయి    2) కోల్‌కతా    3) దిల్లీ     4) బెంగళూరు

 

5. భూకంప మ్యాపులను తయారుచేసే సంస్థ?

1) బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ 

2) భారత వాతావరణ విభాగం

3) సిస్మాలజీ డిపార్ట్‌మెంట్‌ 

4) జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ

 

6. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వివరణ ప్రకారం దేశంలో ఏ జోన్‌లలో తీవ్ర భూకంపాలు సంభవిస్తాయి?

1) 5, 4     2) 1, 2     3) 3, 4     4) 2, 3 

 

7. ప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా జరిగే భ్రంశ మండలం ఏది?

1) పసిఫిక్‌ పరివేష్టిత మేఖల             2) మధ్యదరా సముద్ర మేఖల

3) హిందూ మహాసముద్ర మేఖల        4) అట్లాంటిక్‌ మహాసముద్ర మేఖల

 

8. ప్రపంచంలో ఇప్పటివరకు నమోదయిన అతిపెద్ద భూకంపం ఏది?

1) కాలిఫోర్నియా భూకంపం       2) అలస్కా భూకంపం

3) చిలీ భూకంపం             4) జపాన్‌ భూకంపం

 

9. భారతదేశంలో ఇప్పటివరకు సంభవించిన వాటిలో పెద్ద భూకంపం? 

1) కొయనా భూకంపం    2) షిల్లాంగ్‌ భూకంపం

3) కశ్మీర్‌ భూకంపం    4) అసోం భూకంపం

 

10. దేశంలోని మెట్రో నగరాల్లో ఏ నగరానికి భూకంపాల అపాయం ఎక్కువగా ఉంది?

1) దిల్లీ    2) బెంగళూరు    3) హైదరాబాద్‌    4) చెన్నై

 

సమాధానాలు: 1-1; 2-4; 3-1; 4-2; 5-1; 6-1; 7-1; 8-3; 9-2; 10-1.

 

రచయిత: జల్లు సద్గుణరావు

 

Posted Date : 03-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవుల ఆహారపు అలవాట్లు

జీవావరణంలో గొలుసులు.. పిరమిడ్‌లు!

  ఆహారం ప్రతి జీవికి ప్రాథమిక అవసరం. ఒక్కో జీవికి ఒక్కో రకమైన ఆహారపు అలవాటు ఉంటుంది.  కానీ ఏదో ఒక దశలో ఒక ప్రతి జీవి ఇంకో జీవికి ఆహారంగా ఉపయోపడటం ఈ ఆవరణ వ్యవస్థలోని ప్రత్యేక లక్షణం. ఆ విధంగా ప్రకృతిలోని ఆహారపు గొలుసులో ఏ జీవులు ఏయే స్థాయుల్లో ఉన్నాయో అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటిపై పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. 

 

  ఆవరణ వ్యవస్థలోని జీవ సముదాయాల్లో వివిధ జీవజాతుల ఆహారపు అలవాట్లు విభిన్న రకాలుగా ఉంటాయి. శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకాలు ఇలా భిన్న అలవాట్లతో జీవులుంటాయి. వాటి ఆహార అలవాట్లను పలు రకాలుగా విభజించవచ్చు.

 

ఉత్పత్తిదారులు: కావాల్సిన ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుని స్థానబద్ధంగా జీవించే జీవులను ఉత్పత్తిదారులు అంటారు. ఇవి ఇతర జీవులకూ ఆహారాన్ని అందిస్తాయి. వీటినే స్వయం పోషకాలు అంటారు.  ఆహార గొలుసులో ప్రథమ పోషక స్థాయిని ఆక్రమిస్తాయి. సౌరశక్తి నుంచి లేదా వివిధ రసాయన పదార్థాల నుంచి సంక్లిష్ట కర్బన పదార్థాలను తయారు చేసుకుని జీవిస్తాయి.

ఉదా: మొక్కలు, నీలి ఆకుపచ్చ శైవలాలు, వృక్ష ప్లవకాలు, బ్యాక్టీరియా

 

వినియోగదారులు: ఇవి ఆహార పదార్థాల కోసం ఉత్పత్తిదారులపై లేదా ఇతర వినియోగదారులపై ఆధారపడి జీవించే జీవజాతులు. వీటినే పరపోషకాలు అంటారు. ఆహార అలవాట్లను బట్టి ఈ జీవులను కింది రకాలుగా విభజించారు.

 

ఎ) ప్రథమ వినియోగదారులు: ఇవి తమకు కావాల్సిన ఆహార పదార్థాలను ప్రథమ పోషక స్థాయిలోని ఉత్పత్తిదారుల నుంచి పొందుతాయి. వీటిని శాకాహారులుగా పిలుస్తారు. ఇవి ఆహార గొలుసులో ద్వితీయ పోషక స్థాయిని కలిగి ఉంటాయి.

ఉదా: మిడతలు, గొల్లభామలు, కుందేళ్లు, జింకలు

 

బి) ద్వితీయ వినియోగదారులు: ఇవి తమకు కావాల్సిన ఆహారాన్ని ఉత్పత్తిదారులు, ప్రథమ వినియోగదారుల నుంచి పొందుతాయి. ఇవి శాకాహారులుగా, మాంసాహారులుగా జీవిస్తాయి. వీటినే ప్రాథమిక మాంసాహారులు లేదా సర్వభక్షకులు అని పిలుస్తారు. ఇవి ఆహార గొలుసులో తృతీయ పోషక స్థాయిని ఆక్రమిస్తాయి.

ఉదా: మానవులు, కుక్కలు, పిల్లులు, కోళ్లు

 

సి) తృతీయ వినియోగదారులు: ఇవి ప్రథమ, ద్వితీయ వినియోగదారులపై ఆధారపడి తమకు కావాల్సిన ఆహార పదార్థాలను పొందగలుగుతాయి. వీటిని ద్వితీయ మాంసాహారులుగా పరిగణిస్తారు. ఇవి ఆహార గొలుసులో చతుర్ద పోషక స్థాయిని ఆక్రమించి ఉంటాయి.

ఉదా: పెద్ద చేపలు, కొంగలు, గద్దలు, పాములు, నక్కలు, తోడేళ్లు

 

డి) అంతిమ వినియోగదారులు: ఆహార పదార్థాల కోసం ఇతర వినియోగదారులపై ఆధారపడతాయి. ఇవి ఆహార గొలుసులో పంచమ పోషక స్థాయిలో ఉంటాయి. ఉదా: పులులు, సింహాలు.

పరాన్నజీవులు: ఇతర జీవులపై నివసిస్తూ, వాటి శరీరాల నుంచి ఆహారాన్ని పొందుతూ ఆశ్రయం ఇచ్చిన జీవికి హాని కలిగించేవి. వీటినే పరాన్నజీవులు (పారాసైట్స్‌) అంటారు.

ఉదా: జలగ, నల్లి, నులిపురుగులు

 

విచ్ఛిన్నకారులు: ఇవి ఉత్పత్తిదారులు, వినియోగదారులు చనిపోయిన తరువాత వాటి మృత కళేబరాల్లోని సంక్లిష్ట కర్బన పదార్థాలను, సరళ అకర్బన పదార్థాలుగా విచ్ఛిన్నం చేసి మృత కళేబర కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడతాయి. వీటిని ప్రకృతి పారిశుద్ధ్యులు (నేచురల్‌ స్కావెంజర్స్‌) అంటారు.

ఉదా: బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, రాబందులు

 

శక్తి పరిమాణాల ప్రకారం..

ఆహార గొలుసులోని వివిధ స్థాయుల్లో అందుబాటులోని శక్తి పరిమాణాలను అందించే వివిధ జీవజాతులకు చెందిన జనాభా, జీవ పదార్థాలను, రేఖీయంగా చూపించడాన్ని జీవావరణ పిరమిడ్‌లు అంటారు. వీటిని మొదట ఛార్లెస్‌ ఎల్టన్‌ అనే ఆవరణ శాస్త్రవేత్త ప్రతిపాదించడం వల్ల వీటిని ఎల్టోనియం పిరమిడ్‌లు అంటారు. వీటిని మూడు రకాలుగా విభజించారు.

 

సంఖ్యా పిరమిడ్‌లు: ఇవి వివిధ జనాభాల సంఖ్యాపరమైన సంబంధాన్ని ఆహార గొలుసులో వివిధ పోషక స్థాయుల్లో సూచిస్తాయి. సాధారణంగా పిరమిడ్లలో ఆధార స్థాయిలో ఉత్పత్తిదారుల సంఖ్య ఎక్కువగా ఉండి క్రమంగా అగ్రభాగానికి చేరేకొద్ది వివిధ పోషక స్థాయుల్లోని జీవుల సంఖ్య తగ్గుతుంది. కానీ కొన్నింటిలో ఇది తలకిందులుగా కూడా ఉంటుంది.

ఉదా: అటవీ ఆవరణ వ్యవస్థలో చేతితో అల్లిన నూలు కండె ఆకారంలో, పరాన్నజీవుల ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా, మిగిలిన ఆవరణ వ్యవస్థల్లో నిట్టనిలువుగా సంఖ్యా పిరమిడ్‌లుంటాయి.

 

జీవరాశి పిరమిడ్‌లు: వివిధ పోషక స్థాయుల్లోని జీవ అనుఘటకాల భారం లేదా ద్రవ్యరాశి గురించి తెలిపే పిరమిడ్‌ పటాన్ని జీవరాశి పిరమిడ్‌ అంటారు. ఇందులో ఆధార భాగంలోని పోషకస్థాయి నుంచి శిఖర పోషకస్థాయి వరకు క్రమంగా జీవరాశి పరిమాణం తగ్గడాన్ని గమనించవచ్చు. ఇందులో గడ్డి మైదానాలు, అటవీ ఆవరణ వ్యవస్థలో పిరమిడ్‌లు నిట్టనిలువుగా ఉండగా, కొలను ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా ఉంటుంది.

 

శక్తి పిరమిడ్‌లు: ఒక చదరపు మీటరు వైశాల్యం ఉన్న స్థలంలో సంవత్సరం పాటు వివిధ పోషక స్థాయుల్లోని జీవరాశులు వినియోగించిన శక్తి మొత్తాన్ని తెలిపే రేఖాపటం శక్తి పిరమిడ్‌. ఇందులో ఉత్పత్తిదారుల నుంచి అంతిమ వినియోగదారుల స్థాయి వరకు శక్తి క్రమంగా తగ్గుతుంది. వివిధ ఆవరణ వ్యవస్థల్లోని శక్తి పిరమిడ్‌లు నిట్టనిలువుగా ఉంటాయి.

 

మాదిరి ప్రశ్నలు

 

1. సంఖ్యా పిరమిడ్‌ కిందివాటిలో వేటిని సూచిస్తుంది?

1) ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జాతుల సంఖ్య    2) ఒక జీవ సముదాయంలోని ఉపజాతులు

3) ఒక సముదాయంలోని జనాభా           4) పోషక స్థాయిలోని జీవి ద్రవ్యరాశి

 

2. కిందివాటిలో ఆహార గొలుసుకు మూలాధారం?

1) ఉత్పత్తిదారులు 2) వినియోగదారులు 3) విచ్ఛిన్నకారులు  4) పూతికాహారులు

 

3. కిందివాటిలో సర్వభక్ష జీవికి ఉదాహరణ

1) కుందేలు   2) పులి   3) ఏనుగు  4) కాకి

 

4. ఆవరణ వ్యవస్థలో మిడత, గొల్లభామ, కుందేలు ఏ వినియోగదారులు?

1) ప్రథమ  2) ద్వితీయ   3) అంతిమ  4) ఉత్పత్తిదారులు  

 

5. నిట్టనిలువు పిరమిడ్‌లో కోడి, పిల్లి, కుక్కలను ఏ పోషక స్థాయిలో చూపిస్తారు?

1) ప్రథమ  2) ద్వితీయ   3) తృతీయ   4) చతుర్థ 

 

6. ఆవరణ వ్యవస్థలో శక్తి పిరమిడ్‌లు ఏ విధంగా ఉంటాయి?

1) సమాంతరం    2) నిట్టనిలువు    3) తలకిందులు    4) అన్నీ

 

7. కొలను ఆవరణ వ్యవస్థలో పిరమిడ్‌ ఏ విధంగా ఉంటుంది?

1) తలకిందులుగా    2) నిట్టనిలువుగా    3) జిగ్‌జాగ్‌  4) నూలుకండె ఆకారం  

 

8. అటవీ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్‌లు ఏ విధంగా ఉంటాయి?

1) తలకిందులుగా   2) అడ్డంగా   3) నూలుకండె ఆకారం  4) సిలిండర్‌ ఆకారం

 

9. సాధారణంగా పిరమిడ్‌లలో ఆధారస్థాయిలోని  అణుఘటకాలు?

1) ఉత్పత్తిదారులు  2) వినియోగదారులు   3) ద్వితీయ వినియోగదారులు    4) అన్నీ  

 

10. ఆకుపచ్చ శైవలాలు దేనికి ఉదాహరణ?

1) పరాన్నజీవులు   2) పూతికాహారులు   3) ప్రొడ్యూసర్స్‌   4) ట్రాన్స్‌ఫార్మర్స్‌

 

జవాబులు: 1-1, 2-1, 3-3, 4-1, 5-3, 6-2, 7-1, 8-3, 9-1, 10-3.

 

రచయిత: జల్లు సద్గుణరావు

 

Posted Date : 30-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సునామీ

సముద్ర తీరంలో రాకాసి!

  ఆ విపత్తు విరుచుకుపడితే ఆహ్లాదాన్ని అందించే అలలు అసాధారణంగా రాకాసి రూపాన్ని సంతరించుకుంటాయి. భారీ ఎత్తున ఎగసిపడే కెరటాలు తీరాన్ని కబళించే కరాళకేళి విపరీత విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఏం జరిగిందో గ్రహించేలోగా అంతా సముద్ర గర్భంలో కలిసిపోతుంది. అంతులేని విషాదం వేలమైళ్లు విస్తరిస్తుంది. ఇంతకీ ఆ రాక్షస తరంగాలు ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి? వాటి ప్రభావం జీవరాశిపై ఏ విధంగా ఉంటుంది? ఈ అంశాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.

 

  మహాసముద్రాలు, పెద్ద జలాశయాలు, సరస్సుల్లోని నీరు పరిమాణంలో పెద్ద ఎత్తున స్థానభ్రంశం చెందడం వల్ల సంభవించే భారీ నీటి తరంగాల వరసను సునామీ అంటారు. ఆంగ్లంలో సునామీ ్బగి(్య-్చ్ఝi్శ అనే పదం జపాన్‌ భాషలోని స్బుగి(్య్శ అంటే హార్బర్, నామి ్బ-్చ్ఝi్శ అంటే కెరటం అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. సునామీని తెలుగులో ‘రాకాసి అలలు’ అని, తమిళంలో ‘ఆఝి పెరలై’ అని అంటారు. ఇలా ప్రాంతీయ పేర్లు అనేకం ఉండటం వల్ల 1963లో అమెరికాలోని హవాయి దీవుల్లో జరిగిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహాసభ ‘సునామీ’ అనే పదాన్ని సార్వతిక పదంగా నిర్ణయించింది.



కారణాలు

సునామీ ఏర్పడటానికి మూడు భౌగోళిక కారణాలు, ఒక అంతరిక్ష కారణం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

 

భూపాతాలు: సముద్రం లోపల లేదా కడలికి దగ్గర భూపాతం అంటే కొండచరియలు విరిగి సముద్రంలోకి జారిపడినప్పుడు నీటి కదలికలు ఏర్పడి సునామీగా మారవచ్చు.

ఉదా: 1958లో అలస్కాలోని లిటుయాబే ప్రాంతంలో భూపాతం కారణంగా సునామీ ఏర్పడి 50-150 మీటర్ల ఎత్తులో సముద్ర తరంగాలు ఎగసిపడ్డాయి. 14% సునామీలు భూపాతాల వల్ల జరుగుతున్నాయని అంచనా.

 

అగ్నిపర్వత విస్ఫోటాలు: తీరానికి సమీపంలో లేదా సముద్రం లోపల ఉన్న అగ్నిపర్వతాలు విస్ఫోటం చెందినప్పుడు నేల సాధారణంగా పైకి ఎగబాకడమో, కుంగిపోవడమో జరుగుతుంది. దాంతో సముద్ర నీరు పెద్ద ఎత్తున కదలి సునామీగా మారవచ్చు.

ఉదా: 1983లో ఇండోనేషియాలోని క్రాకటోవా అగ్నిపర్వతం విస్ఫోటం చెంది 40 మీటర్ల ఎత్తులో సునామీ కెరటాలు ఏర్పడ్డాయి. 2% సునామీలు ఈ కారణంగా వస్తున్నాయని అంచనా.

 

భూకంపాలు: సునామీలకు అత్యంత సర్వసాధారణ, ప్రధాన కారణం భూకంపాలు. సముద్ర భూతలం కింద లేదా మహాసముద్రం సమీపంలో సంభవించే భూకంపాల కారణంగా సముద్ర భూతలం కదలి సునామీకి దారితీస్తుంది. ఇలా వచ్చే సునామీ తరంగాలు గంటకు వందలాది కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. భూకంపం వచ్చిన నిమిషాల నుంచి కొన్ని గంటల వ్యవధిలో తీరాన్ని తాకుతాయి. సాధారణంగా సముద్ర గర్భంలో రిక్టర్‌ స్కేలుపై 7.5 పాయింట్లు తీవ్రత ఉన్న భూకంపాలు జరిగినప్పుడే సునామీలు సంభవిస్తాయి. 84% సునామీలు భూకంపాల వల్లే ఏర్పడుతున్నాయి.

 

ఉల్కాపాతాలు: సునామీలు ఏర్పడేందుకు కారణాల్లో ఇది చాలా అరుదైంది. ఉల్కలు, గ్రహశకలాలు లాంటివి భూమి వైపు దూసుకొచ్చినప్పుడు సముద్రాలపై ప్రభావం చూపి సునామీలు రావచ్చు.

ఉదా: 6.5 కోట్ల ఏళ్ల కిందట ఒక పెద్ద గ్రహశకలం భూమిని తాకడం వల్ల అప్పట్లో జీవిస్తున్న డైనోసార్లు, కొన్ని జీవరాశులు చనిపోయినట్లు శాస్త్రీయ ఆధారాలున్నాయి. మానవుడు భూమి మీద అవతరించిన తర్వాత ఉల్కాపాతం వల్ల ఒక్క సునామీ కూడా ఏర్పడలేదు.

 

సామర్థ్యం

సునామీలు గంటకు 800 కి.మీ. అత్యధిక వేగంతో సముద్ర తీరాన్ని తాకగలిగిన అవకాశం ఉంది.

ఉదా: అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌ వద్ద ప్రారంభమైన సునామీ జెట్‌ వేగం కంటే అధిక వేగంతో జపాన్‌లోని టోక్యో నగరాన్ని తాకే ప్రమాదం ఉంది. అంటే ఇక్కడి సునామీ కెరటాలు మధ్యదరా సముద్రంతోపాటు అన్ని మహాసముద్రాలకు విస్తరించవచ్చు.

* సునామీ ప్రారంభమైనప్పుడు తక్కువ డోలన పరిమితి, సుదీర్ఘ తరంగదైర్ఘం ఉంటుంది. తీరానికి చేరే కొద్దీ డోలన పరిమితి ఎక్కువై, తరంగదైర్ఘ్యం తగ్గిపోతూ ఉంటుంది. స్వల్ప వ్యవధిలోనే కెరటాలు గరిష్ఠ ఎత్తుకు పెరుగుతాయి.

* సునామీల ప్రారంభ ప్రాంతంలో సముద్రం లోపల కెరటాల ఎత్తు 30-40 సెం.మీ. మాత్రమే ఉంటుంది. అవే తీరానికి చేరినప్పుడు 30 మీటర్ల ఎత్తువరకూ పెరుగుతాయి.

* సునామీ కేంద్రం నుంచి 30 నిమిషాల్లో తీరాన్ని తాకే సునామీలు పెనువిధ్వంసం సృష్టిస్తాయి.

* తీరాన్ని చేరేటప్పుడు సునామీ వేగం తగ్గుతూ, కెరటాల ఎత్తు పెరుగుతూ తీరాన్ని చేరుతుంది. దీన్ని షోలింగ్‌ ప్రభావం అంటారు.

* సునామీ ఒకే ఒక పెద్ద తరంగం కాదు. ఒక సునామీ 10 లేదా అంతకంటే ఎక్కువ తరంగాలను కలిగి ఉంటుంది. వాటిని సునామీ తరంగ రైలు బండి అంటారు.

* ఒక తరంగం తీరాన్ని తాకిన తరువాత 5 నుంచి 90 నిమిషాల వ్యవధిలో మరో తరంగం తీరాన్ని తాకుతుంది.

* సునామీ కెరటం తీరాన్ని తాకిన తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తే వేగం కంటే కొన్ని రెట్లు వేగంగా అంటే గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. అంటే పరుగెత్తే మనుషులను కూడా కబళించగలిగిన సామర్థ్యం కలిగి ఉంటుంది.

* సునామీ అలలు చాలా దూరం తీరం భూభాగాన్ని ముంచేస్తాయి. ఈ దూరాన్ని రన్‌అప్‌ అంటారు. పెద్ద సునామీలు తీరం నుంచి 1.5 కి.మీ. వరకూ వ్యాపిస్తాయి.

* కొన్నిసార్లు సముద్ర గర్భంలో భూకంపం సంభవించినప్పుడు సముద్రంలో నేల కిందికి కుంగిపోవడం వల్ల తీరం వద్ద నీరు వెనక్కు తగ్గి మహాసముద్ర భూతలం బయటకు కనిపిస్తుంది. దీన్ని సహజసిద్ధమైన సునామీ హెచ్చరికగా భావించి జాగ్రత్తలు తీసుకోవాలి.

 

ప్రభావం

* సునామీలు ఇసుక తీరాన్ని ఖండఖండాలుగా చేస్తాయి. తీరప్రాంతంలోని వృక్షజాతులను విచ్ఛిన్నం చేస్తాయి. కట్టడాలు ధ్వంసమవుతాయి.

* సునామీ కెరటాలు పురోగమించేటప్పుడు మార్గంలో అడ్డంగా ఉన్న ప్రతిదాన్ని కూల్చివేస్తాయి. అవే కెరటాలు తిరోగమనంలో అన్నింటిని కబళించి సముద్రంలోకి తీసుకెళ్లి పోతుంది. ఇది సునామీ విధ్వంసక స్వభావానికి ప్రతీక.

* సునామీతో వచ్చే వరద ప్రభావం వల్ల మానవ ఆవాసాలు, రోడ్లు, ఓడరేవులు, మౌలిక వసతులకు అపార నష్టం కలుగుతుంది. జనజీవనం అస్తవ్యస్తమవుతుంది.

* నీరు ఇళ్లలోకి పెద్ద ఎత్తున చేరడంతో ప్రజలు అందులో మునిగిపోయి మరణిస్తారు. అనేకమంది సముద్రంలోకి కొట్టుకుపోతారు. తరంగాలతోపాటు కొట్టుకొచ్చే వ్యర్థాలు, పెద్దపెద్ద వస్తువుల కింద ఇరుక్కుని మరికొందరు మరణించే ప్రమాదం ఉంది.

* బావులు, ఇతర భూగర్భ జలవనరుల్లో ఉప్పు నీరు, మురుగు నీరు, వ్యర్థాలు చేరి కలుషితమవుతాయి.

* వరదతో పంట నష్టం జరుగుతుంది. పడవలు, వలలు కొట్టుకుపోయి మత్సకారుల జీవనోపాధి దెబ్బతింటుంది. పర్యావరణానికీ అపార నష్టం కలుగుతుంది.

 

సునామీల వ్యాప్తి

* పసిఫిక్‌ మహాసముద్రం - 73%

* మధ్యదరా సముద్రం, నల్ల సముద్రం వంటి భూపరివేష్టిత సముద్రాలు - 16%

* కరేబియన్‌ సముద్రం, అట్లాంటిక్‌ మహాసముద్రాలు - 6%

* హిందూ మహాసముద్రం - 5%

 

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 10-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆవరణ శాస్త్రం - పోషక వలయాలు

జీవనాధార వలయాలు

  భూమి మీద సమస్త జీవరాశులకు, జీవ పక్రియలకు సౌరశక్తి ప్రధాన ఆధారం. సౌరశక్తి వల్ల నీరు ఆవిరై మేఘాలుగా ఏర్పడుతుంది. తిరిగి వర్షించి చక్రీయ వలయంలో నీరుగానే మారుతుంది. ఆవరణ వ్యవస్థలోని కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్‌ లాంటి పోషకాలు నిరంతరం జీవులకు, వాటి పరిసరాలకు మధ్య చక్రీయంగా బదిలీ అవుతూ జీవుల పోషణకు ఉపయోగపడతాయి. అసలు ఈ వలయాలు జీవులకు ఎలా ఉపయోగపడుతున్నాయో పోటీపరీక్షల అభ్యర్థులు తెలుసుకోవాలి.

 

  ప్రతి జీవికి శ్వాసించడానికి, శారీరక ప్రక్రియలకు, ప్రత్యుత్పత్తి నిర్వహించడానికి నిరంతరం పోషక విలువలు కావాలి. కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, హైడ్రోజన్‌ మొదలైన ఖనిజ పోషకాలు నేలలో, నీటిలోనూ స్థిరంగా ఉంటాయి. వీటినే పోషకాల నిలకడ స్థితి అంటారు. అయితే ఇవి జీవులకు, వాటి పరిసరాలైన శిలావరణం, జలావరణం, వాతావరణాల మధ్య చక్రీయంగా బదిలీ అవుతూ జీవుల పోషణకు ఉపయోగపడుతుంటాయి. దీన్నే జీవ-భూ-రసాయన వలయం అంటారు. ఈ వలయం సక్రమంగా కొనసాగడంలో విచ్ఛిన్నకారులు కీలకపాత్ర పోషిస్తాయి.

  చనిపోయిన వృక్ష, జంతు కళేబరాల నుంచి ఏర్పడిన సేంద్రియ పదార్థాల్లో ప్రొటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు ఉంటాయి. బ్యాక్టీరియా చర్యల వల్ల సేంద్రియ పదార్థాలు చివరికి సరళమైన పోషక పదార్థాలుగా మారతాయి. ఆకుపచ్చని మొక్కలు ఈ ఖనిజ పదార్థాలను గ్రహించి వాటిని మళ్లీ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, లిపిడ్లు లాంటి సంక్లిష్ట ఆహార పదార్థాలుగా మార్చుకుంటాయి. అవి తిరిగి ఆహార గొలుసు ద్వారా ఆవరణ వ్యవస్థలోని జీవజాతులకు అందుతాయి. ఈ వలయం నిరంతరం కొనసాగుతుండటంతో ఆవరణ వ్యవస్థ సమతౌల్యంగా ఉంటుంది. 

 

పోషక వలయాలను కింది విధంగా విభజించారు.

 

ఆక్సిజన్‌ వలయం: పరిసరాల్లోని జీవులకు, నిర్జీవ పదార్థాలకు మధ్య జరిగే ఆక్సిజన్‌ వినిమయాన్ని ఆక్సిజన్‌ వలయం అంటారు. చెట్లు గాలిలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌ని పీల్చుకుని, నీరు, సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్యసంయోగ క్రియ జరిపి తిరిగి ఆకుల ద్వారా ఆక్సిజన్‌ను గాలిలోకి విడుదల చేస్తుంటాయి. వాతావరణంలో 21% వరకు ఉండే ఆక్సిజన్‌ నీటిలోనూ కొంత కరిగి ఉంటుంది. అదేవిధంగా ఓజోన్‌ పొరలో కూడా ఆక్సిజన్‌ మోతాదు ఎక్కువగానే ఉంటుంది. ఈ విధంగా ఆక్సిజన్‌ పుష్కలంగా లభించి సమస్త ప్రాణుల శ్వాసక్రియకు సరిపోతుంది.

 

కర్బన వలయం: వృక్ష, జంతు కణజాలాల నిర్మాణానికి కార్బన్‌ వెన్నెముక లాంటిది. భూమి మొదటి వాతావరణ పొర ట్రోపో ఆవరణంలో వాయు స్థితిలో లభించే కార్బన్‌ డై ఆక్సైడ్‌ని సూర్యకాంతి సమక్షంలో మొక్కలు శోషించుకుని కార్బోహైడ్రేట్స్‌ రూపంలో సంశ్లేషణ చెందిస్తాయి. ఈ పోషకం ఉత్పత్తిదారులు, వినియోగదారులకు బదిలీ అవుతూ చివరగా బ్యాక్టీరియాలు, శిలీంద్రాలు లాంటి విచ్చిన్నకారుల వల్ల సరళ అకర్బన పదార్థాలుగా విడిపోతుంది. అంతిమంగా దీనిలోని కార్బన్‌ వాయుస్థితిలో వాతావరణంలోకి, కార్బోనేట్, బైకార్బోనేట్‌ల రూపంలో జలావరణం, శిలావరణంలోకి బదిలీ అవుతుంది. ఈవిధంగా కార్బన్‌ ఘన, ద్రవ, వాయు స్థితిలో చక్రీయంగా బదిలీ అవుతూ తిరిగి మొక్కలు జరిపే కిరణజన్య సంయోగక్రియలో కార్బోనేట్స్‌ రూపంలో సంశ్లేషణ చెందుతుంది.

 

నత్రజని వలయం: వాతావరణంలో నైట్రోజన్‌ వాయువు 78% వరకు ఉంటుంది. ఇది జడవాయువు. రసాయన చర్యల్లో పాల్గొనదు. జీవులకు, చుట్టూ ఉన్న పరిసరాలకు మధ్య జరిగే నత్రజని పదార్థాల వినిమయాన్ని నత్రజని వలయం అంటారు. ప్రొటీన్లు, కేంద్రకామ్లాలు, అమైనో ఆమ్లాల నిర్మాణానికి నత్రజని మూలాధారం. అయినప్పటికీ జీవజాతులు నైట్రోజన్‌ని పరోక్షంగానే గ్రహిస్తాయి. రైజోబియం లాంటి బ్యాక్టీరియాల వల్ల వాతావరణంలోని నైట్రోజన్‌ వాయువు నేలలో నైట్రేట్లుగా స్థిరీకరణకు గురవుతుంది. దీన్నే నత్రజని స్థాపన అంటారు. ఈ నైట్రేట్లను వృక్షాలు నేల నుంచి గ్రహిస్తాయి. నత్రజని స్థాపన వల్ల వాతావరణంలోని అకర్బన నత్రజని, కర్బన నత్రజనిగా మారి మొక్కల్లోకి ప్రవేశిస్తుంది. మొక్కల దేహాల్లో కర్బన నత్రజని ప్రొటీన్లుగా మారుతుంది. మొక్కల కళేబరాల్లోని ఈ కర్బన నత్రజని సూడోమోనాస్‌ లాంటి నత్రీకరణ బ్యాక్టీరియా వల్ల వినత్రీకరణ (డీనైట్రిఫికేషన్‌) జరిగి కొంత నైట్రేట్లుగా నేలలోకి పోగా, మరికొంత స్వేచ్ఛా నత్రజని వాయువుగా మారి వాతావరణంలో కలుస్తుంది. ఈ విధంగా జీవులకూ, చుట్టూ ఉన్న పరిసరాలకు మధ్య జరిగే నత్రజని పదార్థాల వినిమయాన్ని నత్రజని వలయం అంటారు.

 

ఫాస్ఫరస్‌ వలయం: శక్తి వాహకంగా వ్యవహరించే ఫాస్ఫరస్‌ అవక్షేప వలయాల్లో చాలా ముఖ్యమైంది. ఫాస్ఫరస్‌ మూలకం అడినోసిన్‌ ట్రైఫాస్ఫేట్‌ (ATP) గా కణజాల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది భౌమావరణ వ్యవస్థలోనూ, జలావరణ వ్యవస్థలోనూ కొద్దిమొత్తంలో లభిస్తుంది. ఫాస్ఫాటిక్‌ శిలల శైథిల్యం ద్వారా లభించిన ఆర్ధోఫాస్ఫేట్‌ అయాన్ల రూపంలో ఉన్న అకర్బన ఫాస్ఫేట్లు.. వృక్షాల జీవన ప్రక్రియలో పాల్గొంటాయి. ఇవి ఆహారపు గొలుసుల ద్వారా క్రమంగా వినియోగదారులకు, విచ్ఛిన్నకారులకు ప్రవహించి చివరకు నేలలో కలుస్తాయి. నేలలో విడుదలైన ఫాస్ఫేట్లు తిరిగి వృక్షాలకు వినియోగమవుతాయి. ఆధునిక వ్యవసాయ రంగంలో ఫాస్ఫేట్‌ ఎరువుల వాడకం ఎక్కువవడంతో నీటిలో ఆక్సిజన్‌ తగ్గిపోయి యూట్రిఫికేషన్‌కు దారితీసి జలకాలుష్యం ఏర్పడుతోంది. 

 

జల వలయం: జీవులకు, వాటి చుట్టూ ఉన్న వాతావరణం, శిలావరణం, జలావరణం లాంటి భౌతిక పరిసరాలకు మధ్య నీరు ఘన, ద్రవ, వాయు స్థితుల్లో చక్రీయంగా బదిలీ కావడాన్ని జలచక్రంగా పిలుస్తారు. సూర్యుడి నుంచి భూమికి చేరే సౌర వికిరణం ద్వారా జలాశయాలు, మంచు ప్రాంతాల నుంచి బాష్పీభవనం (నీరు ఆవిరవడం), ఉత్పతనం (ఘన పదార్థాలు నీరుగా ఆవిరవడం), బాష్పోత్సేకం (చెట్ల నుంచి విడుదలయ్యే నీటిఆవిరి) లాంటి ప్రక్రియల ద్వారా నీరు గాలిలోకి చేరి మేఘాలుగా మారుతుంది. తిరిగి మేఘాలు ద్రవీభవనం చెంది వర్షంగా, ఘనీభవనం చెంది మంచుగా భూమికి చేరతాయి. ఈవిధంగా భూమిపై ఉన్న సమస్త జీవజాలానికి కావాల్సిన నీటి అవసరాలు తీరుతున్నాయి.

 

మాదిరి ప్రశ్నలు

 

1. జీవ సందీప్తి అంటే ఏమిటి?  

1) కొన్ని జీవులు కాంతి ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉండటం

2) కొన్ని జీవులు కాంతిని గ్రహించడం

3) కొన్ని జీవులు కాంతిని తీసుకోకపోవడం

4) గాలి, సూర్యరశ్మి సంయోగం చెందడం

 

2. సూర్యుడి నుంచి భూమికి చేరే సూర్యకాంతిని ఏమంటారు? 

1) సౌరవికిరణం 2) సూర్యపుటం 3) భూవికిరణం 4) పైవేవీకాదు

 

3. బాష్పోత్సేకం అంటే ఏమిటి?

1) చెట్లు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం           

2) చెట్లు ఆకుల ద్వారా నీటిని విడిచిపెట్టడం

3) చెట్లు ఆకు రాల్చడం                   

4) చెట్లు కార్బన్‌ డై ఆక్సైడ్‌ని పీల్చుకోవడం

 

4. ఘనపదార్థాలు నేరుగా ఆవిరవడాన్ని ఏమంటారు? 

1) బాష్పోత్సేకం 2) బాష్పీభవనం 3) ఉత్పతనం 4) హైడ్రేషన్‌

 

5. సౌర వికిరణం అంటే ఏమిటి?

1) సూర్యుడు బయటకు విడుదల చేసే శక్తి 

2) సూర్యుడి నుంచి భూమి గ్రహించే శక్తి

3) సూర్యుడి కేంద్రంలో ఉద్భవించే శక్తి 

4) సౌరశక్తి వల్ల నీరు ఆవిరవడం

 

6. వృక్ష, జంతు కణజాల నిర్మాణానికి వెన్నెముక లాంటిది? 

1) ఆక్సిజన్‌ 2) నైట్రోజన్‌ 3) కార్బన్‌ 4) హైడ్రోజన్‌

 

7. ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థలో నిర్దిష్ట సమయంలో ఉన్నటువంటి అకర్బన పోషకాల మొత్తం పరిమాణాన్ని ఏమని పిలుస్తారు?

1) నిలకడ స్థితి 2) బయోమ్‌ 3) జీవ ద్రవ్యరాశి 4) బయోట్‌

 

8. ఆవరణ వ్యవస్థలో జీవులకు, పరిసరాలకు మధ్య పోషకాల చక్రీయ బదిలీ విధానాన్ని ఏమంటారు?  

1) భూ - జీవ వలయం 2) భూ- రసాయన వలయం 

3) భూ విజ్ఞాన వలయం 4) జీవ- భూ- రసాయన వలయం

 

సమధానాలు

1-1, 2-2, 3-2, 4-3, 5-1, 6-3, 7-1, 8-4.

 

జల వలయం:

Condensation = ద్రవీభవనం

Precipitation = అవపాతం

Evaporation = బాష్పీభవనం

Rain=  వర్షం

Snow = మంచు

Surface Runoff = ఉపరితల నీరు

Ground Water  = భూగర్భ జలం

 

జల్లు సద్గుణరావు


 

Posted Date : 19-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చక్రవాతాలు

సుడిగాలుల విలయం

ప్రచండ వేగంతో వీచే గాలుల ధాటికి భారీ వృక్షాలు కూకటి వేళ్లతో కూలిపోతాయి. కరెంటు స్తంభాలు కట్టె పుల్లల్లాగా నేలకొరుగుతాయి. ఇళ్ల పైకప్పులు గాలిలో చెక్కర్లు కొడతాయి. వాటికి కుంభవృష్టి తోడై నీరు వరదలై పారుతుంది. తీరప్రాంతాలు మునిగిపోతాయి. ఈ విలయం ఎలా ఏర్పడుతుంది? ఆ సుడిగాలులు సృష్టించే విధ్వంసాలకు కారణం ఏమిటి? విపత్తు నిర్వహణ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వాటి గురించి తెలుసుకోవాలి. 

విధ్వంసం సృష్టించగలిగే వేగమైన గాలులు, కుండపోత వర్షంతో కూడిన వాతావరణ పరిస్థితినే చక్రవాతం అంటారు. ఇవి కొన్ని సందర్భాల్లో సముద్రనీటి మట్టాన్ని పెంచి, తీరంలోని భూభాగాన్ని ముంచెత్తే ఉప్పెనగా (అధిక వేళాతరంగాలు) కూడా మారతాయి. చుట్టూ అధిక పీడన ప్రాంతంతో ఆవరించిన అల్పపీడన ప్రాంతంలోని శక్తిమంతమైన గాలులతో కూడిన సుడులు తిరిగే వాతావరణ అలజడే చక్రవాత స్వరూపం. ఇవి ఉత్తరార్ధ గోళంలో అపసవ్య దిశలో, దక్షిణార్ధ గోళంలో సవ్య దిశలో సుడులు తిరుగుతాయి. చక్రవాతాన్ని ఆంగ్లంలో సైక్లోన్‌ అంటారు. అది ‘సైక్లోస్‌’ అనే గ్రీకు పదం నుంచి పుట్టింది. గ్రీకు భాషలో సైక్లోస్‌ అంటే పాము మెలికల చుట్ట అని అర్థం. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన ఉష్ణమండల తుపాన్లు సర్పిలాకారంగా ఉన్నట్లు గమనించిన హెన్రీ పెడింగ్టన్‌ అనే బ్రిటన్‌ వాతావరణ శాస్త్రవేత్త 1848లో వీటికి ‘సైక్లోన్‌’ అని పేరు పెట్టారు.

 

అల్పపీడనం నుంచే ఆవిర్భావం

సముద్ర ఉపరితలంపై ఏర్పడిన ఒక అల్పపీడన ప్రాంతం అన్ని వైపుల నుంచి అధిక పీడన గాలులను ఆకర్షించడం వల్ల మధ్యలో చక్రవాత కేంద్రం ఏర్పడుతుంది. దీని వ్యాసార్ధం సుమారు 20-30 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పరిధిలో వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. కానీ చుట్టూ చక్రవాత కుడ్యంగా పిలిచే ప్రాంతం విధ్వంసకర పవనాలతో అలజడి సృష్టిస్తుంది. ఈ చక్రవాతాలను మూడు దశలుగా విభజించారు.

1) రూపకల్పన దశ: బాష్పీభవనం ద్వారా గాలిలో 7,000 మీటర్ల ఎత్తు వరకు అధిక సాపేక్ష ఆర్ధ్రతను చేరుకోవడానికి సముద్ర నీటిలో 60 మీటర్ల లోతు వరకు 26 డిగ్రీసెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. అలాంటప్పుడే క్రమంగా నీటిఆవిరి నల్లని క్యుములోనింబస్‌ మేఘాలుగా మారుతుంది. 

2) పరిపక్వ దశ: ఈ దశలో క్యుములో నింబస్‌ మేఘాలు ఉరుములు, మెరుపులను ఏర్పరుస్తూ చక్రవాత కంటి చుట్టూ పట్టీల్లా దట్టంగా అల్లుకుంటాయి. ఆ సమయంలో చక్రవాత కన్ను ఉపగ్రహ చిత్రాల్లో నల్లని కేంద్రం/చుక్కగా కనిపిస్తుంది. ఈ నల్లని కేంద్రం ఎంత చిన్నగా కనిపిస్తే చక్రవాతం అంత బలంగా మారుతుంది. చక్రవాతం క్రమంగా తన స్థానాన్ని జరుపుతూ తీరాన్ని తాకుతుంది.

3) బలహీనపడటం: గాలి పీడనంలో వచ్చిన మార్పుల వల్ల చక్రవాతం పైకి లేదా కిందికి జరిగినప్పుడు అకస్మాత్తుగా ఛేదనం చెంది బలహీనపడుతుంది. ఈ విధంగా చక్రవాతాల కాలవ్యవధి 24 గంటల కంటే తక్కువ వ్యవధి నుంచి 3 వారాల కన్నా ఎక్కువకాలం వరకు ఉండవచ్చు. ఒక చక్రవాతం మూడు దశలు పూర్తవడానికి సగటున 6 రోజులు పడుతుంది. అత్యంత సుదీర్ఘ చక్రవాతంగా పేరు పొందిన ‘టైఫూన్‌ జాన్‌’ 1994లో ఆగస్టు - సెప్టెంబరుల మధ్య 31 రోజులు పసిఫిక్‌ మహాసముద్రంలో కొనసాగింది.

 

వివిధ పేర్లు

చక్రవాతాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతాలవారీగా వివిధ పేర్లతో పిలుస్తారు.

* హిందూ మహాసముద్రం (భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్థాన్, అరేబియా దేశాలైన యెమన్, ఒమన్‌) దేశాల్లో - ఉష్ణమండల తుపాన్లు

* ఆస్ట్రేలియా - విల్లీ - విల్లీలు

* వాయవ్య పసిఫిక్‌లో చైనా, జపాన్‌ - టైఫూన్లు

* పిలిఫ్పైన్స్‌ - బగుయియేస్‌

* ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద్రంలో అమెరికా తూర్పుతీరం పైన, వెస్టిండీస్‌ దీవులు - హరికేన్లు 

* అమెరికా సంయుక్త రాష్ట్రాల భూప్రాంతం - టోర్నడోలు

 

గాలి వేగం ఆధారంగా తుపాను తీవ్రత
కల్లోల రకం గాలి వేగం (గం./కి.మీ.లలో)
అల్పపీడనం (Low pressure) 31
వాయుగుండం (Depression) 31 - 49
తీవ్ర వాయుగుండం (Deep depression) 49 - 61
తుపాను కల్లోలం (Cyclonic storm)  61 - 88
తీవ్ర తుపాను కల్లోలం (Severe cyclonic storm) 88 - 118
అతి తీవ్ర తుపాను కల్లోలం (Very sever cyclonic storm) 118 - 221 
సూపర్‌ సైక్లోన్‌  221 కంటే ఎక్కువ


సూపర్‌ సైక్లోన్‌: 1999, అక్టోబరు 29న ఒడిశాలో సంభవించిన సూపర్‌ సైక్లోన్‌ వల్ల గంటకు 260 - 300 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. సముద్ర నీటిమట్టం 9 మీటర్లు కెరటాలతో ఉప్పెనగా మారి 140 మీటర్ల మేర తీరాన్ని ముంచేసింది. 10 వేల మంది మంది మరణించగా, 2 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి.

సాంకేతిక సహకారం: 2014, అక్టోబరు 12న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కుదిపేసిన హుద్‌-హుద్‌ తుపాను కారణంగా సూపర్‌ సైక్లోన్‌ కంటే తక్కువ వేగంతో గంటకు 180 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. 46 మంది చనిపోయారు. సాంకేతిక పరిజ్ఞానంతో తుపాన్లను ముందుగానే అంచనా వేసి అప్రమత్తం చేస్తుండటంతో ఇటీవల కాలంలో ప్రాణనష్టం తగ్గించడం సాధ్యమవుతోంది.

టోర్నడో: ఇది భూఉపరితలంపై ఏర్పడే చక్రవాతం. 3 - 30 నిమిషాలపాటు మాత్రమే కొనసాగుతుంది. కానీ గాలి వేగం గంటకు 200 కి.మీ. నుంచి అత్యధికంగా 400 కి.మీ. ఉంటుంది. ఆ సమయంలో పైకి విసిరే సుడిగాలినే టోర్నడో అంటారు. దీని గాలివేగాన్ని ఫుజితా స్కేల్‌తో కొలుస్తారు. టోర్నడోలు ఎక్కువగా అమెరికా, మెక్సికో దేశాల భూభాగాల్లో వస్తుంటాయి. పచ్చదనం తగ్గిపోయి కాంక్రీట్‌ జంగిల్‌ విస్తీర్ణం పెరుగుతున్న కారణంగానే అమెరికాలో టోర్నడోల తాకిడి తీవ్రరూపం దాలుస్తోంది. అప్పడప్పుడు ఆస్ట్రేలియాలో ఏర్పడుతున్న నీటి టోర్నడోల (వాటర్‌ స్పౌట్‌) గురించి వాతావరణ నిపుణులు చర్చలు జరుపుతున్నారు.


భారత్‌లో 

మన దేశానికి రెండువైపులా బంగాళాఖాతం, అరేబియా సముద్రాలు ఆవరించి ఉన్నాయి. వాటిలో వేడినీరు ప్రవహిస్తుండటంతో రెండు సందర్భాల్లో తుపాన్లు సంభవిస్తున్నాయి.

1) నైరుతి రుతుపవనాల ప్రవేశానికి ముందు - మే-జూన్‌ నెలల్లో అరేబియా సముద్రంలో సంభవించే చక్రవాతాలు ఈశాన్యం, తూర్పు, వాయవ్యం దిశల్లో కదిలి తీర దేశాల్లో ప్రభావం చూపిస్తున్నాయి.

2) ఈశాన్య రుతుపవనాల సమయంలో - అక్టోబరు - నవంబరు నెలల్లో బంగాళాఖాతంలో ఏర్పడే చక్రవాతాలు ఎక్కువగా వాయవ్యం వైపు, కొన్నిసార్లు ఉత్తరం, పశ్చిమ దిశల్లో కదిలి తీర ప్రాంతంలో ప్రభావం చూపుతున్నాయి.

* హిందూ మహాసముద్రంలో ఏర్పడే చక్రవాతాల వల్ల నష్టపోతున్న 8 దేశాలు 2004 నుంచి కొన్ని పేర్ల జాబితాను ముందుగానే రూపొందించాయి. వాటినే చక్రవాతాలకు పెడుతున్నారు. 2020లో మరో 5 దేశాలు ఇందులో చేరాయి. ప్రస్తుతం 13 దేశాల్లో ముందుగా నిర్ణయించిన పేర్ల జాబితాను చక్రవాతాల కోసం వినియోగిస్తున్నారు. 

* 1977, నవంబరు 19న సంభవించిన దివిసీమ తుపాను ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో నిలిచిపోయింది. నాటి విపత్తులో సుమారు 10 వేల మంది చనిపోయారు.

 

హెచ్చరికలు

రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు తుపాను హెచ్చరికలను నాలుగు దశల్లో జారీ చేస్తుంది.

1) ప్రీ సైక్లోన్‌ వాచ్‌: సముద్రంలో తుపాను ఏర్పడే పరిస్థితి ఉన్నప్పటి నుంచి అంటే 72 గంటల ముందు నుంచి హెచ్చరికలు జారీ చేస్తారు.

2) సైక్లోన్‌ అలర్ట్‌: తీరం వెంట ప్రతికూల ప్రభావం మొదలవుతుందని భావించిన 48 గంటల ముందు వెలువరిస్తారు.

3) సైక్లోన్‌ వార్నింగ్‌: తుపాను రాబోయే 24 గంటల్లో తీరాన్ని తాకుతుందని భావించినప్పుడు తుపాను హెచ్చరికలు చేస్తారు. ఇక్కడి నుంచి ప్రతి గంట గంటకి సమాచారం వెలువడుతుంది.

4) సైక్లోన్‌ హిట్‌ దశ: రాబోయే 12 గంటల్లో తుపాను తీరాన్ని తాకుతుందని అంచనా వేసిన సమయం నుంచి ఈ హెచ్చరిక మొదలవుతుంది. భూమిపై గంటకు 60 కి.మీ. వేగంతో గాలులు వీచే సమయం వరకు ఈ హెచ్చరిక జారీ చేస్తారు.


 

మాదిరి ప్రశ్నలు


1. దేశంలో గుజరాత్‌ తర్వాత రెండో పొడవైన తీరం ఉన్న రాష్ట్రం ఏది?

1) మహారాష్ట్ర     2) తమిళనాడు     3) ఆంధ్రప్రదేశ్‌     4) ఒడిశా


2. ఒకప్పుడు రేవు పట్టణంగా కొనసాగిన కోరింగ ప్రాంతం 1839లో వచ్చిన తుపానుకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ప్రస్తుతం చిన్న గ్రామంగా కొనసాగుతోంది. ఆ ప్రాంతం ఏ జిల్లాలో ఉంది?

1) కాకినాడ     2) పశ్చిమ గోదావరి    3) నెల్లూరు    4) తిరుపతి


3. విశాఖపట్నాన్ని హుద్‌-హుద్‌ తుపాను ఏ తేదీన తాకింది?

1) 2014, అక్టోబరు 12        2) 2014, సెప్టెంబరు 14     3) 2015, ఆగస్టు 5     4) 2016, జనవరి 3


4. ఆంధ్రప్రదేశ్‌ ప్రాదేశిక తుపాను హెచ్చరిక కేంద్రం ఎక్కడుంది?

1) చెన్నై   2) విశాఖపట్నం    3) కోల్‌కతా    4) పారాదీప్‌ 


5. తీవ్రమైన తుపాను గాలులను అడ్డుకోవడానికి తీర ప్రాంతం వెంబడి పెంచే చెట్లను ఏమంటారు?

1) ఆశ్రయతోరణ మొక్కలు    2) మడ అడవులు    3) శృంగాకార అడవులు   4) ఆల్ఫైన్‌ అడవులు


6. భారతదేశంలో తుపానులు ఎక్కువగా సంభవించే నెలలు?

1) డిసెంబరు - జనవరి    2) జూన్‌ - జులై     3) అక్టోబరు - నవంబరు    4) మార్చి - ఏప్రిల్‌


7. భారతదేశంలో మొత్తం భూభాగంలో ఎంత శాతం చక్రవాతాలకు అనువుగా ఉంది?

1) 8%        2) 18%        3) 30%        4) 40%


8. 1970లో బంగ్లాదేశ్‌పై విరుచుకుపడి మూడు లక్షల మంది ప్రాణాలు బలిగొన్న తుపాను పేరు?

1) నైనా      2) లైలా      3) ట్రేసి     4) బోలా 


9. ఎంత వేగంతో గాలులు వీచినప్పుడు సూపర్‌ సైక్లోన్‌గా పిలవాలి?

1) గంటకు 221 కి.మీ.కంటే ఎక్కువ        2) గంటకు 118 కి.మీ.కంటే ఎక్కువ

3) గంటకు 88 కి.మీ. కంటే ఎక్కువ        4) గంటకు 400 కి.మీ. కంటే ఎక్కువ


10. మన దేశంలో బంగాళాఖాతానికి, అరేబియా సముద్రానికి మధ్య తుపాన్ల నిష్పత్తి ఎలా ఉంటుంది?

1) 4 : 1        2) 1 : 4        3) 2 : 6        4) 6 : 2

 

సమాధానాలు: 1-3,   2-1,   3-1,   4-2,   5-1,   6-3,   7-1,   8-4,   9-1,   10-1

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 01-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూమి - ఆవరణాలు

సమస్త జీవులకూ సానుకూలం!

  వర్షాలు పడి నదులు, కాలువలుగా ప్రవహిస్తే జీవులకు, మొక్కలకు కావాల్సిన నీళ్లు అందుతుంటాయి. ఇది సర్వ సాధారణ విషయంగా కనిపించినా, శాస్త్రీయంగా పరిశీలిస్తే ఇందులో జలావరణం నుంచి జీవావరణం వరకు పలు వ్యవస్థల ప్రభావాలు ఇమిడి ఉంటాయి. ఇవన్నీ సమస్త జీవులకు అవసరమైన అనుకూలతలను అందిస్తూ వాటి మనుగడ సవ్యంగా సాగడానికి సహకరిస్తుంటాయి. పరిసరాలకు, ప్రాణులకు మధ్య ఉన్న ఈ విశిష్ట బంధం గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

  జీవులు తమ చుట్టూ ఉన్న పరిసరాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా జీవించడానికి,  ప్రత్యుత్పత్తికి ఆవరణ వ్యవస్థే ఆధారం. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలోని జీవ వైవిధ్యం, జీవుల ఆవాసాలు, అందుబాటులో ఉన్న శక్తి వనరులన్నింటినీ కలిపి ఆవరణ వ్యవస్థ నిర్మాణం అంటారు. ఆవరణ వ్యవస్థ     సమతౌల్యతను కాపాడటం పర్యావరణ వ్యవస్థ ముఖ్యలక్షణం. జీవ, నిర్జీవ అంశాల మధ్య జరిగే అంతఃచర్యలు, జీవుల మధ్య ఉండే  విధిపూర్వక సంబంధాలపై పర్యావరణ   మనుగడ ఆధారపడి ఉంటుంది. మొత్తం భూమి చుట్టూ నాలుగు ఆవరణలు ఆవరించి ఉన్నాయి.

 

1) శిలావరణం (Lithosphere): భూమి   ఉపరితలం నుంచి కొంత లోతు వరకు    విస్తరించి, ఘనస్థితిలో ఉన్న భూమి బాహ్య పొరను శిలావరణం అంటారు. ఈ ఉపరితలం వివిధ భౌమకాలాల్లో అంతర్జనిత, బహిర్జనిత బలాలకు గురవుతూ వచ్చింది. ఈ ప్రక్రియలో ఉపరితలంపై పర్వతాలు, పీఠభూములు,   మైదానాలు లాంటి భూస్వరూపాలు ఏర్పడ్డాయి. అలా వివిధ జీవజాతుల మనుగడకు కావాల్సిన భౌతిక పర్యావరణం ఏర్పడింది. శిలావరణం జీవజాతులకు కావాల్సిన ఆహార వనరులు,  శక్తి వనరులు, ఆవాసాలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

 

2) జలావరణం (Hydrosphere) : భూమి చుట్టూ ఆవరించిన జలాలను జలావరణం అంటారు. భూ మొత్తం వైశాల్యం సుమారు 510 మిలియన్‌ చదరపు కి.మీ.లలో 71% జలావరణం ఆవరించింది. భూమిపై జీవనానికి అనుకూల వాతావరణం ఏర్పడేందుకు జలావరణం సహకరిస్తుంది. జలచక్రంలో భాగంగా నీరు ఆవిరై, తిరిగి భూమి మీద వర్షంగా కురిసి జీవులకు ఆధారమైన నీటిని సమకూరుస్తుంది. జలభాగం ప్రధాన కార్బన్‌ శోషకం (carbon sink) గా వ్యవహరిస్తుంది. భూమిపై రెండు కార్బన్‌ శోషకాలను గుర్తించవచ్చు. మహాసముద్రాలు, సముద్రాలు అతిపెద్ద బ్లూ కార్బన్‌ సింక్‌ గా ఉన్నాయి. భూమి మీద ఉన్న అటవీ వనరులను గ్రీన్‌ కార్బన్‌ సింక్‌గా పిలుస్తారు. దక్షిణ అమెరికాలోని అమెజాన్‌ అడవులు అతిపెద్ద గ్రీన్‌ కార్బన్‌ సింక్‌కు ఉదాహరణ.

 

3) వాతావరణం (Atmosphere): భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొరే వాతావరణం. ఇది భూమి ఉపరితలం నుంచి దాదాపుగా 1600 కి.మీ. ఎత్తువరకూ విస్తరించింది. వాయువులో ఉండే ఘన, ద్రవ  కణాలను ఏరోసోల్స్‌ (Aerosols)  అంటారు. వాతావరణంలో చేరే దుమ్ము, ధూళి రేణువులు, కలుషిత గాలి వాతావరణంలోని  ఘనపదార్థాలు. ఇవి పరిమితికి మించి గాలిలో చేరితే గాలి పారదర్శకత దెబ్బతిని, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.

 

వాతావరణంలో ని వివిధ  పొరలు

 

ట్రోపో ఆవరణం: ఇది భూమిని ఆవరించి ఉన్న మొదటి వాతావరణ పొర. భూమధ్య రేఖా ప్రాంతంలో 18 కి.మీ. ఎత్తు, ధ్రువాలపై 8 కి.మీ. ఎత్తు వరకు ఉంటుంది. ఈ ఆవరణంలో ధూళి కణాలు, మేఘాలు, పవనాలు, వర్షం, ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణ అంశాలన్నీ ఏర్పడతాయి. అందుకే ఈ ఆవరణాన్ని కల్లోల/మిశ్రమ/ పరివర్తన ఆవరణం అంటారు. జీవుల మనుగడకు అనుకూలమైన ఆవరణం ఇది. ఈ ఆవరణం పైభాగం కంటే కింది భాగంలో   ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి    సంవహన క్రియకు దోహదం చేస్తున్నాయి. ఇందులో పైకి వెళ్లేకొద్దీ ప్రతి 1000 మీటర్లకు 6.4 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల చొప్పున లేదా ప్రతి 165 మీటర్లకు ఒక డిగ్రీ సెంటీగ్రేడ్‌ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. దీన్నే ఉష్ణోగ్రత క్షీణతా క్రమం అంటారు. ట్రోపో   ఆవరణ పైభాగంలో అత్యంత వేగంగా వంకరలు తిరుగుతూ కదిలే జియోస్ట్రోపిక్‌ పవనాలనే జెట్‌స్ట్రీమ్స్‌ అంటారు. ఇలాంటి పశ్చిమ జెట్‌ స్ట్రీమ్‌ ఒకటి భారతదేశంపై నుంచి హిమాలయాల అంత ఎత్తులో వీస్తుండటం వల్ల ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో వర్షాలు కురుస్తుంటాయి.

 

స్ట్రాటో ఆవరణం: ఇది ట్రోపో ఆవరణంపైన భూమి    ఉపరితలం నుంచి దాదాపు 50 కి.మీ. ఎత్తు వరకు    విస్తరించి ఉంది. ఈ ఆవరణానికి, ట్రోపో ఆవరణానికి మధ్యలో ట్రోపోపాస్‌ అనే సంధి పొర ఉంటుంది. స్ట్రాటో ఆవరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. ఇందులోనే జెట్‌ విమానాలు ప్రయాణిస్తాయి. ఈ ఆవరణంలో పైకి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. భూమికి రక్షణ   కవచంగా పిలిచే ఓజోన్‌ ఆవరణం స్ట్రాటో ఆవరణంలోనే భూమి చుట్టూ విస్తరించి ఉంది. ఓజోన్‌ పొర సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలను వడపోసి వేడిని మాత్రమే పంపిస్తుంది. స్ట్రాటో   ఆవరణం పై అంచులో, దానిపైన ఉన్న మీసో ఆవరణానికి మధ్య స్ట్రాటో సంధి పొర (స్ట్రాటో పాస్‌) ఉంటుంది.

 

మీసో ఆవరణం: ఇది స్ట్రాటో పాస్‌పైన భూమి ఉపరితలం నుంచి 80 కి.మీ. ఎత్తు వరకూ ఆవరించి ఉంది. ఈ ఆవరణంలో పైకి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అందువల్ల దీన్ని బాహ్యట్రోపో ఆవరణం అంటారు. ఈ ఆవరణం పైఅంచును మీసో పాస్‌ అంటారు. ఇక్కడ  100 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకే ఇక్కడ రాకెట్లు ప్రయాణించేలా వాటికి క్రయోజెనిక్‌ ఇంజిన్లు వాడతారు.

 

ఐనో ఆవరణం: ఇది మీసోపాస్‌ను ఆనుకుని సుమారుగా 400 కి.మీ. ఎత్తు వరకు భూమి చుట్టూ ఆవరించి ఉంది. ఇందులో ఆక్సిజన్, నైట్రోజన్‌ అణువులు కలిసి  అయనీకరణ చెందుతాయి. హైడ్రోజన్, హీలియం అణువులు కలిసి అకస్మాత్తుగా ఉష్ణోగ్రతను పెంచుతాయి. అందువల్ల ఐనో ఆవరణాన్ని థ]ర్మో ఆవరణం అని కూడా అంటారు. భూమి నుంచి పంపిన విద్యుదయస్కాంత తరంగాలు ఐనో ఆవరణంలో పరావర్తనం చెంది తిరిగి భూమిని రేడియో తరంగాలుగా చేరతాయి.

ఎక్సో ఆవరణం: ఇది ఐనో ఆవరణం పైన విస్తరించి ఉన్న ఆవరణం. ఇది పదార్థం నాలుగో రూపమైన ప్లాస్మా స్థితిలో ఉంటుంది. హైడ్రోజన్, హీలియం వల్ల ఇది కూడా అధిక ఉష్ణోగ్రతతో ఉంటుంది. ఈ పొరను మాగ్నిటో    ఆవరణం అని కూడా అంటారు.

 

4) జీవావరణం (Biosphere): శిలావరణం, జలావరణం, వాతావరణం కలుసుకునే సంధి ప్రాంతంలో ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్, నీరు లాంటి పదార్థాలు జీవ - భూ - రసాయన వలయాల ద్వారా   పరస్పరం మార్పిడి చెందుతుంటాయి.  ఇది నిరంతరం జీవజాతుల ఆవిర్భావానికి, వాటి మనుగడకు కావాల్సిన అనుకూల భౌతిక పరిస్థితులను ఏర్పరుస్తాయి. ఈ భౌతిక పరిసరాల్లో నివసించే మొత్తం జీవజాతినే జీవావరణం అని పిలుస్తారు.

 

కాంతి పుంజాలు

  సూర్యుడి నుంచి వెలువడే అధిక  శక్తిమంతమైన     వికిరణాలు ఐనోస్ఫియర్‌లోకి ప్రవేశించినప్పుడు అందులోని  ఆక్సిజన్, నైట్రోజన్‌ వాయువులతో విభేదిస్తాయి. ఫలితంగా రసాయన చర్య జరిగి మిరుమిట్లు గొలిపే కాంతి వెలువడుతుంది. వీటినే అరోరాలు అంటారు. ఈ కాంతి కిరణాలు అయస్కాంత ధ్రువాల వైపు ఆకర్షితమవుతాయి. ఇవి ధ్రువాల పై ఆరు నెలలు చీకటిగా ఉన్న రోజుల్లో కనిపిస్తుంటాయి. వీటినే ఉత్తర ధ్రువంలో అరోరా బోరియాలిస్‌ అని, దక్షిణ ధ్రువంలో అరోరా ఆస్ట్రాలిస్‌ అని అంటారు.

 

వివిధ రూపాల్లో లభించే నీరు

మహాసముద్రాలు 97.25%
ధ్రువాల్లో మంచు, హిమనీనదాలు 2.05%
భూగర్భజలం 0.68%
సరస్సులు 0.01%
నేలలో తేమ 0.005%
గాలిలో తేమ 0.001%
నదులు 0.0001%
మొత్తం 99.9961%


మాదిరి ప్రశ్నలు

 

1. ఎకోసైడ్‌ అంటే ఏమిటి?

1. మానవుడి అభివృద్ధి వల్ల పర్యావరణ క్షీణత

2. మానవుడి అభివృద్ధి వల్ల పర్యావరణ అభివృద్ధి

3. భూకంపాల వల్ల పర్యావరణం                   దెబ్బతినడం

4. పైవన్నీ

 

2. భూమి మీది మొత్తం జలావరణంలో సముద్రాలు ఎంత నీటిని ఆవరించి ఉన్నాయి?

1. 73%         2. 97.3% 

3. 25.5%        4. 50%

 

3. రేడియో తరంగాలు ఏ ఆవరణం నుంచి భూమి పైకి పరావర్తనం చెందుతాయి?

1. మీసో ఆవరణం  2. స్ట్రాటో ఆవరణం

3. ఐనో ఆవరణం  4. ఎక్సో ఆవరణం

 

4. వాతావరణంలో అత్యధికంగా ఉన్న వాయువు ఏది?

1. నైట్రోజన్‌    2. ఆక్సిజన్‌

3. ఆర్గాన్‌      4. కార్బన్‌ డయాక్సైడ్‌

 

5. ఏరోసోల్స్‌ అంటే ఏమిటి?

1. గాలిలోని ఘన ద్రవకణాలు    

2. గాలిలోని వాయు కణాలు

3. గాలిలోని దుమ్ము కణాలు     

4. గాలిలోని కర్బన కణాలు

 

6. ఉత్తర ధ్రువం వైపు కనిపించే కాంతి పుంజాలను ఏమంటారు?

1. అరోరా ఆస్ట్రాలిస్‌   

2. అరోరా బోరియాలిస్‌

3. విద్యుత్‌ కాంతులు   4. పైవన్నీ

 

7. అతిశీతల వాతావరణంలో రాకెట్లకు వాడే ఇంజిన్‌ ఏమిటి?

1. రేడియో విండోస్‌   2. జెట్‌ విండోస్‌

3. క్రయోజెనిక్‌ ఇంజిన్‌ 

4. క్రిటికల్‌ ఇంజిన్‌

 

సమాధానాలు: 1-1, 2-2, 3-3, 4-1,  5-1, 6-2, 7-3.

 

రచయిత: జల్లు సద్గుణరావు  

 

Posted Date : 26-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వ‌ర‌ద‌ల విప‌త్తు

జల విలయం

నదుల ప్రవాహాలు గట్లు దాటినా, అధిక వర్షాల వల్ల కురిసిన నీటిని అదుపు చేయలేకపోయినా వరదలు సంభవిస్తాయి. పొలాలను, జనావాసాలను ముంచేస్తాయి. ఆస్తులకు, ప్రాణాలకు నష్టాన్ని కలిగిస్తాయి. తాగునీరు కలుషితమైపోతుంది. పారిశుద్ధ్యం క్షీణించి అంటువ్యాధులు ప్రబలుతాయి. జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఇదంతా వరదలు సృష్టించే విలయమే. నదులకు నిలయమైన మన దేశంలో ఏటా ఈ పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. విపత్తు నిర్వహణ అధ్యయనంలో భాగంగా వరదల స్థితిగతులను, కారణాలను, ప్రభావాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

 

 

నీరు సాధారణ స్థితిని లేదా ప్రవాహ స్థాయిని మించినప్పుడు వరదలు వస్తాయి. వాన చినుకులు జడివానగా మారి కొన్ని గంటల  వ్యవధిలోనే వరదగా మారవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆనకట్టలు  తెగిపోవడం వల్ల ఎలాంటి హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా వరదలు సంభవించవచ్చు. ఎక్కువ శాతం వరదలకు నదీ ప్రవాహాలే ప్రధాన కారణం. వాటి అంతర్భాగం, ఆనకట్టల సామర్థ్యాన్ని మించి    ప్రవహించినప్పుడు చుట్టుపక్కల భూభాగాలను ముంచెత్తుతుంటాయి.

 

వరదల్లో రకాలు


నదీ వరదలు: వర్షాకాలంలో అధిక వర్షాల వల్ల, తుపాన్లు సంభవించే సందర్భాల్లోనూ, మంచు కరిగి నదిలో కలిసినప్పుడు నదీ వరదలు సంభవిస్తాయి. సముద్రంలోకి పంపే నీటి పరిమాణం కంటే ఎక్కువ నీటిని నది కలిగి ఉన్నప్పుడు నీరు పొంగి గట్టు దాటి   వరదలు సంభవిస్తాయి. వీటినే నదీ వరదలు అంటారు. నది తనలో ఉంచుకోగలిగిన నీటి పరిమాణాన్ని దాని పారుదల సామర్థ్యం అంటారు. నీటి పరీవాహక ప్రాంతం నుంచి ఒక సెకనులో ప్రవహించే నీటి పరిమాణాన్ని ‘డిశ్చార్జ్‌’ అంటారు.


తీరప్రాంత వరదలు: తుపాను వచ్చినప్పుడు, సముద్ర ఉప్పెనల వల్ల, సునామీలు సంభవించినప్పుడు, కొన్ని సందర్భాల్లో సముద్రంలో పెద్ద అలలు ఏర్పడినప్పుడు వచ్చే వరదలను తీర ప్రాంత వరదలు అంటారు.


నదీముఖద్వార వరదలు: సముద్రంలో ఉప్పెన కారణంగా గానీ, సునామీ కెరటాలు నెట్టుకొస్తున్నప్పుడుగానీ, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రంలో వేలా తరంగాలు ఎక్కువగా ఉన్నప్పుడు గానీ, నది ద్వారా సముద్రంలోకి ప్రయాణించే నీటిని సముద్రం స్వీకరించలేక వెనక్కి పంపినప్పుడు తీరం వెంబడి వరదలు రావచ్చు. నదులు సముద్రంలో కలిసే ప్రదేశాలను నదీ ముఖ ద్వారాలు అంటారు.


మెరుపు వరదలు: హఠాత్తుగా మంచు కరిగి నదిలో చేరడం,  కొండలపైన కుండపోత వర్షాలు, ఆనకట్టలు పగిలిపోవడం, కూలిపోవడం వల్ల అకస్మాత్తుగా సంభవించేవి మెరుపు వరదలు.


పట్టణ వరదలు: పట్టణ ప్రాంతాల్లో నీటిపారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల, భారీ వర్షాలు కురిసినప్పుడు పట్టణాల్లో ఈ  వరదలు సంభవిస్తుంటాయి.


ప్రమాదం కారణంగా వచ్చే వరదలు: అధిక పరిమాణంలో నీటి సరఫరా చేసే నీటి గొట్టాలు పగిలిపోవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు నీటితో మునిగిపోవడం ద్వారా వచ్చే వరదలు.

 

ప్రపంచ వరద స్థితిగతులు

ప్రపంచవ్యాప్తంగా మానవుల జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగించే విపత్తుల్లో అత్యంత విధ్వంసకర విపత్తు వరదలు. ప్రపంచ మొత్తం విపత్తు నష్టాల్లో అత్యధికంగా 30% ఈ వరదల వల్లే జరుగుతోంది. దీని తర్వాత స్థానంలో 21% నష్టం తుపాన్ల వల్ల ఏర్పడుతోంది. ‘ద హ్యూమన్‌ కాస్ట్‌ ఆఫ్‌ వెదర్‌ రిలేటెడ్‌ డిజాస్టర్‌’ పేరుతో ఐక్యరాజ్యసమితి వెల్లడించిన నివేదిక ప్రకారం 1995-2015 మధ్య ప్రపంచవ్యాప్తంగా వరదల వల్ల 230 కోట్ల మంది ప్రభావితమయ్యారు. 1,57,000 మంది  మరణించారు. మొత్తం జల, వాతావరణ విపత్తుల్లో ఈ నష్టం 56% మేర ఉంది.


ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ విపత్తు కుదింపు వ్యూహం (United Nations International Strategy for Disaster Reduction)’ రూపొందించిన గ్లోబల్‌ ఎసెస్‌మెంట్‌ రిపోర్ట్‌ 2011 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వరదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న   జనాభాలో 90% మంది దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్‌ దేశాల్లోనే ఉన్నారు. ఇందులో దక్షిణాసియా దేశాల్లో భారత్, బంగ్లాదేశ్‌లు ఎక్కువ ప్రభావానికి గురవుతున్నాయి. గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా వరద ప్రభావాన్ని ఎదుర్కొన్న దేశాలు చైనా, ఇండియా, బంగ్లాదేశ్, జర్మనీ, పోలండ్, మొజాంబిక్, అమెరికా వరుస   క్రమంలో ఉన్నాయి. 


ప్రపంచ వ్యాప్తంగా వివిధ వర్గాల వరద బాధితులు:  

 

* అల్పాదాయం ఉన్నవారు  50% 

* దిగువ మధ్యస్థాయి ఆదాయం ఉన్నవారు  26%  

*  అధిక మధ్యస్థాయి ఆదాయం ఉన్నవారు  23%  

* అధిక ఆదాయం ఉన్నవారు - 1%


భారతదేశంలో వరదలు

* ప్రపంచ మొత్తం వరద మరణాల్లో 1/5 (20%) మన దేశంలోనే సంభవిస్తున్నాయి. భారత్‌లో మొత్తం విపత్తు నష్టంలో 52% వరదల వల్లే జరుగుతోంది.


* దేశ వైశాల్యంలో 40 మిలియన్‌ హెక్టార్ల భూమి వరద ప్రభావానికి గురవుతోంది. ఇది దేశ వైశాల్యంలో 12%. (బిల్డింగ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ప్రకారం)


* దేశంలో ఉత్తర, ఈశాన్య ప్రాంతాలు ఏటా వరద ముప్పు ఎదుర్కొంటున్నాయి.


* దేశంలోని అన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా గంగా, బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాలు వరద పీడిత   ప్రాంతాలుగా ఉన్నాయి. 


* ఉద్ధృతిపరంగా చూస్తే ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఎక్కువగా వరదల బారిన పడుతున్నాయి.


* వరదల వల్ల దేశంలో ఏటా 40 లక్షల టన్నుల వడ్లు నీటిపాలవుతున్నాయని అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం (IRRI) వివరించింది.


* 1953 - 2009 మధ్య గమనిస్తే భారతదేశంలో వరదల వల్ల ఏటా సగటున రూ.1650 కోట్ల నష్టం మేర వాటిల్లింది. సగటున 1,464 మంది మరణిస్తున్నారు. 86,288 పశువులు చనిపోతున్నాయి.


వరద ముప్పు ప్రాంతాలు:  ప్రపంచంలో అత్యధిక వరద ముప్పు ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. ఇక్కడి వరదలకు రుతుపవన కాలాల్లో తక్కువ కాలంలో ఎక్కువ వర్షం కురవడం, అధిక పూడిక ఉన్న నదులు, వాలైన హిమాలయ పర్వత శ్రేణులు లాంటివి ముఖ్యమైన కారణాలు.   


గంగా నదీ పరీవాహక ప్రాంతం: దేశంలో వరద దుర్బలత్వం ఉన్న ప్రాంతాల్లో ఇది ప్రధానమైంది. అందులోనూ గంగా పరీవాహకంలోని ఉత్తర భాగం ఉపనదుల    కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో శారద, గాగ్రా నదుల వల్ల; బిహార్‌లో కోసీ, గండక్‌ నదుల వల్ల ఎక్కువగా వరదలు సంభవిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో దక్షిణ భాగంలో దామోదర్, జయ నదులు, వాటి ఉపనదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి.


బ్రహ్మపుత్ర, బరాక్‌ నదుల పరీవాహక ప్రాంతం: ఈ నదులు, వాటి ఉప నదులతో అస్సాం ఎక్కువగా వరదలకు గురవుతోంది. ఈ పరీవాహక ప్రాంతంలో పశ్చిమ బెంగాల్‌ ఉత్తర భాగంలో జల్దాకా, తీస్తా, తోర్సా నదులు వరదలకు కారణమవుతున్నాయి. అలాగే మణిపుర్‌లో తిలాంగ్, నంబుల్, చప్కి, తోబుల్‌ నదులు, అధిక వర్షాల వల్ల ఇంఫాల్‌లో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.


వాయవ్య నదీ పరీవాహక ప్రాంతం: భారత వాయవ్య ప్రాంతంలో జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్, గగ్గర్‌ నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి.


మధ్య భారత్, దక్కన్‌ పరీవాహక ప్రాంతం: ఈ ప్రాంతంలో గోదావరి, కృష్ణా, కావేరి, పెన్న, తుంగభద్ర, నర్మద మొదలైన నదుల పరీవాహక ప్రాంతాలు, ఒడిశాలోని   మహానది, బైతరణి, బ్రహ్మణి నదీ పరీవాహక ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి.

 

తెలుగు రాష్ట్రాల్లో వరదల స్వభావాలు

దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే పెద్ద  ఎత్తున ప్రాణ, ఆస్తి, పంట నష్టాలకు వరదలు కారణమవుతున్నాయి.

* తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో వరదల దుర్బలత్వం ఎక్కువ. గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా నదులు సముద్రంలో కలిసే నదీ ముఖ ద్వారాల్లో డెల్టా మైదానాలు ఏర్పడి, అవి విశాలంగా, పాయలుగానూ చీలిపోయి ప్రవహిస్తున్నాయి.

* ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద నదుల డెల్టాలతోపాటు చిన్న నదులు, వాగులు పొంగడం వల్ల, కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాలు రుతువుల కాలంలో వరదల్లో మునిగిపోతున్నాయి.

* గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ వైపు కచ్చితమైన, స్థిరమైన ప్రవాహ మార్గాలు కలిగి ఉండటం, మానవ నిర్మిత ఆనకట్టలు వరద నీటిని సక్రమంగా మోసుకెళ్లడం వల్ల వరదల ప్రభావం అంతగా లేదు. అయినప్పటికీ తెలంగాణలో గోదావరి పరీవాహక మార్గంలో నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు; ప్రాణహిత మార్గంలో ప్రస్తుత కొమురం భీమ్‌ జిల్లా రుతుపవనాల కాలంలో వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి.

 

వరదలపై అధ్యయనం: జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (GSI) ముంపునకు గురవుతున్న భూమి ఆకారాన్ని, పరీవాహక ప్రాంతం (హరివాణం) వైశాల్యం, నేల వాలు, మురుగు నీటిపారుదల వ్యవస్థ లాంటి వాటిపై సమాచారాన్ని సేకరించి వరద దుర్బలత్వ మ్యాపులను తయారు చేస్తుంది. 

Posted Date : 11-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వ‌ర‌ద‌ల విప‌త్తు

మాదిరి ప్రశ్నలు


1. ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే వరదలతో ఏ వర్గం వారు అధికంగా ప్రభావితమవుతున్నారు?

1) అధిక ఆదాయం గలవారు    2) అల్ప ఆదాయం గలవారు

3) తక్కువ మధ్య ఆదాయం గలవారు   4) అధిక మధ్య ఆదాయం గలవారు


2. దేశ మొత్తం వైశాల్యంలో వరద దుర్బలత్వం ఉన్న భూమి ఎంత?

1) 12%  2) 85%  3) 68%  4) 56%


3. దేశ మొత్తం వర్షంలో నైరుతి రుతువులో (జూన్‌ - సెప్టెంబర్‌ మధ్య) ఎంత వర్షం కురుస్తుంది?

1) 75%  2) 85%  3) 50%  4) 20%


4. దేశంలో వరదల స్థితి కింది విధంగా ఉంది?

1) దేశంలో పెద్ద నదుల ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి.

2) దేశంలో చిన్న నదుల ప్రాంతంలో వరదలు సంభవిస్తున్నాయి.

3) దేశంలో దాదాపు అన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి.

4) తూర్పునకు వెళ్లే నదులు మాత్రమే వరదలకు కారణమవుతున్నాయి.


5. ఉద్ధృతిపరంగా వరదలు ఎక్కువ సంభవించే రాష్ట్రాలు వరుసగా?

1) ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, అస్సాం 

2) ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌

3) బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, అస్సాం 

4) అస్సాం, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌


6. దేశంలో పెద్ద విపత్తు ఏది?

1) భూకంపాలు  2) తుపాన్లు  3) కరవు  4) వరదలు


7. ప్రపంచంలో విపత్తుల జాబితాలో జల, వాతావరణ విపత్తుల గ్రూపులో కింది ఏ విపత్తు ఎక్కువ ప్రభావవంతమైంది?

1) సునామీలు  2) కరువు  3) వరదలు  4) తుపాన్లు


8. గ్లోబల్‌ అసెస్‌మెంట్‌ రిపోర్ట్‌ ప్రకారం 90% వరద బాధితులు ఏ ప్రాంతాల్లో ఉన్నారు?

1) దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిపిక్‌ దేశాల్లో

2) దక్షిణాసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాల్లో

3) ఆసియా, ఆఫ్రికా దేశాల్లో

4) ఆసియా, ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు


9. భారత్‌లో కింది ఏ ప్రాంతం ఎక్కువగా వరదలకు గురవుతుంది?

1) ఉత్తర వాయవ్య ప్రాంతం  2) ఉత్తర, ఈశాన్య ప్రాంతం

3) ఉత్తర, దక్షిణ ప్రాంతం  4) ఈశాన్య ఆగ్నేయ ప్రాంతం


10. భారత ప్రభుత్వం జాతీయ వరదల నిర్వహణ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది?

1) 1954  2) 1952  3) 1986  4) 1994

 

సమాధానాలు: 1-2; 2-1; 3-1; 4-3; 5-1; 6-4; 7-3; 8-1; 9-2; 10-1.

 

ర‌చ‌యిత‌: జ‌ల్లు స‌ద్గుణ‌రావు

Posted Date : 11-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సహజ వనరులు - పరిరక్షణ

వాడుకుంటూ.. కాపాడుకుంటూ!


ఎంత ఉపయోగించుకున్నా తరగదు గాలి. తవ్విన కొద్దీ తగ్గిపోతుంది బొగ్గు. అవి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు. జీవుల మనుగడకు మూలాధారాలు. వాటిని సక్రమంగా వాడుకొని ఆదిమానవుడు ఆరోగ్యంగా జీవిస్తే, విచక్షణారహితంగా వినియోగించుకుంటూ ఆధునిక జీవుడు పర్యావరణానికి ప్రమాదకరంగా మారాడు. స్థిరమైన అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణ తప్పనిసరని ప్రపంచం గుర్తించింది. అందుకే వనరులను సరైన రీతిలో వాడుకుంటూ, కాపాడుకుంటూ ఉండాలని ప్రకటించింది. పర్యావరణాంశాల అధ్యయనంలో భాగంగా సహజ వనరులు, రకాలు, క్షీణత తదితర అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.  
 


మానవుడికి అవసరమైన వస్తుసేవల ఉత్పత్తికి ఉపయోగపడే పదార్థాలు, శక్తి లాంటి వాటిని సహజవనరుల రూపంలో ప్రకృతి ప్రసాదిస్తోంది. ఆవరణ వ్యవస్థలు, జీవ రాశులు తమ విధులను నిర్వహించడానికి, మానవ సమాజాల సాంఘిక, ఆర్థిక నాగరికతల మనుగడకు కావాల్సిన శక్తిని అందించే వనరులనే సహజ వనరులు అంటారు. వివిధ ప్రామాణికతల ఆధారంగా వాటిని విభజించవచ్చు.


లభ్యతను అనుసరించి!

లభ్యతను అనుసరించి వనరులను వర్గీకరించారు. 

జీవ వనరులు: జీవావరణంలో ప్రాణం ఉండే అడవులు, జంతువులు, అనేక జీవజాతులే జీవ వనరులు. వృక్షాలు, జంతువులు మిలియన్ల సంవత్సరాల క్రితం నశించి, రూపాంతరం చెందడం వల్ల ఏర్పడిన బొగ్గు, చమురు, సహజ వాయువు లాంటి శిలాజ ఇంధనాలు జీవ వనరుల తెగకు చెందినవి.

నిర్జీవ వనరులు: జీవం లేని అనుఘటకాలు, సేంద్రియ పదార్థాల నుంచి లభించే వనరులే నిర్జీవ వనరులు. భౌతికపరమైన గాలి, నీరు, నేల లాంటివి ఈ వనరుల కోవకే చెందుతాయి. కాంతి, ఉష్ణం, వర్షపాతం తదితర శీతోష్ణస్థితి సంబంధితాలూ నిర్జీవ వనరులే. సేంద్రీయపరమైన కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, లిపిడ్స్‌ను కూడా జీవరహిత వనరులుగానే పరిగణిస్తారు నిరేంద్రియపరమైన సోడియం, కాల్షియం, ఫాస్ఫరస్‌ లాంటి రసాయనాలు నిర్జీవ వనరుల కిందకే వస్తాయి. 


 పునరుత్పత్తి సామర్థ్యాన్ని బట్టి!

మళ్లీ ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఆధారంగా వనరులను వర్గీకరించారు. 

పునరుద్ధరించగలిగే సహజ వనరులు: వినియోగిస్తున్నప్పటికీ తిరిగి ఉత్పత్తి చెందే సామర్థ్యం ఉన్నవి, మానవ ప్రయత్నాల ద్వారా కొత్తగా ఉత్పత్తి చేయగలుగుతున్న వనరులను పునరుత్పత్తి చెందే సహజ వనరులుగా భావించవచ్చు. ఇవి సాధారణంగా కాలుష్యరహితమైనవి. అందువల్ల వీటిని హరిత ఇంధనాలు అని పిలుస్తారు.

ఉదా: అటవీ వనరులు, పంట పొలాలు, జీవజాతుల ఉత్పత్తి, జలవనరులు, సౌరశక్తి, పవనశక్తి, ఓషన్‌ ఎనర్జీ, జియో థర్మల్‌ ఎనర్జీ, జలవిద్యుత్తు లాంటివి.

పునరుద్ధరించలేని సహజ వనరులు: ఈ వనరులు వినియోగించే కొద్దీ తరిగిపోతుంటాయి. వీటికి పునరుత్పత్తి సామర్థ్యం ఉండదు. మానవ ప్రయత్నం ద్వారా పునరుద్ధరించడం వీలు కాదు. ఇవి కాలుష్య కారకాలు. ప్రస్తుతం ఎక్కువ వినియోగంలో ఉన్నాయి.

ఉదా: శిలాజ ఇంధనాలు (బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, సహజ వాయువు రూపాంతరాలైన షెల్‌ గ్యాస్, గ్యాస్‌ హైడ్రేట్స్, కోల్‌బెడ్‌ మీథేన్‌), అణు ఇంధన   వనరులు (యురేనియం, థోరియం, ప్లుటోనియం) ప్రస్తుతం మానవుని జీవన గమనాన్ని యంత్ర శక్తి, సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యమే నిర్దేశిస్తున్నాయి. కానీ వాటిని నడిపించడానికి ఇంధనశక్తి తప్పనిసరి. ఆ ఇంధన వనరుల్లో నూతన పోకడలు, విధానాల్లో అనేక మార్పులు కాలానుగుణంగా సంభవిస్తూనే ఉన్నాయి. వినియోగించే కాలం ఆధారంగా వాటిని వివిధ రకాలుగా విభజించవచ్చు.

1) సంప్రదాయ ఇంధన వనరులు: అనాదిగా మానవుడు వినియోగిస్తున్న ఇంధన వనరులివి. ఉదా: బొగ్గు, డీజిల్, సహజ వాయువు ఆధారంగా ఉత్పత్తి చేసే థర్మల్‌ విద్యుత్తు, జల విద్యుత్తు, అణుశక్తి; చోదక శక్తి కోసం వాడే ముడిచమురు, సహజ వాయువు లాంటివి. వీటిలో జల విద్యుత్తు మాత్రమే  పునరుత్పాదక ఇంధన వనరు.

2) సంప్రదాయేతర ఇంధన వనరులు: ఇవి ఇటీవల కాలంలో అభివృద్ధి చేసిన, అధిక ప్రాచుర్యం పొందిన ఇంధన వనరులు. వీటిని మళ్లీ రెండు రకాలుగా పేర్కొంటున్నారు.

ఎ) పునరుత్పాదక ఇంధన వనరులు: సౌర శక్తి, పవన శక్తి, బయో గ్యాస్, బయో డీజిల్, బయోమాస్‌ పవర్, బయో ఇథనాల్, చిన్న  తరహా జలవిద్యుత్తు, బగస్సీ - కోజనరేషన్‌ లాంటి తిరిగి ఉత్పత్తి చేయగలిగే శక్తి వనరులు.

బి) నవీన శక్తి వనరులు: ఇటీవలి కాలంలో సాంకేతిక సామర్థ్యంతో తయారై, వినియోగంలోకి వస్తున్న శక్తివనరులు.

ఉదా: హైడ్రోజన్‌ శక్తి, జియో థర్మల్‌ శక్తి, టైడల్‌ ఎనర్జీ, సీవేవ్‌ ఎనర్జీ, ఓషన్‌ థర్మల్‌ గ్రేడియంట్‌ ఎనర్జీ, షెల్‌ గ్యాస్, కోల్‌బెడ్‌ మీథేన్, గ్యాస్‌ హైడ్రేట్స్, బ్యాటరీలతో నడిచే వాహనాలు వంటివి.


అధిక వినియోగంతో క్షీణత

ఆదిమానవుడు అందుబాటులో ఉన్న సహజ వనరులను సహజ జీవనానికి మాత్రమే వినియోగించుకుని మంచి వాతావరణంలో ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడిపేవాడు. కానీ ఆధునిక మానవుడు అమూల్యమైన సహజ వనరులను విచక్షణారహితంగా వినియోగిస్తూ, ప్రమాదకరమైన వాతావరణంలో దుర్భర జీవితాన్ని సాగిస్తున్నాడు. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతి క్షీణించకుండా పరిరక్షించాల్సిన  ఆవశ్యకతను ఐక్యరాజ్యసమితి ‘వరల్డ్‌ ఛార్టర్‌ ఆఫ్‌ నేచర్‌ 1982’లో గుర్తించింది. వ్యక్తి స్థాయి నుంచి, అంతర్జాతీయ స్థాయి వరకూ అన్ని స్థాయుల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పింది. స్థిరమైన వృద్ధిని సాధించడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి చట్టాల్లో పర్యావరణ పరిరక్షణను పొందుపరచాలని ఈ చార్టర్‌ వివరించింది.

సహజ వనరుల పరిరక్షణ విధానాలు: పునరుద్ధరించగలిగిన, పునరుద్ధరించలేని వనరుల వృద్ధి రేటు కంటే వినియోగ రేటు ఎక్కువగా ఉంటే దాన్ని సహజవనరుల క్షీణతగా పరిగణించవచ్చు. అది వ్యవసాయం, చేపల వేట, గనుల తవ్వకం, నీరు, శిలాజ ఖనిజాల వినియోగం లాంటి వాటిల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల వనరుల నిర్వహణలో మూడు ప్రక్రియలు పాటించాలి. 

1) తగ్గించడం (Reduce): వీలైనంత వరకూ సహజ వనరుల వాడకాన్ని తగ్గించాలి. అనవసరంగా వాడకూడదు.

ఉదా: విద్యుత్తు వాడకం, నీటి వాడకం లాంటివి.

2) పునఃచక్రీయం (Recycle): సహజ వనరులపై ఒత్తిడి తగ్గించడానికి అప్పటికే వినియోగించడం ద్వారా లభించిన వేస్ట్‌ పేపర్, ప్లాస్టిక్, గ్లాస్‌ లాంటి పదార్థాలను పునరుత్పత్తి చేసి వినియోగించవచ్చు.

3) తిరిగి ఉపయోగించడం (Reuse): పచ్చళ్లకు, జామ్‌లకు వాడిన గాజు, ప్లాస్టిక్‌ బాటిళ్లను బయట పారేయకుండా తిరిగి వినియోగించవచ్చు. వార్తాపత్రికలను చదివిన తర్వాత ప్యాకింగ్‌ చేయడానికి వాడవచ్చు. ఈ విధంగా వాడిన వస్తువులనే మళ్లీ, మళ్లీ వినియోగించడం వల్ల సహజ వనరుల వృద్ధి, పరిరక్షణ సాధ్యమవుతుంది.


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో సంప్రదాయ ఇంధన వనరు కానిది ఏది?

1) బొగ్గు       2) అణువిద్యుత్‌      3) జలవిద్యుత్‌        4) కోల్‌బెడ్‌ మీథేన్‌

జ: 4

 


2. సహజ వనరుల పరిరక్షణ విధానాల్లో వరుస క్రమం ఏది?

  1) రెడ్యూస్‌ - రీసైకిల్‌ - రీయూజ్‌        2) రీసైకిల్‌ - రెడ్యూస్‌ - రీయూజ్‌ 

  3) రెడ్యూస్‌ - రీయూజ్‌ - రీసైకిల్‌        4) రీసైకిల్‌ - రీయూజ్‌- రెడ్యూస్‌ 

జ: 1

 

3. కిందివాటిలో కన్వెన్షనల్‌ శక్తి వనరు ఏది?

  1) జీవ ఇంధనాలు    2) సౌర శక్తి        3) జలవిద్యుత్‌       4) పవన శక్తి 

జ: 3

 

4. కిందివాటిలో సంప్రదాయేతర శక్తి వనరు ఏది?

  1) బయోగ్యాస్‌      2) సౌరశక్తి         3) టైడల్‌ శక్తి      4) పైవన్నీ

జ: 4 

 

5. కిందివాటిలో పునరుత్పాదక శక్తి వనరు కానిది?

  1) సౌర విద్యుత్‌       2) పవన విద్యుత్‌      3) ఓషన్‌ థర్మల్‌ ఎనర్జీ  4) ఏదీకాదు

జ: 4

 

6. సహజ వనరుల క్షీణత అంటే?

1) సహజ వనరుల పునరుద్ధరణ కంటే వాటి  వినియోగం ఎక్కువగా ఉండటం

2) సహజ వనరుల పునరుద్ధరణ కంటే వాటి వినియోగం తక్కువగా ఉండటం

3) సహజ వనరుల వినియోగం కంటే వాటి పునరుద్ధరణ ఎక్కువగా ఉండటం

4) ఏదీకాదు

జ: 1

 

7. కిందివాటిలో నవీన శక్తి వనరు ఏది?

  1) హైడ్రోజన్‌ ఎనర్జీ    2) టైడల్‌ ఎనర్జీ     3) సీవేవ్‌ ఎనర్జీ       4) పైవన్నీ

జ: 4

 

8. కిందివాటిలో సరికానిది?

1) ముడి చమురు సంప్రదాయ, పునరుత్పత్తి చెందని వనరు. 

2) పవన శక్తి సంప్రదాయేతర, పునరుత్పత్తి చెందే వనరు.

3) జియోథర్మల్‌ శక్తి నవీన, పునరుత్పత్తి చెందే వనరు.

4) సహజ వాయువు సంప్రదాయ, పునరుత్పత్తి చెందే వనరు.

జ: 4

 

9. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

   1) 1890       2) 1986      3) 1980        4) 1952

జ: 2

రచయిత: జల్లు సద్గుణరావు 

Posted Date : 27-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కరవు

పట్టి పీడించే కాటకం!

 

కావాల్సినంత కురవని వర్షం, బీటలు వారిన భూములు, అడుగంటిన చెరువులు, ఎండిపోయిన పంటలు, నిస్సారమైన నేలలు, వీటి ప్రభావంతో వస్తుసేవలు అందక జనం పడే ఇబ్బందులు. ఇదే విపత్తు. సమాజ పురోగతిని కుంగదీసే ప్రకృతి విపరిణామం. ఇలాంటి కాటక పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయి? నివారించే మార్గాలు ఏమిటి? తదితర అంశాలను ‘విపత్తు నిర్వహణ’ అధ్యయనంలో భాగంగా పరీక్షార్థులు తెలుసుకోవాలి.

  

 

ఒక భౌగోళిక ప్రాంతంలో సాధారణ పరిస్థితులకు భిన్నంగా కొంతకాలం వరకూ పూర్తిగా వర్షం లేకపోవడం లేదా అల్ప వర్షపాతం ఉండవచ్చు. ఇది శీతోష్ణస్థితి సాధారణ లక్షణం. దీనివల్ల నీరు, ఆహారం, పశుగ్రాసం కొరత ఏర్పడటం, ఉపాధి అవకాశాలు కొరవడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితినే కరవు లేదా దుర్భిక్షం అని పిలుస్తారు. ఈ వైపరీత్యంతో వ్యవసాయదారులతోపాటు మొత్తం సమాజం కూడా ఇబ్బందులకు గురవుతుంది. 


ప్రధాన కారణాలు: 

* దేశంలో రుతుపవనాలు అసమానంగా విస్తరించడం.

* మానవ అభివృద్ధి వల్ల వృక్షసంపద దెబ్బతిని నీరు భూమిలో ఇంకకపోవడం.

* అధిక జనాభా వల్ల నీటివనరులపై ఒత్తిడి పెరగడం.

* పట్టణీకరణ పెరగడంతో నీటి నిల్వ ప్రాంతాలు, నీటివనరుల పరీవాహక ప్రదేశాలు ఆక్రమణకు గురవడం.

* నీటి అవసరాలు, నిర్వహణ గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం.

 

నాలుగు రకాలు

భారత వ్యవసాయ కమిషన్‌ కరవును నాలుగు రకాలుగా విభజించింది.

వాతావరణ సంబంధ కరవు: ఒక ప్రదేశంలో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు సంభవించే కరవును వాతావరణ సంబంధ కరవుగా పేర్కొనవచ్చు. ఇలాంటి కరవు కారణంగా మిగతా కరవులు ఏర్పడతాయి. ఇది అన్ని కరువుల్లోనూ అతి తీవ్రమైంది.


జల సంబంధ కరవు: చాలాకాలం పాటు ఏర్పడే వాతావరణ కరవు కారణంగా భూఉపరితలంపైన, భూగర్భంలో నీటివనరుల లభ్యత తగ్గిపోవడాన్ని జలసంబంధ కరవుగా నిర్వచించవచ్చు.


వ్యవసాయ సంబంధ కరవు: జలసంబంధ కరవు ఎక్కువ కాలం కొనసాగితే మృత్తికల్లో తేమ తగ్గిపోయి మొక్కలు, పంటలు ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడలేని స్థితిని వ్యవసాయ సంబంధ కరవుగా భావించవచ్చు.


సామాజిక - ఆర్థిక కరవు: పై మూడు రకాల కరవులతో పాటు వస్తువులు, సేవల సరఫరా డిమాండ్‌పైన ప్రభావం చూపడాన్ని సామాజిక - ఆర్థిక కరవుగా పిలుస్తారు. ఇది సమాజంలోని ప్రతి వ్యక్తిపైనా ప్రభావం చూపుతుంది.


ఎలా కొలుస్తారు?


1) కరవు ఆరంభం: ఒక ప్రదేశంలో సాధారణ వర్షపాతంలో 25 శాతం తగ్గడం లేదా ఉండాల్సిన వర్షపాతంలో 75 శాతం వరకే నమోదైతే కరవు మొదలైనట్లు పరిగణిస్తారు.


2) మిత కరవు: సాధారణ వర్షపాతంలో 26% నుంచి 50% వరకు తగ్గడం లేదా ఉండాల్సిన వర్షపాతంలో 50% వరకు మాత్రమే కురిస్తే మిత కరవుగా పిలుస్తారు.


3) తీవ్ర కరవు: సాధారణ వర్షపాతంలో 50% కంటే తగ్గితే తీవ్ర కరవుగా వ్యవహరిస్తారు. మన దేశంలో వాయవ్య ప్రాంతంలో బలహీన రుతుపవనాల వల్ల, పర్యావరణం దెబ్బతినడంతో అతి తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడుతుంటాయి.


ప్రపంచ స్థితిగతులు


* ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం సహజ విపత్తుల్లో కరవు ద్వారా వచ్చే విపత్తు వాటా 19 శాతం ఉంటుంది. మొత్తంగా చూస్తే కరవు విపత్తు 3వ స్థానంలో ఉంది (మొదటి స్థానం వరదలు - 30%, రెండో స్థానం తుపాన్లు - 21%).

* ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ (యూఎన్‌డీఆర్‌ఆర్‌- జెనీవా) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అన్నిరకాల సహజ విపత్తు మరణాల్లో కరవు, దుర్భిక్షం వల్ల అత్యధికంగా 45%, ఆ తర్వాత వరదల కారణంగా 16% మరణాలు సంభవిస్తున్నాయి.

* వరల్డ్‌ బ్యాంక్, యూఎన్‌ఓ సంయుక్తంగా విడుదల చేసిన సహజ వైపరీత్యాలు, అసహజ వైపరీత్యాల నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం సంభవించే విపత్తులు వరదలు, తుపాన్లు. అయితే ఆఫ్రికా దేశాల్లో మాత్రం కరవు తరచూ సంభవిస్తుంది.  

 

భారత్‌లో కరవు పరిస్థితులు

ఏటా దేశంలో 5 కోట్ల మంది ప్రజలు కరవు ప్రభావానికి గురవుతున్నారు. మొత్తం 640 జిల్లాల్లో 191 జిల్లాలు తీవ్ర కరవు ముప్పు ఎదుర్కొంటున్నాయి. దేశంలో మొత్తం వ్యవసాయ భూమిలో 68% భూమి క్షామం బారిన పడుతోంది. ఇది దేశం మొత్తం భూమిలో 16%. శుష్క, అర్ధశుష్క మండలాల్లో దాదాపు 8-9 ఏళ్లకు ఒకసారి తీవ్ర, అసాధారణ కరవు ఏర్పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరవు ఏటా సర్వసాధారణం.

ఉదా: రాజస్థాన్‌లో అత్యధిక ప్రాంతాల్లో 2000, 2001, 2002, 2003లలో వరుసగా నాలుగేళ్లు కరవు తాండవించింది.


కరవు తీవ్రత ఆధారంగా భారత వ్యవసాయ కమిషన్‌ దేశాన్ని అయిదు ప్రాంతాలుగా విభజించింది.


1. వాయవ్య భారతదేశం: రాజస్థాన్‌ తూర్పు, పశ్చిమ ప్రాంతాలు; గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాలు; పంజాబ్, హరియాణా, చండీగఢ్, దిల్లీ ప్రాంతాలను ఇందులో చేర్చారు. ఇది దేశంలో ఎక్కువగా కరవు ఎదుర్కొనే ప్రాంతం.


2. పశ్చిమ, మధ్య భారతదేశం: మహారాష్ట్రలోని మరట్వాడా, విదర్భ, ఉత్తర కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ భాగాలు; కొంకణి, గోవా ప్రాంతాలు, తెలంగాణ ఇందులో ఉన్నాయి.


3. ద్వీపకల్ప భారతదేశం: ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలు.


4. మధ్య ఈశాన్య భారతదేశం: ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌లో తూర్పు, పశ్చిమ భాగాలు.


5. ఈశాన్య భారతదేశం: అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, త్రిపుర, హిమాలయాల దిగువనున్న పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాలు.

 

దేశంలో భూగర్భ జలాల వినియోగం ఆధారంగా రెండు ప్రాంతాలుగా విభజించారు.

డార్క్‌ జోన్‌: దేశంలో 40% ప్రాంతాన్ని డార్క్‌ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను 50% కంటే ఎక్కువగా తోడేశారు.

ఉదా: రాజస్థాన్‌లోని సరిష్కా జాతీయ పార్కు ప్రాంతం.

గ్రే జోన్‌ ప్రాంతం: దేశంలో 30% ప్రాంతం గ్రే జోన్‌లో ఉంది. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను అక్కడి వర్షపాతం కంటే ఎక్కువ పరిమాణంలో తోడేస్తుంటారు.

 

కరవు తీవ్రతను తగ్గించే చర్యలు: * వర్షం నీటిని సరైన మార్గాల్లోకి మళ్లించే విధానాలు (వాటర్‌ హార్వెస్టింగ్‌) పాటించాలి.

* దేశంలో ఉత్తర భారత నదులను, దక్షిణ భారత నదులను కాల్వల ద్వారా అనుసంధానించాలి.

* గుజరాత్‌లో ఝలరా, రాజస్థాన్‌లోని బోలిస్‌ లాంటి మెట్ల బావుల విధానం, చెరువుల నిర్మాణం లాంటి సంప్రదాయ జలసంరక్ష పద్ధతులను ప్రోత్సహించాలి.

* ప్రజల్లో కరవుపై అవగాహన కల్పించాలి.

* వర్షపాతం, జలాశయాలు, సరస్సులు, నదులు లాంటి వాటిలో నీటి లభ్యతను గమనిస్తూ సరైన నీటి పర్యవేక్షణ చేపట్టాలి.

* పొలాల నుంచి వృథాగా పోతున్న నీటిని వ్యవసాయ కుంటల్లాంటి ఉమ్మడి జలాశయాల్లోకి చేరేలా చూడాలి.

* ముందుగానే కరవు ప్రణాళికను తయారు చేసుకోవాలి.

* కరవు ప్రాంతంలో జీవనోపాధి ప్రణాళికలు, పంటల బీమా పథకాలు అమలు చేయాలి.


మాదిరి ప్రశ్నలు


1. అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?

1) హైదరాబాద్‌     2) బెంగళూరు     3) ఇందౌర్‌     4) కోల్‌కతా

జ: హైదరాబాద్‌

 

2. ఝలరా, బోలిస్‌ అనే సంప్రదాయ నీటి సంరక్షణ విధానాలు కింది వాటిలో దేనికి చెందుతాయి? 

1) చెరువులు    2) మెట్ల బావులు    3) ఆనకట్టలు    4) నీటి కాలువలు

జ: మెట్ల బావులు

 

3. ఇంటి పైకప్పు నుంచి జారే వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం దేనికి ఉదాహరణ?

1) వాటర్‌షెడ్‌ విధానం       2) రైన్‌ షాడో విధానం

3) రైన్‌ ప్రిసిపిటేషన్‌ విధానం      4) వాటర్‌ హార్వెస్టింగ్‌ విధానం

జ: వాటర్‌ హార్వెస్టింగ్‌ విధానం

 

4. భారతదేశ వ్యవసాయ భూమిలో కరవు భూమి ఎంత?

1) 38%      2) 68%      3) 48%      4) 28%

జ:  68%

 

5. భూగర్భ జలాలను 50% కంటే ఎక్కువగా వాడేసే ప్రాంతాలను ఏ జోన్‌గా నిర్ణయించారు?

1) డార్క్‌ జోన్‌     2) గ్రే జోన్‌     3) ఎల్లో జోన్‌      4) రెడ్‌ జోన్‌

జ: డార్క్‌ జోన్‌

 

6. సాధారణ వర్షపాతంలో ఎంత శాతం తగ్గితే కరవుగా భావిస్తారు? 

1) 25% వరకు    2) 50% వరకు    3) 75% వరకు    4) 10% వరకు

జ: 50% వరకు

 

7. ప్రపంచ సహజ విపత్తుల్లో కరవు విపత్తు వాటా ఎంత?

1) 50%      2) 19%      3) 5%          4) 80%

జ: 19%

 

8. మహారాష్ట్రలో రాలెగావ్‌ సిద్ధి గ్రామంలో కరవును పారదోలిన అనుసంధానకర్త, సామాజిక కార్యకర్త ఎవరు?

1) అన్నాహజారే     2) రాజేంద్రసింగ్‌      3) మేధాపాట్కర్‌      4) పాలేకర్‌

జ: అన్నాహజారే

 

9. దేశంలో కరవు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం.

1) మధ్య భారతదేశం        2) ఈశాన్య భారతదేశం

 3) వాయవ్య భారతదేశం       4) హిమాలయ ప్రాంతం

జ: వాయవ్య భారతదేశం
 

10. భారత వ్యవసాయ పరిశోధనా మండలి కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?

1) దిల్లీ      2) ముంబయి      3) బెంగళూరు      4) కోల్‌కతా

జ: దిల్లీ

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 16-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అటవీ వనరులు - సంరక్షణ

తరగని సంపదకు.. తరాల సంక్షేమానికి!

 

భూగోళమనే శరీరానికి అడవులే ఊపిరితిత్తులు. అవి వాయు కాలుష్యాన్ని నివారించి జీవరాశికి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారాన్ని అందిస్తాయి. అత్యంత విలువైన, ఎన్నటికీ తరిగిపోని ఆ సహజ సంపదను అందరూ కాపాడుకోవాలి. వనాలు క్షీణించే కొద్దీ కాలుష్యం, భూతాపం పెరిగిపోతాయి. వర్షాలు గతి తప్పుతాయి. దాంతో ఆహార సంక్షోభం సంభవిస్తుంది. అలాంటి సమస్యల నిరోధానికి, భవిష్యత్తు తరాల సంక్షేమానికి అడవులను రక్షించుకోవడం చాలా అవసరం. అందుకే మన దేశంలో అడవుల స్థితిగతులు, వాటిలో రకాలు, సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలను కాబోయే ప్రభుత్వ ఉద్యోగులు తెలుసుకోవాలి.

 

 

ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపదలో అడవులు, ఉద్భిజ్జ సంపద అత్యంత ప్రధానమైనవి. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో సహజసిద్ధంగా పెరిగే వృక్షాలను అడవులుగా భావిస్తే, వాటితో పాటు ఉండే గడ్డి మైదానాలు, పొదలు, మొక్కలు, లతలు అన్నింటినీ కలిపి ఉద్భిజ్జ సంపదగా పరిగణిస్తారు. ఫారెస్ట్‌ అనే పదం ఫోరెస్‌ (Fores) అనే లాటిన్‌ పదం నుంచి పుట్టింది. అడవులు పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా, మానవుడి ఆర్థిక, సామాజిక అవసరాలను తీరుస్తున్నాయి. మన దేశంలో 1987 నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి అడవుల లెక్కలను ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సేకరిస్తోంది. 2021లో సేకరించిన 17వ ఇండియన్‌ స్టేట్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ ప్రకారం (ISFR) దేశంలో 7,13,789 చ.కి.మీ. (71.37 మిలియన్ల హెక్టార్లు) మేర అడవులున్నాయి. దేశ వైశాల్యంలో 21.71% విస్తరించాయి. 2019 నాటి ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ లెక్కలతో పోలిస్తే 1,540 చ.కి.మీ. మేర అడవులు పెరిగాయి. ఈ పెరుగుదల అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో, ఆ తర్వాత తెలంగాణ, ఒడిశాలలో ఉంది.

 

విస్తరణ స్థితిగతులు

మన దేశ అడవులు ప్రపంచ అడవుల్లో 2% మాత్రమే ఉన్నప్పటికీ 10వ స్థానంలో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ వారి గ్లోబల్‌ ఫారెస్ట్‌ రిసోర్సెస్‌ అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యధిక అడవులు ఉన్న దేశాలు వరుసగా 1) రష్యా 2) బ్రెజిల్‌ 3) కెనడా.

దేశంలో అడవులు అత్యధికంగా విస్తరించిన రాష్ట్రం మధ్యప్రదేశ్‌ అయితే, అడవుల శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం మిజోరం.


అడవుల విస్తీర్ణం రాష్ట్రాల్లో..

అత్యధికం                       

1. మధ్యప్రదేశ్‌               

2. అరుణాచల్‌ప్రదేశ్‌       

3. ఛత్తీస్‌గఢ్‌                 

అత్యల్పం

1. హరియాణా

2. పంజాబ్‌

3. గోవా

             

కేంద్రపాలిత ప్రాంతాల్లో..

అత్యధికం                                

1. జమ్ము-కశ్మీర్‌                     

2. అండమాన్‌ నికోబార్‌ దీవులు    

3. లద్దాఖ్‌                               

అత్యల్పం

1. చండీగఢ్‌

2. లక్షదీవులు

3. పుదుచ్చేరి

 

అడవుల శాతం రాష్ట్రాల్లో..

అత్యధికం                               

1. మిజోరం (85%)               

2. అరుణాచల్‌ ప్రదేశ్‌ (79%)   

3. మేఘాలయ (76%)         

అత్యల్పం

1. హరియాణా (3.63%)

2. పంజాబ్‌ (3.67%)

3. రాజస్థాన్‌ (4.87%)

 

కేంద్రపాలిత ప్రాంతాల్లో...

అత్యధికం                               

1. లక్షదీవులు (90.33%)     

2. అండమాన్‌ నికోబార్‌ దీవులు (82%)    

3. జమ్ము-కశ్మీర్‌ (39%)    

అత్యల్పం

1. లద్దాఖ్‌ (1.35%)   

2. పుదుచ్చేరి (11%)

3. దిల్లీ (13%)

 

దేశంలో అడవుల ప్రాంతీయ వర్గీకరణను గమనిస్తే అత్యధిక శాతం అడవులు ద్వీపకల్ప పీఠభూమిపై (57%) ఉన్నాయి. హిమాలయాలపైన 18%; పశ్చిమ కనుమలు, పశ్చిమ తీరంలో 10%; తూర్పు కనుమలు, తూర్పు తీరంలో 10%; మిగిలిన 5 శాతం ఉత్తర మైదానాల మీద విస్తరించి ఉన్నాయి.


అడవుల్లో రకాలు 

సాధారణంగా అడవులు వర్షపాతం, గాలిలో తేమ, ఉష్ణోగ్రత, సముద్ర మట్టం నుంచి ఎత్తు వంటి వాటిపై ఆధారపడి పెరుగుతాయి. భారతదేశంలో అనేక నిమ్నోన్నతాలు, శీతోష్ణ స్థితిగతుల్లో ప్రాంతాల మధ్య వ్యత్యాసాల వల్ల వివిధ రకాల అడవులు విస్తరించి ఉన్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు భారతదేశ అడవులను ఎన్నో విధాలుగా విభజించినప్పటికీ సాధారణ అవగాహన కోసం దేశంలో అడవులను కింది విధంగా వర్గీకరించవచ్చు.

 

ఉష్ణ మండల సతతహరిత అరణ్యాలు: ఈ రకం దేశంలో 21 శాతం విస్తరించి ఉన్నాయి. ఇవి పెరగడానికి 200 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం, సముద్ర మట్టం నుంచి 500 - 1500 మీ. కంటే ఎత్తయిన ప్రాంతం కావాలి. అందువల్ల ఇవి పశ్చిమ కనుమల పశ్చిమ భాగాల్లోనూ, అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ, అండమాన్‌ - నికోబార్‌ దీవుల్లో విస్తరించి ఉంటాయి. ఈ అడవుల్లో మహాగని, ఎబోని, రోజ్‌వుడ్, సింకోనా, సేముల్, ఇరులా లాంటి పొడవైన కాండాలు, వెడల్పయిన ఆకులు, గట్టి కలపనిచ్చే చెట్లు పెరుగుతాయి.

 

ఉష్ణమండల ఆకురాల్చు అడవులు: మన దేశ అడవుల్లో ఈ రకం అత్యధికంగా 65 శాతం ఉన్నాయి. 100 - 200 సెం.మీ. వర్షపాతం, సముద్ర మట్టం నుంచి 500 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. కొండవాలులు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు వీటికి అనుకూలం. ద్వీపకల్పం మీద, అన్ని పీఠభూముల్లో, తూర్పు కనుమల వెంబడి శివాలిక్‌ హిమాలయాల్లోనూ, లక్షదీవులు, అండమాన్‌ నికోబార్‌ తూర్పు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లోనూ గట్టి కలప, వెడల్పు ఆకులుండే టేకు, మద్ది, సాల్, గంధపు చెట్లు, వెదురులాంటి వృక్ష సంపద ఉంటుంది.

 

ఉష్ణమండల పొదలు లేదా ఎడారి పొదలు: ఇవి ఎక్కువగా వాయవ్య భారత దేశంలోనూ, ద్వీపకల్పంలో కొండల తూర్పు భాగాల్లోని వర్షచ్ఛాయా ప్రాంతాల్లో 2% మేర విస్తరించి ఉన్నాయి. వీటికి 100 సెం.మీ. కంటే తక్కువ వర్షం సరిపోతుంది. ఇందులో తాటి, ఈత, కర్జూరం చెట్లు, బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి పొదలు, చిన్న ఆకులు, దళసరి ఆకులుండే వృక్ష సంపద పెరుగుతుంది. ఇవి బాష్పోత్సేకాన్ని నిరోధిస్తాయి. కాబట్టి వీటిని ‘జీరోఫైట్స్‌’ వృక్షసంపద అంటారు.

 

హిమాలయ పర్వత అడవులు: ఎత్తయిన హిమాలయాల్లో పెరిగే వృక్షసంపద. ఇవి మిగతా ప్రాంతాలతో పోలిస్తే మంచులో పెరిగే ఆల్ఫైన్‌ అడవులు, సమశీతల శృంగాకార అడవుల వృక్ష సంపద ఉంటాయి. ఉదా: విల్లో, ఆల్టర్, దేవదారు, ఓక్‌ సిల్వర్‌ పర్‌.

 

మడ అడవులు: ఇవి ఉప్పు నీరు కలిసిన డెల్టాలు, ఈస్చ్యురీల్లో (నదీముఖాలు) పెరుగుతాయి. వీటినే టైడల్‌ ఫారెస్ట్‌ లేదా క్షారజల అరణ్యాలు అంటారు. ఇవి మన దేశంలో 2% మాత్రమే ఉన్నాయి. సముద్రతీరం ఉన్న 9 రాష్ట్రాలు, అండమాన్‌-నికోబార్‌ దీవులు, పుదుచ్చేరి, దాద్రానగర్‌ హవేలి ప్రాంతాల్లో అక్కడక్కడా విస్తరించి ఉన్నాయి. ఇవి సునామీలకు సహజ అడ్డుగోడలుగా ఉపయోగపడతాయి. వీటికి శ్వాసవేళ్లు, కాండాలలో గాలి గదులు ఉంటాయి. వీటితో చేపల వేటకు వాడే సంప్రదాయ పడవలను ఎక్కువగా తయారు చేస్తుంటారు.


అటవీ సంరక్షణకు ప్రభుత్వ చర్యలు

* అటవీ చట్టం - 1927

* వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972

* పులిని జాతీయ జంతువుగా ప్రకటించిన సంవత్సరం - 1972

* మొదటిసారిగా పులుల సంరక్షణ ప్రాంతాలను ఏర్పాటు చేసిన సంవత్సరం - 1973

* అటవీ పరిరక్షణ చట్టం - 1980

* పర్యావరణ చట్టం - 1986

* జీవ వైవిధ్య చట్టం - 2002

* వన మహోత్సవ కార్యక్రమం - ప్రతి సంవత్సరం జులైలో

* 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అడవులను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఆదేశిక సూత్రాల్లో కూడా పొందుపరిచారు.

* సామాజిక అడవుల కార్యక్రమం - 1980-82


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో మడ అడవులు లేని రాష్ట్రం ఏది?

1) పశ్చిమ బెంగాల్‌     2) తమిళనాడు     3) ఆంధ్రప్రదేశ్‌       4) అస్సాం

జ: అస్సాం

 

2. అడవుల విస్తీర్ణం అత్యధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1) లద్దాఖ్‌      2) జమ్ము-కశ్మీర్‌      3) అండమాన్‌ - నికోబార్‌ దీవులు     4) లక్షదీవులు

జ: జమ్ము-కశ్మీర్‌

 

3. కింది ఏ అడవుల్లో జీవవైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది?

1) దట్టంగా పెరిగే సతతహరిత అరణ్యాలు 

2) గడ్డి భూములు ఎక్కువగా ఉండే ఆకురాల్చు అడవులు

3) ముళ్ల పొదలు ఎక్కువగా ఉండే ఎడారి పొదలు

4) హిమాలయాల్లోని అడవులు

జ: గడ్డి భూములు ఎక్కువగా ఉండే ఆకురాల్చు అడవులు

 

4. కోరింగ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఒడిశా      2) తమిళనాడు     3) కేరళ     4) ఆంధ్రప్రదేశ్‌

జ: ఆంధ్రప్రదేశ్‌

 

5. జాతీయ అటవీ విధాన తీర్మానం ప్రకారం దేశంలో ఎంత శాతం అడవులు ఉండాలి?

1) 33.3%     2) 23.3%    3) 43.3%     4) 53.3%

జ: 33.3%

 

6. ఫారెస్ట్‌ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది?

1) గ్రీకు      2) అరబ్బీ     3) లాటిన్‌      4) స్పానిష్‌

జ: లాటిన్‌

 

7. మన దేశంలో 90% కి మంచి అడవులు ఉన్న ప్రాంతం ఏది?

1) మిజోరం      2) లక్షదీవులు      3) అండమాన్‌ - నికోబార్‌      4) మధ్యప్రదేశ్‌

జ: లక్షదీవులు​​​​​​​

 

8. కింది ఏ దేశం మొదటిసారిగా అడవుల నరికివేతను నిషేధించింది?

1) డెన్మార్క్‌       2) నార్వే       3) అమెరికా      4) రష్యా

జ: నార్వే​​​​​​​

 

9. అడవి గాడిదల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?

1) కచ్, గుజరాత్‌     2) రాంచి, ఝార్ఖండ్‌     3) జోర్హాట్, అస్సాం    4) ఎర్నాకులం, కేరళ

జ: కచ్, గుజరాత్‌​​​​​​​

 

10. దేశంలో అత్యల్పంగా అడవులున్న రాష్ట్రం?

1) పంజాబ్‌       2) హరియాణా      3) రాజస్థాన్‌        4) సిక్కిం

జ: హరియాణా​​​​​​​


రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 25-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప‌ర్యావ‌ర‌ణ ఉద్యమాలు

  పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యాలుగా తెలంగాణలో పలు సామాజిక ఉద్యమాలు జరిగాయి. వీటిలో నల్గొండ జిల్లాలో యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా.. రాజధాని నగరంలో మూసీ నది ప్రక్షాళన దిశగా నిర్వహించిన ఉద్యమాలు ప్రధానమైనవి. స్థానికుల నుంచి వ్యక్తమైన నిరసనలు ఉద్యమాలుగా మారాయి. వీటికి పలు సంస్థలు, ప్రముఖుల నుంచి మద్దతు లభించడంతో కొంతమేర విజయవంతమయ్యాయి. ఈ ఉద్యమాల వివరాలు తెలుసుకుందాం..

  మన దేశంలో పర్యావరణ ఉద్యమాలు గ్రామస్థాయి నుంచి 1970లలోనే ప్రారంభమయ్యాయి. 1980వ దశకం నుంచి తెలంగాణలో సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. 1990వ దశకం నుంచి ఉద్యమాలు తీవ్రమయ్యాయి. ప్రపంచీకరణ, నయా ఉదారవాదం పేర్లతో చోటు చేసుకున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పర్యావరణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. ప్రాంతీయంగా కూడా పర్యావరణం, మానవ హక్కుల పరిరక్షణ దిశగా సాగిన సామాజిక ఉద్యమాలు అనేక అంశాలను లేవనెత్తాయి. ఇలాంటి ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా.. ఒక ఆశయం కోసం పనిచేస్తాయి. ప్రజాస్వామిక విధానాల్లోనే కార్యక్రమాలను రూపొందిస్తాయి.

 

యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం

  భారత యురేనియం సంస్థ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - యూసీఐఎల్) తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జున జలాశయం సమీపంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు గుర్తించింది. దీని సమీప గ్రామాల్లో సుమారు 1303 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు యూసీఐఎల్ నిర్ధారించింది. 2001 ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం మైనింగ్, శుద్ధి కర్మాగారాన్ని స్థాపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది.

* 2002 సెప్టెంబరులో నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంభాపురం గ్రామాల్లో యురేనియం గనుల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద 795 ఎకరాల్లో సుమారు రూ.315 కోట్లతో దాదాపు 20 ఏళ్ల వరకు తవ్వకాలు చేయడానికి నిర్దేశించింది. అనుమతుల అనంతరం నమూనాల కోసం తవ్వకాలను ప్రారంభించడంతో అప్పట్లో స్థానికులు దీన్ని వ్యతిరేకించారు.

* 2005లో దేవరకొండ పరిధిలో యురేనియం తవ్వకాలకు ప్రయత్నించగా అక్కడి స్థానికుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో తవ్వకాలను నిలిపివేశారు. 2006లో 'యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం' అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పెద్దఎత్తున స్థానికులు ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమానికి గిరిజన సమాఖ్య అధ్యక్షుడు రవీంద్రనాయక్ మద్దతు తెలిపారు. పర్యావరణవేత్తలు, జన విజ్ఞాన వేదిక, పౌరహక్కుల సంఘం నాయకులు కూడా మద్దతిచ్చారు.

* 2007లో లంభాపురం, పెద్దగట్టు, శేరుపల్లి, చిట్రియాల, పెద్దమూల, కాచరాజుపల్లి గుట్టల్లోని అటవీ ప్రాంతంలో దేశ రక్షణ, అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే యురేనియం నిక్షేపాలున్నట్లు యురేనియం సంస్థ పరిశోధనలో తేలింది. దీంతో 2007లో మళ్లీ యురేనియం శుద్ధి కర్మాగార నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులను అక్కడి స్థానికులు పెద్దఎత్తున అడ్డుకున్నారు. ప్రజలకు మద్దతుగా 20 స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఇది చివరికి ప్రజా ఉద్యమంగా మారి నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనుకంజ వేసి పనులను వాయిదా వేసింది.

 

మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమం

  1980వ దశకం నుంచి హైదరాబాద్ నగర శివార్లలో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించాయి. దీంతో పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలన్నీ మూసీ నదిలో కలవడం వల్ల అది ఒక మురికి కాలువగా మారింది. వాస్తవంగా.. మూసీ నది హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తుండటం వల్ల నగర ప్రజల తాగునీటి అవసరాలకు ఉద్దేశించి దీని ఉపనదిపై హుస్సేన్‌సాగర్ సరస్సును పూర్వకాలంలో నిర్మించారు. అయితే కాలక్రమేణా ఈ నీరు కలుషితమైంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రతిరోజూ జంట నగరాల నుంచి 350 మిలియన్ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్థ పదార్ధాలు కలుస్తున్నట్లు గత పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో 1986లో డాక్టర్ కిషన్‌రావు, కె.పురుషోత్తమ్‌రెడ్డిల ఆధ్వర్యంలో 'సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్' అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి స్థానిక ప్రజలను కూడగట్టారు. ఇతర పర్యావరణ సంఘాలతో కలిసి మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజల జీవించేహక్కును కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1988లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఫలితంగా కొన్ని పరిష్కారాలను కనుక్కున్నారు. 1989లో హానికరమైన వ్యర్థపదార్ధాల నిర్వహణ, నిల్వ, పరిష్కారాల కోసం 'హానికరమైన వ్యర్థపదార్థాల' నియమావళిని ప్రభుత్వం రూపొందించింది. ఈమేరకు ఉద్యమం కొంత విజయం సాధించింది.

* 2000లో మూసీ నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీట్ కాలువ ద్వారా ప్రవహింపజేసి.. నదీ జలాల ప్రాంతాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించి తెలుగుదేశం ప్రభుత్వం 'నందనవనం' అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది సమీపంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించింది. దీంతో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 'మూసీ బచావో ఆందోళన్' అనే నినాదంతో స్థానిక సామాజిక సంస్థలు ఉద్యమం చేపట్టాయి. దీనికి పర్యావరణవేత్త మేధా పాట్కర్ మద్దతు ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది.

* 2000, జూన్ 24న 'ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్' అనే సంస్థను ప్రారంభించారు. ఈ ఫోరమ్ కన్వీనర్ ఎం.వేదకుమార్ ఆధ్వర్యంలో 'హైదరాబాద్ బచావో' అనే పర్యావరణ ఉద్యమం మొదలైంది. 2006, నవంబరు 21న కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు పురానా పూల్ వంతెన నుంచి అంబర్‌పేట వరకు పాదయాత్ర చేపట్టారు. వీరితో పాటు నగరంలోని ఛత్రీ, గమన అనే రెండు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి.

* 2007లో మూసీనదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ జలమండలి మూసీ నది పొడవునా దశలవారీగా మురుగు శుద్ధి, ప్రక్షాళన పనులను చేపట్టడానికి 10 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను సిద్ధం చేసింది. అయితే వీటివల్ల అక్కడి జనావాసాలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయని 'సేవ్ మూసీ రివర్ క్యాంపైన్' పేరుతో స్థానిక పర్యావరణ సెల్ 2009, జూన్ 2న ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమానికి మద్దతుగా సేవ్ లేక్స్ సొసైటీ, సేవ్ రాక్స్ సొసైటీ, అక్షర, ప్రజా చైతన్య వేదిక, పుకార్, చెలిమి ఫౌండేషన్, హెరిటేజ్ వాచ్ లాంటి పర్యావరణ సంఘాలు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచాయి.

* 2009 నుంచి నగరం వేగంగా విస్తరిస్తున్న కొద్దీ మూసీ నది పరివాహక ప్రాంతాలు రియాల్టర్లు, కబ్జాదారుల ఆక్రమణలకు గురవుతూ వస్తున్నాయి. మలక్‌పేట, హిమాయత్‌నగర్, అజ్గంపురా, కాచీగూడ ప్రాంతాల్లో మూసీ నది ఆక్రమణలకు గురైంది. ముఖ్యంగా ఒక సంస్థ నదీ పరివాహ ప్రాంతాన్ని కబ్జాచేసి వేసిన వెంచర్ చుట్టూ ప్రహరీగోడను నిర్మించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు 'మూసీ బచావో' పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు. పలువురు నాయకులు, ప్రజా సంఘాలు దీనికి మద్దతు తెలిపాయి. ఈ ఉద్యమకారుల డిమాండ్‌కు స్పందించి జీహెచ్ఎంసీ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించడానికి పర్యావరణ నిర్వహణ ద్వారా ఆర్ధిక వృద్ధి సాధించడమే లక్ష్యం. - టీఎస్ పీసీబీ విజ‌న్‌

Posted Date : 30-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప‌ర్యావ‌ర‌ణ ఉద్యమాలు

మాదిరి ప్రశ్నలు

1. తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఎవరు?
ఎ) జోగు రామన్న బి) అజ్మీరా చందూలాల్ సి) జూపల్లి కృష్ణారావు డి) కొప్పుల ఈశ్వర్
జ: (ఎ)

 

2. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ ఎవరు?
ఎ) బహుగుణ బి) రాజీవ్‌శర్మ సి) అనురాగ్‌శర్మ డి) ఎ.కె.చాందా
జ: (బి)

 

3. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 2014, జులై 6 బి) 2015, జులై 6 సి) 2014, ఆగస్టు 6 డి) 2015, ఆగస్టు 6
జ: (ఎ)

 

4. ప్రాంతీయ సామాజిక ఉద్యమాలు ఏ దశకం నుంచి ప్రారంభమయ్యాయి?
ఎ) 1980 బి) 1990 సి) 2000 డి) 1970
జ: (ఎ)

 

5. తెలంగాణలో యురేనియం నిక్షేపాలున్న జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి బి) మహబూబ్‌నగర్ సి) నల్గొండ డి) మెదక్
జ: (సి)

 

6. 'సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్' అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 1986 బి) 1987 సి) 1988 డి) 1989
జ: (ఎ)

 

7. 'ఛత్రీ, గమన, పుకార్, చెలిమి' అనేవి ఏమిటి?
ఎ) వ్యాపార సంస్థలు బి) ప్రకటన సంస్థలు సి) స్వచ్ఛంద సంస్థలు డి) ప్రభుత్వ సంస్థలు
జ: (సి)

 

8. మూసీనది కాలుష్య వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇచ్చిన పర్యావరణవేత్త ఎవరు?
ఎ) బాబా ఆమ్టే బి) మేధా పాట్కర్ సి) రాజేంద్ర సింగ్ డి) బహుగుణ
జ: (బి)

 

9. 2000, జూన్ 24న ఏర్పడిన 'ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్' కన్వీనర్ ఎవరు?
ఎ) ఎం.వేదకుమార్ బి) డాక్టర్ కిషన్‌రావు సి) కె.పురుషోత్తంరెడ్డి డి) రామారావు
జ: (ఎ)

 

10. నల్గొండలో యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమానికి మద్దతునిచ్చిన గిరిజన సమాఖ్య నాయకుడు ఎవరు?
ఎ) రవీంద్రనాయక్ బి) నాగేశ్వర్‌రావు సి) వీరేంద్రనాయక్ డి) ధరేంద్రసింగ్
జ: (ఎ)

 

11. నల్గొండ జిల్లాలో 'యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం' అనే స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 2005 బి) 2006 సి) 2007 డి) 2008
జ: (బి)

 

12. మూసీ నది వెంబడి ఉద్యానవనం అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన ప్రాజెక్టు ఏది?
ఎ) హరితపత్రం బి) నందనవనం సి) మిత్రవనం డి) జలవనమండలి
జ: (బి)

 

13. 2006 నవంబరు 21న హైదరాబాద్‌లో కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు 'హైదరాబాద్ బచావో' అనే నినాదంతో పాదయాత్ర ఎక్కడ నిర్వహించారు?
ఎ) మియాపూర్ నుంచి ఎల్బీనగర్      బి) జూబ్లీహిల్స్ నుంచి ఫలక్‌నుమా
సి) పురానా పూల్ నుంచి అంబర్‌పేట   డి) అంబర్‌పేట నుంచి మలక్‌పేట
జ: (సి)

 

14. 'వాటర్ మెన్ ఆఫ్ ఇండియా, జోహడ్ వాలా బాబా' అనే బిరుదులు ఎవరివి?
ఎ) వందనా శివా బి) సునీతా నారాయణ్ సి) అన్నాహజారే డి) రాజేంద్రసింగ్
జ: (డి)

 

15. టైమ్ మ్యాగజైన్ 'పర్యావరణ హీరో'గా ఎవరిని అభివర్ణించింది?
ఎ) సునీతా బి) అన్నాహజారే సి) వందనాశివ డి) మాధవ్ ప్రియదాస్
జ: (సి)

 

16. 'జలమందిర్ యాత్ర' పేరుతో గుజరాత్‌లో ప్రజలను చైతన్యపరిచిన జానపద గాయకుడు ఎవరు?
ఎ) రామ్‌బియా బి) మాధూరిప్రియ సి) రామ్‌లీలావాలా డి) మనోహర్‌బియా
జ: (ఎ)

Posted Date : 30-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవవైవిధ్యం

 

    ప్రకృతిలో ఎన్నో ప్రత్యేకతలు.. మరెన్నో వైవిధ్యాంశాలు. మొక్కలు, జంతువులు, జీవరాశులు.. లక్షలాది రకాల్లో ఉండే ఇవన్నీ ప్రకృతిలో భాగమే. ఇలాంటి విభిన్న అంశాల జీవ వైవిధ్యం (బయో డైవర్సిటీ) ఎంత ఎక్కువగా ఉంటే పర్యావరణానికి అంత ప్రయోజనకరం. 'ఆధునికీకరణ' ప్రభావంతో జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు బయో డైవర్సిటీకి పెద్దపీట వేస్తున్నాయి. భారతదేశం దీనికి మరింత ప్రాధాన్యం ఇస్తూ అనేక రకాలుగా జీవ వైవిధ్యాన్ని అభివృద్ధి చేసే చర్యలు చేపడుతోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జీవ వైవిధ్యానికి సంబంధించిన ప్రత్యేక అధ్యయన సమాచారం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..
    జీవ సమాజంలోని జీవుల మధ్య ఉండే విభిన్నతను 'జీవ వైవిధ్యం' అంటారు. ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన జీవుల సంఖ్య, భిన్నత్వ ం, మార్పు చెందే తత్వాలన్నీ జీవ వైవిధ్యానికి సంబంధించినవే. అందుకే ప్రకృతిని గమనిస్తే విభిన్న రకాల వృక్షాలు, జంతువులు, జీవులు కనిపిస్తాయి.

 

జీవ వైవిధ్య స్థాయులు

జీవ వైవిధ్య క్రమానుగత స్థాయి ప్రకారం ప్రధానంగా 3 రకాలు. అవి..
1. జన్యుపర జీవ వైవిధ్యం (జెనిటిక్ బయోడైవర్సిటీ)
2. జాతిపర జీవవైవిధ్యం (స్పీసిస్ బయోడైవర్సిటీ)
3. ఆవరణ వ్యవస్థల జీవవైవిధ్యం (ఇకో సిస్టమ్ బయోడైవర్సిటీ)

 

జన్యుపర జీవవైవిధ్యం

    ఇది ఒక జాతిలో ఉండే జీవవైవిధ్యం. అంటే ఒకే జాతికి చెందిన జీవుల మధ్య ఉన్న విభిన్నతలకు సంబంధించింది. జీవుల జీవకణాల్లోని క్రోమోజోముల్లోని జన్యువులు ఆ జీవి వ్యక్తిగత లక్షణాలను నిర్ధారిస్తాయి.
ఉదా: జన్యుపర జీవవైవిధ్యం కారణంగా కొందరు సన్నగా, లావుగా, పొడవుగా, పొట్టిగా, తెల్లటి చర్మంతో, వివిధ రంగుల్లో ఉండటం; ఒకే జాతికి చెందిన కుక్కలు, పిల్లులూ, పుష్పాలు మొదలైనవి.

 

జాతిపర జీవ వైవిధ్యం

    శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించినా, నేటికీ భూగోళంపై కచ్చితంగా ఎన్ని జాతులకు చెందిన జీవులున్నాయో ఎవరికీ తెలియదు.
* భూమ్మీద 10-14 మిలియన్ల జాతులు/ జీవులున్నట్లు అంచనా. ఇవి చాలావరకు కీటకాలు, సూక్ష్మజీవులే.

ఆవరణ వ్యవస్థల జీవ వైవిధ్యం

    దీనిలో ఒక భౌగోళిక ప్రాంతంలోని అరణ్యాలు, పచ్చిక బయళ్లు, ఎడారులు లాంటి భౌమావరణ వ్యవస్థలు; నదులు, సరస్సులు, నదీ ముఖద్వారాలు, తీర ప్రాంతాలు, మహా సముద్ర ప్రాంతాలు లాంటి జలావరణానికి చెందిన విభిన్న ఆవాసాలకు సంబంధించిన జీవ వైవిధ్యం ఉంటుంది. ఇందులో శీతోష్ణస్థితి ప్రముఖ పాత్ర వహిస్తుంది.
ఉదా: భూమధ్యరేఖ వర్షారణ్యంలో జీవ వైవిధ్యం అధికస్థాయిలో ఉండగా, అందుకు భిన్నంగా ఉష్ణ ఎడారులు, ధ్రువ ప్రాంతాల్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.
* ఆహారం, నివాసం, ఆరోగ్యం కోసం అనాదిగా మానవులు భూగోళపు జీవ వైవిధ్యంపై ఆధారపడుతున్నారు.

 

కాలుష్య ప్రభావం

    జీవ వైవిధ్యం సహజ, వ్యవసాయ వ్యవస్థల ఉత్పాదకతలను పెంపొందిస్తుంది. ఆధునిక నాగరకత ఫలితంగా ఉత్పన్నమవుతున్న కాలుష్యం మానవుడు నివసిస్తున్న ప్రాంతాలన్నింటిలోని జీవ వైవిధ్యంపై అనేక రకాల వ్యతిరేక ప్రభావాలను చూపుతోంది.
ఉదా: అటవీ ప్రాంతాలను పంట భూములు, రహదారులు, క్వారీలు, గనులుగా మారుస్తున్నారు.

 

జీవావరణ సమతౌల్యం

    ఒక జీవ సంఘంలో కాలానుగుణంగా జీవావరణం ద్వారా క్రమంగా సంభవించే మార్పులుంటాయి. ఇవి మినహా జన్యుపరమైన.. జాతులు, ఆవరణ వ్యవస్థల మధ్య ఉండే జీవ వైవిధ్యం స్థిరంగా ఉండి, అది సహజసిద్ధమైన క్రియాశీల సమతాస్థితిలో ఉంటే, అలాంటి స్థితిని జీవావరణ సమతౌల్యం అంటారు.
* ఈ సమతౌల్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ ప్రభావం మరీ ముఖ్యమైంది.
* భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరగడం, హిమ సంపాతాలు, వరదలు, కరవు కాటకాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఆయా ప్రభావిత ప్రాంతాల్లో జీవావరణ సమతౌల్యాన్ని ప్రభావితం చేస్తాయి.
* జీవావరణ సమతౌల్య పరిరక్షణ కోసం అనుసరణీయ, దీర్ఘకాలిక, శాస్త్రీయ అవలోకనంతో వెంటనే చర్యలు చేపట్టాలి.

 

జాతిపర జీవ వైవిధ్యంలో మ్యాపింగ్

    బ్రిట్స్, పాల్ విలియమ్స్, డికీయిర్‌రైట్, చారిస్ హంప్ రేజర్ శాస్త్రవేత్తలు ప్రపంచంలో జీవవైవిధ్య పటాలను మొదటిసారి తయారు చేశారు. వీరు జీవ వైవిధ్య మ్యాప్‌లో 'వరల్డ్ మ్యాప్‌'ను అభివృద్ధి చేశారు. దీనిలో మూడు రకాలున్నాయి.
 

1. ఆల్ఫా పటాలు (ఆల్ఫా మ్యాప్స్)

    ఇందులో ప్రత్యేక ప్రాంతాల్లో మొత్తం జాతిపర సంఖ్యలను పొందుపరిచి, విశ్లేషణాత్మకమైన వివిధ ప్రాంతాల్లో జీవ వైవిధ్య అధ్యయన పటాల్లో గుర్తించారు.
 

2. బీటా పటాలు (బీటా మ్యాప్స్)

    ఇందులో జీవ వైవిధ్య నిర్మాణాలు, జాతిపర నిర్మాణాలు, పోలికలు, సంఘాలు, కొలతలు, ఆవరణ సమతౌల్యంలో జాతిపర మార్పులను ఈ పటాల్లో గుర్తించారు.
 

3. గామా పటాలు (గామా మ్యాప్స్)

    ఇందులో భౌగోళిక ప్రాంతాల్లో జాతిపర మార్పుల గణాంకాలు, వాటికి అయిన ఖర్చుల్లాంటి వివరాలను ఈ పటాల్లో పొందుపరిచారు.
 

తడి భూభాగాలు (వెట్ ల్యాండ్స్)

    భూమి ఉపరితలంపై నీటితో ఉన్న ప్రాంతాల్లో ఆవరణ వ్యవస్థలను సంరక్షించడానికి, వివిధ జీవులను, వృక్షాలను, నేలలను, వన్య ప్రాణులను కాపాడటానికి ఈ ప్రాంతాలు ఉపయోగపడతాయి.
రామ్‌సర్ సమావేశం (రామ్‌సర్ కన్వెన్షన్): ఇరాన్‌లో 1971, ఫిబ్రవరి 2న అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యత్వం ఉన్న దేశాలు రామ్‌సర్ ఒప్పందంపై సంతకం చేశాయి. 1975, డిసెంబరు 21న ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కొన్ని తడి ప్రాంతాలను గుర్తించారు. (వివరాలను పట్టిక-1లో చూడండి.)

వన్యమృగ సంరక్షణపై అంతర్జాతీయ సమావేశం

    ప్రపంచంలో జరిగిన 5 ప్రధాన అంతర్జాతీయ వన్యప్రాణి సమావేశాల్లో భారత్ పాల్గొంది. మనదేశంలో పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
* అంతర్జాతీయ వ్యాపార అటవీ వృక్ష జాతులు (Flora), జంతు జాతులు (Fauna) సమావేశంలో 1976, జులై 20న భారతదేశం సంతకం చేసింది.
* మానవ, జీవావరణ కార్యక్రమాన్ని (ఎంఏబీ- మ్యాన్ అండ్ బయోడైవర్సిటీ) యునెస్కో 1971లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 2012 నాటికి 117 దేశాల్లో 598 బయోస్ఫియర్ సంస్థలు సభ్యత్వం తీసుకున్నాయి.
* జీవవైవిధ్య సమావేశం 1992, జూన్ 5న రియో డీ జెనీరోలో జరిగింది.

 

భారతదేశంలో జీవవైవిధ్యం

    ప్రపంచంలో భారతదేశం 12వ మెగా జీవవైవిధ్య దేశం. మన దేశం ప్రపంచంలో 2.5 శాతం భౌగోళిక వైశాల్యం కలిగి ఉంది. ప్రపంచంలో 7.8 శాతం జాతిపర వైవిధ్యం భారత్ సొంతం. ఇదో రికార్డు. ప్రపంచంలో ఇండో-మళాయన్ అత్యంత విస్తీరణ ప్రాంతం.
* మన దేశంలో వృక్ష సంబంధ జాతులు 46,000 ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 7 శాతం. ఇందులో 33 శాతం వ్యాధుల బారిన పడుతున్నాయి.
* మన దేశంలో సుమారు 15,000 రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 6 శాతం. ఇందులో 1500 రకాలు జాతిపర వ్యాధుల బారిన పడుతున్నాయి.
* దేశంలో సుమారు 81,000 జంతుపర జాతులున్నాయి. ప్రపంచ జంతు సంపదలో ఇది 6.5 శాతం. (జంతు జాతుల వివరాలకు పట్టిక-2 చూడండి.)


* భారత్ 1972లో వన్య మృగ సంరక్షణ చట్టాన్ని చేసింది. అంతకు ముందు 5 జాతీయ హోదా కలిగిన పార్కులు ఉండేవి.
* వన్యమృగ సంరక్షణ సవరణ చట్టాన్ని 2006లో చేశారు. అదే ఏడాది సెప్టెంబరు 4 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా జాతీయ పులుల అటవీ అథారిటీ, వన్యమృగ క్రైమ్ కంట్రోల్ బ్యూరోలను ఏర్పాటు చేశారు.

 

జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళిక

    జాతీయ వన్యమృగ బోర్డును 1982లో కేంద్రం ఏర్పాటు చేసింది. మొదటి జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళికను 1983లో ప్రారంభించారు.
 

జాతీయ జీవ వైవిధ్య చట్టం

    ఈ చట్టాన్ని 2002లో చేశారు. 2003, అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కిందకు
1. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ (ఎన్‌బీఏ),
2. జాతీయ జీవ వైవిధ్య బోర్డ్(ఎస్‌బీబీ),
3. జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ (బీఎంసీ) వస్తాయి. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ సంస్థను చట్టబద్ధ హోదాతో చెన్నై (2003)లో ఏర్పాటు చేశారు. భారత్‌లోని పలు జీవ వైవిధ్య సంస్థల వివరాలివి..

* వన్యమృగ సంస్థ - 1996లో డెహ్రాడూన్‌లో ఏర్పాటు.
* భారత వన్యమృగ బోర్డు - 2001 డిసెంబరు 7న పునర్‌నిర్మాణం
* జంతు సంక్షేమ డివిజన్లు - 2002 జులై నుంచి అమలు
* జంతు సంక్షేమ జాతీయ సంస్థ (ఎన్ఐఏడబ్ల్యూ) - ఫరీదాబాద్ (1960 చట్టం ప్రకారం ఏర్పడింది)
* బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1890 ఫిబ్రవరి 13న స్థాపించారు
* జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1916 (కోల్‌కతా)లో ఏర్పాటు

 

భారతదేశంలో జీవ వైవిధ్య సంరక్షణలు

1. ఎలిఫెంట్ ప్రాజెక్టు: 1992 ఫిబ్రవరిలో ఎలిఫెంట్ ప్రాజెక్టును స్థాపించారు. దేశంలో ప్రస్తుతం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 32 ఎలిఫెంట్ ప్రాజెక్టులున్నాయి. ఇవి ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉన్నాయి. (భారత్‌లోని ఎలిఫెంట్ ప్రాజెక్టు / రిజర్వ్ వివరాలు పట్టిక-3లో చూడండి.)

టైగర్ ప్రాజెక్టు

భారత ప్రభుత్వం 1973, ఏప్రిల్ 1న పులుల (టైగర్ రిజర్వ్) ప్రాజెక్టును ప్రారంభించింది. దేశంలో మొదటి ప్రాజెక్టు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. (మన దేశంలోని టైగర్ రిజర్వ్ ప్రాంతాల వివరాలు పట్టిక-4లో చూడండి.)

బయోస్ఫియర్ రిజర్వ్

    ప్రాదేశిక, తీర ప్రాంత ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి యునెస్కో చట్రం కింద మానవ, జీవావరణ కార్యక్రమంలో భాగంగా మనదేశంలో 1986లో బయోస్ఫియర్‌ను స్థాపించారు. దేశంలో మొదటి బయోస్ఫియర్ నీలగిరి. ప్రస్తుతం దేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వ్‌లున్నాయి. వీటిలో 9 ప్రపంచ బయోస్ఫియర్ నెట్‌వర్క్‌లో ఉన్నాయి. దేశంలోని 7 బయోస్ఫియర్‌లను యునెస్కో దత్తత తీసుకుంది. (భారతదేశంలోని బయోస్ఫియర్ రిజర్వ్‌ల వివరాలు పట్టిక-5లో చూడవచ్చు.)

మెరైన్ నేషనల్ పార్క్‌లు

    మన దేశంలో 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గుజరాత్ ప్రభుత్వం అటవీశాఖ ఆధ్వర్యంలో గల్ఫ్ ఆఫ్ కచ్‌లో; జామ్‌నగర్ జిల్లా ఓకా, జోదియాల వద్ద 1982లో 270 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో మెరైన్ నేషనల్ పార్కు ప్రారంభించింది. ఇది దేశంలోనే మొదటి జాతీయ మెరైన్ పార్కు.
    దేశంలో ప్రధాన ప్రవాళభిత్తిక (కోరల్ రీఫ్) కోసం గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ అఖాతం, గల్ఫ్ ఆఫ్ కచ్, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో ఏర్పాటు చేశారు. వివరాలివి..
1. పాక్ అఖాతం - తమిళనాడు (రామేశ్వరం)
2. గల్ఫ్ ఆఫ్ మన్నార్ - తమిళనాడు (ట్యూటికోరిన్)
3. అండమాన్, నికోబార్ - బంగాళాఖాతం
4. గల్ఫ్ ఆఫ్ కచ్ - గుజరాత్
5. లక్షద్వీప్ - అరేబియా సముద్రం

 

భారతదేశంలోని ప్రవాళ భిత్తికల పరిశోధనా సంస్థలు

    డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్‌మెంట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్- అహ్మదాబాద్
జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - కోల్‌కతా
కేంద్ర మెరైన్ ఫిషరీస్ పరిశోధన సంస్థ - మదురై
సెంటర్ ఫర్ ఎర్త్ స్టడీస్ - త్రివేండ్రం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ - గోవా

 

Posted Date : 30-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవవైవిధ్యం

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో భారత జాతీయ జలచరం (అక్వాటిక్ ఆనిమల్) ఏది?
ఎ) డాల్ఫిన్ బి) తాబేలు సి) తిమింగలం డి) ఏదీకాదు
జ: (ఎ)

 

2. సమాజంలో అన్ని స్థాయి జీవుల మధ్య విభిన్నతను ఏమంటారు?
ఎ) పర్యావరణం బి) జీవ వైవిధ్యం సి) సమాజం డి) వైవిధ్యం
జ: (బి)

 

3. జీవ వైవిధ్య క్రమానుగత స్థాయులు ఎన్ని రకాలు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
జ: (బి)

Posted Date : 30-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వరద విపత్తులు


     మానవ మనుగడకు ప్రకృతి ప్రాణాధారం.. అది వికృత రూపం దాలిస్తే మాత్రం ప్రమాదకర పరిణామం.. ఇలాంటి ప్రమాదకర విపత్తుల్లో వరదలు ఒకటి. వివిధ రీతుల్లో ముంచుకొచ్చే ఈ వరదల కారణంగా భూమండలంపై ఎన్నో ప్రాంతాల్లో అపార నష్టం వాటిల్లుతోంది. భారతదేశంలోనూ వీటి ప్రభావం తీవ్రంగానే ఉంది. తెలుగు రాష్ట్రాలకూ అప్పుడప్పుడూ ఈ ముప్పు తప్పడం లేదు. అసలు వరదలెలా సంభవిస్తాయి? ఏవిధంగా తీవ్ర నష్టాలకు కారణమవుతున్నాయి? తదితర అంశాలు తెలుసుకుందామా!
ప్రకృతి సహజ వికృత రూపాల్లో వరదలు ఒకటి. ఏటా వరదల వల్ల ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, పర్యావరణ పరంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాణ నష్టం కూడా ఎక్కువే. సూర్యపుటం (సూర్యుడి నుంచి భూమి గ్రహించే ఉష్ణోగ్రత) వల్ల భూమి వేడెక్కి.. నేల మీద ఉన్న తేమ, జలాశయాల్లోని నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడతాయి. ఈ మేఘాలు అనుకూల పరిస్థితుల్లో వర్షం లేదా మంచు లేదా వడగళ్లుగా మారి నేలపై అవపాతం చెందుతాయి. ఈ ప్రక్రియ విపరీతంగా జరిగి అధిక వర్షాలు పడినప్పుడు సాధారణంగా వరదలు ఏర్పడతాయి. ఏదైనా ప్రాంతంలో సాధారణ ప్రవాహస్థాయిని మించి నీరు ప్రవహించినప్పుడు వరదలు సంభవిస్తాయి. వరద ఉద్ధృతి పెరగడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. అయితే ఆనకట్టలు తెగిపోవడం, భారీ వర్షాలు తదితర ప్రక్రియల వల్ల ఎలాంటి హెచ్చరిక లేకుండానే అకస్మాత్తుగా వరదలు వస్తాయి.

 

వరదలు.. రకాలు

1. నదీ వరదలు
     నది తనలో ఉంచుకోగల నీటి పరిమాణాన్ని పారుదల సామర్థ్యం (ఛానెల్ కెపాసిటీ) అంటారు. సముద్రంలోకి పంపే నీరు కంటే ఎక్కువ నీరు నదిలో ఉన్నప్పడు ఆ నీరు పొంగి నది గట్టును దాటి వరదలు సంభవిస్తాయి. వీటిని 'నదీ వరదలు అంటారు.
2. మెరుపు వరదలు
     కుండపోత వర్షాలు.. మంచు హఠాత్తుగా కరిగి నదిలో చేరడం.. ఆనకట్టలు విరిగిపోవడం లాంటివి జరిగినప్పుడు అకస్మాత్తుగా వచ్చే వరదలను 'మెరుపు వరదలు అంటారు.
3. తీర ప్రాంత వరదలు
     సముద్రంలో ఉప్పెనలు, సునామీలు వచ్చినప్పుడు తీర ప్రాంతంలో ఏర్పడిన వరదలను 'తీర ప్రాంత వరదలు అంటారు.
4. నదీ ముఖద్వార వరదలు
     సముద్రంలోని ఉప్పెన కారణంగా సముద్రంలోని అలలు నదీ నీటి ప్రవాహాన్ని వెనక్కి నెడతాయి. ఫలితంగా నదులు సముద్రంలో కలిసే ప్రదేశాల్లో ఏర్పడిన వరదలను 'నదీ ముఖద్వార వరదలు అంటారు.
5. పట్టణ వరదలు
     సరైన మురుగునీటి వ్యవస్థ లేని నగరాలు, పట్టణాల్లో భారీ వర్షాలు సంభవించినప్పుడు ఏర్పడిన వరదలను 'పట్టణ వరదలు అంటారు.
6. ప్రమాద కారణ వరదలు
     అధిక పరిమాణంలో నీటిని సరఫరా చేసే గొట్టాలు పగిలిపోయినప్పుడు చుట్టు పక్కల ప్రాంతాలు నీటిలో మునిగిపోతాయి. ఇలా ఏర్పడే వరదలే 'ప్రమాద కారణంగా ఏర్పడిన వరదలు.

 

కొత్త సవాళ్లు

     ప్రాచీన కాలంలో మానవులు జలాశయాలకు దగ్గరలోనే నివసించేవారు. అయితే వరదల ప్రభావాన్ని తప్పించుకోవడానికి తగినంత దూరంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకునేవారు. నాగరకతలు అభివృద్ధి చెందిన కాలంలో మానవులు నదీలోయ ప్రాంతాల్లో జీవించేవారు. యూఫ్రటిస్, టైగ్రిస్ నదీ లోయల్లో మెసపటోమియా నాగరకత; నైలు నదీలోయలో ఈజిప్టు నాగరకత; సింధు నదీ ప్రాంతంలో సింధు నాగరకత; యాంగ్జీ, పసుపు నదీ ప్రాంతంలో చైనా నాగరకత ఇలాంటివే. 21వ శతాబ్దంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవుడి జీవిత కాలం పెరిగింది. అదే సమయంలో అనేక విపత్తుల వల్ల ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. అభివృద్ధి, జనాభా, నగరీకరణ తరచూ వరదలు రావడానికి కారణమవుతున్నాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ సహజ వనరులపై ఒత్తిడి అధికమవుతోంది. ఇది మానవ జీవితాలను అత్యంత అపాయంలోకి నెడుతోంది. కొన్ని చోట్ల సరైన అభివృద్ధి ప్రణాళిక లేకపోవడం వల్ల వరదలు ఏర్పడుతుండగా మరికొన్ని చోట్ల అతి అవస్థాపనా సౌకర్యాల కల్పన వల్ల వరదలు సంభవిస్తున్నాయి. మెక్సికోలోని మిసిసిపీ నదీ ప్రాంతం, బంగ్లాదేశ్‌లోని హోండూరస్ పర్వత ప్రాంతాల్లోని అభివృద్ధి చెందుతున్న (జనసాంద్రత ఎక్కువగా ఉన్న) ప్రాంతాల్లో ఈ వరదల బీభత్సం ఎక్కువగా ఉంది. ఈ విధంగా మానవుడి అభివృద్ధి కూడా కొత్త సవాళ్లను విసురుతోంది.
 

రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీ

     వివిధ రకాల విపత్తుల వల్ల జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాలను లెక్కించడానికి, నమోదు చేయడానికి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సంస్థ పనిచేస్తోంది. వాతావరణ విపత్తుల్లో వరద విపత్తు వల్ల ప్రపంచంలో అత్యధిక ఆస్తి, ప్రాణ నష్టాలు, అత్యధిక ప్రాంతాల్లో సంభవిస్తున్నాయని ఈ సంస్థ పేర్కొంది.
 

భారతదేశంలో వరదల ప్రభావం

     ప్రపంచ వ్యాప్తంగా వరదల కారణంగా మరణిస్తున్నవారిలో 20% భారతదేశంలోనే ఉన్నారు. ఇక్కడ వరద ముప్పునకు గురయ్యే ప్రదేశాలు కూడా ఎక్కువే. ఇక్కడ దాదాపు అన్ని నదీ పరీవాహక ప్రదేశాల్లోనూ వరదలు సంభవిస్తున్నాయి.
1. గంగానదీ పరీవాహక ప్రాంతం
     ఉపనదుల వల్ల గంగానదీ పరీవాహక ప్రాంతంలో ఉత్తర భాగం తీవ్ర వరదలకు గురవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ్ బంగ రాష్ట్రాల్లోని ఉత్తర భాగాలు ప్రతి సంవత్సరం వరదల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో శారద, గాగ్రా నదులు వరదలకు కారణమవుతున్నాయి. బిహార్‌లో ఏటా కోసి, గండక్ నదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి. పశ్చిమ్ బంగలోని దామోదర్, అజయ్ నదుల చుట్టుపక్కల ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి.
2. బహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం
     బ్రహ్మపుత్ర, బరాక్ నదులు.. వాటి ఉపనదుల కారణంగా అసోం ఎక్కువగా వరదలకు గురవుతోంది. జల్దాకా, తీస్తా, తోర్సా నదుల వల్ల పశ్చిమ్‌బంగ ఉత్తర ప్రాంతం నీటి ముంపునకు గురవుతోంది.
3. వాయవ్య నదీ పరీవాహక ప్రాంతం
     వాయవ్య భారతదేశంలో జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్, గగ్గర్ నదుల పరీవాహక ప్రాంతాలు జలసమాధి అవుతున్నాయి.
4. మధ్య, దక్కన్ భారతదేశం
     గోదావరి, కృష్ణా, కావేరి, పెన్నా, తుంగభద్ర, నర్మదా తదితర నదులు.. మధ్య, దక్కన్ భారతదేశంలో ఏటా వరదలకు కారణమవుతున్నాయి. ఒడిశాలో మహానది, వైతరణి, బ్రాహ్మణి నదీపరీవాహక ప్రాంతాలు కూడా వరదల బీభత్సాన్ని ఎదుర్కొంటున్నాయి.
5. ముప్పు ముంగిట తెలుగు రాష్ట్రాలు
     తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులు ప్రధానంగా వరదలకు కారణమవుతున్నాయి. ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో నాగావళి, వంశధార నదులు; దక్షిణ ఆంధ్రాలో పెన్నా నదీ ప్రాంతం వరదలకు కారణమవుతున్నాయి. 2009లో కృష్ణానదికి వచ్చిన వరదల వల్ల మహబూబ్‌నగర్, కర్నూలు, నల్గొండ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు అపార నష్టం వాటిల్లింది. ముంబయి, కోల్‌కత లాంటి పెద్ద నగరాల్లోనూ మురుగునీటి వ్యవస్థ ప్రణాళికాయుతంగా లేదు. అధిక వర్షాలు వచ్చినప్పుడు నగరాలు నీట మునుగుతున్నాయి. 2005లో ముంబయిలో ఒకే రోజున 10 సెంటీ మీటర్ల వర్షం కారణంగా ఆ మహానగరాన్ని వరదలు ముంచెత్తాయి.
ముఖ్యాంశాలు
* జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం భారతదేశ భూభాగంలో 12.8 శాతం (40 మిలియన్ల హెక్టార్లు) వరదలకు గురవుతోంది. ఇందులో అధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 21.9 శాతం, బిహార్‌లో 12.7 శాతం భూభాగంలో వరదలు సంభవిస్తున్నాయి.
* వరదల కారణంగా 1953-2009 మధ్య భారతదేశం ఏడాదికి సగటున రూ.1,650 కోట్లను నష్టపోయింది. ప్రతి సంవత్సరం సగటున 1,464 మంది చనిపోతుండగా, 86,288 పశువులు మృత్యువాత పడుతున్నాయి.
* మన దేశంలో వరద ఉద్ధృతిని తెలుసుకోవడానికి శాటిలైట్, రిమోట్ సెన్సింగ్ పరికరాలు లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
* మన దేశంలో వరదల హెచ్చరికలను కేంద్ర జలసంఘం లేదా సాగునీరు, వరద నియంత్రణ శాఖ లేదా జలవనరుల శాఖ జారీ చేస్తాయి.
* సహజ వైపరీత్యమైన వరదలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధంగా ఉండాలి. అప్పుడే అవి విపత్తులుగా మారకుండా ఉంటాయి. తద్వారా విలువైన సంపదను కాపాడుకోవచ్చు.

Posted Date : 30-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సామాజిక ఉద్యమాలు

సామాజిక ఉద్యమాల ప్రధాన లక్ష్యం మార్పు. అంటే.. ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి మార్పును ఆశించడం. మన దేశంలో ఇలాంటి సామాజిక ఉద్యమాల పరిధి విస్తృతం. దానికి ప్రధాన కారణం మన దేశ సామాజిక వ్యవస్థ స్వభావం. ప్రపంచంలోని చాలా దేశాల కంటే భిన్నమైన సామాజిక నిర్మాణం మనది.
1960వ దశకం నుంచి అమెరికా, యూరప్ దేశాల్లో కొత్త తరహా ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ కాలంలో వచ్చిన పర్యావరణ, శాంతి, స్త్రీవాద ఉద్యమాలను నూతన ఉద్యమాలుగా వర్గీకరించవచ్చు. భారతదేశంలో తలెత్తిన దళిత, ఆదివాసీ, స్త్రీవాద, మానవ హక్కుల, పర్యావరణ ఉద్యమాలను కూడా 'నూతన సామాజిక ఉద్యమాలు'గానే పేర్కొనవచ్చు. అయితే ఈ ఉద్యమాల లక్ష్యం రాజ్యాధికారం కాదు.

 

పర్యావరణం - సంవేదన దశ

భారతదేశంలో అనేక సామాజిక ఉద్యమాలు పర్యావరణ సమస్యలను తమ అజెండాలో చేర్చాయి. పర్యావరణ అంశాలు సామాజిక ఉద్యమాల్లో 20వ శతాబ్దపు రెండోభాగంలో.. 1970 దశకం తర్వాత వచ్చినప్పటికీ, వాటి మూలాలు వలస పాలన కాలంలోనే ఉన్నాయి.
* అడవులు - అటవీ ఉత్పత్తులు, సముద్ర సంపదపై హక్కులు..
* చేపల చెరువుల పెంపకం, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, పెద్ద ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకించడం..
* అణు విద్యుత్తు, అణుశక్తి కేంద్రాల ఏర్పాటు, అణుయుద్ధాలను వ్యతిరేకించడం..
ఇలాంటి పర్యావరణ అంశాలను వివిధ సామాజిక ఉద్యమాలు తమ అజెండాలో చేర్చాయి. సామాజిక ఉద్యమాలైన గిరిజన, మహిళ, పౌరహక్కుల, రైతుల, కార్మిక ఉద్యమాల అజెండాలో పర్యావరణ అంశాలు కనిపిస్తాయి.

 

అటవీ హక్కుల కోసం..

గిరిజన ఉద్యమాల్లో చిప్కో, అప్పికో ముఖ్యమైనవి. గిరిజనుల అవసరాలు, మనుగడ.. అటవీ ఉత్పత్తులు, అటవీ సంపదపై ఆధారపడి ఉన్నందున గిరిజనులకు వాటిపై హక్కులు ఉండాలని ఈ ఉద్యమాలు పేర్కొన్నాయి.

 

చిప్కో ఉద్యమం

చారిత్రక నేపథ్యం: చిప్కో ఉద్యమం ప్రాచీన భారతీయ సంస్కృతి నుంచి ఉద్భవించింది. చారిత్రకంగా, తాత్వికంగా గాంధేయ సత్యాగ్రహ విధానాల్లోనే నడిచినందున ఈ ఉద్యమాన్ని ఆ రోజుల్లో 'అడవి సత్యాగ్రహం అని పిలిచేవారు. గిరిజనులు అడవులను రక్షించుకోవాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం మొదలైంది. మొదట చెట్లను రక్షించే ఉద్యమంగా, తర్వాత ఆర్థిక ఉద్యమంగా మారి చివరకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. బ్రిటిష్ పరిపాలనలో 1927లోని అటవీ చట్టం వల్ల గ్రామ ప్రజల హక్కులను నిరాకరించడం, గ్రామీణ జీవనోపాధి లేకపోవడం, వాణిజ్యం కోసం అడవులను కొల్లగొట్టడంతో దేశమంతటా ఈ ఉద్యమం వ్యాపించింది.

 

చిప్కో అంటే.. : చిప్కో అనే పదం హిందీ నుంచి వచ్చింది. ఇది ఆలింగనం చేసుకోవడం/హత్తుకుపోవడం అనే అర్థాన్ని ఇస్తుంది. ప్రస్తుత ఉత్తరాఖండ్ అడవుల్లో నివసించే బిష్నోయ్ తెగకు చెందిన గిరిజన మహిళలు అక్కడి అడవులను నరకకుండా వాటిని రక్షించుకోవడానికి చేపట్టిన ఉద్యమమే చిప్కో ఉద్యమం. వృక్ష ఆలింగన పద్ధతి ద్వారా చెట్లను హత్తుకుని వాటిని నరకకుండా కాపాడుకున్నారు.

 

స్వాతంత్య్రానంతరం: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చిప్కో ఉద్యమం గాంధేయ విధానంతో 'మీరా బెహన్, సరళ బెహన్' లాంటి గాంధేయవాదులతో సాగింది. వీరు మొదలుపెట్టిన పర్యావరణ ఉద్యమాలు ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ కొండల్లో వ్యాపించాయి. తర్వాత కాలంలో చండీ ప్రసాద్ భట్, సుందర్‌లాల్ బహుగుణ ద్వారా ఈ ఉద్యమం విస్తృతమై ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది.

 

సర్వోదయ మండల్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గిరిజనులు సరళ బెహన్ ఆధ్వర్యంలో 1961లో 'ఉత్తరాఖండ్ సర్వోదయ మండల్‌'ను నెలకొల్పారు. తర్వాత గోపేశ్వర్ జిల్లాలోని 'దషోలి' గ్రామంలో చండీ ప్రసాద్ భట్ నాయకత్వంలో 'దషోలి గ్రామ్ స్వరాజ్ మండల్' అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. వీరు పర్యావరణ పరిరక్షణ కోసం శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. హిమాలయాల్లోని వివిధ అటవీ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం, అక్కడి వృక్షాలను నరకడాన్ని వ్యతిరేకిస్తూ చిప్కో పద్ధతిని చేపట్టారు. ఈ విషయంపై 1972, 1973లో విస్తృత ఉద్యమాలు సాగాయి.

 

సుందర్‌లాల్ బహుగుణ: 1973లో ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో గోపేశ్వర్ గ్రామంలో చండీప్రసాద్ భట్ నాయకత్వంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 1989లో కర్ణ ప్రయోగ్ దగ్గర అడవుల్లో చెట్లను కొట్టివేసి 'ఫైన్' చెట్లను పెంచుదామని ప్రభుత్వ అధికారులు ప్రయత్నించినప్పుడు అక్కడి ప్రజలతో కలిసి సుందర్‌లాల్ బహుగుణ ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా నిరోధించగలిగారు. ఇలా బహుగుణ నేతృత్వంలో ఈ ఉద్యమం ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ అంతటా వ్యాపించింది. అంతకు ముందు పర్యావరణవేత్తగా ఉన్న ఆయన 1981 నుంచి 1983 దాకా హిమాలయ ప్రాంతంలో దాదాపు 5000 కి.మీ.ల మేర పాదయాత్ర చేశారు. చివరకు దిల్లీ చేరి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి అటవీ వినియోగ పద్ధతులు మార్చాలని కోరారు. ఫలితంగా ప్రధాని ఆజ్ఞానుసారం అప్పటి నుంచి 15 సంవత్సరాల దాకా హిమాలయ ప్రాంతాల్లో చెట్లు కొట్టడాన్ని నిషేధించారు.

 

కర్ణాటకలో అప్పికో

1983 సెప్టెంబరులో కర్ణాటక రాష్ట్రంలో చిప్కో ఉద్యమానికి బదులు 'అప్పికో' ఉద్యమంగా ప్రారంభమైంది. ఈ ఉద్యమకారులు కూడా చెట్లను కౌగిలించుకుని చెట్టుని నరికే ప్రయత్నాన్ని ఆపు చేశారు.

 

'చిప్కో' విజయాలు

* ప్రజల హక్కులను కాపాడి, అడవులకు ప్రకృతికి ఉన్న తాత్విక సామీప్యాన్ని రక్షించి శాస్త్రీయంగా వీటికి కొత్త రచన చేయడమే చిప్కో ఉద్యమ లక్ష్యం.
* ఈ ఉద్యమం గిరిజనుల ఐక్యతను చాటిచెప్పి ఇతర రాష్ట్రాల ప్రజలకు మార్గదర్శకంగా నిలిచింది.
* ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాలయాలతోపాటు రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక వరకు ఈ ఉద్యమం వ్యాపించింది.
* నిరక్షరాస్యులైన గిరిజనులు నడిపిన ఉద్యమ స్ఫూర్తి అక్షరాస్యులు, నగరవాసులతోపాటు ప్రజలందరిలో పర్యావరణ జాగృతిని కలిగించింది.

 

నర్మదా బచావో

  పర్యావరణ పరిరక్షణ కోసం.. వనరుల విధ్వంసానికి వ్యతిరేకంగా దేశంలో చెలరేగిన ఉద్యమాలన్నింటిలోకి 'నర్మదా బచావో ఆందోళన్ తలమానికమైంది.

  1961లో నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నర్మద, దాని ఉపనదులపైన సుమారు 3000 చిన్న, 135 మధ్య తరహా, 30 పెద్దతరహా ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించారు. వీటన్నింటిని కలిపి 'సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్' అంటారు. ఇందులో భాగంగా గుజరాత్, దక్షిణ రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 1964లోనే కేంద్ర ప్రభుత్వం నర్మదానదిపై 'సర్దార్ సరోవర్ పేరుతో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే క్షామ ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని ప్రభుత్వం భావించింది. అలాగే తాగునీరు, సాగునీరుతో పాటు 12,200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పిత్తి జరుగుతుందని భావించి నర్మదానదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. 1969లో కేంద్రం మూడు రాష్ట్రాలకు నదీ జలాల వినియోగం అంటే పంపిణీ నిమిత్తం 'నర్మద జలవివాద న్యాయ ట్రైబ్యునల్‌'ను నియమించింది.

  1987లో ప్రపంచ బ్యాంకు ఈ భారీ ప్రాజెక్టుకు 450 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేయడంతో డ్యామ్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ఆనకట్ట నిర్మాణాన్ని నిలిపి వేయాలని 1988లో ప్రముఖ పర్యావరణవేత్త మేధా పాట్కర్ నాయకత్వలో 'నర్మదా బచావో ఆందోళన్' అనే పర్యావరణ పరిరక్షణ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో మేధా పాట్కర్‌తోపాటు సుందర్‌లాల్ బహుగుణ, బాబా ఆమ్టే (ప్రముఖ సంఘ సేవకులు), అరుంధతీ రాయ్ (ప్రముఖ రచయిత్రి) ఉన్నారు.

 

'ఆందోళన్' ఎందుకంటే..?

* పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని అడవులు నశించిపోతాయి.
* భూకంపాలు సంభవించవచ్చు.
* నదీ పరివాహక ప్రాంతాల్లో జీవావరణం దెబ్బతిని నేల నాణ్యత తగ్గిపోతుంది.
* లక్షల మంది ఆదివాసులు నిరాశ్రయులవుతారు.
ఈ దుష్ఫలితాలను వివరిస్తూ 1989 నాటికి వీరు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. దీంతో ప్రపంచ బ్యాంకు రుణ మొత్తాన్ని ఇవ్వకుండా వెనక్కి తీసుకుంది.

 

ప్రముఖుల మద్దతు

* 1989లో హర్యుద్ నగరంలో మేధాపాట్కర్, బాబా ఆమ్టే, సుందర్ లాల్ బహుగుణ ఆధ్వర్యంలో నర్మదా ఆనకట్ట నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.
* 1990, డిసెంబరు 25న బాబా ఆమ్టే ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌గాట్ నగరం నుంచి గుజరాత్ సరిహద్దుల్లోని ఫెర్కునా గ్రామం (సర్దార్ సరోవర్ డ్యామ్) వరకు 250 కి.మీ. మార్గంలో 'సంఘర్ష్ యాత్ర' పేరుతో పాదయాత్ర చేసి సంచలనం సృష్టించారు.
* 1991 జనవరిలో మేధాపాట్కర్, ఆమ్టే అమరణ నిరాహార దీక్ష తలపెట్టారు. అయితే ఆరోగ్య దృష్ట్యా దీక్షను 1991, జనవరి 28న విరమింపజేశారు.
* 1991లో స్వీడన్ దేశం మేధా పాట్కర్ సేవలకు గుర్తింపుగా 'రైట్ లైవ్లీహుడ్ అవార్డ్' అనే అత్యున్నత పురస్కారంతో గౌరవించింది.
* 'ది ఫ్రెండ్స్ ఆఫ్ రివర్ నర్మదా' అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది.
* ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ 'ది గ్రేటర్ కామన్ గుడ్' అనే తన పుస్తకం ద్వారా మద్దతు పలికి, భారీ ఆనకట్టల వల్ల కలిగే నష్టాలు, విధ్వంసాల గురించి ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు.
* డ్యామ్ ఎత్తును 122 మీటర్లకు పెంచాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 2006 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఆనకట్ట ఎత్తును 90 మీటర్ల కంటే ఎక్కువ పెంచరాదని తీర్పునిచ్చింది.
* 2006 సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా గుజరాత్ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ప్రాజెక్టు ప్రారంభించింది.

 

తెహ్రీ డ్యామ్ ఉద్యమం

ఉత్తరాఖండ్‌లోని గడ్వాల్ జిల్లా తెహ్రీ గ్రామానికి సమీపంలో భగీరథ, భిలాం గంగా నదులపై రష్యా సాంకేతిక సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా డ్యామ్ నిర్మాణానికి తలపెట్టాయి. ఇది భూకంప జోన్ పరిధిలో ఉంది. దీని ఎత్తు 260.5 మీటర్లు. ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్దది. 1988 జులైలో రష్యా ఆర్థిక సహకారం (రూ. 3000 కోట్లు)తో 'తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (టీహెచ్‌డీసీ)' నెలకొల్పింది. ఈ డ్యామ్ వల్ల 2,70,000 హెక్టార్ల భూమికి సాగునీరు.. 346 మెగావాట్ల విద్యుత్తు.. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు తాగునీటిని సమకూర్చవచ్చని అంచనా వేశారు. చేపల పెంపకం, వలస పక్షులకు కూడా కేంద్రమవుతుంది.
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సుందర్‌లాల్ బహుగుణ నాయకత్వంలో 'తెహ్రీ బాంధ్ విరోధి సంఘర్ష్ సమితి' ఆధ్వర్యంలో తెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని ఆపాలని ఉద్యమం నడిపిస్తున్నప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెహ్రీ గ్రామంతోపాటు 96 గ్రామాలు పాక్షికంగా మునిగిపోతాయని, 85 వేల మంది ప్రజలు నిర్వాసితులవుతారని అంచనా వేశారు.

 

నిశ్శబ్ద లోయ ఉద్యమం

కేరళలోని పశ్చిమ కనుమల్లోని నీలగిరి పర్వతాల్లో నిశ్శబ్ద లోయ (Silent Valley) ఆవరించి ఉంది. ఈ ప్రాంతంలో కీచురాళ్లు లేకపోవడం వల్ల నిశ్శబ్దంగా ఉంటుంది. అందువల్ల దీనికి నిశ్శబ్దలోయ అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉన్నవి సతత హరిత వనాలు. వేల సంవత్సరాల నుంచి ఈ అడవులు అరుదైన, అతి విలువైన జంతు, వృక్ష జాతులకు నిలయంగా ఉన్నాయి. దేశంలోనే అపురూప సంపదగా ఈ లోయను భావిస్తారు.
1976లో కేరళ ప్రభుత్వం 240 మెగావాట్ల జల విద్యుత్తు కేంద్రాన్ని నీలగిరి పర్వతాల సమీపంలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ నిర్మాణం వల్ల 1000 హెక్టార్ల అరణ్యం నశించిపోతుందని, దీనివల్ల పర్యావరణ సమతౌల్యానికి విఘాతం కలుగుతుందని, అరుదైన వృక్ష సంపద నశించి పోతుందని, అరణ్య సంపదను నాశనం చేసుకోవడం సమర్థనీయం కాదని కేరళ ప్రజలు 'శాస్త్ర సాహిత్య పరిషత్' అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో పెద్ద ఉద్యమం నడిపారు. ఈ ఉద్యమం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేరళ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేసింది. అంతేకాకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ లోయను జాతీయపార్కుగా ప్రకటించారు.

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు

* నదీ జలాల్లో 'విష' ప్రవాహం

  మానవ మనుగడ దేనిపై ఆధారపడి ఉందో ఆ పర్యావరణం కాలుష్యం దెబ్బకు విషతుల్యంగా మారుతోంది. పారిశ్రామికీకరణ ప్రభావంతో వెదజల్లుతున్న కాలుష్యం పౌర సమాజాన్ని ఊపిరి సలపనీయడం లేదు. నదీ జలాలు, పరిసర ప్రాంతాల్లో చిమ్ముతున్న విష ప్రభావానికి మూగజీవాలు చనిపోతున్నాయి. మనుషులు కూడా బలై పోతున్నారు. ఈ విపత్కర పరిస్థితిని రూపుమాపాలంటూ ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా సాగిన ప్రధాన ఉద్యమాలేమిటో చూద్దాం..
పౌరహక్కుల ఉద్యమాలు తమ అజెండాలో పర్యావరణ సమస్యలకు తొలి ప్రాధాన్యం ఇచ్చాయి. కాలుష్యం లేని పర్యావరణంలో జీవించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని ఈ ఉద్యమాలు భావించాయి. ఈమేరకు పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అణుశక్తి వినియోగం, అణు విద్యుత్ కర్మాగారాల ఏర్పాటు, అణు యుద్ధాలు లాంటివాటిని వ్యతిరేకిస్తూ పౌర హక్కుల ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అలాగే భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, భారీ పరిశ్రమల ఏర్పాటు, మైనింగ్ తదితర కార్యకలాపాలకు భూసేకరణ జరిపే క్రమంలో.. కొన్ని కుటుంబాలు తమ భూములను కోల్పోతున్నాయి. ఇలాంటి నిరాశ్రయుల హక్కుల సాధన కోసం పోరాటాలు జరుగుతున్నాయి.

 

కాలుష్య వ్యతిరేక ఉద్యమాలు: మన దేశంలో శతాబ్దాలుగా నదులు, వాగులు, ఏరులు.. ప్రజలకు తాగునీటిని అందిస్తున్నాయి. పరిశ్రమల వాణిజ్య అవసరాలు తీరుస్తున్నాయి. మత్స్య సంపదలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే పారిశ్రామికీకరణ వల్ల ఇవి చాలామేర కలుషితం అయ్యాయి. ప్రత్యేకంగా ఉత్తరాన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ్‌బంగ రాష్ట్రాలకు చెందిన నగరాల్లో గంగానది పొడవునా ఉన్న పంచదార, కాగితం, ఎరువులు, రసాయనాలు, రబ్బరు, పెట్రోకెమికల్స్ పరిశ్రమల నుంచి వచ్చే కలుషితాలన్నీ నదిలో కలుస్తున్నాయి. దక్షిణాన కూడా పలు పరిశ్రమలు గోదావరి, కావేరి, తుంగభద్ర నదులను కలుషితం చేస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో కాలుష్య వ్యతిరేక ఉద్యమాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వాలు కొన్ని చర్యలతోపాటు పలు చట్టాలను కూడా రూపొందించాయి.

 

'సోన్'లో గరళం: మధ్యప్రదేశ్‌లోని షోడోల్ జిల్లాలో సోన్ నది పక్కనున్న అమ్లాయ్ నగరంలో 1965లో ఓరియంటల్ పేపర్ మిల్స్ అనే కాగితం పరిశ్రమ ఏర్పాటైంది. ఇది పెట్టిన రెండేళ్లకే కలుషిత పదార్థాల వల్ల నదిలోని చేపలు, పరిసర ప్రాంతాల్లో పశువులు మరణించాయి. 1970 నుంచి నది చుట్టుపక్కల ప్రాంతాల్లోని 20 గ్రామాల ప్రజలు పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం వల్లే నదీ జలాలు విషపూరితం అయ్యాయంటూ అధికారులకు, కలెక్టరుకు, మంత్రులకు విన్నవించుకున్నారు. అయినా యాజమాన్యం దీనిపై స్పందించలేదు. 1973లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ, దిల్లీ) బృందం ఈ ప్రాంతంలో సర్వే జరిపింది. పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల పశువుల్లో పాల దిగుబడి తగ్గిందని; నదిలోని చేపలు, గ్రామాల్లోని పశువులు క్రమంగా చనిపోతున్నాయని తెలిపింది. దీంతో అక్కడి ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమం చేపట్టారు. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 1974లో నీటి కాలుష్య నియంత్రణ చట్టాన్ని రూపొందించింది.

 

'చాలియార్' కలుషితం: కేరళలోని చాలియార్ నది పక్కన 1958లో బిర్లా సంస్థ గ్వాలియర్ రేయాన్స్ పరిశ్రమను స్థాపించింది. దీని నుంచి విడుదలయ్యే కాలుష్యం వల్ల ఆ నదిలోని చేపలన్నీ చనిపోయాయి. నది నుంచి నీరు వెళ్లే పంట పొలాలు నాశనమయ్యాయి. పరిసర గ్రామాల ప్రజలకు చర్మ రోగాలు సోకాయి. దీంతో వీరంతా 1963లో కాలుష్యాన్ని అదుపు చేయాలని కోరుతూ పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపారు. 1975లో ఇది భారీ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఫలితంగా 1981లో కాలుష్య నియంత్రణ మండలి కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టింది.

 

గోవాలో ఉద్యమం: 1973లో గోవాలో జువారి ఆగ్రో కెమికల్స్ లిమిటెడ్ అనే ఎరువుల పరిశ్రమను ప్రారంభించారు. పని ప్రారంభించిన 3 నెలలకే కాలుష్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లు కూడా మాడిపోయాయి. దీంతో 1974 మార్చి 31న సలదాన్హా అనే ఉపాధ్యాయుడు స్థానిక ప్రజలతో కలిసి కాలుష్య వ్యతిరేక సంఘాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా పరిశ్రమకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

 

కాలుష్య కర్మాగారం: ముంబయికి గాలి వచ్చే నైరుతి దిశలోని అలీబాగ్ ప్రాంతంలో ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు స్థాపించాయి. ఈ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల పర్యావరణం దెబ్బతిని, ప్రజలు కాలుష్యానికి గురవుతున్నారని అక్కడి ప్రజలు గుర్తించారు. వీరంతా దీన్ని వేరే ప్రాంతానికి తరలించాలని ఉద్యమం చేపట్టారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం దీన్ని మరోచోటుకు తరలించింది.

 

భోపాల్ దుర్ఘటన

  1984, డిసెంబరు 2 అర్ధరాత్రి భోపాల్‌లోని 'యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్' (అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ) అనే ఎరువుల తయారీ పరిశ్రమ నుంచి 'మిథైల్ ఐసోసైనేట్' అనే ప్రమాదకర విషవాయువు వెలువడింది. ఇది 3 వేల మంది మరణానికి కారణమైంది. భారతదేశంలో సంభవించిన పారిశ్రామిక దుర్ఘటనల్లో అతి భయానక విపత్తుగా ఇది చరిత్ర పుటల్లో నిలిచింది. అనంతర కాలంలో ఈ వాయువు దుష్ప్రభావం ఫలితంగా దాదాపు 15 వేల మంది మరణించారు. 5 లక్షల మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురయ్యారు. లక్షలాది మంది ప్రజలు వికలాంగులు, అంధులుగా మారారు. జీవచ్చవాలుగా మిగిలిన వారు చాలామంది ఉన్నారు.

  ఈ సంఘటనలో ప్రధాన నిందితుడైన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ సీఈవో వారెన్ ఆండర్సన్‌ను 1985 ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. అయితే అతడు బెయిల్‌పై అమెరికా వెళ్లాడు. 1986లో రషీదాబీ, చంపాదేవి శుక్లా భోపాల్ బాధితులకు న్యాయం చేయాలని పెద్దఎత్తున ఉద్యమం నడిపారు. దేశప్రజల నుంచి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

  1989లో రషీదాబీ, చంపాదేవి ఆధ్వర్యంలో 'భోపాల్ హతశేషుల ఉద్యమం' నడిచింది. దిల్లీలో వేలాది ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తమకు న్యాయం చేయమని కోరుతూ నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి వినతి పత్రం సమర్పించారు.

  1999లో చంపాదేవి ఇతర ఉద్యమకారులతో కలిసి న్యూయార్క్ కోర్టులో 'యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్'పై ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. 2002లో రషీదాబీ, చంపా కలిసి న్యూఢిల్లీలో 19 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. భోపాల్ బాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. రషీదాబీ, చంపా చేసిన సేవలకు గుర్తింపుగా 2004లో వారికి 'గోల్డ్‌మన్ పర్యావరణ బహుమతి' లభించింది. ఈ పురస్కారాన్ని పర్యావరణ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. వీరి పోరాటానికి కొన్ని అంతర్జాతీయ సంస్థలు మద్దతు ఇచ్చాయి. అవి..

* ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ - బ్రిటన్
* భోపాల్ మెడికల్ అప్పీల్ - బ్రిటన్
* గ్రీన్‌పీస్ ఇంటర్నేషనల్ - బ్రిటన్
* అసోసియేషన్ ఫర్ ఇండియన్ - అమెరికా
* కోర్ వాచ్ - అమెరికా
* పెస్టిసైడ్ యాక్షన్ నెట్‌వర్క్ - అమెరికా
* భోపాల్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ - జపాన్

  విషయం మళ్లీ 2010లో వార్తల్లోకి వచ్చింది. 2011లో కేంద్రం బాధితులకు రూ.1500 కోట్ల అదనపు ప్యాకేజీని సిఫారసు చేసింది. ఇటీవల ఈ కేసును కొట్టేశారు.

  కేంద్ర ప్రభుత్వం 1984లో 'పర్యావరణ పరిరక్షణ చట్టం'ను రూపొందించింది. 1986లో పారిశ్రామిక కాలుష్య నియంత్రణ చట్టాలను అమలు చేసింది.

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప‌ర్యావ‌ర‌ణ సంక్షోభం

* పరిరక్షణ అత్యవసరం
* మూడోవంతు అడవులతో ముప్పు నివారణ

జనాభా పెరుగుదల.. పెరుగుతున్న అవసరాలు.. మానవ తప్పిదాలు.. తదితర అంశాల నేపథ్యంలో పర్యావరణం విధ్వంసానికి గురవుతోంది. ఓజోన్ పొర ఛిద్రమవుతోంది.. భూమి వేడెక్కిపోతోంది.. అడవులు నాశనమై పోతున్నాయి.. కాలుష్యం పెరిగిపోతోంది.. ఇవన్నీ పర్యావరణాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. మానవాళిని భయంకర విపత్తుల్లోకి తీసుకెళుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పర్యావరణానికి ఎన్నటికీ పూడ్చలేని నష్టం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలా పర్యావరణం దెబ్బతినడానికి కారణాలేమిటి? ఎలాంటి దుష్ఫలితాలుంటాయి? నివారణ చర్యలేమిటి? తెలుసుకుందామా!
జీవావరణ వ్యవస్థలోని జనాభా పెరుగుదల వల్ల పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. జనాభా పెరిగే కొద్దీ మానవ నివాసానికి; వ్యవసాయ భూమి, వంటచెరకు కోసం అడవులను, పచ్చిక బయళ్లను నాశనం చేస్తుండటం వల్ల భూమి మృత్తికలు, వాటిలోని సారం కొట్టుకుపోతున్నాయి. సాగుచేయడం ద్వారా మిగిలే వ్యర్థ, ఘన, ద్రవ పదార్థాలు.. అనాగరిక పారిశుద్ధ్య అలవాట్ల వల్ల పర్యావరణ సంక్షోభం ఏర్పడుతోంది. ఈ వ్యర్థాలను తగిన విధంగా నియంత్రించకపోవడంతో శిలావరణ, జల, వాయు సంక్షోభానికి దారి తీస్తోంది. కొన్ని వ్యవసాయ విధానాలతోపాటు పురుగుమందులు, రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి రసాయన, జైవిక సంక్షోభానికి గురవుతోంది.

 

ఓజోన్ పొర (O3)

  ఓజోన్ పొరలో రంధ్రాలు లేదా ఛిద్రాలు ఏర్పడటం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. భూగోళాన్ని ఆవరించి ఉన్న వాతావరణాన్ని 5 పొరలుగా విభజించారు. వీటిని రెండు భాగాలుగా వర్గీకరించవచ్చు. అవి..

 

జలహారం

  ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమమే జలహారం. దీన్నే 'వాటర్ గ్రిడ్' పథకం అంటారు. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి వ్యక్తికి 100 లీటర్లు, పట్టణాల్లో 130 లీటర్ల చొప్పున నీటిని అందించాలనేది లక్ష్యం. దీన్ని మొదట నల్గొండ జిల్లా చౌటుప్పల్ వద్ద ఏర్పాటు చేశారు. దీనికి జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'హడ్కో అవార్డు' లభించింది. 

ఎ. సమరూప ఆవరణాలు: ఇందులో ట్రోపో, స్ట్రాటో, మీసో ఆవరణాలు 90 కి.మీ.ల లోపు ఉండి సమాన నిష్పత్తులు, ధర్మాలు ఉన్నందున వీటిని సమరూప ఆవరణాలు అంటారు.

 

బి. బహురూప ఆవరణాలు: ఇందులో థర్మో, ఎక్సో ఆవరణాలు 90 కి.మీ.ల పైన వేర్వేరు నిష్పత్తుల్లో ఉన్నందున వీటిని బహురూప ఆవరణాలు అంటారు.

  భూఉపరితలంపై 18-50 కి.మీ.ల వరకు ఉన్న ఆవరణాన్ని స్ట్రాటో ఆవరణం అంటారు. ఈ ఆవరణంలో 25-40 కి.మీ.ల మధ్య ఒక దట్టమైన పొర ఉంటుంది. దీన్నే ఓజోన్ పొర అంటారు. ఆక్సిజన్‌కు మరో రూపమే ఓజోన్. ఆక్సిజన్‌లోని ఒక కణంలో రెండు అణువులుంటే, ఓజోన్‌లో మూడు అణువులు ఉంటాయి. ఈ ఓజోన్ వాయువు పొర సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను అడ్డగించి, భూమికి చేరకుండా నిరోధిస్తుంది. ఫలితంగా ఆ కిరణాలు భయంకర వినాశకర విపత్తు నుంచి మానవాళిని రక్షిస్తాయి.

 

దుష్ఫలితాలు

అతినీలలోహిత కిరణాలు అధిక సంఖ్యలో భూమిని చేరితే కలిగే దుష్ఫలితాలు..
* జీవరాశుల చర్మం చిట్లిపోయి, జీవకణాలు సర్వనాశనం అవుతాయి.
* చర్మ సంబంధ క్యాన్సర్, కంటి వ్యాధులు, రోగనిరోధక శక్తి కోల్పోవడం లాంటి రుగ్మతలకు దారితీస్తుంది.
* మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియను మందగింపజేస్తుంది. తేలిగ్గా తెగుళ్లకు గురవుతాయి.
* ఈ కిరణాలు సముద్ర జలాల్లోని జీవరాశులకు కూడా హాని కలిగిస్తాయి.

 

మానవుడే కారణం

ఓజోన్ పొర విధ్వంసానికి మానవుడే ప్రధాన కారణం. ఈ విధ్వంసంలో 'క్లోరో ఫ్లోరో కార్బన్లు' ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటినే 'క్లోఫోకాలు' (ఈ ఒక కణం క్లోరిన్, ఫ్లోరిన్, కర్బనాల మిశ్రమం) అంటున్నారు. వీటితోపాటు బ్రోమిన్ కూడా ప్రమాదకారిగా మారింది. దీన్ని అగ్నిమాపక పరికరాల్లో ఉపయోగిస్తున్నారు.
పంటలపై చల్లే స్ప్రేలు, రిఫ్రిజిరేటర్లు, ప్లాస్టిక్, ఫోమ్, డిటర్జెంట్ల ఉత్పత్తుల తయారీ వల్ల వాతావరణంలో క్లోఫోకాలు ప్రతి సంవత్సరం ఒక మిలియన్ టన్నుకంటే ఎక్కువగా విడుదల అవుతున్నాయి. దీనివల్ల ఏటా లక్ష మందికి పైగా చర్మ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు.

 

85 శాతం ధ్వంసం

ఓజోన్ పొర మందం సన్నగిల్లుతున్నట్లు శాస్త్రవేత్తలు 1980 దశాబ్దంలోనే గమనించారు. ఆర్కిటిక్ ప్రాంతంపై ఉండే ఓజోన్ పొర 85 శాతం పైగా ధ్వంసమైందని తాజా పరిశీలనల్లో తేలింది. దీని ప్రభావం వల్ల ఉత్తర యూరప్ ప్రాంతంలో చర్మ క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఓజోన్ పొర ప్రస్తుతం 14 మిలియన్ చదరపు మైళ్ల మేర ఛిద్రమైందని ఓజోన్ పొరపై పరిశోధన చేసిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తెలిపింది.
నివారణ : ఓజోన్ పొర నివారణలో భాగంగా ప్రపంచ దేశాలన్నీ ఒకేతాటిపైకి రావాలి. ఏరోసాల్ ప్రొపల్లెంట్లు, ప్లాస్టిక్ ఫోమ్స్, రిఫ్రిజిరేటర్లలో వాడే సింథటిక్ రసాయనాలను తగ్గించి ప్రత్యామ్నాయాల వైపు ప్రయాణించాలి. ఇందులో భాగంగా ఈ ప్రమాద తీవ్రతను, వాటి దుష్ఫలితాలను గుర్తించి అమెరికా, జపాన్ లాంటి దేశాలు 'క్లోఫోకాలకు' ప్రత్యామ్నాయ రసాయనాలను తయారు చేస్తున్నాయి. అయితే ఇవి చాలా ఖరీదైనవి. పేద, బడుగు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా తయారు చేసుకోగలిగినప్పుడు పూర్తిగా క్లోఫోకాలను నిషేధించవచ్చు.
* ఇటీవల వోక్స్‌వ్యాగన్ కంపెనీ తయరుచేసిన కార్లలో పర్యావరణ సంక్షోభానికి దారితీసే వాయువులు ఉన్నట్లు తేలినందున అమెరికా ఆ కంపెనీపై ఆంక్షలు విధించింది.

 

భూతాపం (గ్లోబల్ వార్మింగ్)

భూగోళం వేడెక్కడాన్ని 'భూతాపం' అంటారు. ఇలా భూమిపై ఉష్ణోగ్రత పెరగడానికి గ్రీన్‌హౌస్ వాయువులు కారణమవుతున్నాయి. కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, క్లోఫోకాలు, ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి వాయువులను 'గ్రీన్‌హౌస్' వాయువులు అంటారు. ఇలా భూమిని చేరిన సూర్యరశ్మి ఉపరితలం నుంచి పై పొరల్లోకి వెళ్లకుండా ఈ వాయువులు అడ్డగించడం వల్ల భూమి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ఈ గ్రీన్‌హౌస్ ప్రభావానికి సగానికి పైగా కార్బన్ డై ఆక్సైడ్ (CO2) కారణం. ముఖ్యంగా పశ్చిమ పారిశ్రామిక దేశాలే ఈ వాయువుల పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

 

దుష్ఫలితాలు: గ్రీన్‌హౌస్ ప్రభావంతో భూమండలం వేడెక్కుతోంది. దీనివల్ల జీవావరణం తీవ్ర దుష్ఫలితాలకు లోనవుతోంది.
* ప్రాథమికంగా భూమిలో తేమ తరిగిపోయి ఆహారోత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల వ్యవసాయ సంక్షోభం తలెత్తుతుంది.
* సముద్ర జలాలు బాగా వ్యాకోచిస్తాయి. వీటివల్ల సముద్ర మట్టం పెరిగి, తీరప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు.
* ధ్రువ ప్రాంతాల్లోని మంచు కరగడం ప్రారంభిస్తే జల ప్రళయమే వచ్చి ప్రపంచంలో అనేక ప్రాంతాలు, దీవులు ముంపునకు గురై కొట్టుకుపోతాయి.
ఉదా: అంటార్కిటికా ఖండంలోని మంచు కరిగిపోతే సముద్ర నీటిమట్టం 55 మీటర్ల వరకు పెరుగుతుందని అంటార్కిటికా పరిశోధన సంస్థ అధ్యయనంలో తేలింది. మన దేశంలో అంటార్కిటికా పరిశోధన కేంద్రం గోవాలో ఉంది. దీనివల్ల హిందూ మహాసముద్రంలోని 'మాల్దీవులు' మునిగిపోయే ప్రమాదం ఉంది.

 

నివారణ చర్యలు: శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భూమి వేడెక్కడం మానవుడు ఎదుర్కొంటున్న భయంకర విపత్తుల్లో ముఖ్యమైంది.
* ప్రపంచ దేశాలన్నీ ముందుగా అడవులను పరిరక్షించాలి. ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికాల్లో జరుగుతున్న వన నిర్మూలనను వెంటనే ఆపాలి.
* అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ బీడు భూముల్లో వనీకరణ చేపట్టాలి. భారతదేశంలో సుమారు 12 లక్షల ఎకరాల భూమి వ్యర్థంగా ఉన్నట్లు అంచనా వేశారు. ఇలాంటి చోట్ల వనీకరణ జరగాలి.
* విద్యుదుత్పాదనకు బొగ్గు, సహజవాయువుల వాడకాన్ని తగ్గించాలి. వాటి స్థానంలో ఇతర మార్గాలను అన్వేషించాలి. సౌరశక్తి, అలల కదలిక, గాలి ప్రసరణ లాంటి మార్గాల్లో విద్యుదుత్పాదనను భారీ ఎత్తున చేపట్టాలి. ఉదాహరణకు.. మన దేశంలో పశ్చిమ్‌బంగ - టైడల్ శక్తి; ఉత్తర్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, రాజస్థాన్ - సౌరశక్తి; తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ - పవన శక్తి; తమిళనాడు, కేరళ - అలల శక్తి ద్వారా విద్యుదుత్పాదనలో ముందున్నాయి.
* రోడ్డు, రైలు మార్గాలకు ప్రత్యామ్నాయంగా జల మార్గ రవాణాను ప్రోత్సహించాలి.
* ఎయిర్ కండిషనింగ్, కార్లు లాంటి నిత్యావసరాలు కాని ఉపకరణాల వినియోగాన్ని తగ్గించాలి.

 

జనాభా పెరుగుదల, నగరీకరణ

  క్రీ.పూ. 8 వేల సంవత్సరాల కిందటే వ్యవసాయం ప్రారంభమైందని అంచనా. అప్పట్లో ప్రపంచ జనాభా కేవలం 40 లక్షలు ఉంటే అది క్రీ.శ.1750 నాటికి 50 కోట్లు. ప్రస్తుతం ప్రపంచ జనాభా 732 కోట్లకు చేరింది. ఇలా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నివాస, రవాణా, ఆరోగ్యం, ఆహారం తదితర సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించాల్సి ఉంటుంది. వీటి కోసం భారీ పరిశ్రమలను స్థాపించాలి. ఫలితంగా ఆయా పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాల వల్ల కాలుష్యం పెరుగుతోంది. రెండో ప్రపంచ యుద్ధానంతరం రసాయన ప్రగతి కూడా విపరీతంగా పెరిగింది. దీంతో మూడో ప్రపంచ దేశాల్లో సాంప్రదాయిక సహజ వనరుల స్థానంలో కృత్రిమ పదార్థాల వినియోగం ఎక్కువైంది. ఇటీవల పత్తి, ఉన్ని, పట్టుకు బదులు నైలాన్, సింథటిక్ పదార్థాలు; కలపకు బదులు అల్యూమినియం; పొలాల్లో సేంద్రియ ఎరువులకు బదులు రసాయనిక ఎరువుల వినియోగం ఎక్కువ కావడం వల్ల పర్యావరణం సంక్షోభానికి గురైంది. 

  జనాభా పెరుగుతున్న కొద్దీ నివాసాలకు, వ్యవసాయ వినియోగం కోసం అడవులను నిర్మూలిస్తున్నారు. ఇలా జనాభా అవసరాల కోసం అడవులను నరికి వేయడంతో వన్యమృగాలు కూడా అంతరించి పోతున్నాయి. వాతావరణ తరంగాల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల గాలిలో తిరిగే పక్షి సంతతి అంతరించి పోయింది. ఫలితంగా ప్రకృతిలో సమతౌల్యత దెబ్బతిని పర్యావరణం, పరిసరాలు కలుషితమవుతున్నాయి.

 

దుష్ఫలితాలు

  'మనం' వనరుల సంక్షోభంలో ఉన్నాం.. ఎందుకంటే వైద్య సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపడటం వల్ల భూమ్మీద జనాభా భారం అధికమవుతోంది.. ఇలా అధిక జనాభా వల్ల, పదార్థాలను వృథా చేయడంతో పర్యావరణానికి ఎన్నటికీ పూడ్చలేని నష్టం పెరిగిపోయే గండం వస్తుందని హైస్టన్ క్లేడ్ అనే భూవిజ్ఞాన శాస్త్రవేత్త పేర్కొన్నారు.

* 1900 సంవత్సరం నాటికి ప్రపంచం మొత్తం మీద 700 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవులు 1975 నాటికి 290 కోట్ల హెక్టార్లకు పరిమితమైపోయాయి. 2010 నాటికి అవి మూడోవంతు అంతరించి పోతాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థలు హెచ్చరించాయి.
* ప్రపంచ జనాభాలో ప్రస్తుతం 17.7% భారతదేశంలో ఉంటే, ప్రపంచ అడవుల విస్తీర్ణంలో సుమారు ఒక శాతం మాత్రమే భారతదేశంలో ఉన్నాయి. ఇలా దేశంలో సగటున 15 లక్షల హెక్టార్లలో ప్రతి సంవత్సరం అటవీ ప్రాంతం అంతరిస్తోంది.

 

నివారణ చర్యలు

* ప్రకృతిలో పర్యావరణ సమతౌల్యతను కాపాడటానికి.. మొత్తం భూవిస్తీర్ణంలో మూడో వంతు అడవులు ఉండి తీరాలని తీర్మానం చేసుకున్నాం. ఇవి పర్వత, కొండచరియల్లో 60 శాతం, మైదాన ప్రాంతంలో 20 శాతం ఇతర ప్రాంతాల్లో మిగిలిన శాతం అడవులు ఉండాలని భారతదేశం 1952లో తీర్మానం చేసింది. ఈ ప్రకారం అడవుల పెంపకం, పరిరక్షణ దిశగా చర్యలు చేపట్టాలి.
* అడవులు తగ్గుతున్న కొద్దీ ప్రకృతిలో సమతౌల్యత దెబ్బతింటుంది. అందువల్ల మానవుడి దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న అడవులను పరిరక్షించడంతో పాటు కొత్త ప్రాంతాల్లో వన సమీకరణ చేపట్టాలి.
* జనాభా పెరుగుదలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అక్షరాస్యత శాతాన్ని పెంచి, స్త్రీ విద్యను నిర్బంధం చేయడం ద్వారా అధిక జనాభా సమస్యను నివారించవచ్చు.

 

నగరాలు, పట్టణాల్లో కాలుష్యం

  21వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో పరిశ్రమలు, వాహనాల రద్దీ, జనసాంద్రత భారీగా పెరిగింది. దీనికి తగ్గట్టే కాలుష్యం కూడా పెరిగింది. వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి, విషవాయువుల పరిమాణం పెరగడంతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది.

ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో తక్షణమే పరిష్కరించాల్సిన సమస్యల్లో జల, వాయు, ధ్వని కాలుష్యాలతోపాటు పరిసరాల కాలుష్యం కూడా ప్రధానమైంది.
పట్టణాల్లో ఇళ్లతోపాటు, మార్కెట్లు, హోటళ్లు, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కూడా తీవ్ర కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి. వీటిని చాలా దూర ప్రాంతాలకు తరలించి శుద్ధి చేయాలి.

 

దుష్ఫలితాలు

* పట్టణాల్లో మురుగు నీటిపారుదల సౌకర్యాలు, మలమూత్ర విసర్జనకు సదుపాయాలు లేనందున.. వర్షాకాలంలో చెత్తాచెదారాలు, మురుగుతో మంచినీరు కలుషితం అవుతోంది. రోగకారక క్రిములు పెరుగుతున్నాయి.
* ఈగలు, దోమలు వ్యాప్తి చెందడం వల్ల అనేక అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి.
* మురికి గుంటలు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. మలేరియా, మెదడువాపు, బోదకాలు లాంటి వ్యాధుల వ్యాప్తికి ఇవి కారణమవుతున్నాయి.

 

నివారణ చర్యలు

* రసాయన ఎరువులు, క్రిమిసంహారకాల వాడకం తగ్గించడం ద్వారా పర్యావరణ పరిస్థితులను మెరుగు పరచవచ్చు.
* పారిశ్రామిక కాలుష్య నివారణ కోసం సైక్లోన్ సెపరేటర్స్, వెన్చూరి స్క్రూబర్స్, స్ప్రేటవర్స్, బ్యాగ్ ఫిల్టర్స్ లాంటి పరికరాలను అమర్చాలి.

 

పర్యావరణ సంక్షోభానికి కారణమవుతున్న ప్రధాన అంశాలు

* తరుగుతున్న ఓజోన్ పొర మందం
* భూమి వేడెక్కుతున్న ప్రక్రియ
* పరిశ్రమల ద్వారా జరిగే కాలుష్యాలు
* జనాభా విపరీతంగా పెరిగిపోవడం
50 సంవత్సరాల వయసున్న ఒక వృక్షం ఏటా ఒక టన్ను ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. 50 టన్నుల నీటిని నిల్వ చేస్తుందని అంచనా. ఈ లెక్కన దాని జీవిత కాలంలో దాదాపు రూ.15 లక్షల లాభాన్ని చేకూరుస్తుంది.

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప‌ర్యావ‌ర‌ణ సంక్షోభం

మాదిరి ప్రశ్నలు

 

1. ఏ కార్ల కంపెనీలో పర్యావరణ క్షీణతకు దారితీసే వాయువులున్నాయనే అంశం ఇటీవల వార్తాల్లోకి వచ్చింది?
ఎ) స్కోడా బి) వోక్స్‌వ్యాగన్ సి) మారుతి డి) టాటా
జ: (బి)

 

2. భారత ప్రభుత్వం జాతీయ అటవీ తీర్మానాన్ని ఏ సంవత్సరంలో చేసింది?
ఎ) 1952 బి) 1953 సి) 1962 డి) 1963
జ: (ఎ)

 

3. 'బోదకాలు' వ్యాధి దేని వల్ల వ్యాప్తి చెందుతుంది?
ఎ) నీరు బి) పందులు సి) దోమలు డి) గాలి
జ: (సి)

 

4. కిందివాటిలో సజాతి ఆవరణం కానిది ఏది?
ఎ) ట్రోపో బి) స్ట్రాటో సి) మీసో డి) థర్మో
జ: (డి)

 

5. కింది ఏ ఆవరణంలో ఓజోన్ పొర ఉంటుంది?
ఎ) స్ట్రాటో బి) ట్రోపో సి) మీసో డి) ఎక్సో
జ: (ఎ)

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చ‌క్ర‌వాతాలు

* సైక్లోన్ల జల ప్రళయం
* ఉప్పొంగే ప్రకృతి విపత్తు
* ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు

  మానవ జీవనానికి అమ్మఒడిలా ఉండే ప్రకృతి ఒక్కోసారి ప్రళయాన్ని సృష్టిస్తుంటుంది. ఇలాంటి ప్రళయాల్లో చక్రవాతాలు (సైక్లోన్లు) ఒకటి. సముద్ర జలాల్లో ఉద్భవించే ఈ తుపాన్ల ప్రభావంతో తీర ప్రాంతాలు అపార నష్టాన్ని చవిచూస్తుంటాయి. బలమైన గాలులు, కుండపోత వర్షాలతో విరుచుకుపడే ఈ విపత్తులను ముందుగానే గుర్తించగల విజ్ఞానం పెరుగుతున్నా.. ఆపగలగడం అసాధ్యం. కోట్లాది మంది నివసిస్తున్న ఉత్తర, దక్షిణ హిందూ మహాసముద్ర తీరాల్లోనూ, పశ్చిమ అట్లాంటిక్ మహాసముద్ర తీరంలోనూ, తూర్పు, దక్షిణ పసిఫిక్ మహాసముద్ర తీరాల్లోనూ ప్రతి సంవత్సరమూ చక్రవాతాల తాకిడి తప్పడం లేదు. ఏడున్నర వేల కిలోమీటర్లకు పైగా తీరరేఖ ఉన్న భారతదేశం కూడా ఈ విపత్తులను నిత్యం ఎదుర్కొంటోంది. అసలు ఏమిటీ చక్రవాతాలు? ఎందుకు ఏర్పడతాయి? వీటి ప్రభావం ఏయే ప్రాంతాల్లో ఉంటుంది? వంటి వివరాలను ఒకసారి చూద్దాం..
 

  కుంభవృష్టి వర్షాన్ని కుమ్మరిస్తూ.. సముద్రాల్లో పెద్దఎత్తున తరంగాలను సృష్టిస్తూ.. ఉత్తరార్ధగోళంలో అపసవ్యదిశలోనూ, దక్షిణార్ధగోళంలో సవ్యదిశలోనూ శక్తిమంతమైన గాలులతో సుడులు తిరిగే వాతావరణ అలజడినే చక్రవాతం (సైక్లోన్) అని పిలుస్తారు. చక్రవాతాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఇలా ప్రాంతీయంగా అనేక పేర్లతో పిలుస్తున్నా, వీటి రూపురేఖలు ఒకేవిధంగా ఉంటాయి. వీటి ప్రభావంతో అపారమైన ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవిస్తుంటుంది. అంతటి బలమైనవీ చక్రవాతాలు.

 

ఇవే సైక్లోన్లు

  చక్రవాతాలను ఆంగ్లంలో సైక్లోన్స్ అంటారు. 'సైక్లోస్' అనే గ్రీకు పదం నుంచి సైక్లోన్ పదం పుట్టింది. సైక్లోస్ అంటే పాము మెలిక చుట్ట (కాయిల్ ఆఫ్ స్నేక్) అని అర్థం. చక్రవాతం అనేది సమశీతోష్ణ, ఉష్ణమండల అక్షాంశాల వేడి, సముద్ర ప్రవాహాల వల్ల సంభవించిన అల్పవాతావరణ పీడన ప్రభావం. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన ఉష్ణమండల తుపాన్లు సర్పిలాకారంగా తిరిగి అలజడిని సృష్టిస్తాయి. ఈ అలజడులను గమనించిన బ్రిటన్ వాతావరణ శాస్త్రవేత్తలు వీటికి సైక్లోన్ అని నామకరణం చేశారు.

సముద్రంలోని అధిక ఉష్ణోగ్రత, అధిక సాపేక్ష ఆర్ద్రత, వాతావరణ అస్థిరతల కలయిక వల్ల ఏర్పడే ఒక సంక్లిష్ట ప్రక్రియే చక్రవాతం. సముద్రంలో అధిక ఉష్ణోగ్రత వల్ల దానిపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతానికి అన్ని వైపుల నుంచీ అధిక పీడన గాలులు చేరతాయి. ఫలితంగా వాయుగుండంగా మారి, చక్రవాత కేంద్రం (ఐ ఆఫ్ సైక్లోన్) ఆ మధ్యలో ఏర్పడుతుంది. చక్రవాత వ్యాసం కొన్ని వందల కిలో మీటర్లు ఉండగా, చక్రవాత కేంద్ర వ్యాసం 20-30 కి.మీ.ల వరకూ ఉంటుంది. చక్రవాత కేంద్ర పరిమాణం తగ్గుతున్న కొద్దీ చక్రవాత బలం అంతకంతకూ పెరుగుతుంది. చక్రవాత కేంద్రం పెరుగుతున్న కొద్దీ దాని బలం క్రమంగా తగ్గిపోతుంది.

 

మూడు దశల్లో..

 

1. రూపకల్పన దశ

బాష్పీభవనం ద్వారా గాలికి సమృద్ధిగా నీటి ఆవిరిని అందించడం కోసం 26°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న సముద్రపు నీరు 60 మీటర్ల లోతు వరకూ సముద్రంలో ఉన్నప్పుడు చక్రవాత రూపకల్పన జరుగుతుంది. ఈ దశలో గాలి సంతృప్తం చెంది వాతావరణంలో 7000 మీటర్ల ఎత్తు వరకూ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి.

 

2. సంపూర్ణ దశ

క్యుములోనింబస్ మేఘాలకు దిగువనే ఉన్న తీవ్ర అల్పపీడనానికి అన్ని వైపుల నుంచీ అధిక పీడన గాలి చేరుతుంది. ఇది గాలిని కల్లోలితం చేసి గాలివానతో కూడిన చక్రవాతంలా మారుతుంది.

 

3. బలహీన దశ

చక్రవాతం అధిక ఉన్నతిని చేరడం లేదా మరొక అల్పపీడనం వల్ల అది నేలను తాకినప్పుడు గాలి వెంటనే ఛేదనం చెందడం వల్ల చక్రవాతం బలహీనమైపోతుంది.

 

కాలచక్రం

  చక్రవాతం 24 గంటల కంటే తక్కువ వ్యవధిలో ప్రారంభమై 3 వారాల వరకూ ఉండవచ్చు. సగటున ఒక చక్రవాతం మూడు దశలు పూర్తవడానికి 6 రోజులు పడుతుంది. ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడిన చక్రవాతాలు సాధారణంగా 5-6 రోజులు కొనసాగుతాయి. అరుదైన సందర్భాల్లో 3 వారాల కంటే ఎక్కువ రోజులు కూడా కొనసాగవచ్చు.

 

భారత్‌లో తుపాన్ల ప్రభావం

తుపాన్ల తాకిడి ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 10% తుపాన్లు ఇక్కడే సంభవిస్తున్నాయి. భారతదేశం మొత్తం తీరరేఖ(7,516 కి.మీ.లు) కూడా చక్రవాతాలకు అనుకూలంగా ఉంటుంది. దేశంలోని మొత్తం భూవైశాల్యంలో సుమారుగా 8% భూభాగం చక్రవాతాల విలయాన్ని ఎదుర్కొంటోంది. మొత్తంగా 84 తీరప్రాంత జిల్లాలు చక్రవాతాలను ఎదుర్కొంటున్నాయి. మొత్తం చక్రవాతాల్లో మూడింట రెండొంతులు బంగాళాఖాతంలోనే ఏర్పడుతున్నాయి. దేశంలో ఎక్కువ చక్రవాతాలు అక్టోబరు, నవంబరుల్లో సంభవిస్తాయి. బంగాళాఖాతంలో అల్పపీడనాలు సాధారణంగా ఆగ్నేయ దిశలో ఏర్పడి చక్రవాతాలుగా మారి వాయవ్యం వైపు నడుస్తాయి. అప్పుడప్పుడూ తూర్పున ఏర్పడి పశ్చిమానికి కూడా నడిచి తీరం దాటుతుంటాయి.

 

ఒడిశా, ఏపీలకు తాకిడి

  అండమాన్, నికోబార్ దీవుల ప్రాంతంలో ఆవిర్భవించిన తుపాన్లే కాకుండా కొన్ని సమయాల్లో పసిఫిక్ మహాసముద్రంలో బలహీనపడిన వాయుగుండాలు కూడా బంగాళాఖాతంలోకి వచ్చి బలం పుంజుకుని తుపాన్లుగా మారతాయి. ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్టుమెంట్ లెక్కల ప్రకారం 1891 నుంచి 2012 వరకూ 73 తుపాన్లు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకాయి. దీనికి కారణం సముద్రపు లోతు తక్కువగా ఉండటమే.. అంతేకాకుండా ఖండతీరపు అంచు ఆకారం కూడా వాటికి అనుకూలంగా ఉంది.

  1999, అక్టోబరు 29వ తేదీన ఒడిశా తీరాన్ని తాకిన 'సూపర్ సైక్లోన్' వల్ల 10 వేల మంది చనిపోగా, 15 లక్షల ఇళ్లు నాశనమయ్యాయి. ఇది గంటకు 250 కి.మీ.ల వేగంతో వీచింది. 1977లో ఆంధ్రప్రదేశ్ తీరంలో దివిసీమ విలయానికి 10 వేల మంది చనిపోయారు. 2013, అక్టోబరు 12న ఏర్పడిన 'పైలిన్' తుపాను ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల మధ్య ప్రభావం చూపించి 25 మందిని బలిగొంది. 2013, అక్టోబరు 22న ఏర్పడిన 'హెలెన్' తుపాను కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలను తాకింది. దీనివల్ల 11 మంది చనిపోయారు. 2014, అక్టోబరు 12న విశాఖపట్నం, విజయనగరాలను కుదిపేసిన హుద్‌హుద్ తుపాను ఆరుగురిని బలితీసుకోగా, అపారమైన ఆస్తినష్టం వాటిల్లింది. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వీటి రాకను ముందుగా గుర్తించడంతో ప్రాణ నష్టాలను చాలావరకు తగ్గించగలుగుతున్నాం.

 

నామకరణం కూడా..

  తొలిసారిగా 20వ శతాబ్దంలో ఆస్ట్రేలియా వాతావరణ పరిశీలకుడొకరు తుపాన్లకు తనకు నచ్చిన రాజకీయ నాయకుల పేర్లు పెట్టారు. అప్పటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 5 ప్రాంతీయ బోర్డులు ఆయా ప్రాంతాలకు చెందిన దేశాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా పేర్లను నిర్ణయిస్తాయి. 2000 సంవత్సరంలో ఓమన్‌లోని మస్కట్‌లో జరిగిన ప్యానల్ ఆన్ ట్రోపికల్ సైక్లోన్స్ 27వ సమావేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే తుపాన్లకు పేర్లు ఖరారు చేశారు. ఉత్తర హిందూ మహాసముద్రం తీరంలోని తుపాను ప్రభావిత దేశాలైన భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్థాన్, ఓమన్‌లు ఇచ్చిన పేర్లను వరుస క్రమంలో రాబోయే తుపానుకు ముందుగానే నిర్ణయిస్తారు. పైలిన్, హెలెన్, హుద్‌హుద్.. ఇవన్నీ అలా పెట్టిన పేర్లే.

 

ముందస్తు హెచ్చరికలు

  భారత ప్రభుత్వ భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖలో వాతావరణ శాఖ ఒక విభాగం. ఇండియన్ మెటిరియోలాజికల్ డిపార్టుమెంట్(ఐఎమ్‌డీ)ను 1875లో కలకత్తాలో ఏర్పాటు చేశారు. వాతావరణ పరిశీలనలు, పరిస్థితులను ముందస్తుగా వెల్లడించడం; భూకంపాల గురించిన సమాచారాన్ని అందించడం దీని ప్రధాన విధి. ఐఎమ్‌డీకి దేశ వ్యాప్తంగా 6 ప్రాంతీయ కేంద్రాలున్నాయి. తుపాను రాక హెచ్చరికలు కోల్‌కతా, చెన్నై, ముంబయిలోని ఏరియా సైక్లోన్ వార్నింగ్ సెంటర్ల నుంచి; విశాఖపట్నం, భువనేశ్వర్, అహ్మదాబాద్‌లలో ఉన్న వార్నింగ్ సెంటర్ల నుంచి ఐఎమ్‌డీకి చేరతాయి. సైక్లోన్ హెచ్చరికలను ఇన్‌శాట్ ఉపగ్రహం ద్వారా స్థానిక భాషల్లో ప్రచారం చేసేందుకు ఒక ప్రత్యేక విపత్తు వ్యవస్థ ఉంది. ఈ హెచ్చరికలను రేడియో, టెలివిజన్, టెలీఫోన్ లాంటి సాధనాల ద్వారా ప్రచారం చేస్తారు.

 

ముఖ్యాంశాలు

* ఇంతవరకూ చరిత్రలో అతి సుదీర్ఘ చక్రవాతం 'టైఫూన్ జాన్'. ఇది 1994 పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి 31 రోజులపాటు కొనసాగింది.
* 1971లో అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'హరికేన్ జింజర్' 28 రోజులు కొనసాగి రెండో స్థానంలో నిలిచింది.
* 1970లో బంగ్లాదేశ్‌లో గంటకు 205 కిలో మీటర్ల వేగంతో సంభవించిన బోలా చక్రవాతం వల్ల 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
* గంటకు 222 కిలో మీటర్ల పైబడిన వేగంతో ఏర్పడే తుపాన్లను సూపర్ సైక్లోన్లు అంటారు.

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

చ‌క్ర‌వాతాలు

మాదిరి ప్రశ్నలు

 

1. కిందివాటిలో ప్రకృతి విపత్తుల్లో భాగమైనవి ఏవి?

ఎ) గాలివాన బి) వాయుగుండం సి) అల్పపీడనం డి) పైవన్నీ
జ: డి(పైవన్నీ)

 

2. సైక్లోన్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
జ: గ్రీకు

 

3. ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్‌మెంట్ ఎక్కడ ఉంది?
జ: దిల్లీ

 

4. ప్రపంచంలో అత్యధిక ఆస్తినష్టం కలిగించిన తుపాను ఏది?
జ: కత్రినా తుపాను - 2005

 

5. చైనా, జపాన్ దగ్గర ఏర్పడిన చక్రవాతాలను ఏమంటారు?
జ: టైఫూన్‌లు

 

6. తుపాన్ల ప్రభావాన్ని తగ్గించడానికి సహజసిద్ధ వాయు నిరోధకాలు?
జ: తీరప్రాంత చెట్లు

 

7. కిందివాటిలో చక్రవాతాలకు సంబంధం లేనిది?
ఎ) బలమైన గాలులు బి) అసాధారణ వర్షం సి) ఉప్పెన డి) ఓడరేవులు
జ: డి(ఓడరేవులు)

 

8. చక్రవాత కేంద్రం ఎలా ఉంటుంది?
జ: ప్రశాంతంగా

 

9. టోర్నడోలు ఎక్కువగా ఎక్కడ సంభవిస్తాయి?
జ: అమెరికా

 

10. చక్రవాతం సరాసరి కాలం ఎంత?
జ: 6 రోజులు

 

11. భారతదేశంలో ఎంత తీరంలో చక్రవాతాల ప్రభావం ఉంది?(సుమారుగా)
జ: 7500 కి.మీ.

 

12. తుపాన్లను అంచనా వేసే నోడల్ వ్యవస్థ ఏది?
జ: భారత వాతావరణ శాఖ

 

13. భారతదేశంలో చక్రవాతాలు ఎక్కువగా ఏ కాలంలో సంభవిస్తాయి?
జ: అక్టోబరు - నవంబరు

 

14. చక్రవాతం ఎలాంటి విపత్తు?
జ: వాతావరణ జల సంబంధ

 

15. బంగాళా ఖాతం, అరేబియా సముద్రాల్లో సంభవించే చక్రవాత విపత్తుల నిష్పత్తి?
జ: 4 : 1

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స‌హ‌జ‌వ‌న‌రులు

* సహజ వనరులే మన సంపద
* సంరక్షణ అందరి బాధ్యత

 

  సమాజంలో ఎవరైనా నీతికి విరుద్ధంగా చేసే పనులన్నీ అనైతిక చర్యలు. గత కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి అక్రమ, అనైతిక చర్యలు పెరిగి పోతుండటంతో పర్యావరణంలో అసమతౌల్యం పెరిగిపోతోంది. మరోవైపు సహజ వనరులు తరిగి పోతున్నాయి.
ప్రకృతి ప్రసాదించిన గాలి, నీరు, భూమి, ఖనిజ సంపద, అడవులను సహజవనరులుగా పరిగణిస్తారు. సమాజ జీవనంలో వ్యవసాయం వంటి వాటికి ఉపయోగపడే జంతువులను కూడా సహజవనరులుగానే పరిగణిస్తాం. ఇవి కూడా పర్యావరణంలో ముఖ్య భాగం. అందుకే భారతీయ సంస్కృతిలో చాలామంది సంప్రదాయంగా జంతువులను ఆరాధిస్తుంటారు.

 

సహజ వనరులు.. రకాలు

బపునరుద్ధరణ వ్యూహం ఆధారంగా సహజ వనరులను 2 రకాలుగా వర్గీకరిస్తారు.

 

1. పునరుద్ధరించగల సహజ వనరులు

ఈ రకమైన వనరులను ప్రవాహ వనరులు అనికూడా అంటారు. ఇవి స్థిరంగా ఉండి తరిగిపోని వనరులు. తిరిగి సమకూర్చుకోగలిగిన లేదా సృష్టించుకోగలిగిన వనరులను పునరుద్ధరించగల సహజ వనరులు అంటారు. ఇవి పరిమితి లేకుండా సమకూరుతుంటాయి. ఇలాంటి పునరుద్ధరించగల సహజ వనరులను ఉపయోగించేటప్పుడు సంఘ ప్రయోజన దృక్పథం అవసరం. ఎందుకంటే ఒక వనరు ఉపయోగించే విధానం వేరొక వనరుపై ప్రభావాన్ని చూపుతుంటుంది.
ఉదా: నీరు, అడవులు, మత్స్యసంపద, సౌరశక్తి, తరంగశక్తి, జంతుజాలాలు.

 

2. పునరుద్దరించలేని సహజ వనరులు

ఇవి అంతరించిపోయే స్వభావం ఉన్న వనరులు. వీటిని తిరిగి సృష్టించుకునే అవకాశాలు ఉండవు. వినియోగ ప్రక్రియలో ఈ వనరులు అంతరించిపోతాయి. ఒక నిర్ణీత సమయంలో వీటి పరిమాణం స్థిరంగా ఉంటుంది. ఉదా: బొగ్గు నిల్వలు, పెట్రోలియం, గ్యాస్, ఖనిజ నిక్షేపాలు. వీటిలో కొన్ని ఖనిజపరమైన వనరులను పునఃచక్రీకరణ (రీసైక్లింగ్) చేయవచ్చు. మొదటిసారిగా ఉపయోగించినప్పుడు ఇవి నశించిపోతాయి. రీసైక్లింగ్ చేయడం ద్వారా తిరిగి వీటిని వేరొక రూపంలో ఉపయోగించుకోవచ్చు. ఉదా: రాగి, వెండి, బంగారం.

 

ప్రాధాన్యం
 

* సహజ వనరులు భౌతిక పర్యావరణంలో భాగంగా ఉంటూ మానవుడు, జంతువులు, ఇతర జీవరాశుల మనుగడకు తోడ్పడతాయి
* భూమి లాంటి సహజ వనరు వ్యవసాయం, పారిశ్రామిక, గృహనిర్మాణం, తృతీయరంగ కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది.
* సహజ సంపద ఒక దేశం భౌగోళిక ఉనికి, ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేస్తుంది.
* సౌరశక్తి, వాయుశక్తి, తరంగశక్తి, ప్రవాహ వనరులు నిరంతరం అందుబాటులో ఉంటాయి.
* ఆహారం, పశుగ్రాసం, వంటచెరుకు.. సహజ వనరులైన మొక్కలు, చెట్ల ద్వారా లభిస్తాయి. పర్యావరణ సమతౌల్యానికి, సకాల వర్షాలకు అడవులు ఎంతో తోడ్పడతాయి.
ఇలా సహజ వనరులు నిష్క్రియాత్మకంగా ప్రకృతిలో నిక్షిప్తమై ఉంటాయి. భారతదేశం, అర్జెంటీనా, బ్రెజిల్ లాంటి దేశాల్లో సహజ వనరులు ఎక్కువ. స్విట్జర్లాండ్, ఇంగ్లండ్, జపాన్ లాంటి దేశాల్లో సహజ వనరులు తక్కువ. దీన్నిబట్టి పరిశీలిస్తే నిరంతర పరిశోధన, నూతన వనరుల అన్వేషణకు ప్రతి దేశంలోనూ ప్రోత్సాహం ఉండాలి. వనరుల నిర్వహణలో జీవవైవిధ్యం, ఆవరణ సంతులన సాధించడానికి దేశాలన్నీ ప్రయత్నించాలి.

 

ప్రధాన వనరులు

 

భూమి

భూమి, సంబంధిత వనరులు అంటే విస్తృతార్థంలో జీవావరణపు స్వరూప స్వభావంతో విస్తరించిన భూ ఉపరితలభాగం. కొన్ని సందర్భాల్లో భూమిని సహజ, నశింపజేయ వీల్లేని మృత్తికాశక్తిగా నిర్వచించవచ్చు. భూమి అనేది నిర్ధారిత భౌతిక సంపద. సహజ వనరులన్నీ భూమిపైనా, అంతర్గతంగా ఆవరించి ఉండి, పరిమిత సరఫరా కలిగి ఉన్నాయి.
ఉదా: భౌగోళిక ప్రదేశాలు, ఖనిజ నిల్వలు

 

వృక్షాలు

వృక్షాలు, జంతుజాలం కలిసి పర్యావరణానికి ఒక సమగ్ర స్వరూపాన్ని కలుగజేస్తున్నాయి. ఈ రెండింటి పరిరక్షణ పర్యావరణ సమతౌల్యానికి చాలా అవసరం. వృక్షాలు వేర్లతో నేలను పట్టుకోవడం ద్వారా మృత్తికా క్రమక్షయాన్ని తగ్గించి నీటి నాణ్యతను పెంచుతున్నాయి. మనం పీల్చే గాలిని శుభ్రపరుస్తున్నాయి. జంతువులకు కావాల్సిన ఆహారాన్ని అందిస్తూనే, వన్యప్రాణులకు ఆవాసాలుగా మారుతున్నాయి. చెట్లు ప్రధానమైన సహజవనరులు. కాబట్టి ఎన్ని వీలైతే అన్ని చెట్లను నాటడం మన బాధ్యత. ఇవి పుస్తకాల తయారీకి కావాల్సిన కాగితపు గుజ్జునిస్తాయి. అడవుల ద్వారా పండ్లు, తేనె, కలప, వంట చెరుకు, సుగంధ ద్రవ్యాలు, పూలు, ఔషధాలు, ఇంధనం; బొమ్మలు, బూటుపాలిష్, టూత్‌పేస్టుల తయారీకి కావాల్సిన ముడిసరుకులు లభిస్తాయి.

 

నీరు

నీరు మనకు జీవనాధారం. నీటిలో ఉపరితల జలం, భూగర్భజలం అనే రెండు రకాలుంటాయి. భూ ఉపరితలంపై 79% నీరు ఆక్రమించి ఉంది. భూమి ఉపరితలంపై ఉన్న నీటిలో 97.25% ఉప్పునీరు, 2.75% మంచినీరు ఉంది. మూడింట రెండొంతుల నీటిని మంచు కప్పేసింది. జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు తయారీలో ఉపయోగపడుతూ, నీరు పునరుత్పాదక వనరుగా మెరుగైన పాత్ర పోషిస్తోంది.

 

గాలి

ఇది ప్రధానమైన సహజ వనరు. ఇది భూమిపై ఉన్న సకల జీవరాశికి అత్యావశ్యకం. ప్రతిప్రాణి మనుగడకు గాలి అవసరం. ఇంధనాలు మండటానికి, రసాయన చర్యలు జరగడానికి ఇది తప్పనిసరి. ప్రాణికోటికి జీవనాధారమైన గాలి తరిగిపోని సహజవనరు.

 

ప్లాస్టిక్, పురుగుమందుల వినియోగం

ప్లాస్టిక్: ప్లాస్టిక్ అనేది క్లిష్టమైన భార అణువులతో కూడిన పాలిమర్లు. ప్లాస్టిక్ పరిశ్రమల్లో తయారుచేసే కృత్రిమ లేదా పాక్షిక కృత్రిమ కర్బన ఘన పదార్ధాలు.

పర్యావరణ సమస్యలు తెచ్చిపెట్టే కొన్ని నూతన రసాయన పదార్థాల్లో ప్లాస్టిక్ ఒకటి. దీని తయారీలో పాలీఎథిలీన్, పాలీవినైల్ క్లోరైడ్, పాలీస్టిరీన్ అనే రసాయనాలు ఉపయోగిస్తారు. నదులు, ఉద్యానాలు, వీధులు, సముద్రాలు, తీరప్రాంతాలనూ ప్లాస్టిక్ కలుషితం చేస్తోంది. ఒకవేళ ప్లాస్టిక్‌ని మండించినట్లయితే అది గాల్లోకి విషవాయువులను చిమ్ముతుంది. చాలా జంతువులు ప్లాస్టిక్‌తో మిళితమైన ఆహారాన్ని తిని చనిపోతున్నాయి.
ప్లాస్టిక్ క్యాన్సర్ లాంటి వ్యాధులకు దారితీస్తుంది. దీన్ని పునశ్శుద్ధి చేసే విధానం కూడా చర్మ, శ్వాసకోశ సంబంధ సమస్యలతో ముడిపడి ఉంది. అందువల్ల అందరూ ప్లాస్టిక్ సంచులకు బదులు దుస్తుల సంచులను వాడి ప్లాస్టిక్‌ను నియంత్రించవచ్చు.

పురుగుమందులు: క్రిమి కీటకాలను చంపడానికి, నిరోధించడానికి, నియంత్రించడానికి పురుగుమందులను ఉపయోగిస్తారు. ఆహారోత్పత్తిలో విరివిగా యూరియా, పురుగుమందులను వాడటం వల్ల వాటి అవశేషాలు ఆ ఆహారాన్ని తీసుకునే వారిలోనూ కనిష్ఠ స్థాయిలో కనిపిస్తాయి. కీటకనాశినులను తరచూ వాడే రైతులు తలనొప్పి, అలసట, నిద్రలేమి, చేతులు వణకడం, నాడీ సంబంధ సమస్యలతో బాధ పడుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లల్లో ఈ పురుగుమందుల ప్రభావంతో నాడీ వ్యవస్థ దెబ్బతింటోంది.

 

ప్రత్యామ్నాయాలు:

* పురుగుల నియంత్రణలో సూక్ష్మజీవులు, వివిధ జీవ రసాయనాలను వాడాలి.
* కీటకాల పెరుగుదలను అరికట్టాలి.
* సేంద్రీయ వ్యర్థాలను వాడాలి.
* మిశ్రమ పంటలు, పంటమార్పిడి పద్ధతులను అవలంబించాలి.
* పురుగులను చంపే ఇతర జీవులను పంటల్లో వదలాలి.

 

తరిగిపోతున్నాయి జాగ్రత్త!

గత కొన్ని దశాబ్దాలుగా పర్యావరణం క్షీణిస్తోంది. ఫలితంగా సహజ వనరులు తరిగిపోతున్నాయి.

 

1. తరుగుదల లేదా క్షయం

సహజ వనరుల పునరుత్పత్తి కంటే వేగంగా వాటి వినియోగం జరిగితే దాన్ని సహజ వనరుల తరుగుదల అంటారు.

 

2. మృత్తికా క్రమక్షయం

గాలి లేదా నీరు వరద ప్రవాహం వల్ల భూ ఉపరితలంపై మట్టి, రాళ్లు ఉన్నచోటు నుంచి క్రమక్షయం చెంది మరోచోట నిలిచిపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు. అధిక మృత్తిక క్షయం వల్ల నేలలు సారహీనమై ఎడారులుగా మారతాయి. నేలసారం తగ్గి వ్యవసాయోత్పత్తి కూడా తగ్గిపోతుంది. నేల సారహీనం కావడానికి గాలి, నీరు, ప్రాథమిక కారణాలు. ఇందులో 84% నేల సారహీనం కావడానికి కారణమైతే మిగతా 16% భౌగోళిక పర్యావరణ సమస్యల వల్ల ఉత్పన్నమవుతుంది. ఇలా మృత్తికాక్షయానికి గాలితోపాటు వర్షపాతం, నదులు, ప్రవాహాలు, తీరప్రాంతాలు, మంచుప్రాంతాలు, మంచుగడ్డ కట్టడం లాంటివి కారణాలుగా చెప్పవచ్చు.

 

నివారణ చర్యలు

* సాగు భూముల మధ్య గడ్డి పెంచడం
* సాగు నేలను అతిగా ఉపయోగించకుండా, ఎక్కువగా పశువులు మేయకుండా చూడటం.
* వివిధ రకాల మొక్కలను పెంచడం ద్వారా జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడం.
* తడి నేలను పరిరక్షించడం.
* మొక్కలు, రకరకాల గడ్డి జాతులను పెంచడం.
* బంజరు భూముల్లో ఎక్కువ మొత్తంలో చెట్లు పెరిగేలా చూడటం.

 

3. అడవుల నరికివేత

మానవులు తమ అవసరాల కోసం అడవులు, సంబంధిత పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. పారిశ్రామిక యుగం నుంచి దాదాపుగా ప్రపంచంలోని సగభాగం అడవులు ధ్వంసం కావడంతో లక్షలాది జంతు, వృక్షజాతులు అంతరించిపోయాయి.
అడవుల నరికివేతకు చాలా కారణాలున్నాయి. నరికివేసిన అటవీ భూభాగాన్ని పశువుల దాణా, వ్యవసాయం, ఆవాసాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇలా అటవీ భూములకు ప్రత్యామ్నాయాలు లేకపోవడం వల్ల వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతోంది. జీవవైవిధ్యం లోపించడం వల్ల భూములు బంజర్లుగా మారుతున్నాయి.

 

నష్ట నివారణ చర్యలు

* అడవుల నరికివేత అవసరమైనప్పుడు మరొక ప్రాంతంలో తప్పనిసరిగా మొక్కలను పెంచాలి.
* చెట్లు, అడవుల పరిరక్షణ కోసం పాటుపడేవారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి.
* కచ్చితంగా, నిజాయతీగా ఉండే అధికారుల యాజమాన్యంతో అడవులను సంరక్షించాలి.

 

ముఖ్యాంశాలు

* ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ నివేదిక ప్రకారం.. ప్రతి సంవత్సరం సుమారు 15 కోట్ల చెట్లను నరికి వేస్తున్నారు.
* 1960లో 'ఏజెంట్ ఆరేంజ్' అనే రసాయనాన్ని యుద్ధ సమయంలో అమెరికా, వియత్నాంపై ప్రయోగించింది. ఈ రసాయన ప్రభావం వల్ల మొక్కల ఆకులు రాలిపోతాయి, ఎండిపోతాయి.
* అడవులను పెంపొందించి పర్యావరణాన్ని కాపాడటం కోసం భారత ప్రభుత్వం 5వ పంచవర్ష ప్రణాళికలో సామాజిక అడవుల కార్యక్రమాన్ని ప్రారంభించి, 6వ ప్రణాళికలో అభివృద్ధి చేసింది.
* తెలంగాణ ప్రభుత్వం తరిగిపోతున్న అడవులను పెంపొందించేందుకు 2015 జులై 3-7 తేదీల మధ్య 'హరితహారం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
* మానవ వ్యర్థ పదార్థాలు సముద్రాల్లో కలిసిపోవడం వల్ల నత్రజని శాతం పెరిగి రకరకాల జలచరాలు మరణిస్తున్నాయి. ఫలితంగా ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. దీన్ని 'బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ)' అంటారు.

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స‌హ‌జ‌వ‌న‌రులు

మాదిరి ప్రశ్నలు

 

1. వాతావరణంలో అత్యధికంగా ఉన్న జడ వాయువు ఏది?
జ: ఆర్గాన్

 

2. ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు ఏవి?
ఎ) గాలి బి) నీరు సి) భూమి డి) ఇవన్నీ
జ: డి(ఇవన్నీ)

 

3. భౌగోళిక పర్యావరణ సమస్యల వల్ల ఎంత శాతం నేల సారహీనం అవుతుంది?
జ: 16%

 

4. భారత ప్రభుత్వం ఏ ప్రణాళికలో 'సామాజిక అడవుల కార్యక్రమాన్ని' ప్రారంభించింది?
జ: 5వ

 

5. వియత్నాంతో యుద్ధ సమయంలో అమెరికా అక్కడి అడవులను నాశనం చేయడానికి ఏ రసాయనాన్ని ఉపయోగించింది?
జ: ఏజెంట్ ఆరెంజ్

 

6. కింది వాటిలో ప్రపంచంలో సహజ వనరులు ఎక్కువ ఉన్న దేశమేది?
ఎ) బ్రెజిల్ బి) అర్జెంటీనా సి) భారతదేశం డి) పైవన్నీ
జ: డి(పైవన్నీ)

 

7. వాతావరణంలో ఆమ్లజని శాతం ఎంత?
జ: 21%

 

8. భూ ఉపరితలంపై ఉన్న మంచినీటి శాతం ఎంత?
జ: 2.75%

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సునామీ

* తీవ్ర భౌగోళిక వైపరీత్యం
* తీర ప్రాంతాల్లో విధ్వంసం

సునామీ.. పేరు చెప్పగానే భయకంపితులను చేసేంత తీవ్రమైన విధ్వంసకర విపత్తు. మీటర్ల కొద్దీ ఎత్తులో.. ఒకదాని వెంబడి మరొకటిగా.. ఊహకు అందనంత వేగంగా.. దూసుకొచ్చే సముద్రపు అలలు తీర ప్రాంతాల్లో విలయాన్ని సృష్టిస్తాయి. ఒకేసారి కొన్ని దేశాలపై ప్రభావం చూపించగలిగేంత తీవ్ర శక్తిమంతమైన ఈ సునామీలు ఎలా పుడతాయి? ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? వీటిని ముందుగా గుర్తించగలమా? తీవ్రతను తగ్గించడానికి ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలి? ఎదుర్కోవడం ఎలా? - తెలుసుకుందాం..
అత్యంత ఎక్కువగా ఆస్తి, ప్రాణ నష్టాలను మిగిల్చి.. తీవ్ర విధ్వంసాన్ని సృష్టించి.. పర్యావరణానికి తీవ్రహాని కలిగించే భౌగోళిక వైపరీత్యాల్లో సునామీ ఒకటి. ప్రధానంగా భూకంపాల కారణంగా ఏర్పడే సునామీలను ముందుగా ఊహించగలిగినా వాటివల్ల వచ్చే నష్టాన్ని మాత్రం పూర్తిగా తగ్గించలేకపోతున్నాం. సాధారణ భాషలో 'రాకాసి అలలుగా వీటిని పిలుస్తుంటారు. భారీ పరిమాణంలో స్థానభ్రంశం చెందిన నీటి వల్ల ఉవ్వెత్తున ఎగిసిపడే నీటి తరంగాల వరుసను సునామీ అంటారు. మహా సముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు... చివరకు ఈత కొలను (స్విమ్మింగ్ పూల్)ల్లో కూడా సునామీలు ఏర్పడవచ్చు. 2015 ఏప్రిల్ 25న నేపాల్‌లో భూకంపం సంభవిచ్చినప్పుడు ఒక స్విమ్మింగ్‌పూల్‌లో ఏర్పడిన సునామీని మీడియా ద్వారా చూడగలిగాం.

 

ఒకటి కాదు.. పదికి పైగా..

  బలమైన భూకంపాల వల్ల సముద్రపు అగాధాల్లో ఏర్పడిన సునామీ కెరటాలు వందల కిలోమీటర్ల పొడవునా (సుమారుగా 800 కి.మీ. వేగంతో) ప్రయాణిస్తుంటాయి. సునామీ అంటే ఒక పెద్ద తరంగం కాదు. పది లేదా అంతకంటే ఎక్కువ తరంగాలు ఉండొచ్చు. వాటిని 'సునామీ తరంగ రైలు అంటారు. ఒక్కో తరంగం ఒకదాని తర్వాత ఒకటి 5 నిమిషాల నుంచి 90 నిమిషాల వ్యవధిలో మరొకదాన్ని అనుసరిస్తాయి.
సునామీ మహాజల కుడ్యం (Huge wall of water) తీరానికి చేరిన తర్వాత ఒక వ్యక్తి పరుగెత్తే వేగం కంటే చాలా ఎక్కువ వేగంగా (50 కి.మీ.ల వేగంతో) ప్రయాణిస్తుంది. ఈ దూరాన్ని 'రన్ అప్ అంటారు. ఇది తీరాన్ని బట్టి కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. సునామీ ప్రారంభ ప్రాంతంలో తరంగాల ఎత్తు కొన్ని సెంటీమీటర్లుగా ఉండి, తీరానికి చేరే కొద్దీ 30 మీటర్ల ఎత్తువరకు కూడా ఉండొచ్చు. అందువల్ల సముద్రంపై ఓడలో ప్రయాణిస్తున్న వారికి సునామీ గురించి తెలియదు.
సునామీ తీరాన్ని చేరుతున్నప్పుడు వేగం తగ్గుతూ అల ఎత్తు పెరుగుతుంది. దీన్నే 'షోలింగ్ ప్రభావం అంటారు. సునామీ ప్రారంభమైన చోట తక్కువ డోలన పరిమితితో ఉంటుంది. తీరానికి చేరే కొద్దీ డోలన పరిమితి పెరుగుతుంది. కొన్నిసార్లు తీరం వద్ద నీరు వెనక్కు తగ్గి సముద్ర తీరం భూతలం బయటకు కనిసిస్తుంది. దీన్ని సునామీ రావడానికి అవకాశం ఉన్న సహజ సిద్ధమైన హెచ్చరికగా భావించవచ్చు.

 

జపాన్ సునామీ విలయం

  2011, మార్చి 11వ తేదీ మధ్యాహ్నం 2.46 గంటల సమయంలో జపాన్‌లోని ఈశాన్యప్రాంతంలోని తోహోకు ప్రాంతానికి 130 కి.మీ.ల దూరంలో (పసిఫిక్ మహాసముద్రంలో రిక్టర్ స్కేలుపై 9 తీవ్రత కూడిన పెను భూకంపం వల్ల) సునామీ సంభవించింది. దీంతో ఫుకిషిమా దైచీలోని అణువిద్యుత్తు ప్లాంటులో విస్ఫోటం జరిగింది. కొన్ని పరిశ్రమల్లో మంటలు రేగాయి. ఇలా ఈ భూకంపం వల్ల అనేక గొలుసు కట్టు విపత్తులు సంభవించాయి.

 

11 దేశాలపై ప్రభావం

  2004, డిసెంబరు 26న ఇండోనేషియాలోని జావా, సుమత్రా దీవుల మధ్య సుండా అగాధంలో సునామీ ఏర్పడింది. ఇది చుట్టూ ఉన్న 11 దేశాలను నష్టపరిచింది. మన దేశంలో తమిళనాడు తీరంలోని నాగపట్నం ఎక్కువగా దెబ్బతింది. దీంతోపాటు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి; కేరళ రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించాయి.

 

భారత్ తీరరేఖకూ..

  ఒకచోట ఏర్పడిన సునామీ కెరటాల ప్రభావం వాటి తీవ్రతను బట్టి అన్ని మహాసముద్రాల్లోనూ కనిపించవచ్చు. భారతదేశ తీరరేఖ మొత్తం సునామీ ముప్పును కలిగి ఉంది. మనదేశ భూపటల పలక (క్రస్ట్ ప్లేట్) ఆస్ట్రేలియన్ పలక నుంచి దూరంగా జరుగుతున్నందున మన దేశానికి తరచుగా సునామీలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. భారతదేశానికి దూరంగా రెండు చోట్ల ఏర్పడుతున్న భూకంపన అధికేంద్రాల వద్ద సునామీలు ఏర్పడి మనదేశ తీరాన్ని తాకుతున్నాయి.
1. అండమాన్ నికోబార్ దీవులు, సుమత్రాదీవి వంపు దగ్గర ఏర్పడిన సునామీలు భారత్‌తో సహా ప్రధాన దేశాలను చేరడానికి 3 నుంచి 5 గంటల వ్యవధి పడుతుంది.
2. అరేబియన్ మైక్రో పలక భారత్ భూపటల పలకను ఢీ కొడుతున్నందున అరేబియా సముద్రంలోని మక్రాన్ ప్రాంతంలో సునామీ ఏర్పడుతుంది. ఇది ప్రధాన భారత తీరానికి అంటే గుజరాత్ తీరాన్ని చేరడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది.

 

అంతర్జాతీయ హెచ్చరిక వ్యవస్థ

  సునామీ ఏ తీరాన్నైనా తాకే ప్రమాదం ఉంది. అలాగే అవి ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతుంటాయి. ఈమేరకు అంతర్జాతీయ సునామీ హెచ్చరిక వ్యవస్థను హవాయి దీవుల్లోని హోనలూలు వద్ద 1946లో ఏర్పాటు చేశారు. దీన్ని పసిఫిక్ సునామీ వార్నింగ్ (Pasific Tsunamy Warning System - PTWS)సెంటర్ అంటారు. ఇది సునామీ రావడానికి గంటల ముందు సంబంధిత దేశాలను అప్రమత్తం చేస్తుంది. కొన్ని దేశాల్లో ప్రాంతీయ హెచ్చరిక కేంద్రాలు కూడా ఉన్నాయి.

 

భారత్‌లోనూ...

  గతంలో జరిగిన భూకంపాల సమాచారం ఆధారంగా ప్రస్తుత భూకంపం వల్ల సునామీ ముప్పును అంచనా వేసేవారు. ఈ సమాచారం 15 నిమిషాల ముందు మాత్రమే హెచ్చరిక జారీ చేయడానికి పరిమితం అయ్యేది. తర్వాత సర్వే ఆఫ్ ఇండియా తీరం వెంబడి టైడ్‌గేజ్ విధానాన్ని అమలు చేసింది. ఇది కూడా చాలా ఆలస్యంగానే సమస్య తీవ్రతను తెలియజేసేది.
2004లో ఏర్పడిన సునామీని రాడార్ల సహకారంతో తెలుసుకున్నారు. ఇది భూకంపం వచ్చిన రెండు గంటల తర్వాత మాత్రమే తరంగాల ఎత్తును నమోదు చేయగలిగింది.
2007, అక్టోబరు 15న ఐఎన్‌సీవోఐఎస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్)లో సత్వర సునామీ హెచ్చరిక కేంద్రాన్ని (సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ - టీఈడబ్ల్యూసీ) ఏర్పాటు చేశారు. ఇది హైదరాబాద్‌లో ఉంది.

 

తీవ్రతను తగ్గించాలంటే..

* తీరం వెంబడి జపాన్‌లా గోడలు నిర్మించి సునామీ తీవ్రతను తగ్గించవచ్చు. మడ అడవులను పెంచడం ద్వారా కూడా ప్రయోజనం ఉంటుంది.
* తీరం సమీపంలో నిర్మాణాలను దృఢంగా, ఎత్తయిన ప్రాంతాల్లో నిర్మించాలి.
* విపత్తు సమయంలో సహాయ కేంద్రాలుగా పనిచేసే కమ్యూనిటీ హాల్స్‌ను ఎత్తయిన ప్రాంతంలో నిర్మించాలి.
* సరైన వరద నివారణ చర్యలు ముందుగానే కలిగి ఉండాలి.
* సరైన భూ వినియోగ ప్రణాళిక అవసరం.

 

సునామీలెలా ఏర్పడతాయి?

  జలాశయాల్లో ఆకస్మిక చలనం వల్ల సునామీ తరంగాలు ఏర్పడతాయి. ఇవి ముఖ్యంగా సముద్ర తీరాల వద్ద ఎక్కువ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. సునామీల వల్ల వాటిల్లే నష్టం, అవి ఏర్పడే స్థానం, ప్రయాణం చేసే దూరం, తాకే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. అవి ఏర్పడే ప్రాంతం నుంచి 30 నిమిషాల్లో తీరాన్ని తాకే సునామీలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి.
* సముద్రం దగ్గర లేదా లోపల బలమైన భూకంపాలు వచ్చినప్పుడు ఏర్పడిన భ్రంశ చలనాల వల్ల సునామీలు సర్వసాధారణంగా సంభవిస్తాయి. పెద్దఎత్తున ఏర్పడిన సునామీ తరంగాలు మహాసముద్రాలను కూడా దాటే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 1960 చిలీలో రిక్టర్ స్కేలుపై 9.5 గా నమోదైన భూకంపం వల్ల ఏర్పడిన సునామీ తరంగాలు జెట్ వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రం అవతల ఉన్న జపాన్ తీరంలోని మత్స్య పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించాయి. సాధారణంగా సముద్ర గర్భంలో భూకంపం వచ్చినప్పుడు దాని తీవ్రత రిక్టర్ స్కేలు మీద 7.5 గా నమోదైనప్పుడు సునామీలు సంభవిస్తాయి.
* సముద్రం కింద లేదా సముద్రానికి దగ్గరలో భూపాతం (ల్చ్థ్టి ళ్ద్ట్ఠీౖ) జరిగి కొండచరియలు నీటిలో పడినప్పుడు సునామీ ఏర్పడవచ్చు. 1958లో అలస్కాలోని లిటుయా బేలో సంభవించిన భూపాతం వల్ల 50-150 మీటర్లు ఎత్తున సముద్ర కెరటాలు తీరాన్ని తాకాయి.
* సముద్రాల్లో అగ్నిపర్వతాల విస్ఫోటం జరిగినప్పుడు కూడా సునామీలు ఏర్పడవచ్చు. 1883లో ఇండోనేషియాలోని కాక్రటోవా అగ్నిపర్వతం విస్ఫోటం చెందినప్పుడు జావా, సుమత్రా దీవుల్లో 40 మీటర్ల ఎత్తున సునామీ ఏర్పడింది.
సునామీ (Tsunami) అనేది జపాన్ పదం. జపాన్ భాషలో గ్బ్యి అంటే హార్బర్ (ఓడరేవు), nami అంటే వేవ్ (కెరటం) అని అర్థం. ఈ రెండు పదాల కలయికే సునామీ. తమిళంలో సునామీని ఆఝి పెరలై (Aazhi peraial) అని కూడా అంటారు.

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సునామీ

మాదిరి ప్రశ్నలు

 

1. ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీల శాతం ఎంత?
జ: 8%

 

2. భారతదేశంలో సునామీలు ఎక్కడ వస్తున్నాయి?
జ: బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో

 

3. ఇటీవల బంగాళాఖాతంలో సునామీ ఎప్పుడు ఏర్పడింది?
జ: 2004, డిసెంబరు 26

 

4. సునామీ అంటే ...?
జ: తీరాన్ని ముంచేసిన పెద్ద అలలు

 

5. సునామీ అనేది ఎలాంటి విపత్తు?
జ: భౌగోళిక

 

6. అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది?
జ: హోనలూలు

 

7. సునామీలు ఎక్కడ ఏర్పడతాయి?
ఎ) పసిఫిక్ మహాసముద్రం బి) అంట్లాటిక్ మహాసముద్రం
సి) హిందూ మహాసముద్రం డి) పైవన్నీ
జ: డి

 

8. సునామీలు ఏర్పడటానికి ప్రధాన కారణం?
జ: సముద్రాల్లో భూకంపాలు సంభవించడం

 

9. సునామీలు అధికంగా ఏర్పడే సముద్రం ఏది?
జ: పసిఫిక్ మహాసముద్రం

 

10. సునామీలు ఎలా ఏర్పడతాయంటే...?
ఎ) సముద్రాల్లో భూకంపాలు బి) సముద్రాల్లో అగ్నిపర్వత విస్ఫోటం
సి) సముద్రాల్లో భూపాతం డి) పైవన్నీ
జ: డి

 

11. సునామీ ఎప్పుడు సంభవిస్తుంది?
జ: రాత్రి, పగలు సమయాల్లో

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కాలుష్యం

  యావత్తు భూమండలం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటి. మానవ జీవనం ప్రశాంతంగా సాగిపోవడానికి తోడ్పడే ప్రకృతిని దారుణంగా దెబ్బతీస్తున్న కాలుష్యం ఫలితంగా ఎన్నో దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. ప్రధాన జీవాధారాలైన గాలి, నీరు, పర్యావరణం తీవ్రంగా కలుషితం అవుతున్నాయి. ఇందుకు దారితీసిన పరిస్థితులు, అనంతర పరిణామాలపై టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం అందిస్తున్న అధ్యయన సమాచారం..
భూగోళం నాలుగు ఆవరణాలతో కూడి ఉంది. అవి శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. ఈ ఆవరణాలన్నింటిని కలిపి పర్యావరణం అంటారు. ఒక జీవి చుట్టూ ఉండే భౌతిక, రసాయనిక, జీవ పరిస్థితులను పర్యావరణం లేదా పరిసరాలు అని చెప్పవచ్చు. ఈ పర్యావరణాన్ని అనేక రకాల కాలుష్యాలు దెబ్బతీస్తున్నాయి.

 

కాలుష్యం అంటే..?

  భౌతిక, థర్మల్, జైవిక, రేడియోధార్మిక ధర్మాల్లో సంభవించే మార్పులు జీవుల ఆరోగ్యం, భద్రతకు హాని కలిగించే విధంగా ఉంటే దాన్ని కాలుష్యంగా పరిగణిస్తారు. ప్రస్తుత సమాజంలో వేగంగా విస్తరిస్తున్న ఆరోగ్య సమస్యలకు కాలుష్యమే ప్రధానమైన కారణం. కాలుష్యానికి గురవుతున్నవారిలో మహిళలు, పిల్లలే ఎక్కువ. 1972 జూన్ 5న స్టాక్‌హోంలో ప్రపంచ పర్యావరణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగంలో పర్యావరణ ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రకృతి, పర్యావరణం గురించి చర్చించిన అధర్వణ వేదంలోని కొన్ని అంశాలను ప్రస్తావించారు. పూర్వీకులు ప్రకృతిని ఆరాధించేవారని.. భూమి, గాలి, నీరు, ఆకాశం, అంతరిక్షం - వీటిలోని సమస్త జీవ జాతులన్నింటిలోనూ శాంతి పరిఢవిల్లాలని ప్రార్థించేవారని తన ప్రసంగంలో పేర్కొన్నారు. పర్యావరణం కలుషితం కాకుండా చూడాలని, ప్రకృతి సమతౌల్యం సాధిస్తేనే భూమండలంపై ఉన్న సమస్త జీవులు సురక్షితంగా ఉండగలుగుతాయని పిలుపునిచ్చారు.

 

కాలుష్య కారకాలు

  జనాభా విస్ఫోటమే అన్ని రకాల కాలుష్యానికి ప్రధాన కారణం. తారు, చెత్త లాంటి వ్యర్థ పదార్థాలు; సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, అమ్మోనియం, ఫ్లోరిన్, క్లోరిన్, హైడ్రోజన్ లాంటి వాయువులు; ఫ్లోరైడ్ లాంటి రసాయన పదార్థాలు; సీసం, ఇనుము, జింకు, పాదరసం లాంటి మూలకాలు; హెర్బిసైడ్లు, క్రిమిసంహారక మందులు, కృత్రిమ ఎరువులు, రేడియో ధార్మిక పదార్థాలు, శబ్దం, అధిక ఉష్ణం.. ఇవన్నీ కాలుష్య కారకాలే. జనాభా విపరీతంగా పెరగడంతో నీటి వినియోగం కూడా ఎక్కువైంది. ఇది కూడా కాలుష్యానికి కారణమవుతోంది.

 

జల కాలుష్యం

  సమస్త జీవులకు నీరు ప్రాణాధారం. తాగడానికి, పంటలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు, మానవ నిత్యావసరాలకు నీరు చాలా అవసరం. జల కాలుష్యంతో నీటి స్వభావం మారిపోతోంది. ఉపయోగానికి పనికి రాకుండా పోతోంది. అంతేకాదు దాని ఉపయోగం ప్రమాదకరం కూడా. అన్ని ప్రాంతాల్లో కావాల్సినంత పరిమాణంలో మంచినీరు లభించడం లేదు.
  ప్రాణకోటికి ప్రమాదకరమైన అదనపు పదార్థాలు నీటిలో కలవడాన్ని జల కాలుష్యంగా నిర్వచించవచ్చు. ఇది జీవరాశులకు తీవ్రమైన హాని కలిగిస్తుంది. స్వచ్ఛమైన నీటిలో ఆక్సిజన్, హైడ్రోజన్, సేంద్రీయ సమ్మేళనాలు, ఫాస్ఫేట్‌లు, ఒండ్రుమట్టి, సూక్ష్మజీవులు లాంటివి కలిసి ఉంటాయి. కాలుష్యం వల్ల వీటి మధ్య సమతౌల్యం దెబ్బతింటుంది.

 

జల కాలుష్య కారకాలు
1) మురుగు వ్యర్థ పదార్థాలు
2) అంటు వ్యాధుల ఏజెంట్లు
3) విదేశీ సేంద్రీయ రసాయనాలు
4) రసాయనిక ఖనిజ పదార్థాలు, సమ్మేళనాలు

 

పర్యావరణ సమస్యలు 

 పరాన్నజీవులు, సూక్ష్మజీవులను తనలో ఇముడ్చుకుని నీరు కలుషితమవుతుంది. వాస్తవానికి ఎన్నో వ్యాధులు, ఇతర పర్యావరణ ప్రమాదాల కంటే నీటి కాలుష్యమే ప్రధానమైంది. విపరీతంగా పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ వల్ల స్వచ్ఛమైన నీటికి కొరత ఏర్పడుతోంది. కలుషిత నీరు వివిధ రోగాలకు కారణమవుతోంది. భారతదేశంలో 80 శాతం వ్యాధులు జల కాలుష్యం వల్ల సంభవిస్తున్నాయి.

 

నీటి కాలుష్య దుష్ఫలితాలు

* కలరా, టైఫాయిడ్, విరోచనాలు లాంటి వ్యాధులు సంక్రమించడం.
* జలచరాలు.. ముఖ్యంగా చేపలు చనిపోవడం. దాంతో జల ఆహార నిల్వలు తగ్గిపోవడం.
* నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో దంతాలపై ఉండే ఎనామిల్ ఊడిపోవడం, గారకట్టడంతోపాటు ఎముకలు దెబ్బతినడం.
* నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటే చిన్నపిల్లల రక్తం నీలిరంగులోకి మారి ఒక రకమైన వ్యాధి బారిన పడటం.
* నీటిలో ఫాస్ఫేట్‌లు ఎక్కువై జలచరాలు చనిపోవడం.
* నీటిలో కొన్నిరకాల విష రసాయనాల ప్రమాణం ఎక్కువైన సందర్భాల్లో పిల్లలు కురూపులు, వికలాంగులుగా జన్మించడం.

 

నివారణ చర్యలు

* పారిశ్రామిక మురుగులో సేంద్రీయ పదార్థాలైన కర్బనం, నత్రజని, గంధకం, సీసం, పాదరసం లాంటి రసాయనాలు ఉంటాయి. ఈ మురుగు సహజ నీటివనరుల్లో కలిస్తే అవి కలుషితం అవుతాయి.
* పరిశ్రమలు విడుదల చేసే మురుగును శుద్ధిచేసే బాధ్యతను ఆయా పారిశ్రామిక యాజమాన్యాలే నిర్వహించి, మురుగు శుద్ధి కర్మాగారాలను నెలకొల్పాలి.
* ఇళ్లలోని మురుగుకోసం ఆక్సిడేషన్ సాండ్స్, సెప్టిక్ ట్యాంకులను ప్రతి ఇంటిలో నిర్మించుకోవాలి. మురుగునీటిని శుద్ధి చేయకుండా వదలడం శిక్షార్హమైన నేరం.
* కాలుష్య నియంత్రణ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించాలి.
* కాలుష్య నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి.

 

ధ్వని కాలుష్యం

మనం వినగలిగే శబ్దాల మోతాదుకు మించి వినే శబ్దాన్నే ధ్వని కాలుష్యం అనవచ్చు. వాహనాలు, పరిశ్రమలు, లౌడ్ స్పీకర్లు వంటివి ధ్వని కాలుష్య కారకాలు.
బహిరంగ ప్రదేశాల్లో ఉదయం 50 డెసిబుల్స్‌కి మించని ధ్వని ఆరోగ్యకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నివేదికలు తెలుపుతున్నాయి. పర్యావరణ నిపుణులు ధ్వని కాలుష్యం సుమారు 70 డెసిబుల్స్ స్థాయిని మించి ఉండరాదని చెబుతున్నారు. వివిధ పట్టణాలు, నగరాల్లో రద్దీ సమయాల్లో ప్రధాన రహదారుల్లో ధ్వని కాలుష్యం 90 నుంచి 110 డెసిబుల్స్ వరకు ఉంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాలు, పరిమితుల ప్రకారం.. ధ్వని తీవ్రత పారిశ్రామిక వాడల్లో రాత్రి 65 డెసిబుల్స్, పగలు 75 డెసిబుల్స్; నివాస ప్రాంతాల్లో రాత్రి 45 డెసిబుల్స్, పగలు 55 డెసిబుల్స్; ఆస్పత్రుల వద్ద రాత్రి 45 డెసిబుల్స్, పగలు 50 డెసిబుల్స్ మించి ఉండకూడదు.
రైల్వేలు, పరిశ్రమలు, నిర్మాణ రంగ కార్యకలాపాలు, ప్రజా సమూహాలు, లౌడ్ స్పీకర్‌లు.. ఇవన్నీ ధ్వనిని వ్యాప్తి చేస్తాయి. ధ్వని ఎక్కువగా ఉన్నప్పుడు పర్యావరణంలో అసమతౌల్యం ఏర్పడుతుంది. ఇలా నిరంతర ధ్వని కాలుష్య ప్రభావం వల్ల శ్రామిక సామర్థ్యం, వారి వృత్తిపరమైన పనితీరు క్షీణిస్తుంది.

 

ధ్వని కాలుష్య సమస్యలు

* నిద్రలేమి
* తొందరగా అలసిపోవడం
* వికారం, అధిక రక్తపోటు
* అల్సర్లు, రక్తహీనత, నరాలపై తీవ్ర ప్రభావం
* తలనొప్పి, శ్వాస సంబంధ వ్యాధులు, వినికిడి సమస్యలు
* మెదడు, నాడీ వ్యవస్థ క్రమంగా దెబ్బతిని, చికాకు పెరగడం.

 

వాయు కాలుష్యం

వాతావరణంలో వాయువులు సాధారణ నిష్పత్తిలో ఉన్నంత వరకు కాలుష్యం ఉండదు. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, ధూళి కణాలు, పొగ, పొగమంచు లాంటివి గాలిలో అధికంగా చేరడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది.

 

వాయు కాలుష్య కారణాలు

* నిబంధనలను పాటించని వ్యవసాయ కార్యకలాపాలు
* పదార్థాల దహనం
* యంత్రాల సహాయంతో జరిగే ఉత్పత్తి ప్రక్రియలు
* ద్రావణాల ఉపయోగం
* అణుధార్మిక పదార్థాల వినియోగం

 

దుష్ప్రభావాలు

వాయు కాలుష్యం మానవుడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది శ్వాస, రక్త ప్రసరణ వ్యవస్థల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
* కార్బన్ మోనాక్సైడ్ రక్తంలోని హిమోగ్లోబిన్‌తో కలిసిపోయి శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది.
* సల్ఫర్ డై ఆక్సైడ్ ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపుతుంది. ఆస్తమాకు కారణమవుతూ, మరణాల రేటును పెంచుతుంది.
* నైట్రోజన్ డై ఆక్సైడ్ - బ్రాంకైటీస్, ఆస్తామా వ్యాధులను కలిగిస్తుంది.
* గాలిలో అధిక పరిమాణంలో ఉన్న సీసం ఎముకలు, కాలేయం, గుండె, మూత్రపిండాల పనితీరుపై చెడుప్రభావాన్ని చూపుతుంది.
* శిలాజ ఇంధనం అధికంగా వాడటం వల్ల గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగి హరితగృహ ప్రభావానికి దారితీస్తుంది.

 

నివారణ చర్యలు

* వాయు కాలుష్యాన్ని నివారించేందుకు బ్యాగ్ ఫిల్టర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్పిటేటర్స్ లాంటి నియంత్రణ పరికరాలను ఉపయోగించాలి.

 

రేడియో ధార్మిక కాలుష్యం

రేడియేషన్‌కు గురికావడం ప్రకృతి సహజమే అయినా అణువిద్యుత్తు, అణ్వస్త్రాల ఉత్పత్తి భారీస్థాయిలో చేపట్టడం వల్ల మానవులు భారీ పరిమాణంలో రేడియేషన్‌కు గురవుతున్నారు. ఆయా సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ప్రత్యక్షంగా రేడియో ధార్మికతకు గురవుతున్నారు. ఫలితంగా క్యాన్సర్, జన్యు సంబంధ వ్యాధులబారిన పడుతున్నారు. పిల్లలు అనారోగ్యంతో జన్మిస్తున్నారు.

 

ముఖ్యాంశాలు

* ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతున్న ప్రధాన సమస్యల్లో పర్యావరణ కాలుష్యం ఒకటి.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో తేలిందేమిటంటే.. ఒక్క భారతదేశంలోని ఆరు ప్రధాన నగరాల్లోనే ఏటా సుమారు 40-50 వేల మంది కాలుష్యం వల్ల చనిపోతున్నారు.
* భారతదేశంలోని సహజ నీటి వనరుల్లో సుమారు 80 శాతం నీరు కలుషితమై.. మనుషులు, జంతువులు, పశుపక్ష్యాదులకు కూడా తాగడానికి పనికిరావడం లేదని ఇటీవల ఒక సర్వేలో తేలింది.
* తెలంగాణలో గోదావరి నదీతీరం వెంబడి ఉన్న సిర్‌పూర్‌లో కాగితపు వ్యర్థాలు, అక్కడి ప్రజలు గోదావరిలోకి వదిలే కాలుష్యాలు ఏటూరునాగారం ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. ఈ రెండు ప్రాంతాల కలుషితాల ప్రభావం భద్రాచలం మీద ఉంటుంది.
* ప్రపంచం మొత్తం వాతావరణ కాలుష్యంలో సగానికి పైగా కాలుష్యానికి ఒక్క అమెరికాయే కారణమవుతోంది.


అత్యంత కలుషితమై'నది' గంగా

భారతదేశంలోని గంగానది సుమారు 1760 కి.మీ.ల మేర కలుషితమై ప్రపంచంలో అత్యంత పొడమైన కలుషిత నదిగా మారడంతో.. ఈ పరిస్థితిని నివారించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం రూ. 10 వేల కోట్లను కేటాయించింది. 'గంగానది ప్రక్షాళన' పేరుతో కేంద్ర జలవనరుల సంఘం నివారణ చర్యలు చేపడుతోంది. దీనికి ప్రధాన కారణం.. దేశ విస్తీర్ణంలో గంగానది పరివాహక ప్రాంతం 8.61 లక్షల చదరపు కిలోమీటర్లు (1/4వ వంతు) ఉండి.. 45 కోట్ల మంది ప్రజలు జీవిస్తుండటమే.

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ అంశాలు

  మానవుడు ఎదుర్కొంటున్న ప్రకృతి సిద్ధమైన విపత్తుల్లో భూకంపాలు అత్యంత విధ్వంసకరమైనవి. రోజురోజుకూ సాధిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని ఎదుర్కోవడానికి మనిషి ఎంత ప్రయత్నిస్తున్నా.. ఇవి సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. భౌతిక, ఆర్థిక, సాంఘిక, పర్యావరణ అంశాల్లో ఎప్పటికప్పుడు మానవులను వెనక్కు నెట్టేస్తున్నాయి. ఇంతటి విపత్తు కారకాలైన భూకంపాలు ఎలా వస్తాయి? ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశంలో ఇవి సంభవించడానికి దారితీసే పరిస్థితులున్న ప్రాంతాలు ఏవి? హైదరాబాద్ నగరం పరిస్థితి ఏమిటి? భూకంపాలకు సంబంధించిన విపత్తు నిర్వహణ ఎలా ఉండాలి? టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ విభాగం - 'విపత్తు నిర్వహణ'లో భూకంపాలు కీలకాంశాల్లో ఒకటి. వీటిపై అభ్యర్థులు సమగ్ర అవగాహన సాధించాలి.

  సరైన సాంకేతిక పరిజ్ఞానం కొరవడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలకే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలు (సూపర్ కంట్రీలు)గా నిలవాలని ప్రయత్నిస్తున్న చైనా, జపాన్ లాంటి వాటికి కూడా భూకంపాలు పెద్ద ప్రశ్నార్థకంగా మారాయి. ఒక సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిగా చిన్న ప్రకంపనలు, భూకంపాలు సంభవిస్తుండగా.. ఒక మాదిరి నష్టం కల్పించే భూకంపాలు రెండెంకెల్లోను, తీవ్రమైన నష్టాలు మిగిల్చే భూకంపాలు ఒక అంకెలోనే ఏర్పడుతున్నాయి. ఇవి మానవుల అభివృద్ధిని కొన్ని దశబ్దాల వెనక్కు నెట్టేస్తున్నాయి. ఇవి వాటిల్లేటప్పుడు ఏమాత్రం ముందుస్తు హెచ్చరికలు జారీచేసే సమయం కూడా ఉండదు.

 

ఎలా సంభవిస్తాయి?

  భూమి ఉపరితలం ఆకస్మికంగా కదలడాన్నే భూకంపం అంటారు. ఖండ పలకల కదలికలు లేదా భూపటల కదలికలు లేదా విరూప కారక చలనాల (టెక్టోనిక్ చలనాలు) వల్ల ప్రధానంగా భూకంపాలు సంభవిస్తాయి. అయితే కొండ చరియలు విరిగి పడటం (భూపాతం), హిమశిఖరాలు విరిగి పడటం (హిమపాతం).. అగ్నిపర్వతాల విస్ఫోటం సందర్భాల్లో; భూమిలోపల యురేనియం, థోరియం లాంటివి విస్ఫోటనం చెందినప్పుడు.. భూపొరల మధ్య సర్దుబాటు జరిగినప్పుడు.. ఇలాంటి మరికొన్ని కారణాల వల్ల కూడా భూమి కంపిస్తుంది.
భూపటల పలకలు అంచుల వద్ద జారడం వల్ల, ఎదురుగా అభిసరణం (కన్వర్జెన్స్) చెందే ప్రాంతాల్లో భూమి పొరల లోపల సంచిత శక్తి విడుదలవుతుంది. ఇలాంటి ప్రాంతాలను భ్రంశ మండలాలు (ఫాల్ట్ జోన్స్) అంటారు. ఈ ప్రాంతాల్లో స్థితి స్థాపక శక్తి, నిరోధక స్థితి స్థాపకతగా మారి ప్రకంపనాలు విడుదలవుతాయి. అవి భూఉపరితలానికి శి, ళీ, లి అనే మూడు రకాల తరంగాలుగా చేరి భూమిని కంపింపజేస్తాయి. ఈ ప్రక్రియ అంతా ఒక్క నిమిషంలో పూర్తవుతుంది.

 

ఎలా గుర్తిస్తారు?

  భూకంపాలను, భూకంపన పరిమాణాన్ని గుర్తించడానికి సిస్మోగ్రాఫ్ (భూకంప లేఖిని) అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. భూకంపాల తీవ్రత / బలం / శక్తిని కొలిచే స్కేలే రిక్టర్ స్కేలు. ఈ మాట బాగా వాడుకలో ఉంది. భూకంపం వల్ల నష్టం జరిగే ప్రాంతాన్ని అధికేంద్రం (న్ప్ఞ్ఠ్థ్మ్ఠ్ిౖ) అంటారు. ఇది నాభికి నేరుగా భూ ఉపరితలంపై ఉండే బిందువు. భూమి లోపలి పొరల మధ్య ప్రకంపనాలు ఏర్పడే అంతర్భాగ కేంద్ర బిందువును నాభి (హైపో సెంటర్) అంటారు. ఈ రెండింటి మధ్య ఉన్న దూరం మీద భూకంప బలం ఆధారపడి ఉంటుంది. నాభిలోతు పెరుగుతుంటే భూకంపం బలం తగ్గుతుంది. నాభిలోతు తగ్గుతుంటే భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 1943లో ఇండోనేషియాలో జరిగిన భూకంప నాభి లోతు 720 కిలోమీటర్లుగా నమోదైంది.

 

భూకంపాలు - రకాలు

1. గాధ భూకంపాలు: భూకంప నాభిలోతు 60 కిలో మీటర్ల కన్నా తక్కువ ప్రాంతంలో ఏర్పడే భూకంపాలు. అధిక శాతం భూకంపాలు ఇవే.

2. మాధ్యమిక భూకంపాలు: నాభిలోతు 60 నుంచి 300 కి.మీ.ల మధ్య ఏర్పడే భూకంపాలు.

3. అగాధ భూకంపాలు: నాభిలోతు 300 నుంచి 700 కి.మీ.లు, ఆపైన జరిగే భూకంపాలు.

 

ఎలా కొలుస్తారు?

  భూకంపాల తీవ్రతను కొలవడానికి పురాతన, నవీన అనే రకాల స్కేళ్లు ఉన్నప్పటికీ మెర్కిలీ స్కేలు, రిక్టర్ స్కేలు ముఖ్యమైనవి. రిక్టర్ స్కేలులో 0-9 వరకూ పాయింట్లు ఉంటాయి. ఇది భూకంప నష్టాన్ని, బలాన్ని రెండింటినీ కొలవగలదు. అందువల్ల దీన్ని మాగ్నిట్యూడ్ స్కేలు అంటారు. ఎంఎస్‌కే స్కేలు (మెద్వదేవ్ స్పాన్ హువర్ - కార్నిక్ స్కేలు), మెర్కిలీ స్కేలు రెండూ ఒకే రకమైనవి. ఇందులో | - శ్రీ|| భాగాలుగా విడగొట్టి ఉంటాయి.
ఎక్కువ దేశాలు రిక్టర్ స్కేలును వాడుతున్నాయి. ఈ స్కేలు ప్రకారం 5.9 లేదా 6 పాయింట్లు దాటితే స్థలాన్ని బట్టి కొంత నష్టం ప్రారంభమవుతుంది. ట్రై నైట్రో టోలిన్ అనే రసాయన పదార్థ విస్ఫోటంతో సంతులనం చేస్తూ ఈ స్కేలును తయారు చేశారు.

 

రెండు భూకంప ప్రాంతాలు

ప్రపంచంలో రెండు భూకంప ప్రాంతాలను నిర్ణయించారు.
1. ఫసిఫిక్ పరివేష్ఠిత మేఖల: ఇది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ప్రాంతం. ఇందులో దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలోని పెరూ, ఈక్విడార్, చిలీ, కొలంబియా, వెనుజులా వంటి దేశాలున్నాయి. ఉత్తర అమెరికా పశ్చిమతీరంలోని మెక్సికో, కాలిఫోర్నియా, అలస్కా లాంటి అమెరికా రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అలాగే ఆసియా ఖండం తూర్పుతీరంలోని చైనా, జపాన్, రష్యా, ఫిలిప్పైన్స్, ఇండోనేసియా, మలేసియా, న్యూజిలాండ్ దేశాల్లో భూకంపాలు తరుచుగా సంభవిస్తున్నాయి.

2. మధ్యపర్వత మేఖల: ఈ భ్రంశ మండలం యూరప్ ఖండంలోని ఆల్ఫ్స్ పర్వతాల నుంచి, హిమాలయాల వరకూ విస్తరించి ఉంది. ఇందులో భారత్, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్, ఇరాన్, ఇరాక్, టర్కీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలున్నాయి. ఈ విధంగా భూకంపాలన్నీ భ్రంశ మండలాలు, ముడుత పర్వతాలున్న ప్రాంతాల్లో సంభవిస్తున్నాయి.

 

భారతదేశంలో భూకంపాలు

  ప్రపంచంలో అత్యంత నవీన ముడుత పర్వతాలు హిమాలయాలు. నేపాల్‌లో 2015 ఏప్రిల్ 25, ఆ తరువాత సంభవించిన భూకంపాలకు కారణం ఇవే. భారతదేశాన్ని 5 భూకంప జోన్లు(మండలాలు)గా నిర్ణయించారు. అయితే 1997లో వల్నరబులిటీ అట్లాస్ (దుర్బలత్వ అట్లాస్) ప్రకారం ఒకటో జోన్‌ను రెండో జోన్‌లో కలిపేశారు.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రూపొందించిన మ్యాప్ ప్రకారం కింది జోన్‌లు మన దేశంలో ఉన్నాయి.
5వ జోన్: రిక్టర్ స్కేలు తీవ్రత 7 పాయింట్లు దాటిన భూకంప ప్రాంతం. ఇది అత్యంత అపాయకరమైన జోన్. ఇందులో ఉత్తర బిహార్, ఉత్తరాఖండ్ ఉత్తర భాగం, అన్ని ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లో కొంతప్రాంతం, గుజరాత్‌లోని కచ్, బుజ్ ప్రాంతాలు ఉన్నాయి.
4వ జోన్: రిక్టర్ స్కేలు 6 నుంచి 7 పాయింట్ల తీవ్రత నమోదైన ప్రాంతం. ఇది అధిక అపాయం ఉన్న ప్రాంతం. ఇందులో దిల్లీ, సిక్కింతో పాటు బిహార్, ఉత్తరాఖండ్, గుజరాత్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలున్నాయి. వీటితో పాటు మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతం ఉంది.
3వ జోన్: రిక్టర్ స్కేలు తీవ్రత 4 నుంచి 6 పాయింట్లున్న ప్రాంతాలు. ఇవి ఒక మాదిరి అపాయం ఉన్న భూకంప ప్రాంతాలు. ఇందులో పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌తోపాటు మధ్య, దక్షిణ భారతదేశం ఉంది. కోల్‌కతా, చెన్నై, ముంబయి నగరాలు కూడా ఉన్నాయి.
2వ జోన్(1, 2 జోన్లు కలిపి): ఈ ప్రాంతాలు అత్యల్ప అపాయం ఉన్నవి లేదా అపాయం లేనివి. ఇందులో రిక్టర్ స్కేలు తీవ్రత 4 పాయింట్ల కంటే తక్కువగా ఉంటుంది. ఈ జోన్ పరిధిలో దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఉన్నాయి.

 

ఉపశమన చర్యలు

సాంకేతిక రంగం అత్యంత అభివృద్ధి సాధించినా భూకంపాలను రాకుండా ఆపలేం. కొన్ని ఉపశమన చర్యలు మాత్రం చేపట్టవచ్చు.
నిర్మాణాత్మక చర్యలు: సరైన ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ పద్ధతులను పాటించడం ద్వారా భవన నిర్మాణాలు చేపడితే కొంత నష్టాన్ని నివారించే వీలుంది.
నిర్మాణేతర చర్యలు: భూకంప దుర్బలత్వం ఉన్న ప్రాంతాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చిన భవన నిర్మాణ నిబంధనలను అనుసరించడం. భవన నిర్మాణానికి ముందు నిర్మాణ ప్లాన్‌ను పురపాలక యంత్రాంగాలు క్షుణ్నంగా తనిఖీ చేయడం.
జాతీయ భవన నిర్మాణ కోడ్: సమగ్రమైన కోడ్‌ను 1970లో రూపొందించారు. దీన్ని 1987లో రెండుసార్లు, 1997లో ఒకసారి సవరించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నియమాలను రూపొందించారు.
బిల్డింగ్ మెటీరియల్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్: ఇది భవనాల పునర్నిర్మాణానికి, ప్రాణాలు కాపాడే విధంగా నిర్మాణాలు చేపట్టడానికి సరైన సాంకేతిక పద్ధతులు, సరైన మెటీరియల్ వాడటానికి భాధ్యత వహిస్తుంది.

 

ఇతర నియమాలు:

* గట్టినేలపై ఇల్లు కట్టు కోవాలి.
* మూల మట్టాలన్నింటి వద్ద కనెక్షన్ దృఢంగా ఉండాలి.
* పటిష్ఠమైన పునాది నిర్మించుకోవాలి.
* పైకప్పు దృఢంగా వేయాలి.
* పైకప్పు ఒకే సమీకృత యూనిట్‌గా వేయాలి.
* భవనం సాధారణంగా దీర్ఘ చతురస్రాకార ప్రణాళికతో ఉండాలి.

 

ముఖ్యాంశాలు

* భారతదేశంలో భూకంపాల పర్యవేక్షణకు భారత వాతావరణ విభాగం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది.
* భారత వాతావరణ విభాగం నేషనల్ సిస్మలాజికల్ నెట్‌వర్క్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 55 అధ్యయన కేంద్రాలున్నాయి.
* మనదేశంలోని మెట్రో నగరాల్లో ఒక్క దిల్లీ మాత్రమే భూకంపాల పరిధిలో ఉంది.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద భూకంపం 1969 ఏప్రిల్ 13న కిచ్చెన్నపల్లి
- గొల్లగూడెం ప్రాంతంలో సంభవించింది. దీన్నే భద్రాచలం భూకంపం అంటారు.
* హైదరాబాద్ నగరం భూకంపాల తీవ్రతలో రెండో జోన్ పరిధిలో ఉంది.
* భారతదేశంలో ఇంతవరకూ పెద్ద భూకంపం 1897లో షిల్లాంగ్ పీఠభూమిలో సంభవించింది. ఇది రిక్టర్‌స్కేలుపై 8.7గా నమోదయింది.
* ప్రపంచంలో ఇంతవరకూ పెద్ద భూకంపం చిలీ భూకంపం. 1960 మే 20న సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌స్కేలుపై 9.25గాను, మెర్కిలీ స్కేలుపై 9.5గాను నమోదైంది.
* ప్రపంచంలో ఇంతవరకు సంభవించిన భూకంపాల్లో రెండో అతిపెద్దది అలస్కా భూకంపం. 1965లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 9.1 గాను, మెర్కిలీ స్కేలుపై 9.2 గాను నమోదైంది.

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ అంశాలు

మాదిరి ప్రశ్నలు

 

1. ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీల భాగం ఎంత?
జ: 8%

 

2. భూకంపం అనేది?
జ: వేగంగా జరిగే విపత్తు

 

3. భారతదేశ మొత్తం విపత్తుల్లో భూకంపాల భాగం ఎంత?
జ: 11%

 

4. భూకంపం ఒక .......
జ: భౌగోళిక వైపరీత్యం

 

5. భూకంపాల నుంచి ఉత్పత్తి అయ్యేవి?
జ: ప్రకంపనాలు

 

6. సిస్మోగ్రాఫ్‌కు మొదట చేరే తరంగాలు?
జ: P తరంగాలు

 

7. కింది ఏ దేశంలో భూకంపాలు ఎక్కువ సంభవిస్తాయి?
జ: ఆస్ట్రేలియా

 

8. డిజాస్టర్స్ మిటిగేషన్ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
జ: అహ్మదాబాద్

 

9. భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం?
జ: పసిఫిక్ మహాసముద్రం చుట్టూ

 

10. పెద్ద భూకంపాలు మన దేశంలో కింది ఏ ప్రాంతాల్లో సంభవిస్తున్నాయి?
జ: ఈశాన్య రాష్ట్రాలు

 

11. కింది ఏ తరంగాలను - చీల్చే తరంగాలు అంటారు?
జ: S తరంగాలు

 

12. భారత్ భూభాగంలో ఎంత శాతం భూకంపాలకు అనుకూలంగా ఉంది?
జ: 58.6%

 

13. భూకంప దుర్బలత్వ మ్యాప్ ఆధారంగా కింది ఏ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి?
జ: శ్రీనగర్

 

14. భూకంపాలు ఏర్పడటానికి అవకాశం ఉన్న ప్రాంతాలను ఏమంటారు?
ఎ) భ్రంశ మండలాలు బి) అధికేంద్రాలు
సి) రంధ్ర మండలాలు డి) పైవన్నీ

 

15. భారతదేశంలో అర్బన్ ఎర్త్‌క్వేక్ వల్నరబులిటీ రిడక్షన్ ప్రాజెక్టుని కింది ఏ సంస్థలు నిర్వహిస్తున్నాయి?
జ: భారత ప్రభుత్వం

 

16. అంతర్జాతీయ భూకంప పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
జ: లండన్

 

17. భూకంపాల జోన్‌లో దృఢమైన ఇల్లు కట్టకోవడాన్ని ఏమంటారు?
జ: నిర్మాణాత్మక చర్య

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం

  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిర్వహిస్తున్న పరీక్షల సిలబస్‌లో కొత్తగా 'పర్యావరణ సమస్యలు' అనే అంశాన్ని చేర్చారు. గ్రూప్ - 1, 2, 3, 4; గెజిటెడ్, నాన్ గెజిటెడ్, టెక్నికల్ ఇతర పోటీ పరీక్షల్లో భాగంగా జనరల్ స్టడీస్ విభాగంలో ఈ అంశాన్ని చేర్చారు. ఈ పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులంతా మానవ మనుగడలో అత్యంత కీలకమైన పర్యావరణం గురించి తెలుసుకోవాలి. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పర్యావరణ సమస్యలపై మంచి అవగాహన సాధించాలి.
మానవ మనుగడకు మూలాధారం ప్రకృతి. ప్రతి అవసరానికీ మనిషి ప్రకృతిపై ఆధారపడాల్సిందే. ఈ క్రమంలో ప్రజలు తమ ఆర్థికావసరాల కోసం ప్రకృతిపై అన్నివైపుల నుంచీ దాడిచేస్తూ కొల్లగొడుతున్నారు. ఈ చర్యలన్నీ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రారంభంలో పరిశ్రమలు.. తర్వాత శాస్త్ర, సాంకేతిక విప్లవం.. విస్తారమైన వ్యవసాయ క్షేత్రాలు.. సింథటిక్ ఉత్పత్తుల వినియోగం, వాటి ఉత్పత్తి పద్ధతులు.. ఇవన్నీ ప్రకృతికి విఘాతం కలిగిస్తూ క్రమంగా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి. 1945లో హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబు వేసిన నాటి నుంచి ప్రపంచం ఈ 'భూగోళ సంక్షోభం'లోకి ప్రవేశించిందని చెప్పవచ్చు.

 

పర్యావరణం అంటే..

  మనలో ప్రతి ఒక్కరికి మన చుట్టూ ఉన్న పరిసరాలతో పరిచయం ఉంటుంది. ఈ పరిసరాలే జీవుల మనుగడ మీద ప్రభావం చూపిస్తాయి. మనుగడకు అవసరమైన బాహ్య పరిస్థితుల (భూమి, గాలి, నీరు, ఆహారం, వెలుతురు, వేడి, చలి) లభ్యతనే పర్యావరణం అంటారు. ఒక జీవరాశిని ప్రభావితం చేసి, మార్పులకు గురిచేస్తూ ఉన్న సజీవ, భౌతిక మూలక పదార్థాల మిశ్రమాన్ని పర్యావరణంగా చెప్పవచ్చు. సూక్ష్మంగా చెప్పాలంటే మన చుట్టూ ఆవరించి ఉన్న అంశాలే (జీవ, భౌతిక, రసాయన) పర్యావరణం. పర్యావరణంలోని జీవుల మనుగడకు ముప్పు వాటిల్లే విధంగా పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తే.. నివారణకు మానవుడు చేపట్టే చర్యలే 'పర్యావరణ పరిరక్షణ'.

 

రకాలు, సమస్యలు

పర్యావరణాన్ని 2 రకాలుగా చెప్పవచ్చు.

 

1. భౌతిక / సహజ పర్యావరణం:

  జీవరాశులను ప్రభావితం చేసే భూమి, నీరు, గాలి, వాతావరణం.. ఇవన్నీ నిర్జీవ భౌతిక అంశాలు. అలాగే వర్షపు నీరు, సూర్యకిరణాలు, తేమ, వాయు తరంగాల వేగం లాంటి వాతావరణ పరమైన కారకాలు కూడా ఇందులో అంశాలే.
భౌతిక / సహజ పర్యావరణం ప్రయోజనాలు, ప్రాధాన్యాలు..
* గృహ నిర్మాణం, పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి లభ్యమవుతుంది.
* జీవరాశులకు అవసరమైన భూమి, నీరు, గాలి.. పోషక మూలకాలను అందిస్తుంది.
* వాతావరణ కారకాలను నియంత్రిస్తుంది.
* వాతావరణం జీవరాశులకు ఆమ్లజని, ఇతర వాయువులను అందజేస్తుంది.
* భూగోళంలోని జలసంపద ఈ భౌతిక వాతావరణంపైనే ఆధారపడి ఉంటుంది.

 

2. జీవ పర్యావరణం:

  దీన్ని జీవుల సజీవ పర్యావరణం అంటారు. జీవరాశుల మనుగడకు ఇది సహాయపడుతుంది. భూమిపై ఉన్న సూక్ష్మజీవులు, జలచరాలు, పక్షులు, జంతువులు, వృక్ష సంపద, మానవులు దీనిలోని అంతర్భాగాలు.

 

సమస్యల ప్రభావం

1. శీతోష్ణస్థితిలో మార్పుల వల్ల గ్లోబల్ వార్మింగ్ (భూతాపం), సముద్ర నీటిమట్టం పెరగడం, గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలవడం, వరదలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లవచ్చు.
2. పర్యావరణం దెబ్బతినడం వల్ల గాలిలో స్వచ్ఛత లోపిస్తుంది. ఫలితంగా మానవులకు శ్వాస సంబంధ వ్యాధులు సంక్రమిస్తాయి. అంగవైకల్యంతో పాటు అంతర్గత, బాహ్య అవయవాల ఆరోగ్యం దెబ్బ తింటుంది. సహజ లోపాలు కూడా తలెత్తవచ్చు.
3. జన్యుపర సమస్యలు ఏర్పడవచ్చు.
4. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక జనాభా కారణంగా అనేక సమస్యలు..
5. కాలుష్యం: నేల (భూమి), గాలి (వాయు), నీరు (జల) కలుషితం అవుతున్నాయి. పర్యావరణం దెబ్బతినడంతో కాంతిపై ఆ ప్రభావం పడుతుంది. దృష్టి దోషాలు తలెత్తుతాయి. ధ్వని కాలుష్యం, ఓజోన్ పొర దెబ్బతినడం, అంతరిక్షంలో సమస్యలు తలెత్తవచ్చు.
6. జీవ వ్యర్థపదార్థాల నాశనం వల్ల తలెత్తే సమస్యలు.

 

పర్యావరణ ఉద్యమాలు

  పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, పొగ, విషపూరిత రసాయనాలు వదలడం వల్ల కలుగుతున్న దుష్ప్రభావాన్ని ప్రపంచ దేశాల ప్రజలు గుర్తించారు. సముద్రాలు, ఎడారుల్లో అణు పరీక్షలు చేయడం లాంటి వాటివల్ల పర్యావరణానికి ఎదురవుతున్న ముప్పును గుర్తించారు. సరస్సులు ఎండిపోవడం, ఆమ్ల వర్షాలు వంటి విపరిణామాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ఇలా పర్యావరణ పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమాలన్నీ దాదాపు 20వ శతాబ్దంలోనే కొంత ఊపందుకున్నాయి. న్యూక్లియర్ వ్యర్థ పదార్థాలు పడేయడం, ఉష్ణోగ్రతల్లో మార్పులు, వాయు కాలుష్యం లాంటి వాటి గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఏర్పడింది.
* పర్యావరణ పరిరక్షణ కోసం మొదటగా 1962లో రేచల్ కార్సన్ రాసిన 'నిశబ్ద వసంతం' అమెరికా పర్యావరణ ఉద్యమంలో మైలురాయి లాంటిది.
* 1970లో మొదటిసారిగా ధరిత్రి దినోత్సవం నిర్వహించడంతోపాటు పర్యావరణాన్ని రక్షించేందుకు యూఎస్ఏ పార్లమెంటు చట్టాలు చేసింది.
* 1970లో అణ్వాయుధ పరీక్షలకు వ్యతిరేకంగా 'గ్రీన్‌పీస్' ఉద్యమం మొదలై.. ఆ తర్వాత అన్ని దేశాలకు విస్తరించింది. అంటార్కిటికాలో ఏర్పాటైన 'గ్రీన్‌పీస్' స్థావరం వివిధ దేశాల్లోని ఉద్యమాలను సమన్వయ పరిచింది.
* 1980లో పర్యావరణ ప్రత్యేక సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష కార్యాచరణ మొదలైంది. ఇందులో గ్రీన్‌పీస్, ఎర్త్‌లాండ్, ఎర్త్ ఫస్ట్ లాంటి సంఘాలు ఏర్పడ్డాయి.
* 1972, జూన్ 5న 'స్టాక్‌హోం'లో అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ సదస్సు జరిగింది. అప్పటి నుంచి జూన్ 5 ను ప్రతి సంవత్సరం 'ప్రపంచ పర్యావరణ దినం'గా యావత్ ప్రపంచం పాటించాలని ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించింది.
* 1982లో కెన్యాలోని 'నైరోబి'లో ప్రపంచ దేశాలు మళ్లీ సమావేశమయ్యాయి. ఇలా.. 1982 నాటికి వందకు పైగా దేశాల్లో పర్యావరణ సంస్థలు ఏర్పడ్డాయి.
* 1992లో 'ధరిత్రి సదస్సు'గా ప్రస్తావిస్తున్న రియోడి జనీరియో (బ్రెజిల్) సమావేశం నాటికి పర్యావరణ అంశాలు మొత్తం ప్రపంచాన్ని జాగృతం చేయడంలో సఫలమయ్యాయి. ఇందులో 150 దేశాలు భూగోళం వేడిమి, గ్రీన్‌హౌస్ వాయువుల గురించి చర్చించాయి. ఈ సమావేశంలో చర్చించిన రెండో అంశం జీవరాశుల సమతౌల్యానికి సంబంధించింది.
* నార్వే ప్రధానిగా విధులు నిర్వహించిన గ్రొహర్లెమ్ బ్రుంట్‌లాండ్ ఐక్యరాజ్య సమితి స్థాపించిన 'వరల్డ్ కమిషన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్‌'కు ఛైర్మన్‌గా పనిచేశారు.

 

పర్యావరణంలో ఉత్పన్నమయ్యే సమస్యలు..

* మానవ జనాభా పెరుగుదల
* జల సంబంధమైన వరదలు, భూపాతాలు
* డ్రైనేజీ, వ్యవసాయ సమస్యలు
* జీవ నిర్మాణంలో సాంద్రత పెరగడం
* భూ వినియోగం.
* నానో టెక్నాలజీ, శాస్త్ర-సాంకేతిక మార్పులు
* న్యూక్లియర్, రేడియోధార్మిక శక్తిలో మార్పులు
' పర్యావరణానికి కలిగే ముప్పును నివారించడానికి జీవ వైవిధ్యం, జీవ భద్రత లాంటివి చేపట్టడం.. అటవీ సంపదను పెంచడం.. సహజ వనరులను కాపాడుకోవడం.. పలురకాల జంతు జాతులను పెంపొందించడం.. పర్యావరణ చట్టాలను పటిష్ఠంగా అమలు చేయడం లాంటి చర్యలు అవసరం. ఈ అంశాలపై అధ్యయనం చేయాలి.'

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వైపరీత్యం

* విపత్తు నిర్వహణ
* అన్ని స్థితిగతులపై ప్రభావం

  విపత్తు అంటే అకస్మాత్తుగా సంభవించేది. ప్రకృతిసిద్ధంగా లేదా ప్రమాదవశాత్తూ లేదా నిర్లక్ష్యం వల్ల జరిగే ఈ విపత్తులతో వెంటనే కోలుకోలేనంత ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది. ప్రకృతి సహజంగా కావచ్చు లేదా మానవ తప్పిదం వల్ల కూడా కావచ్చు.. దానివల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ప్రకృతి వైపరీత్యాలను నివారించలేం. ఈ వైపరీత్యాల ప్రభావం దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై ఉంటుంది. అసలు వైపరీత్యాలు అంటే ఏమిటి? అవి ఎలా సంభవిస్తాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? వీటన్నింటిపై టీఎస్‌పీఎస్పీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సమగ్ర అవగాహన అవసరం. ఈ విభాగం నుంచి దాదాపు 8-10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

  మానవుడు భూమిపై ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైన వాటిలో విపత్తులు ఒకటి. 'విపత్తు' ప్రపంచ సమస్య అయితే 'ప్రాంతీయ పరిష్కారం' దీనికి నివారణోపాయం. ఒక సమూహం(ప్రజలు) నుంచి సహాయం పొందాల్సినంత ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగే సంఘటనను దేనినైనా విపత్తుగా పిలవవచ్చు. విపత్తులు ఆయా ప్రాంత ప్రజల ఆర్థిక, సాంఘిక, రాజకీయ, శారీరక, మానసిక స్థితిగతులు.. అన్నింటిపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇవి అనాది కాలం నుంచీ ఉన్నా గత కొన్నేళ్లుగా ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఆస్తినష్టం, ప్రాణనష్టం, పర్యావరణ హానికి కారణమవుతున్నాయి.

 

వైపరీత్యం అంటే...

  ఒక ప్రాంత ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలకు, పర్యావరణ హానికి కారణమయ్యే సంఘటనను వైపరీత్యంగా భావించవచ్చు. ఎడారిలో భూకంపం సంభవిస్తే ఆస్తి, ప్రాణ నష్టం జరగదు. బంగ్లాదేశ్‌లో 2007లో సంభవించిన సిదర్ తుపానును దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. వరదలు, కరవు, అగ్ని ప్రమాదాలు, భూపాతం (ల్యాండ్ స్త్లెడ్) లాంటి సామాజిక, సహజ విపత్తులు ప్రకృతిసిద్ధంగా, మానవ కారణంగా ఏర్పడతాయి.

 

దుర్బలత్వం అంటే..

  ఒక ప్రాంతం / నిర్మాణం / సేవలు, వాటి స్వభావం రీత్యా అవి విపత్తుభరిత ప్రాంతానికి ఎంత దూరంలో ఉన్నాయి? అనే అంశంపైన దుర్బలత్వం ఆధారపడి ఉంటుంది. ఈవిధంగా వైపరీత్యాల ప్రభావానికి గురయ్యే సునిశితత్వాన్ని పెంచే స్థితిని దుర్బలత్వం అంటారు. ప్రజలపై వైపరీత్యం చూపే ప్రభావం భౌతిక అంశాలపై మాత్రమే కాకుండా ఆ ప్రాంత ప్రజల ఆర్థిక, సాంఘిక స్థితిగతులపై కూడా ఆధారపడి ఉంటుంది. ఆర్థికంగా, సాంకేతికంగా సరైన నిర్మాణాలు లేని పేద దేశాల్లో విపత్తు నష్టం ఎక్కువగా ఉంటుంది. 2001లో గుజరాత్‌లో జరిగిన భూకంపం వల్ల 3.3 బిలియన్ అమెరికన్ డాలర్ల నష్టం జరిగింది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైపరీత్యాల వల్ల అత్యధిక ప్రాణనష్టం జరుగుతుంది. 1970లో బంగ్లాదేశ్‌లో జరిగిన 'బోలా' అనే తుపాను వల్ల 3 లక్షల మంది చనిపోయారు.
భౌగోళిక, జల, జీవకారకమైన భూకంపాలు; సునామీలు, చక్రవాతాలు, వరదలు, వ్యాధులు లాంటి ప్రకృతిసిద్ధ విపత్తులను మానవుడు అడ్డుకోలేడు. నష్టానికి గురయ్యే అవకాశాలు ఉండటం, వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేకపోవడం అనే అంశాల కలయికపై విపత్తు నష్టం ఆధారపడి ఉంది. వాటిని ప్రతిఘటించే సామర్థ్యంపై మానవ పురోగమనం ఆధారపడుతుంది.

 

హ్యోగో కార్యచట్రం

  2005-15 మధ్యకాలంలో విపత్తుల తగ్గింపు, నివారణా కార్యాచరణ ప్రక్రియ కోసం జపాన్‌లోని హ్యోగో ప్రాంతంలోని కోబె వద్ద 2005 జనవరి 18 నుంచి 22 మధ్య ప్రపంచ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విపత్తులకు సంబంధించి ముందు తీసుకోవాల్సిన చర్యలు, తర్వాత చేపట్టాల్సిన తక్షణ కార్యక్రమాలను విపత్తు నిర్వహణతో అనుసంధానం చేసి ఈ వైపరీత్యాల నుంచి ప్రజలు తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పలు నిర్వహణ విధానాలను ప్రతిపాదించారు. అవి..

 

విపత్తు నిర్వహణ

  ఇది విపత్తులను ఎదుర్కొనే అనేక రకాల ప్రక్రియలను తెలియజేస్తుంది. ఇవి విపత్తు ముందు ప్రక్రియలు, తర్వాత ప్రక్రియలు అనే రెండు విధాలుగా ఉండాలని నిర్ణయించారు. విపత్తు ముందస్తు చర్యలు అపాయాన్ని కుదించే విధంగా ఉండాలి. విపత్తు తదనంతర చర్యలు తక్షణ ఉపశమనం, దీర్ఘకాలంలో క్రమంగా తేరుకోవడం అనే అంశాలుగా ఉండాలి.

 

రెండు రకాల చర్యలు

  విపత్తు అపాయ నిర్వహణ విపత్తుకు ముందు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన అంశాలను తెలియజేస్తుంది. ఇందులో సంసిద్ధంగా ఉండటం, తీవ్రతను తగ్గించడం అనే అంశాలకు సంబంధించిన ప్రక్రియలు కలిసి ఉంటాయి. ఈ ప్రక్రియలు నిర్మాణాత్మక, నిర్మాణేతర చర్యలు అనే 2 విధాలుగా ఉండాలి.

 

ఉపశమనం దిశగా..

  విపత్తు అపాయ నిర్వహణ తాత్కాలిక చర్యలకు సంబంధించిన అంశం. విపత్తు తీవ్రత, దాని స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఉపశమన చర్యలను విపత్తు జరిగిన క్షణం నుంచి కొన్ని వారాలు లేదా నెలలు నిర్వహిస్తారు.

 

తేరుకోవడం

  విపత్తుల నుంచి తేరుకునే నిర్వహణ దీర్ఘకాలిక చర్యలను తెలియజేస్తుంది. ఇందులో విపత్తు స్వభావాన్ని బట్టి పునర్నిర్మించడం, స్థిరత్వాన్ని కల్పించడం అనే చర్యలు చేపడతారు. ఇవి కొన్ని సంవత్సరాలు కొనసాగుతాయి.
మన దేశంలో విపత్తు నిర్వహణ మూడు స్థాయిల్లో జరుగుతోంది. అవి..
1. కేంద్రస్థాయిలో - ప్రధానమంత్రి అధ్యక్షతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ)
2. రాష్ట్రాల స్థాయిలో - ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎస్‌డీఎంఏ)
3. జిల్లా స్థాయిలో - జిల్లా కలెక్టరు / జిల్లా మేజిస్ట్రేట్ / డిప్యూటీ కలెక్టరు / డిప్యూటీ మెజిస్ట్రేట్ అధ్యక్షతన జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (డీడీఎంఏ).
వీటితోపాటు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఐడీఎం) కొన్ని బాధ్యతలను నిర్వర్తిస్తుంది. విపత్తు నిర్వహణను సంస్థాగతం చేయడం, విపత్తులపై పరిశోధన, విపత్తు నిర్వహణపై శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం, సమావేశాలు ఏర్పాటు చేసి బులిటెన్‌లు ప్రచురించడం వంటి కార్యక్రమాల నిర్వహణ కోసం మన దేశంలోని ఎన్ఐడీఎం పనిచేస్తోంది.

 

ముఖ్యాంశాలు

* ప్రకృతి విపత్తుల నివేదిక ప్రకారం ప్రపంచంలో జరుగుతున్న విపత్తుల్లో ఆసియా ఖండంలో సంభవిస్తున్నవి 37 శాతం. వీటివల్ల జరిగే నష్టం 49 శాతం.
* ప్రపంచంలో ఎక్కువగా విపత్తులకు గురవుతున్న మొదటి 10 దేశాల్లో భారత్ కూడా ఒకటి.
* 2003-2009 ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం సహజ విపత్తుల వల్ల భారతదేశం ఏటా స్థూల జాతీయోత్పత్తిలో 2 శాతం, ప్రభుత్వ ఆదాయంలో 12 శాతం నష్టపోతోంది.
* ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1990 దశకాన్ని అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది. తర్వాత మనదేశంలో విపత్తు నిర్వహణ విభాగాన్ని మొదట వ్యవసాయ శాఖలో ఏర్పాటు చేశారు. 2002లో దీన్ని హోం వ్యవహారాల శాఖకు తరలించారు.

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు - నిర్వహణ

1. అంతర్జాతీయ విపత్తు కుదింపు మూడో సదస్సు ఎక్కడ జరిగింది?
జ: 2015 మార్చి - సెండాయ్ ‌

 

2. కిందివాటిని జతపరచండి.

వాయువు అంశం/ప్రభావం
i) మిథైల్‌ ఐసోసైనేట్‌ a) జైవిక వ్యవస్థ
ii) ఏజెంట్‌ ఆరెంజ్‌ b) కిరణ ధార్మిక
iii) రేడియో తరంగాలు c) రసాయనిక
iv) మైకోటాక్సిన్స్‌ d) పారిశ్రామిక

జ: i - d, ii - c, iii - b, iv - a

 

3. రాస్టార్, వెక్టార్‌ నమూనాలు ఎందులో భాగాలు?
జ: భౌగోళిక సమాచార వ్యవస్థ

 

4. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ భూతల కేంద్రం (Earth Station) ఎక్కడ ఉంది?
జ: షాద్‌నగర్‌

 

5. కిందివాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగం కానిది?
1) పేదరికం, ఆకలిని నిర్మూలించడం             2) ఉత్పత్తి, వినియోగాన్ని పెంపొందించడం
3) క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం     4) లింగ సమానత్వం, మహిళా సాధికారత
జ: 3 (క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం)

 

6. గ్రీన్‌పీస్‌ ఉద్యమం మొదట దేనికి వ్యతిరేకంగా జరిగింది?
జ: అణు వ్యతిరేకత

 

7.  కిందివాటిలో జల కాలుష్యం  వల్ల రాని వ్యాధి?
1) కలరా      2) కామెర్లు      3) మలేరియా      4) డయేరియా
జ: 3 (మలేరియా)

 

8. కిందివాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి.
1) జాతీయ హరిత ట్రైబ్యునల్‌      2) జీవ వైవిధ్య చట్టం
3) జాతీయ వన్యప్రాణి చట్టం        4) జల కాలుష్య నియంత్రణ చట్టం
జ: 3421

 

9. పర్యావరణంపై భారత పార్లమెంట్‌ చేసిన చట్టాల్లో సరికానిది.   
1) పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986                 2) బయోస్ఫియర్‌ చట్టం - 1988
3) వాయు కాలుష్య నియంత్రణ చట్టం - 1981      4) హాట్‌స్పాట్‌ చట్టం - 2006
జ: 2 (బయోస్ఫియర్‌ చట్టం - 1988)

 

10. కిందివాటిలో సరైంది? 
a) క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం వాతావరణ మార్పునకు సంబంధించింది. 
b) మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఓజోన్‌ తరుగుదలకు సంబంధించింది.
జ: a, b సరైనవి

 

11. కిందివాటిలో సరికానిది? 
1) అంతర్జాతీయ సునామీ దినోత్సవం - నవంబరు 5     2) అంతర్జాతీయ అటవీ దినోత్సవం - మార్చి 20
3) అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం - ఏప్రిల్‌ 22             4) అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం - మే 22
జ: 2 (అంతర్జాతీయ అటవీ దినోత్సవం - మార్చి 20)

 

12. కిందివాటిని జతపరచండి.

సమావేశం వేదిక
i) ఓజోన్‌ తగ్గుదల సదస్సు a) న్యూదిల్లీ
ii) అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు b) కిగాలి
iii) COP - 24 సదస్సు c) న్యూయార్క్‌
iv) సుస్థిరాభివృద్ధి  లక్ష్యాల సదస్సు d) కెటోవీస్‌

జ: i-,b ii-a, iii-d, iv-c

 

13. కిందివాటిలో సరైంది ఏది?
1) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2015 - 30 వరకు వర్తిసాయి 
2) SDG లో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు ఉన్నాయి
3) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2015, సెప్టెంబరు 25న ఆమోదించారు
జ: 1, 2, 3 సరైనవి

 

14. అప్పికో ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జ: కర్ణాటక

 

15. కిందివాటిలో పర్యావరణ ఉద్యమాలకు సంబంధించి సరికానిది?
1) క్షిపణులకు వ్యతిరేకంగా బాలియాపాల్‌ ఉద్యమం జరిగింది.
2) మేధాపాట్కర్‌ ‘నర్మద బచావో’ ఆందోళన చేపట్టారు.
3) ఝార్ఖండ్‌లో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా జంగిల్‌ బచావో ఉద్యమం జరిగింది. 
4) యురేనియం వ్యతిరేక ఉద్యమం నిశ్శ‌బ్ద లోయలో  జరిగింది.
జ: 4 (యురేనియం వ్యతిరేక ఉద్యమం నిశ్శ‌బ్ద లోయలో జరిగింది.)

 

16. కిందివాటిని జతపరచండి.

i) ధరిత్రీ సదస్సు a) జోహెన్నస్ ‌బర్గ్‌ - 2002
ii) పర్యావరణ సదస్సు b) హైదరాబాద్‌ - 2012
iii) జీవవైవిధ్య సదస్సు c) స్టాక్‌హోం - 1972
iv) సుస్థిరాభివృద్ధి సదస్సు d) రియో - 1992

జ: i - d, ii - c, iii - b, iv - a

 

17. జీవావరణ పిరమిడ్‌లో మొదటి మెట్టులో ఉన్నదెవరు?
జ: ఉత్పత్తిదారులు

 

18. కిందివాటిలో జాతీయ విపత్తు నిర్వహణ సపోర్ట్‌ ప్రోగ్రాంను నిర్వహించేది?
     1) ISRO      2) GIS      3) NRSA      4) NGRI
జ: 3 (NRSA)

 

19. క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
జ: 2005, ఫిబ్రవరి 16

 

20. జాతీయ కార్యాచరణ ప్రణాళిక వాతావరణ మార్పు కోసం 2016 డిసెంబరులో ఎన్ని జాతీయ ప్రణాళికలను అమలుపరిచింది?
జ: 8

 

21. కిందివాటిలో సరైనవి గుర్తించండి.  
1) 2016 కరవు నిర్వహణ కరదీపిక దీర్ఘకాలిక కరవు 33% ఉన్నట్లు పేర్కొంది.
2) కరవు పీడిత ప్రాంతం కింద 35% ఉన్నట్లు పేర్కొంది.
3) 10% కంటే ఎక్కువ అవపాతం లోపించినట్లయితే దాన్ని వాతావరణ కరవు అంటారు.
జ: 1, 2, 3 సరైనవి

 

22. కిందివాటిని జతపరచండి.

అంశం శాతం
i) కరవు ప్రభావం a) 10%
ii) వరద ప్రభావం b) 59%
iii) భూకంప ప్రభావం c) 12%
iv) తుపాన్ల ప్రభావం d) 68%

జ: i - d, ii - c, iii - b, iv - a

 

23. నైలోమీటర్‌ సాధనాన్ని దేన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు?
జ: వరదలు

 

24. కిందివాటిలో ఉష్ణ మండల చక్రవాత వర్గీకరణ వేగానికి సంబంధించి సరికానిది. 
1) తుపాన్‌ స్ట్రోమ్‌ : 62 - 88 కేఎంపీహెచ్‌         2) వాయుగుండం : 31 - 49 కేఎంపీహెచ్‌ 
3) అల్పపీడన ద్రోణి : 50 - 61 కేఎంపీహెచ్‌      4) సూపర్‌ సైక్లోన్‌ : 221 కేఎంపీహెచ్‌ పైన
జ: 3 (అల్పపీడన ద్రోణి : 50 - 61 కేఎంపీహెచ్‌) 

 

25. కొరియాలీస్‌ ఎఫెక్ట్‌ ప్రకారం చక్రవాతాల గమనానికి సంబంధించి సరైంది.
1) ఉత్తరార్ధ గోళంలో చక్రవాతాలు సవ్య పద్ధతిలో వీస్తాయి. 
2) దక్షిణార్ధ గోళంలో అపసవ్య పద్ధతిలో వీస్తాయి.
జ: 1, 2 రెండూ సరైనవికావు

 

26. కిందివాటిలో సరైంది ఏది? 
1) హజార్డ్‌ అనే పదం అరబిక్‌ భాష నుంచి వచ్చింది. 
2) డిజాస్టర్‌ అనే పదం ఫ్రెంచ్‌ భాష నుంచి ఆవిర్భవించింది.
జ: 1, 2 సరైనవి

 

27. కిందివాటిలో ప్రకృతి విపత్తుల్లో భాగం కానిది?
       1) హిమపాతాలు       2) ఉరుములు, పిడుగులు      3) వన నిర్మూలన      4) ఉష్ణశీతల గాలులు
జ: 3 (వన నిర్మూలన)

 

28. ప్రస్తుతం దేశంలోని ఎన్ని రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాయి?
జ: 27

 

29. భారతదేశంలో భౌగోళికంగా కరవులు ఎక్కువగా ఏ ప్రాంతంలో సంభవిస్తున్నాయి?
జ: పశ్చిమ - దక్షిణ భారత్‌

 

30. విపత్తు సంభవించినప్పుడు అవసరమైనవి?
       1) అత్యవసర స్పందన, సహాయం        2) పునరావసం, పునర్నిర్మాణం
       3) సంసిద్ధత                                       4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

31. కిందివాటిలో సరికానిది.  
1) జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని (NDRF) విపత్తు చట్టం సెక్షన్‌ 44 ప్రకారం ఏర్పాటు చేస్తారు.
2) NDRF కేంద్ర హోంమంత్రి నిర్వహణలో ఉంటుంది.
3) NDRF లో ప్రస్తుతం 12 బెటాలియన్లు ఉన్నాయి.
4) ప్రస్తుతం 10వ CRPF బెటాలియన్‌ విజయవాడలో ఉంది. 4
జ:  4  

 

32. ప్రపంచంలో సంభవించే వైపరీత్యాల్లో కిందివాటిలో సరికానిది? 
1) భూకంపాల వల్ల 8% నష్టం కలుగుతుంది         2) వరదల వల్ల 30% నష్టం కలుగుతుంది
3) చక్రవాతాల వల్ల 21% నష్టం కలుగుతుంది.       4) కరవుల వల్ల 20% నష్టం కలుగుతుంది.
జ: 4 (కరవుల వల్ల 20% నష్టం కలుగుతుంది.)

 

33. ఏదైనా భౌగోళిక ప్రాంతంలో లేదా ఒక కమ్యూనిటీలో సంభవించే వైపరీత్యాల వల్ల జరిగే నష్ట తీవ్రత, పరిధి, పరిస్థితులు దేనికి దారితీస్తాయి?
జ: దుర్బలత్వం

 

34. 1999, ఆగస్టు 20న విపత్తు నిర్వహణపై అత్యున్నతాధికార కమిటీని ఎవరి అధ్యక్షతన వేశారు?
జ: జె.సి. పంత్‌

 

35. విపత్తు తీవ్రతను సాధారణంగా దేన్ని బట్టి అంచనా వేస్తారు?
జ: ప్రాణ, ఆస్తి నష్టం

 

36. కిందివాటిలో విపత్తులు, వాటి నోడల్‌ మంత్రి బాధ్యతలను జతపరచండి.

విపత్తు  మంత్రి
i) పరిశ్రమలు - రసాయనాలు A) హోంమంత్రి
ii) హిమపాతాలు B) వ్యవసాయ మంత్రి
iii) కరవులు C) రక్షణ మంత్రి
iv) NDRF D) పర్యావరణ - అటవీ మంత్రి

జ: i - D, ii - C, iii - B, iv - A

 

37. కింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి.
1) జాతీయ విపత్తు నిర్వహణ మొదటి సమావేశం న్యూదిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో 2006, నవంబరు 29న జరిగింది.
2) జాతీయ విపత్తు నిర్వహణ సమావేశాలకు ప్రధాన మంత్రి అధ్యక్షత వహిస్తారు.
జ: 1, 2 సరైనవి

 

38. కిందివాటిని జతపరచండి.

కమిటీ ఛైర్‌పర్సన్‌
i) కేబినెట్‌ కమిటీ A) కేంద్ర హోంమంత్రి
ii) జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ B) హోం కార్యదర్శి
iii) జాతీయ కార్యనిర్వహణ కమిటీ C) కేబినెట్‌ కార్యదర్శి
iv) విపత్తు సమన్వయ కమిటీ D) ప్రధానమంత్రి

జ: i - D, ii - C, iii - B, iv - A

 

39. అంతర్జాతీయ విపత్తు తగ్గింపు మూడో సదస్సు 2015, మార్చి 18న ఎక్కడ జరిగింది?
జ: సెండాయ్‌

 

40. నూతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP) ను 2016, జూన్‌ 1న న్యూదిల్లీలో ఎవరు విడుదల చేశారు?  
జ: ప్రధానమంత్రి  

 

41. కిందివాటిని జతపరచండి.

సంస్థ కార్యాలయం
i) అంతర్జాతీయ విపత్తు తగ్గింపు సంస్థ A) బ్యాంకాక్‌
ii) ఆసియా విపత్తు ప్రతిస్పందన సంస్థ B) జెనీవా
iii) సార్క్‌ విపత్తు తగ్గింపు సంస్థ C) నాగ్‌పుర్‌
iv) నేషనల్‌ సివిల్‌ డిఫెన్స్‌ కాలేజీ D) దిల్లీ


జ: i - B,  ii - A, iii - D, iv - C

 

42. కింది అంశాల్లో సరైనవాటిని గుర్తించండి.
       1) అంతర్జాతీయ సునామీ అవగాహన దినోత్సవం - నవంబరు 5
       2) జాతీయ విపత్తు అవగాహన దినోత్సవం - అక్టోబరు 29
       3) అంతర్జాతీయ విపత్తు కుదింపు దశాబ్దం - 1990 - 2000
జ: 1, 2, 3

 

43. దీర్ఘకాలిక విపత్తు ప్రణాళిక అభివృద్ధిని ఏ రకమైన విపత్తు స్థాయిలో సూచిస్తారు?
జ: L3

 

44. ‘జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక’ (NDMP)లో మొత్తం ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి?
జ: 14

 

45. కింది అంశాల్లో సరైనవి. 
     1) విపత్తు సహాయ నిధిని ఏర్పాటుచేయాలని 9వ ఆర్థిక సంఘం మొదట సిఫారసు చేసింది.
     2) 13వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు జాతీయ విపత్తు సహాయక నిధిని 2010, ఏప్రిల్‌ 1న ప్రారంభించారు.
     3) 14వ ఆర్థిక సంఘం 2015-20కి గాను ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,489 కోట్లను సిఫారసు చేసింది.
జ: 1, 2, 3

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వరదలు

  నదీప్రవాహ మార్గాల హద్దులు (గట్లు)జల ప్రవాహాన్ని నిలువరించలేకపోవడం వల్ల పరీవాహక ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితిని 'వరద' అంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణస్థితులు, వర్షపాతం ఉండటంవల్ల ఏటా ఏదో ఒక ప్రాంతంలో వరదలు సంభవిస్తూ ఉంటాయి. అధిక వర్షపాతం ఉండే జూన్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో వరదలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
తుపాను, వాయుగుండాలు వచ్చినప్పుడు కూడా వరదలు వస్తాయి. అధిక వర్షపాతం, కూడా వరదలు రావడానికి కారణమవుతుంది. భారతదేశంలోని సుమారు 3290 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని భూమి వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.

  ఏటా సరాసరి 75 లక్షల హెక్టార్ల భూమి వరదల ప్రభావానికి గురవుతోంది. సుమారు 1600 మంది వరదల వల్ల మరణిస్తున్నారు. సాలీనా రూ.1805 కోట్ల రూపాయల ఆస్తి, పంటనష్టం జరుగుతోంది. ఇళ్లు, రోడ్లు దెబ్బతింటున్నాయి. 1977లో అత్యధికంగా 11,316 మంది మృత్యువాత పడ్డారు. భారతదేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వివిధ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది. దేశ విస్తీర్ణంలో 8 శాతం వరకూ భూభాగం వరదలకు గురయ్యే అవకాశముంది. గంగా, బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా వస్తుంటాయి.

 

వరదలు రావడానికి కారణాలు

* నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం, నది ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల వరదలు సంభవిస్తాయి.

* అధిక వర్షపాతం, వాయుగుండాలు, తుపాన్లు వరదలకు కారణమవుతాయి.

* నదులు, చెరువులు, కాల్వలకు గండ్లు పడటం; నదీ ప్రవాహ మార్గాలు పూడికతో నిండిపోవడం వల్ల వరదలు సంభవిస్తున్నాయి.

* అతిగా అడవులను నరికివేయడం, పర్వత ప్రాంతాల్లో నేల క్రమక్షయానికి గురవడం వల్ల వరదల ఉద్ధృతి పెరుగుతోంది.

* కొండ చరియలు విరిగిపడటంతో నదులు తమ ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల వరదలు సంభవిస్తాయి.

* చెరువులు, ఆనకట్టలు, గట్ల నిర్మాణంలో సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించకపోవడం వల్ల కూడా వరదలు రావొచ్చు.

* మహానగరాల్లోని నాలాలు ప్లాస్టిక్ కవర్లు, చెత్త, ఇతర ఘన పదార్థాలతో నిండిపోవడం వల్ల అవి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. హైదరాబాద్, ముంబయి లాంటి నగరాల్లో ఈకారణంగానే వరదలు సంభవించాయి.

* వర్షం పడినప్పుడు నీరు నేలలోకి సరైనవిధంగా ఇంకకపోవడం వల్ల వరదలు ఎక్కువవుతాయి. నగరాల్లో నీరు ఇంకే మార్గాలకు పూర్తిగా అడ్డుపడటం వల్ల తరచుగా వర్షాకాలంలో వరదల తాకిడిని, వేసవిలో నీటి కొరతను ఎదుర్కొంటున్నాం.

 

వరద విపత్తు ఆధారంగా భారతదేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించవచ్చు.

 

బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం

  బ్రహ్మపుత్ర, బారక్ నదులు, వీటి ఉపనదుల ప్రాంతాలు దీని కిందకు వస్తాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లోని నదీ పరీవాహక ప్రాంతాల్లో జూన్ నుంచి సెప్టెంబరు వరకు అధిక వర్షపాతం (1100 మి.మీ. నుంచి 6350 మి.మీ.) నమోదవుతోంది. అందువల్ల సర్వసాధారణంగా ఈ ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఇక్కడి నదులు పర్వత ప్రాంతాల్లో పుట్టి, దిగువకు రావడం వల్ల నేల క్రమక్షయానికి గురవడం, కొండచరిచయలు విరిగి పడటం కూడా ఎక్కువగా ఉంటోంది.

 

గంగానదీ పరీవాహక ప్రాంతం 

  గంగా దాని ఉపనదులైన యమున, సోన్, గండక్, కోసి, మహానంద, రాఫ్తి లాంటి నదీ పరీవాహక ప్రాంతాలు దీని కిందికి వస్తాయి. వీటి వల్ల ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్‌ని కొన్ని ప్రాంతాలు, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో వరద ముప్పు ఉంది. ఇక్కడ సంవత్సరానికి 600 మి.మీ. నుంచి 1900 మి.మీ. వరకూ వర్షం కురుస్తుంది. ఈ రాష్ట్రాల్లో గంగానది వల్ల వరదలు ఎక్కువగా వస్తాయి.

 

ఉత్తర-పశ్చిమ నదీ పరీవాహక ప్రాంతం

  బియాస్, రావి, చీనాబ్, జీలమ్ లాంటి నదుల ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. జమ్మూ-కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రాంతాల్లో ఈ నదుల వల్ల వరదలు సంభవిస్తాయి. గంగా పరీవాహక ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ వరద ముప్పు తక్కువే అయినప్పటికీ పూడిక సమస్య ఎక్కువ.

 

మధ్య భారతదేశం - దక్కన్ ప్రాంతాలు

  నర్మదా, తిరుపతి, మహానంది, గోదావరి, కృష్ణా, కావేరి నదుల ప్రాంతాలు దీని కిందకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఒడిషా రాష్ట్రాలు ఈ నదుల వల్ల వరదల బారిన పడతాయి.

  ఒడిషాలోని కొన్ని జిల్లాల్లో వరదలు తరచుగా వస్తుంటాయి. ఈ రాష్ట్రాల్లో రుతుపవనాల సమయంలో, తుపాన్లు సంభవించినప్పుడు వరదలు వచ్చే అవకాశం ఎక్కువ.

 

వరదలకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  నదీతీర ప్రాంతాల్లో, తరచుగా వరదలకు గురవడానికి అవకాశమున్న ప్రజలు వరదలు రావడానికి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల వరదల సమయంలో తక్కువ నష్టం జరుగుతుంది.

* దగ్గరలోని పునరావాస కేంద్రాన్ని గుర్తించి అక్కడికి తొందరగా చేరే మార్గాన్ని తెలుసుకోవాలి.

* ప్రథమ చికిత్స పెట్టెలో మందులు, ఇతర సామాగ్రి ఉన్నాయా లేవో చూసుకోవాలి. ప్రత్యేకంగా డయేరియా, పాముకాటుకు సరైన ఔషధాలను సిద్ధం చేసుకోవాలి.

* రేడియో, టార్చిలైటు, బ్యాటరీలు, తాళ్లు, గొడుగు లాంటివి సమకూర్చుకోవాలి.

* మంచినీరు, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, ఇంధనం లాంటివి ముందుగానే సమకూర్చుకుని నిల్వ చేసుకోవాలి.

* నీరు తాకినా తడవని సంచుల్లో (water proof bags) దుస్తులు, ఇతర విలువైన వస్తువులను భద్రపరచుకోవాలి.

* గ్రామీణ ప్రాంతాల్లో ఎత్తయిన ప్రదేశాలను గుర్తించి, పశువులను అక్కడికి తీసుకు వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి.

 

వరద వచ్చిన ప్రాంతంలో ఉండేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* సురక్షిత (కాచి వడపోసిన) నీటినే తాగాలి. లేకపోతే కలరా, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.

* ఆహార పదార్థాలను వరదనీటిలో తడవకుండా చూడాలి. వరద నీటిలో తడిసిపోయిన ఆహార పదార్థాలను తినకూడదు.

* నీటిని శుభ్రపరచడానికి బ్లీచింగ్ పౌడరు కలపాలి. పరిసరాల్లో సున్నాన్ని చల్లాలి.

* వరదనీటిలోకి వెళ్లకూడదు. వరదల సమయంలో పాముకాటు ప్రమాదాలు ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తెగిపడిన విద్యుత్ తీగలను తాకకూడదు.

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వరదలు

1. గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలను నియంత్రించడానికి భారత ప్రభుత్వం గంగా ఫ్లడ్ కంట్రోల్ కమిషన్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది?
జ:  1972

 

2. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధీనంలో పనిచేసే 'నేషనల్ వాటర్ అకాడమీ' (NWA)ను ఏ నగరంలో నెలకొల్పారు?
జ:  పుణే

 

3. వరదల వల్ల రోడ్లు, రైల్వే లైన్లకు కలిగే నష్టాన్ని తనిఖీ చేయడానికి ఏ సంస్థలు పనిచేస్తున్నాయి? 
జ:  బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ , నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ,  స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ

 

4. వరద హెచ్చరిక, నదీ ప్రవాహం ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి అపాయకరమైన స్థాయి కంటే తక్కువగా ఉంటే  ఆ ప్రవాహాన్ని ఏమంటారు?
జ:  తక్కువస్థాయి వరద

 

5. 2008లో బీహార్‌లోని ఏ నదికి వరదలు రావడం వల్ల 527 మంది మరణించారు? 
జ:  కోసి

 

6. భారతదేశంలో ఎంత శాతం భూ భాగం వరద ముప్పునకు గురయ్యే అవకాశం ఉంది?
జ:  8%

 

7. భారతదేశంలో ఏ నెలల మధ్యకాలంలో వరదలు వచ్చే అవకాశం ఎక్కువ?
జ:  జూన్-సెప్టెంబరు

 

8. భారతదేశంలో ఏ సంవత్సరంలో సంభవించిన వరదల ఫలితంగా అత్యధికంగా 11,316 మంది మరణించారు?
జ:  1977

 

9. మన దేశంలో వరదలు తరచుగా ఏ నదీ పరీవాహక ప్రాంతాల్లో వస్తుంటాయి?
జ:  గంగా-బ్రహ్మపుత్ర

 

10. ఏదైనా ప్రాంతంలో వరదలు రావడానికి కారణం- 
జ:  అధిక వర్షపాతం, తుపాన్లు , జలాశయాలకు గండ్లు పడటం , కొండచరియలు విరిగిపడటం, నదులు ప్రవాహ దిశను మార్చుకోవడం

 

11. హైదరాబాద్, ముంబయి లాంటి నగరాల్లో వరదలు రావడానికి కారణమేమిటి?
జ:  డ్రైనేజీలు ఘనపదార్థాలతో పూడుకుపోవడం

 

12. బ్రహ్మపుత్రా నదీ ప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రాల్లో అక్కడి నదుల వల్ల ఎక్కువగా వరదలు వస్తున్నాయి?
జ:  అసోం, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్

 

13. జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ నది, దాని ఉపనదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి?
జ:  గంగానది

 

14. మధ్య భారతదేశం, దక్కన్ ప్రాంతంలోని ఏ నదుల వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వరదలు సంభవిస్తున్నాయి?
జ:  గోదావరి, కృష్ణా, కావేరి

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కొండచరియలు విరిగిపడటం

భారతదేశంలో సహజంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాల్లో కొండచరియలు విరిగిపడటం (Land slide) ఒకటి. కొండప్రాంతం నుంచి రాళ్లు, మట్టిపెళ్లలు లాంటివి కిందకు పడటాన్ని ఈ రకమైన వైపరీత్యంగా పేర్కొంటారు. మనదేశంలో హిమాలయ ప్రాంతం, పశ్చిమ కనుమలు (westren ghats), నీలగిరి కొండల ప్రాంతాల్లో ఇది ఎక్కువగా సంభవిస్తోంది. సిక్కిం, ఘర్వాల్ (Garwal) ప్రాంతాల్లో సరాసరి ఒక చదరపు కిలోమీటర్‌కు 2 సార్లు కొండచరియలు విరిగిపడుతుంటాయి.

  భారతదేశంలో ఈ వైపరీత్యం సంభవించే అవకాశం 22 రాష్ట్రాల్లో ఉంది. మనదేశంలోని 15 శాతం భూమిని కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతంగా గుర్తించారు. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఘర్వాల్, కౌమాన్ (Kumaon) ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది ఎక్కువగా వర్షాకాలంలో సంభవిస్తుంది.

 

నష్టాలు 

కొండచరియలు విరిగిపడటం వల్ల పర్యావరణానికి, ప్రజలకు తాత్కాలిక, దీర్ఘకాలిక నష్టాలుంటాయి.

ప్రాణ, ఆస్తి నష్టాలు; రోడ్లు దెబ్బతినడం లాంటివి తాత్కాలిక నష్టాలుగా పేర్కొనవచ్చు. ఈ వైపరీత్యం సంభవించిన ప్రాంత బాహ్య స్వరూపం మారిపోవడం; పంటపొలాలు, వ్యవసాయ భూమి నాశనం కావడం, నేల క్రమక్షయానికి గురవడం, ప్రజలకు పునరావాస సమస్యలు తలెత్తడం లాంటివి దీర్ఘకాలిక నష్టాలుగా పేర్కొనవచ్చు. హిమాలయ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం వల్ల రహదారులు, ఆనకట్టలు, టన్నెల్స్, కమ్యూనికేషన్ టవర్స్ లాంటివి తరచుగా దెబ్బతింటున్నాయి. దీని వల్ల మనదేశంలో ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, సుమారు రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల నష్టం వాటిల్లుతోందని అంచనా. కొన్నిసార్లు కొండచరియలు విరిగిపడటం వల్ల నదీప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. 1970లో పాతాళగంగానదిని కొండచరియలు విరిగి అడ్డగించడం వల్ల అలకనందా ప్రమాదం జరిగింది. 2005లో ఇదేవిధంగా పరెచ్చు (Parechhu) నదికి అడ్డంకి ఏర్పడటం వల్ల హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు వచ్చాయి. 

  ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో దీనికి సంబంధించిన నష్టాలు తక్కువగానే ఉన్నాయి. ఆగస్టు 2006లో అరకులోయలో కొండచరియలు విరిగిపడి 18 మంది మరణించారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కొండప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య పెరుగుతూ ఉండటం వల్ల భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి.

 

కారణాలు 

  భారతదేశంలో కొండచరియలు విరిగిపడటానికి కారణాలు 2 అవి:

1) సహజ కారణాలు,

2) మానవ కారణాలు.

  కొండ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు పడటం, కొండవాలుగా ఉండటం, కొండచరియలు వదులుగా అమరి ఉండటం, భూకంపాలు రావడం లాంటివి సహజ కారణాలు. అడవుల నిర్మూలన వల్ల నేల క్రమక్షయానికి గురవడం, సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలు లోపించిన కట్టడాలు, కొండ కింది ప్రాంతాల్లో జనావాసాల ఏర్పాటు, గనులు, క్వారీల తవ్వకం; నేలను ఉపయోగించే విధానాలు లాంటివి మానవ కారణాలుగా చెప్పవచ్చు.

 

వైపరీత్యాన్ని గుర్తించే విధానం 

  నేల, కొండ ప్రాంతాల్లో సంభవించే మార్పుల ఆధారంగా ఈ వైపరీత్యాలను కొద్ది గంటలు లేదా నిమిషాల ముందుగానే గుర్తించవచ్చు. కొండచరియలు విరిగిపడటానికి ముందుగా ఇంట్లోని తలుపులు, కిటికీలు వాటంతట అవే బిగుసుకుపోవడం, గోడలు, ఇతర నిర్మాణాల్లో పగుళ్లు రావడం, ఇంటిగోడలు కదలడం, నేలలో పగుళ్లు ఏర్పడటం, ఫెన్సింగ్, ప్రహారి గోడలు, స్తంభాలు, వృక్షాలు పక్కకు జరగడం, కొండ ప్రాంతాల నుంచి మట్టి, రాళ్లు కొద్దికొద్దిగా రాలుతూ ఉండటం లాంటి మార్పులను గమనించవచ్చు.

 

నివారణా చర్యలు 

* ఏటవాలు, కొండ ప్రాంతాలు, సాధారణ ప్రదేశాల్లో చెట్లు నాటడం.
* ఈ వైపరీత్యం సంభవించే ప్రాంతాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్మాణాలు చేపట్టడం
* రోడ్లు, కాల్వల లాంటివి నిర్మించేటప్పుడు నీటి సహజ ప్రవాహ మార్గానికి అడ్డంకులు ఏర్పడకుండా చూడటం.
* ప్రమాద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకోకుండా చూడటం.
* ప్రమాద తీవ్రతను తగ్గించడానికి కొండ ప్రాంతాల్లో గోడలను నిర్మించడం.
* కట్టడాల్లో సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించడం.
* తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి మ్యాపులను తయారు చేయడం.
* పటిష్టమైన హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయడం.

 

భారతదేశం చేపడుతోన్న చర్యలు 

  కొండచరియలు విరిగిపడే విపత్తును ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు అనేక నిర్వహణా చర్యలను చేపడుతున్నాయి. భారతదేశంలో 'జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జి.ఎస్.ఐ.) దీనిపై మొదటిసారిగా పరిశోధన నిర్వహించింది. ఈ విపత్తు నిర్వహణకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎమ్ఏ) మార్గదర్శకాలను రూపొందిస్తోంది.

  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్‌వో(బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్)తో కలసి మంచు విరిగిపడే ప్రమాద నియంత్రణా చర్యలను చేపడుతున్నాయి. వివిధ సంస్థలు కొండచరియలు విరిగిపడే ప్రాంతాల పటాలను రూపొందిస్తున్నాయి. ఈ వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన శిక్షణ, పరికరాలున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్)ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ వైపరీత్యం సంభవించిన తర్వాత ప్రజలను గుర్తించి, రక్షణ చర్యల్లో పాల్గొంటుంది.

  రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎస్‌డీఎమ్ఏ)తో కలసి అవగాహనా కార్యక్రమాలను చేపట్టడం, పుస్తకాలు ప్రచురణ, కరపత్రాల పంపిణీ, స్థానిక భాషలో వీడియో చిత్రాలను చూపించడం, పారిశ్రామిక ప్రాంతాలు, కార్యాలయాల్లో మాక్‌డ్రిల్స్ నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేస్తోంది. 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఈ విపత్తును ఎదుర్కొనే చర్యలను చేపడుతోంది. అంతేకాకుండా ప్రజలను చైతన్యవంతం చేస్తూ, రాష్ట్రాలకు తగిన సహాయాన్ని అందిస్తోంది.

 

పరిశోధన, నిర్వహణ చేపడుతున్న సంస్థలు

* జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)

* సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ)

* సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీబీఆర్ఐ)

* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - రూర్కి (ఐఐటీ - ఆర్)

* వాడియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ (డబ్ల్యూఐహెచ్‌జీ)

* డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (డీవోఎస్)

* నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్‌సీ)

* డిఫెన్స్ టెర్రేయిన్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (డీటీఆర్ఎల్)

* బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఎస్ఐ)

* భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన స్నో అండ్ అవలాంచ్ స్టడీ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎస్ఏఎస్ఈ) సంస్థ మంచుచరియలు విరిగిపడటంపై పరిశోధన చేస్తోంది.

* బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) భారతదేశంలోని కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, నిర్వహణలను చేపడుతోంది.

* డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ వైపరీత్యం గురించి పరిశోధన, అభివృద్ధి కోసం నిధులను కేటాయిస్తోంది.

* సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐవో) కొండచరియలు విరిగి పడటాన్ని గుర్తించడానికి 2006లో హరిద్వార్‌లోని మానసదేవి ప్రాంతంలో ఇన్‌స్ట్రుమెంటేషన్ నెట్‌వర్క్‌ను నెలకొల్పింది.

* బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ (ఎంబీటీపీసీ), అన్నా యూనివర్సిటీ సంయుక్తంగా 2004లో కొండచరియలు విరిగిపడే వైపరీత్యానికి సంబంధించిన అట్లాస్‌ను ప్రచురించాయి.

* నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఆర్ఎన్ఎస్‌సీ) కొండచరియలు విరిగిపడే వైపరీత్యం ఉన్న ప్రాంతాల పటాలను (Land slide Hazard Zonation Maps) తయారు చేస్తోంది

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూ సంపాతాలు

అమాంతం విరిగిపడే ఆపద! 


కొండచరియలు విరిగిపడ్డాయని, మంచు ప్రవాహాలు ముంచుకొచ్చాయని, రాతి ఖండాలు అమాంతం కూలిపోయాయని, అపార ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయని తరచూ వార్తలు వస్తుంటాయి. వీటికి భారీ వర్షాలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాల వంటి ప్రకృతి ప్రకోపాలతోపాటు, అడవుల నరికివేత, అస్తవ్యస్త ఇంజినీరింగ్‌ విధానాల వంటి మానవ తప్పిదాలు కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ ప్రమాదాలను నిరోధించడానికి, నష్టతీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వాలు నిరంతరం కృషిచేస్తుంటాయి. భవిష్యత్తు ఉద్యోగులుగా అభ్యర్థులు ఈ విపత్తు నిర్వహణ విధానాల గురించి అవగాహన పెంచుకోవాలి. 

 


ఎత్తయిన పర్వతాలు, కొండలు, వాలు ప్రాంతాల నుంచి రాళ్లు, మట్టి, బురద జారిపడటం, నెమ్మదిగా పడటం లేదా కిందికి దొర్లుతూ వచ్చే ప్రక్రియను భూపాతం లేదా కొండచరియలు విరిగిపడటం అంటారు. ఇలా అన్నిరకాల బృహత్‌ చలనాలను భూసంపాతం (Land Slides)అంటారు.

భూపాతాలు ఎక్కువగా పర్వత ప్రాంతాల్లోనే సంభవిస్తాయి. గనుల తవ్వకాలు, భూకంపాలు, వరదలు, అగ్నిపర్వతాల విస్ఫోటాల సమయంలోనూ భూపాతాలు జరగవచ్చు. భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా కొండల ప్రాంతాల్లో భూపాతాలు ఏర్పడవచ్చు. ఇలాంటప్పుడు నదీ ప్రవాహాలను కొండచరియలు అడ్డుకోవడంతో వరదలు వస్తుంటాయి.

 

ప్రకృతి సంబంధ కారణాలు:

* కొండ ప్రాంతాలు ఎక్కువ వాలు కలిగి ఉండటం.

* వాలు ప్రాంతాలు గట్టిగా ఉండి చిన్న కదలికలకు కూడా విరిగిపడటం.

* తీవ్రమైన వర్షపాతం.

* రాతి ప్రదేశాలు బాగా క్రమక్షయానికి గురికావడం.

* భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, వరదలు.

* నీటిపారుదల వ్యవస్థ సరైన దిశలో లేకపోవడం.

 

మానవ సంబంధ కారణాలు:

* చెట్లను విచక్షణారహితంగా కొట్టివేయడంతో జరిగే మృత్తికా క్రమక్షయం.

* సరైన ప్రణాళికలు లేకుండా వాలు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించడం.

* సరైన ఇంజినీరింగ్‌ విధానాలు లేకుండా తవ్వకాలు జరపడం.

* ఇష్టానుసారంగా గనుల తవ్వకం.

* సమర్థ భూవినియోగ ప్రణాళికలు కొరవడటం.

 

భూపాతం రకాలు

1. ప్రపాతం (Falls): ఎత్తయిన వాలు లేదా శిఖరాల నుంచి వేరుపడిన శిలలు ఎగురుతూ, దొర్లుతూ రావడం వంటి అనూహ్య చలనాలను ప్రపాతం అంటారు.

2. శిథిల ప్రవాహం (Derbis flow): వదులైన మట్టి, రాళ్లు, సేంద్రియ పదార్థం లాంటివి గాలి, నీటితో కలిసి ముద్దగా ఏర్పడి వేగంగా దిగువకు ప్రవహించడం.

3. లహర్‌ ప్రవాహం (Lahar flow): అగ్నిపర్వతాల విస్ఫోటం వల్ల జ్వాలాబిల సరస్సులు విచ్ఛిన్నమై ఏర్పడిన బురద ప్రవాహం లేదా మంచు కరగడం వల్ల ఏర్పడిన శిథిల పదార్థం కిందికి ప్రవహించడం.

4. సర్పణం లేదా పాకడం (Creep): మట్టి లేదా శిలలు నెమ్మదిగా, నిటారుగా కిందికి జారడం. ఇవి రిటైనింగ్‌ గోడలు, కంచెలు, స్తంభాలను కిందికి నెట్టుకు వస్తాయి.

5. పంక ప్రవాహం (Mud flow): 50% ఇసుక, బురద మట్టి కలిగిన తడిపదార్థం వేగంగా ప్రవహించడాన్ని పంక ప్రవాహం అంటారు.

6. కూలిపోవడం (Topple): ఒక రాతి ఖండం ముందుకు వంగుతూ అమాంతంగా పడిపోవడాన్ని కూలిపోవడం అంటారు.

 

ప్రపంచ భూపాతాల దుర్బలత్వం: ప్రపంచంలో మొత్తం విపత్తుల్లో 4% భూపాతాల బెడద ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్య అన్ని ఖండాల్లోనూ ఏదో ఒక ప్రాంతంలో సంభవిస్తూ ఉంటుంది.

 

 

భారత్‌లో స్థితిగతులు:

* దేశంలో మొత్తం విపత్తుల్లో భూపాతాల దుర్బలత్వం 11%గా ఉంది.

* దేశంలో అధికశాతం భూపాతాలు కొండచరియలు విరిగిపడటం వల్లే జరుగుతున్నాయి.

* దాదాపు 0.49 మిలియన్‌ చ.కి.మీ.ల్లో భూపాతాలు సంభవిస్తున్నాయి. ఈ విస్తీర్ణం దేశ భూభాగంలో 0.15%.

* అత్యధికంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో, ఆ తర్వాత పశ్చిమ కనుమలు, వింధ్య పర్వతాల్లో భూసంపాతాలు జరుగుతున్నాయి.

* ప్రపంచంలో మొత్తం భూపాతాల్లో 30% హిమాలయాల్లోనే నమోదవుతున్నాయి.

* నీలగిరి లోయను శిథిల సంపాత లోయ అంటారు. 1978లో అసాధారణ వర్షాలతో ఇక్కడ వంద సార్లు భూపాతాలు వచ్చాయి.

* దేశంలో దాదాపు 20 రాష్ట్రాల్లో భూపాతాల ప్రభావం ఉంది. సిక్కిం, ఉత్తరాఖండ్‌ అధిక ప్రభావిత రాష్ట్రాలు.

* శాస్త్రీయ అంచనాల ప్రకారం సిక్కిం, ఉత్తరాఖండ్‌లలో ప్రతి చ.కి.మీ.కు రెండు భూపాతాలు జరుగుతున్నాయి.

* ద్వీపకల్ప భారతదేశంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని కొండ ప్రాంతాల్లో భూపాతం కారణంగా తక్కువ నుంచి ఒక మోస్తరు ప్రమాద అవకాశాలు ఉన్నాయి.

* భారతదేశంలో భూపాతం/ కొండచరియలు విరిగిపడే విపత్తులకు సంబంధించి జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) 2004 నుంచి నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఇది భూపాతపు ప్రాంతాలను పటచిత్రీకరణ చేయడం, అధ్యయనాలు నిర్వహించడం, నివారణ చర్యలు, జాగ్రత్తల గురించి సలహాలు, హెచ్చరికలు జారీ చేస్తుంది.

 

 

ఉపశమన వ్యూహాలు:

* వాలు ప్రాంతాల్లో నీటిపారుదల సరైన మార్గంలో ప్రవహించే విధంగా వరద కాలువలను ఏర్పాటు చేయాలి.

* శిలాశకలాలు కిందికి జారే ప్రాంతాల్లో వాటిని అడ్డుకోవడానికి రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మించాలి.

* భూపాతాలను ఆపడానికి వృక్ష సంపదను పెంచాలి. చెట్లు నేలకోతను ఆపి భూపాతాన్ని నిరోధిస్తాయి.

* భూపాత దుర్బలత్వ ప్రాంతాలను గుర్తించి, సరైన విపత్తు నివారణ వ్యూహాన్ని (హజార్డ్‌ మ్యాపింగ్‌) ముందుగా తయారు చేసుకోవాలి.

* ప్రజలకు అవగాహన కల్పించడం, వర్షాల సమయంలో ముందుగానే సమాచారం అందించడం లాంటివి చేయాలి.

 

మాదిరి ప్రశ్నలు


1. భారతదేశంలో భూపాతాలు ఎక్కువగా జరిగే చోటు

1) హిమాలయాలు       2) ఆరావళి పర్వతాలు      3) నీలగిరి కొండలు       4) తూర్పు కనుమలు

జ: హిమాలయాలు

 

2. భూపాత దుర్బలత్వంపై సత్వర హెచ్చరికలు జారీ చేసే సంస్థ ఏది?

1) భారత వాతావరణ శాఖ             2) బోర్డర్‌ మేనేజ్‌మెంట్‌ శాఖ

3) జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా               4) రహదారుల శాఖ

జ: జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా

 

3. భారతదేశ మొత్తం విపత్తుల్లో కొండచరియలు విరిగి పడే విపత్తు భాగం ఎంత?

1) 0.15 శాతం      2) 11 శాతం      3) 30 శాతం      4) 20 శాతం

జ: 11 శాతం​​​​​​​

 

4. ప్రపంచ మొత్తం విపత్తు నష్టాల్లో భూపాత నష్టం ఎంత?

1) 4 శాతం      2) 10 శాతం      3) 20 శాతం      4) 11 శాతం

జ: 4 శాతం​​​​​​​

 

5. మట్టి, రాళ్లు, సేంద్రియ పదార్థం కలిసి ముద్దలుగా వేగంగా దిగువకు ప్రవహించడం ఏ రకమైన భూపాతం?

1) శీఘ్రపాతం      2) శిథిల ప్రవాహం      3) కూలిపోవడం              4) పాకడం

జ: శిథిల ప్రవాహం​​​​​​​

 

6. శిథిల సంపాత లోయ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?

1) హిమాలయాలు      2) పశ్చిమ కనుమలు      3) వింధ్య పర్వతాలు      4) నీలగిరి కొండలు

జ: నీలగిరి కొండలు​​​​​​​

 

7. మన దేశంలో భూపాతాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాలు

1) సిక్కిం, ఉత్తరాఖండ్‌         2) మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌

3) అస్సాం, పశ్చిమ బెంగాల్‌       4) తమిళనాడు, కేరళ

జ: సిక్కిం, ఉత్తరాఖండ్‌​​​​​​​

 

8. శిలాశకలాలు దొర్లడం, ఎగిరిపడటం వంటి భూపాతాన్ని ఏమంటారు?

1) శిథిల సంపాతం      2) శిథిల ప్రవాహం       3) ప్రపాతం       4) లహర్‌

జ: ప్రపాతం​​​​​​​

 

9. కిందివాటిలో భూపాతాలకు కారణాలేవి?

ఎ) కొండవాలు ఎక్కువగా ఉండటం          బి) కొండల క్రమక్షయం జరగడం

సి) కొండలు వృక్షాలతో కప్పి ఉండటం        డి) కొండలపై వృక్షాలు లేకపోవడం

1) ఎ, బి, సి, డి           2) బి, సి        3) ఎ, బి, డి        4) బి, సి, డి

జ: ఎ, బి, డి​​​​​​​

 

10. మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో భూపాతాలు జరిగే అవకాశం ఉంది?

1) 20        2) 10       3) 4          4) అన్ని రాష్ట్రాలు 

జ: 20

 రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 10-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జలవనరులు

సమస్త జీవులకు సర్వాధారం!


ప్రకృతి వనరుల్లో ప్రధానమైంది, ప్రాణికోటి జీవనానికి అత్యంత అవసరమైంది జలం. జీవుల ఆవిర్భావం నుంచి నాగరికతా వికాసం వరకు అన్నింటికీ నీరే ప్రధానం. దేశంలో వ్యవసాయ ప్రగతి, నగరీకరణ విస్తరణ అంతా ఆ వనరుపైనే ఆధారపడి సాగుతోంది. అందుకే అతి విలువైన నీటి లభ్యత, వినియోగం, నిర్వహణ తీరుతెన్నులను పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.


 

విశ్వంలో ఇప్పటివరకు గుర్తించిన నీరున్న గ్రహం భూమి మాత్రమే. మొత్తం భూవైశాల్యం 510 మిలియన్ల చ.కి.మీ. ఉంటే అందులో సుమారు 361 మిలియన్ల చ.కి.మీ (70.7%) జలం ఆవరించి ఉంది. భూమిపై పర్యావరణ సమతౌల్యానికి ప్రధాన కారణం నీరే. ఒక జాతి ఆర్థికాభివృద్ధి, సామాజిక, సాంఘిక, రాజకీయ స్థితిగతులు అక్కడి నీటివనరులతో ముడిపడి ఉంటాయి. భూమి మీద ఉన్న జలావరణంలో అత్యధిక జలం (97.25%) మహా సముద్రాల్లో ఉప్పునీటి రూపంలో ఉంది. మిగిలిన మంచినీరులో మంచు, హిమానీనదాల రూపంలో 2.05%, భూగర్భ జలంగా 0.68%, సరస్సుల్లో 0.01%, నదుల్లో ప్రవాహ నీరుగా 0.0001% మేర విస్తరించి ఉంది. ప్రపంచంలో బ్రెజిల్, రష్యా, చైనా, కెనడా, ఇండొనేసియా, అమెరికా, భారత్, కొలంబియా, కాంగో లాంటి దేశాల్లో 60% నీటి లభ్యత ఉండగా, మిగిలిన దేశాలన్నింటిలో 40% నీటి లభ్యత ఉంది.


యునెస్కో విడుదల చేసిన ‘యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌’ నివేదిక 2022 ప్రకారం ప్రపంచంలోని పట్టణ ప్రజల్లో 50% మంది భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 69% వ్యవసాయం భూగర్భ జలాలపైనే సాగుతోంది. 22% గృహావసరాల కోసం భూగర్భ జలాలనే వినియోగిస్తున్నారు. 9% పారిశ్రామిక రంగ అవసరాలకు భూగర్భ జలాలు ఉపయోగపడుతున్నాయి.

 

భారత్‌లో లభ్యత

నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ (NCIWRD) ప్రకారం.. 329 మిలియన్ల హెక్టార్లున్న దేశ భూభాగంపై సాలీనా జలచక్రం ద్వారా 4 వేల బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల (బీసీఎం) నీరు లభిస్తోంది. ఇందులో 40% (1600 బీసీఎం) ఆవిరైపోగా, 9% (360 బీసీఎం) నేలలో తేమ రూపంలో, 10% (400 బీసీఎం) భూగర్భజలంగా ఉంటుంది. మిగిలిన 41% (1640 బీసీఎం) నదులు, చెరువులు, సరస్సుల్లో ఉపరితల జలంగా నిల్వ ఉంటుంది.

* దేశంలో ఉపరితల, భూగర్భ జలాలుగా ఉన్న మొత్తం 2040 బీసీఎం నీరు.. దేశ వ్యవసాయ, గృహ, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతోంది.

ప్రపంచ జనాభాలో భారత్‌లో 17.5% ఉంది. అలాగే ప్రపంచ పశు జనాభాలో 15% ఇక్కడ ఉంది. కానీ ప్రపంచ నీటి లభ్యతలో భారత్‌ వాటా 4% మాత్రమే. జలవనరులు దేశమంతటా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా అందుబాటులో లేవు. భూగర్భజలాల పరంగా చూస్తే అవక్షేప శిలలతో, నిక్షేపణ పదార్థాలతో నిండిన ఉత్తర మైదానంలోని గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ నీరు లభ్యమవుతోంది. దీనికి భిన్నంగా ద్వీపకల్ప పీఠభూమి కఠిన శిలలతో ఉండటంతో నీటి లభ్యత తక్కువ ఉంటుంది.


ఆసియాలోనే అత్యధిక వ్యవసాయ భూమి ఉన్న దేశం భారతదేశమే. ఇక్కడి నీటిలో 93.37% వ్యవసాయానికి, 3.73% గృహావసరాలకు వినియోగమవుతోంది. పరివాహక ప్రాంతాల్లో నీటి ఉపరితల లభ్యత ఆధారంగా చూస్తే అయిదు అతి పెద్ద నదుల్లోనే 60% నీరు చేరుతోంది. మిగిలిన 250 నదుల్లో 40% ఉపరితల జలాలు అందుబాటులో ఉన్నాయి.


దేశంలో నైరుతి రుతుపవన కాలంలో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు తక్కువ కాలంలోనే 75% వర్షం కురుస్తుంది. దీంతో అధికభాగం నీరు  వరదల రూపంలో నదుల ద్వారా సముద్రాల్లో కలిసిపోతుంది.


నిర్వహణ చర్యలు

జాతీయ జలవిధానం: నీటి సంరక్షణ, సక్రమ పంపిణీ, క్రమబద్ధీకరణ లాంటి ఆశయాలతో మొదటి జాతీయ జల విధానాన్ని 1987లో తీసుకొచ్చారు. దీని తర్వాత 2002, 2012తో కలిపి ఇప్పటివరకూ మూడు జాతీయ జల విధానాలు వచ్చాయి.


అమృత్‌ పథకం: 500 నగరాల్లో గృహ వినియోగానికి నీరు అందించే ఈ పథకాన్ని కేంద్రం నిర్వహిస్తోంది.


జలక్రాంతి అభియాన్‌: జలవనరుల నిర్వహణ, సంరక్షణ దృష్ట్యా నీటి సరఫరాను మరింత సమర్థంగా అమలుచేసేందుకు 2015 - 16లో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు.


జల్‌ జీవన్‌ మిషన్‌: ప్రతి గ్రామంలో ఇంటింటికీ కొళాయి ద్వారా నీరు అందించే కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక ఇది. రూ.3.60 లక్షల కోట్లతో ఈ పథకాన్ని అమలుచేస్తోంది.


వేగవంతమైన నీటిపారుదల ప్రయోజన పథకం (ఏఐబీపీ): కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఇప్పటివరకు అనుమతించిన ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేయాలనే లక్ష్యంతో 1996 - 97లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.


ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం: సమగ్ర వరద  నిర్వహణ కోసం 11వ ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.


నమామి గంగే కార్యక్రమం: గంగా నది కాలుష్యాన్ని 2020 నాటికి పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన కార్యక్రమం.


ప్రధానమంత్రి కృషి సించాయి యోజన: పంట పొలాలకు నీటి లభ్యతను పెంచి దేశంలో సాగునీటి సదుపాయం ద్వారా సాగు విస్తీర్ణం పెంచాలన్న లక్ష్యంతో 2015 - 16లో హర్‌ ఖేత్‌ కో పానీ (ప్రతి పొలానికి నీరు) నినాదంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.


కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్, వాటర్‌  మేనేజ్‌మెంట్‌: నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా వ్యవసాయ దిగుబడిని పెంచి రైతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్రం 1974 - 75లో దీన్ని అమలు చేసింది. 2015-16 నుంచి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకంలో భాగంగా అమలు చేస్తున్నారు.


అంతరాష్ట్రీయ నదీ జలాల చట్టం: రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకంలో వివాదాల పరిష్కారానికి 1956లో ఈ చట్టం తీసుకొచ్చారు.


నదుల అనుసంధానం: ఉత్తర భారతదేశంలో వరదల నియంత్రణ, దక్షిణ భారతదేశంలో కరవు నివారణ కోసం ఉత్తర భారతంలోని 16 నదులను, దక్షిణ భాగంలో 14 నదులను కాల్వల ద్వారా అనుసంధానించాలని 2002లో కేంద్రం నిర్ణయించింది. 

 

 

మాదిరి ప్రశ్నలు


1. గంగానదీ జల కాలుష్య నిర్మూలన కోసం భారత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమం ఏది?

1) నమస్తే గంగా     2) నమామి గంగే     3) పవిత్ర గంగ     4) మిషన్‌ గంగ


2. నీటి సంరక్షణ, సక్రమ పంపిణీ కోసం మొదటి జాతీయ జల విధానాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

1) 1987     2) 1978      3) 1952      4) 1990


3. జలకాలుష్య నివారణ, నియంత్రణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

1) 1980      2) 1974      3) 1950     4) 1998


4. జల వనరులను అభిలషణీయ స్థాయిలో వినియోగించుకోవడానికి నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1982      2) 1999    3) 1965       4) 1986


5. ప్రపంచ నీటిలభ్యతలో భారతదేశ వాటా ఎంత?

1) 10%      2) 20%     3) 4%     4) 15%


6. మన దేశంలో ఏ నదీ పరివాహక ప్రాంతంలో వార్షిక నీటిలభ్యత అధికంగా ఉంది?

1) గంగా      2) గోదావరి     3) సింధూ     4) బ్రహ్మపుత్ర 


7. ఏ నది నీరు సముద్రంలో అత్యధికంగా కలిసిపోతుంది?

1) బ్రహ్మపుత్ర     2) గంగ    3) మహానది, గోదావరి     4) నర్మద, తపతి 


8. దేశంలో ప్రతి గ్రామీణ గృహానికి కొళాయి ద్వారా నీరు అందించే కార్యక్రమం పేరేంటి?

1) అమృత్‌ పథకం     2) జల్‌ జీవన్‌ మిషన్‌    3) జలక్రాంతి అభియాన్‌    4) అమృత్‌ జల క్రాంతి


9. భారతదేశ భూ విస్తీర్ణం 329 మి.హెక్టార్లలో జలచక్రం ద్వారా లభిస్తున్న నీరు ఎంత?

1) 1000 బి.సి.ఎం.    2) 4000 బి.సి.ఎం.   3) 3000 బి.సి.ఎం.   4) 400 బి.సి.ఎం.


10. భారతదేశంలో లభిస్తున్న అన్ని జలవనరుల్లో వ్యవసాయ రంగానికి వినియోగిస్తున్న నీటి శాతం ఎంత?

1) 90%     2) 93%    3) 50%      4) 60%

 

సమాధానాలు: 1-2, 2-1, 3-2, 4-1, 5-3, 6-4, 7-1, 8-2, 9-2, 10-2.

రచయిత: జల్లు సద్గుణరావు


 

 

 

 

Posted Date : 17-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మానవ కారక విపత్తులు

స్వీయ విధ్వంసక సంక్షోభాలు!

  భూకంపాలు, సునామీలు, తుపాన్ల వంటి సహజ విపత్తులను ఆపడం, అడ్డుకోవడం అసాధ్యం. కానీ అదుపు చేయగలిగిన మానవ కారక ప్రమాదాలు కూడా ఇప్పుడు ప్రపంచానికి పెను విపత్తులుగా పరిణమిస్తున్నాయి. మనిషి చేసే నిర్లక్ష్యం, తప్పులు, సరైన శిక్షణ లేకుండా చేసే పొరపాట్ల వల్ల సంభవించే ప్రాణ, ఆస్తి నష్టాలు అధికమవుతున్నాయి. అధిపత్య ధోరణులతో ఆధునిక సాంకేతికతను వినాశనాలకు వినియోగించడమూ మానవుల వల్ల ఏర్పడుతున్న స్వీయ విధ్వంసక సంక్షోభాలే. ఇలాంటి విపత్తుల రకాలు, వాటి ప్రభావాల గురించి కాబోయే ప్రభుత్వోద్యోగులకు సరైన అవగాహన ఉండాలి. 

 

  మానవ అభివృద్ధిని అడ్డుకునే విపత్తుల్లో భూకంపాలు, సునామీలు, చక్రవాతాలు లాంటి సహజ విపత్తులతోపాటు అనేక మానవ ప్రేరిత విపత్తులు కూడా అభివృద్ధి నిరోధకాలుగా పరిణమిస్తున్నాయి. మానవ ప్రమేయం, తప్పిదాలు, నిర్లక్ష్యం, మానవ నిర్మిత వ్యవస్థలు దెబ్బతినడం లాంటి కారణాలతో ఏర్పడే విపత్తులను మానవ కారక విపత్తులు అంటారు. అవి రెండు రకాలుగా ఉంటాయి.

1) సామాజికపరమైన మానవ కారక విపత్తులు: పౌర యుద్ధాలు, పౌర తిరుగుబాట్లు, తీవ్రవాదం, తొక్కిసలాటలు, ఆస్తులు తగలబెట్టడం లాంటి వాటితో తీవ్ర ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పర్యావరణ హాని జరగడాన్ని సామాజికపరమైన మానవకారక విపత్తులు అంటారు.

2) సాంకేతికపరమైన మానవ కారక విపత్తులు: వివిధ ప్రయోగాలు, నిర్మాణాలు, పారిశ్రామికీకరణ, రవాణా లాంటి వాటిలో మానవ నిర్లక్ష్యం, తప్పిదాలు, యాంత్రిక వైఫల్యం వల్ల ఏర్పడే విపత్తులను సాంకేతికపరమైన విపత్తులుగా పరిగణిస్తారు. పారిశ్రామిక విపత్తులు, నిర్మాణాలు కూలిపోవడం, అగ్ని ప్రమాదాలు, రేడియేషన్‌ విపత్తులు, అంతరిక్ష ప్రమాదాలు, రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు ఇందులో ప్రధానమైనవి.

 

సామూహిక విధ్వంసక ఆయుధాలు

ప్రజల ప్రాణాలు, ఆస్తులు, పర్యావరణానికి భారీ నష్టం తెచ్చే ఆయుధాలివి. అణు, రసాయన, బయోలాజికల్, రేడియోలాజికల్‌ ఆయుధాలు ఇందుకు ఉదాహరణ. 2003లో యూఎస్‌ఏ సారథ్యంలో మిత్రరాజ్యాలు ఇరాక్‌పై దాడి చేసిన సందర్భంగా ఈ పదం బాగా వాడుకలోకి వచ్చింది.

 

అణ్వాయుధాలు: విధ్వంసకర శక్తిని విడుదల చేసే విస్ఫోటక ఆయుధాలే అణ్వాయుధాలు. ఇవి రెండు రకాలు. 1) కేంద్రక విచ్ఛిత్తి ద్వారా పెను విధ్వంసం సృష్టించే అణుబాంబులు లేదా వి - బాంబులు లేదా ఫిజన్‌ బాంబులు. 2) కేంద్రక సంలీన చర్య ద్వారా పెద్ద మొత్తంలో శక్తి విడుదల చేసే హైడ్రోజన్‌ బాంబులు లేదా బీ - బాంబులు లేదా ఫ్యూజన్‌ బాంబులు లేదా థర్మోన్యూక్లియర్‌ బాంబులు. హైడ్రోజన్‌ బాంబులు వి - బాంబుల కంటే వెయ్యి రెట్ల అధిక శక్తిని ఇస్తాయి.

  రెండో ప్రపంచ యుద్ధకాలంలో జపాన్‌పై అమెరికా అణుబాంబులు ప్రయోగించింది. ‘బి-29 బాంబర్‌ ఎనోలా గే’ అనే యుద్ధ విమానం నుంచి మొదటిసారి ‘లిటిల్‌బాయ్‌’ అణుబాంబుని 1945, ఆగస్టు 6న హిరోషిమాపై వేసింది. రెండోసారి 1945, ఆగస్టు 9న అదే యుద్ధ విమానంతో ‘ఫ్యాట్‌మాన్‌’ అణుబాంబుని నాగసాకి నగరంపై విడిచిపెట్టింది. ఈ చర్య మానవ జాతి చరిత్రలో అత్యంత హేయమైన చర్యగా నిలిచిపోయింది.

 

రసాయన ఆయుధాలు: శరీర వ్యవస్థపై దాడి చేసే రసాయన పదార్థాలు లేదా విష పదార్థాలను ఉపయోగించి ప్రజల ప్రాణానికి భారీ నష్టం కలగజేయడాన్ని రసాయన ఆయుధాల దాడిగా భావిస్తారు. సాధారణ రసాయనాలతోనే వీటిని తయారుచేయవచ్చు. వీటిలో అనేక రకాలున్నాయి. ఫాస్జిన్‌ లాంటి ఊపిరాడకుండా చేసే వాయువులు మనుషుల ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేసి ప్రాణాలు హరిస్తాయి. 

  మస్టర్డ్‌ గ్యాస్‌ లాంటి వాటితో శరీరంపై పొక్కులు వస్తాయి. శరీరం కాలిపోవడంతోపాటు చూపు పోతుంది. వీటన్నింటి కంటే ప్రాణాంతకమైంది నెర్వ్‌ ఏజెంట్‌. ఇది శరీరంలోని కండరాలకు మెదడు పంపే సంకేతాలను అడ్డుకుంటుంది. చిన్న బిందువు కూడా ప్రాణాంతకం అవుతుంది. ఉదా: 0.5 మిల్లీగ్రాముల వీఎక్స్‌ నెర్వ్‌ ఏజెంట్‌ ఒక వ్యక్తి ప్రాణం తీస్తుంది. రసాయన కారకాన్ని వ్యాప్తి చేయడానికి ముందు దాన్ని లక్ష్యంపైన లేదా దాని పక్కనే చల్లి తేలికగా వ్యాపింపజేయవచ్చు. అందువల్ల ఈ రసాయన పదార్థాన్ని అత్యంత సమర్థంగా ఉపయోగించాలి. యుద్ధ సమయంలో ఫిరంగి గుండ్లు, బాంబులు, క్షిపణుల్లో రసాయన పదార్థాన్ని నింపి ప్రయోగించవచ్చు. దీన్ని తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ సేనలు ఫ్లోరిన్‌ సిలిండర్‌ను తెరచి శత్రువులపైకి పంపాయి. 1980లో ఇరాన్‌ - ఇరాక్‌ యుద్ధంలో; 2013, ఆగస్టు 21న సిరియా రాజధాని డమాస్కస్‌ శివార్లలో సారిన్‌ అనే నెర్వ్‌ ఏజెంట్‌ను ప్రయోగించారు.

 

పారిశ్రామిక విపత్తులు: రసాయన విపత్తులను, పారిశ్రామిక విపత్తులను ఒకదానికొకటి ప్రత్యామ్నాయ పదాలుగా వాడతారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ‘యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌’ (యూసీఐఎల్‌)’ అనే క్రిమిసంహారక మందుల తయారీ పరిశ్రమ నుంచి 30 - 40 టన్నులకు పైగా మిథైల్‌ ఐసోసైనేట్‌ అనే విషవాయువు లీకవడంతో 3 వేల మందికి పైగా మరణించారు. సుమారు 5 లక్షల మంది అనేక విధాలుగా అనారోగ్యాలకు గురయ్యారు. ఈ సంఘటన 1984, డిసెంబరు 2 అర్ధరాత్రి తర్వాత జరిగింది.

* 1976, జులై 10న ఇటలీలోని సెవేసోలో రసాయనాల తయారీ పరిశ్రమ నుంచి ‘డియోక్సిన్‌’ వాయువు లీకై 3,300 పశువులు చనిపోయాయి. ఆ తర్వాత 80 వేల పశువులను చంపేయాల్సి వచ్చింది.

* 2020, మే 7న తెల్లవారుజామున విశాఖపట్నంలో ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి ‘స్టైరీన్‌’ వాయువు లీకై 12 మంది చనిపోయారు. ఇలా రసాయన పారిశ్రామిక విపత్తులు అనేక సందర్భాల్లో జరుగుతున్నాయి.

 

రేడియోధార్మిక ఆయుధాలు: ఏదైనా ప్రదేశంలో రేడియోధార్మికత కలిగిన పదార్థం కారణంగా తీవ్రనష్టం జరిగితే రేడియోధార్మిక విపత్తు అంటారు. సంప్రదాయ పేలుడు పదార్థాలతో రేడియోధార్మిక పదార్థాలను కలిపి ప్రయోగించడం వల్ల సాధారణం కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. అందువల్ల వీటిని ‘డర్టీబాంబులు’ లేదా ‘బ్యాక్‌ప్యాక్‌ బాంబులు’ అంటారు. వీటిని తయారు చేయడానికి సీజియం-137, స్ట్రాన్షియం-90, కోబాల్ట్‌-60, రేడియో అయోడిన్‌-131 లాంటి రేడియోధార్మిక ఐసోటోప్‌ పదార్థాలను వాడతారు. వీటిని సాధారణంగా ఉగ్రవాదులు వినియోగిస్తుంటారు.

 

జీవాయుధాలు: హానికర వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలను ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తి చేసి, విడుదల చేయడం ద్వారా భారీస్థాయిలో ప్రాణాలను హరించే సూక్ష్మజీవులను జీవాయుధాలు అంటారు. ఇలాంటి జైవిక దాడిని ఉగ్రవాదులు, తీవ్రవాదులు జరిపితే అది బయోటెర్రరిజం అవుతుంది. వీటిని విడిచిపెట్టడానికి అధునాతన సాధనాలు పెద్దగా అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతో చెట్లు, జంతువుల టాక్సిన్ల నుంచీ తయారు చేయవచ్చు. 1 చ.కి.మీ. పరిధిలోని ప్రజలపై దాడి చేయడానికి సంప్రదాయ బాంబుకి 2 వేల డాలర్లు వ్యయమైతే, అణ్వాయుధాలకు 800 డాలర్లు, నెర్వ్‌ గ్యాస్‌ ఆయుధాలకు 600 డాలర్లు ఖర్చవుతుంది. అదే జీవాయుధాలకు ఒక్క డాలరు మాత్రమే వ్యయమవుతుంది. అందువల్ల జీవాయుధాలను ‘పేదవాడి అణుబాంబులు’ అంటారు. ఆంత్రాక్స్, రెసిన్‌లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందని జీవాయుధాలు. మశూచిని కలిగించే వేరియోలా వైరస్, ప్లేగును కలిగించే యెర్సీనియా పెస్టిస్‌ బ్యాక్టీరియాలు వ్యాప్తి చెందే జీవాయుధాలకు ఉదాహరణ.

 

ఆంత్రాక్స్‌: ఈ వ్యాధి బాసిల్లస్‌ ఆంథ్రాసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. శ్వాస పీల్చినప్పుడు అది మనిషి శరీరంలోకి ప్రవేశించి వాంతులు, చర్మంపై పుండ్లు ఏర్పడటానికి కారణమవుతుంది. ఇది ప్రాణాపాయం కలిగించే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాధి.

 

రైసిన్‌ టాక్సిన్‌: ఇది కొంత తక్కువ హానికర రసాయనం. దీన్ని క్యాస్టర్‌ బీన్స్‌ వ్యర్థాల నుంచి తయారు చేస్తారు. ఇది మతిభ్రమించి స్పృహ కోల్పోయే విధంగా చేస్తుంది.

 

మశూచి: ఇది ఆర్ధ్రోపాక్స్‌ వైరస్‌ జాతికి చెందింది. భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ద్వారా సహజసిద్ధ మశూచి (స్మాల్‌ పాక్స్‌) వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు. అయితే దీన్ని జీవాయుధంగా ప్రయోగించే వీలుంది. తుంపర్ల రూపంలో ప్రయోగించే వీలున్న మశూచి ఆయుధాన్ని 1980లో సోవియట్‌ యూనియన్‌ అభివృద్ధి చేసినట్లు చెబుతారు. దీనివల్ల శరీరంపై దద్లుర్లు, జ్వరం, తలనొప్పితో పాటు కంటిచూపు కూడా పోతుంది.

 

ప్లేగు: ఈ వ్యాధి యెర్సీనియా పెస్టిస్‌ అనే బ్యాక్టీరియాతో వస్తుంది. ఈ సూక్ష్మజీవులను నీటి తుంపర్ల ద్వారా ప్రయోగించవచ్చు. దీనివల్ల తీవ్రజ్వరం, చలి, తలనొప్పి, వాంతులు, తల తిరగడం సంభవించి ప్రాణం పోతుంది. ఇందులో నిమోనిక్‌ ప్లేగు ప్రమాదకరమైంది.

 

కబళిస్తున్న రోడ్డు ప్రమాదాలు: మానవ కారక విపత్తుల్లో రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు లాంటి రవాణా ప్రమాదాలతో పాటు, అగ్ని, గని ప్రమాదాలు, ఆహార పదార్థాల పంపకంలో తొక్కిసలాటలు, దేవాలయాల్లో తొక్కిసలాటలు వంటి అనేక మానవ కారక విపత్తులు అనునిత్యం మనిషికి ఎదురవుతున్న మరికొన్ని మానవ కారక విపత్తులుగా చెప్పవచ్చు. అయితే మానవ కారక విపత్తుల్లో రోడ్డు ప్రమాదాలు అత్యధిక ప్రాణనష్టం కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ప్రపంచ రోడ్డు భద్రతా నివేదిక ప్రకారం ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల 12 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. ప్రపంచ వాహనాల్లో 46% అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో ఉంటే, రోడ్డు ప్రమాద మృతుల్లో మాత్రం 90% ఈ దేశాల్లోనే ఉంటున్నారు.

 

ప్రపంచవ్యాప్తంగా గాయాలపాలై మరణించినవారు(డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక):

1) రోడ్డు ప్రమాదాలు - 22.8%

2) ఆత్మహత్యలు - 16.9% 

3) హింస - 10.8% 

4) నిర్మాణాలు కూలిపోయి - 7.5% 

5) విషప్రయోగాలు - 6.7% 

6) అగ్నిప్రమాదాలు - 6.2% 

 

నమూనా ప్రశ్నలు

 

1. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, పర్యావరణానికి భారీగా నష్టం కలిగించే ఆయుధాలను ఏమంటారు? 

1) రసాయన ఆయుధాలు 2) సామూహిక విధ్వంసక ఆయుధాలు

3) పారిశ్రామిక విపత్తులు 4) భౌగోళిక విపత్తులు

 

2. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? 

1) 1984, డిసెంబరు 2

2) 1986, డిసెంబరు 2

3) 1979, మార్చి 28

4) 1976, జులై 10

 

3. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అమెరికా అణుబాంబులు ఎప్పుడు వేసింది? 

1) 1945, అక్టోబరు 2) 1945, జనవరి 3) 1945, ఆగస్టు 4) 1945, జులై

 

4. శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించి, రోగాన్ని కలిగించే ఆంత్రాక్స్‌ ఏ రకమైంది? 

1) వైరస్‌ 2) బ్యాక్టీరియా 3) ఫంగస్‌ 4) ప్రోటోజోవా

 

5. గాలి/తాకడం వల్ల ఇతరులకు వ్యాపించే మశూచి వ్యాధికి కారణం?

1) వేరియోలా వైరస్‌ 2) యెర్సీనియా పెస్టిస్‌ 3) బోట్సులియం బ్యాక్టీరియా 4) ఏదీకాదు

 

6. కింది ఏ ఆయుధాలను డర్టీబాంబులు అంటారు? 

1) రేడియోధార్మిక బాంబులు 2) జైవిక్‌ ఆయుధాలు

3) రసాయన ఆయుధాలు 4) అణ్వాయుధాలు

 

7. మానవ కారక విపత్తుల్లో అధిక ప్రాణనష్టానికి గురిచేసే విపత్తు ఏది? 

1) అగ్ని ప్రమాదాలు 2) ఇల్లు కూలిపోవడం 3) రైలు ప్రమాదాలు 4) రోడ్డు ప్రమాదాలు 

 

8. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనలో లీకైన విషవాయువు ఏది? 

1) మిథైల్‌ ఐసోసైనేట్‌ 2) మిథైల్‌ ఐసోసైనైట్‌ 3) డియోక్సిన్‌ 4) స్టైరిన్‌ వాయువు

 

9. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన రోడ్డు భద్రతా నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదాల వల్ల సంవత్సరానికి సరాసరిగా ఎంతమంది చనిపోతున్నారు?

1) 12 లక్షలు 2) 5 లక్షలు 3) 20 లక్షలు 4) 50 లక్షలు

 

10. ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ దురంతంగా పిలిచే అణువిపత్తు ఎప్పుడు జరిగింది? 

1) 1984 2) 1986 3) 1996 4) 1982

 

సమాధానాలు: 1-2, 2-1, 3-3, 4-2, 5-1, 6-1, 7-4, 8-1, 9-1, 10-2

 

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 28-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూవనరులు

మట్టితోనే మనుగడ!

  పంటలు బాగా పండాలి. అందరికీ ఆహారం సమృద్ధిగా అందాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆక్సిజన్‌ అవసరమైనంత వాతావరణంలో చేరాలి. పర్యావరణాన్ని కాపాడాలి. చిన్న మొక్క పెద్ద వృక్షమై జీవుల అవసరాలను తీర్చాలి. అందుకు మట్టి కావాలి. అంటే భూగోళశాస్త్రం పరిభాషలో మృత్తికలు. సహజ వనరుల్లో అత్యంత కీలకమైన ఆ మృత్తికల రకాలు, లక్షణాలు, వాటిని కాపాడుకోవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.  

  భూమి ఆవిర్భవించి 4.6 బిలియన్ల సంవత్సరాలైందని శాస్త్రవేత్తల అంచనా. అప్పటి నుంచి అది అంతర్గతంగా, బహిర్గతంగా అనేక మార్పులకు గురై నేటి మానవ జీవన విధానానికి అనుకూలంగా మారింది. ఒకప్పుడు అన్ని ఖండాలు కలిసి ఒక మహా ఖండం (పేంజియా)గా భూమి ఉండేది. క్రమంగా అది కొన్ని పలకలుగా విడిపోయి ఏడు ఖండాలు, అయిదు మహా సముద్రాలుగా విస్తరించింది. శిలలతో నిర్మితమైన ఖండాలు భౌతిక, రసాయనిక చర్యల వల్ల శిథిలమై క్రమంగా మృత్తికలుగా విస్తరించాయి. ఇవి ఒక దేశ ఆర్థిక, సాంస్కృతిక, సాంఘిక, ఆరోగ్య, పర్యావరణ అంశాలను ప్రభావితం చేస్తాయి. ప్రకృతిలో లభించే సహజ వనరుల్లో మృత్తికలు అత్యంత ప్రధానమైనవిగా పరిగణించాలి. ఒక ప్రాంతంలోని వృక్ష సంపద, పంటల వైవిధ్యం ఆ ప్రాంతంలో విస్తరించిన మృత్తికలు/నేలలపై ఆధారపడి ఉంటాయి. 

  ప్రపంచవ్యాప్తంగా 36 బిలియన్‌ హెక్టార్ల భూవనరులు ఉంటే, అందులో 329 మిలియన్‌ హెక్టార్లు భారత దేశంలో ఉంది. భూస్వరూపం, శీతోష్ణ స్థితిగతులు, వృక్ష సంపదను బట్టి దేశంలో వైవిధ్యమైన మృత్తికలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా వాటి భౌతిక, రసాయనిక ధర్మాల్లో కూడా వ్యత్యాసాలు కనిపిస్తాయి. మృత్తికలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పెడాలజీ’ అంటారు. మృత్తిక తయారవడం ఒక దీర్ఘకాల ప్రక్రియ. ఒక సెంటీమీటరు మందం మృత్తిక ఏర్పడటానికి సుమారుగా 400 ఏళ్లు పడుతుందని అంచనా. శిలాశిథిల పదార్థాన్ని మృత్తిక అంటారు. శిలల అధ్యయనాన్ని శాస్త్రాన్ని పెట్రాలజీ/లిథాలజీగా పేర్కొంటారు. కొన్ని చోట్ల నేలపైన కుళ్లిన జీవ పదార్థమైన ‘హ్యూమస్‌’ ఒక పొరలా విస్తరించి ఉంటుంది. అలాంటివి సారవంతమైన నేలలు.

  మృత్తికలు ఏర్పడే తీరును బట్టి రెండు రకాలుగా విభజించారు. 

 

స్థాన బద్ధ మృత్తికలు: ఇవి మాతృశిలను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చెంది అదే ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. వీటినే ఇన్‌సైటు నేలలు అంటారు.

ఉదా: నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, లేటరైట్‌ నేలలు, పర్వత నేలలు, ఎడారి నేలలు

 

స్థాన బద్ధంకాని నేలలు: ఈ రకమైన నేలలు మాతృశిలపై ఏర్పడిన తర్వాత నీరు/గాలి వల్ల వేరొక ప్రాంతానికి రవాణా చెంది, ఆ ప్రాంతంలో నిక్షేపితమవుతాయి. వీటినే పరస్థానీయ నేలలు లేదా ఎక్స్‌ సైటు నేలలు అంటారు. 

ఉదా: ఒండ్రు నేలలు, లోయిస్‌ నేలలు, మొరైన్‌ నేలలు. 

 

భారతదేశంలో నేలల రకాలు


మనదేశ భూస్వరూపం అనేక రకాలైన శిలలతో నిర్మితమైన శిలల మ్యూజియం లాంటిది. వాటికి తగ్గట్టుగానే దేశంలో వైవిధ్యమైన శీతోష్ణస్థితి లక్షణాలు కూడా ఉండటంతో అనేక రకాల భౌతిక, రసాయనిక లక్షణాలున్న నేలలు విస్తరించి ఉన్నాయి. అమెరికా శాస్త్రవేత్త వోలేకర్‌ 1893లో మొదటిసారిగా మన దేశ మృత్తికలపై అధ్యయనం చేశాడు. స్వాతంత్య్రానంతరం భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రిసెర్చ్‌) దేశంలోని మృత్తికలపై అధ్యయనం చేసి 1953లో 8 రకాల మృత్తికలున్నట్లు తెలిపింది.


1) ఒండ్రు మృత్తికలు: దేశ భౌగోళిక విస్తీర్ణంలో వీటి వాటా 43 శాతం. ఈ నేలలు గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానం అంతటా, దేశంలో ప్రవహించే నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో సున్నం, పొటాషియం, కాల్షియం లాంటి లవణాలు ఎక్కువగా ఉంటాయి. నైట్రోజన్‌ చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేలల్లో ఆహార, వాణిజ్య రకానికి చెందిన అన్ని రకాల పంటలు పండుతాయి. ఇందులో పాత ఒండ్రు (బంగర్‌), కొత్త ఒండ్రు (ఖాదర్‌), సున్నం పొరను ఆవరించిన (కంకర) నేలలు అనే రకాలున్నాయి.  అయితే అక్కడక్కడ నిస్సారమైన ఆమ్ల, క్షార నేలలు కూడా విస్తరించి ఉంటాయి. వీటిని ఉత్తర మైదానంలో ప్రాంతీయంగా రే, కల్లార్, ఉషర్, రకర్, చోపన్‌ నేలలని  పిలుస్తారు. 


2) ఎర్రనేలలు: ఇవి గ్రానైట్, నీస్, సిస్ట్‌ లాంటి నేలలు శిథిలం కావడం వల్ల ఏర్పడతాయి. వీటిలో ఐరన్‌ ఆక్సైడ్‌ లేదా ఫెర్రిక్‌ ఆక్సైడ్‌ ఎక్కువగా ఉండటంతో ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఇనుము, మెగ్నీషియం ఎక్కువ; హ్యూమ‌స్‌
నైట్రోజన్‌ తక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి మన దేశంలో ద్వీపకల్ప పీఠభూమి వైపున, ముఖ్యంగా ఈశాన్య ఆగ్నేయ భాగాల్లో అధికంగా విస్తరించి ఉన్నాయి. ఈ నేలలు దేశంలో 18 శాతం వరకు ఉండి, రెండో ప్రధాన నేలలుగా నిలిచాయి. వీటిలో మొక్కజొన్న, జొన్న, రాగులు, వరి, వేరుశనగలు, పప్పుధాన్యాలు, కూరగాయలు లాంటి ఆహార పంటలు పండుతాయి.    


3) నల్లరేగడి నేలలు: వీటినే రేగురు నేలలు అంటారు. ఇందులో టైటానియం ఆక్సైడ్‌ కలిసి ఉండటంతో నలుపు రంగులో ఉంటాయి. ఇవి మన దేశంలో దక్కన్‌ పీఠభూమి వైపు మాత్రమే 15 శాతం వరకు విస్తరించి ఉన్నాయి. ఒకప్పుడు లావా ఘనీభవించడంతో ఏర్పడిన బసాల్ట్‌ శిలలు శిథిలమై ఇవి ఏర్పడ్డాయి. వీటికి నీటిని నిల్వ చేసుకునే స్వభావం ఎక్కువ. వేసవిలో పగిలిపోయి, నెర్రెలు ఇచ్చి మట్టి మార్పిడి జరుగుతుంది. అందువల్ల వీటిని సెల్ఫ్‌ ప్లవింగ్‌ నేలలు అంటారు. ఇందులో పత్తి, పొగాకు, చెరకు, మిరప, పసుపు, నూనె గింజలు లాంటి వాణిజ్య పంటలు బాగా పండుతాయి. 


4) లేటరైట్‌ నేలలు: అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో బసాల్ట్, అల్యూమినియం శిలలు శిథిలమైనప్పుడు ఇవి ఏర్పడతాయి. కొండ వాలు ప్రాంతాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, వింధ్య పర్వతాల్లో విస్తరించి ఉంటాయి. ఈ నేలల్లో తేయాకు, కాఫీ, రబ్బరు లాంటి తోటల పంటలు; సుగంధ ద్రవ్యాలు, మామిడి, జీడిమామిడి లాంటి ఉద్యానవన పంటలు ఎక్కువగా పండుతాయి. 


5) పర్వత నేలలు: ఇందులో హ్యూమస్‌ పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటినే అటవీ నేలలు అని కూడా అంటారు. ఇవి కొండల మధ్య లోయల్లో విస్తరించి ఉంటాయి. హిమాలయాల్లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నేలల్లో వరి, మొక్కజొన్నలతోపాటు పండ్ల తోటలు సాగు చేస్తారు. వీటిలో కరేవా నేలలు ప్రత్యేకమైనవి. సాధారణంగా సున్నపు నిక్షేపాల వల్ల ఏర్పడతాయి. జమ్మూకశ్మీర్‌లోని కశ్మీర్‌ వ్యాలీ, బద వ్యాలీలోనూ ఉన్నాయి. కుంకుమ  పువ్వు ప్రధానంగా పండుతుంది. బాదం, వాల్‌నట్, ఆపిల్‌ లాంటి వాటినీ సాగు చేస్తారు. జమ్మూకశ్మీర్‌లోని పలంపుర్, పుల్మావా, కుల్గాం ప్రాంతాల్లో నాణ్యమైన కుంకుమపువ్వు పండుతుంది. 


6) ఎడారి నేలలు:  ఇవి మన దేశంలో వాయవ్య ప్రాంతంలో రాజస్థాన్, ఉత్తర గుజరాత్‌లోనూ, పంజాబ్, హరియాణా, నైరుతీ ప్రాంతాల్లోనూ విస్తరించి ఉన్నాయి. ఈ నేలలో ఫాస్ఫేట్లు, నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. తగినంత నీరు అందిస్తే నేల సారవంతంగా మారి జొన్నలు, సజ్జలు, పప్పుధాన్యాలు లాంటి పంటలు పండుతాయి. దేశంలో పొడవైన వ్యవసాయ కాలువగా పిలిచే ఇందిరాగాంధీ కాలువ/రాజస్థాన్‌ కాలువ రాజస్థాన్‌లోని అతి శుష్క ప్రాంతాలకు సాగునీరు అందిస్తోంది. 


7) ఆమ్ల, క్షార నేలలు: నిస్సారమైన ఈ నేలలు దేశంలో 1.29 శాతం ఉన్నాయి. నేల గాఢత 6.5 pH కంటే తక్కువగా ఉంటే ఆమ్ల నేలలుగా, అదే 7.5 pH కంటే ఎక్కువగా ఉంటే క్షార నేలలుగా పిలుస్తారు. ఇవి ఉత్తర మైదానంలº అక్కడక్కడ విస్తరించాయి. వీటిని సారవంతం చేయడానికి సున్నం లేదా జిప్సం ఎరువుగా వాడాలి. 


8) ఊబి నేలలు: వీటినే పీటీ నేలలు లేదా సేంద్రియ నేలలు అంటారు. పొటాషియం ఫాస్ఫేట్లు తక్కువగా ఉండి, హ్యూమస్‌ అధికంగా ఉంటుంది. దేశంలో 1.17% ఉన్నాయి.  కేరళలోని అలెప్పీ, కొట్టాయం జిల్లాల్లోనూ, పశ్చిమ బెంగాల్‌లో సుందరబన్స్‌ ప్రాంతంలోనూ, ఒడిశా, తమిళనాడు తీరాలకు దగ్గరలోనూ విస్తరించాయి. నల్లటి ఈ నేలలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. నీరు ఎక్కువగా నిల్వ ఉండటంతో మొక్కల పెరుగుదలను నిరోధిస్తుంది. 

 

మృత్తికా క్రమక్షయం

  భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో మృత్తికా క్రమక్షయం ప్రధానమైంది. అధిక నీటి ప్రవాహం, పవనాలు, పశువుల గడ్డిమేత, అడవులు తొలగించడం లాంటి కారణాల వల్ల మృత్తిక కోసుకుపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు. దేశంలో 175 మిలియన్‌ హెక్టార్ల భూమిలో మృత్తికా క్రమక్షయం జరుగుతోంది. ఇది ఎక్కువగా ఎర్ర, నల్లనేలల్లో సంభవిస్తుంది. దేశంలో సాలీనా ప్రతి హెక్టారుకు 16.4 టన్నుల మట్టిని కోల్పోతున్నట్లు 1951లోనే ప్రణాళికా సంఘం తెలియజేసింది.

1) పటక్రమక్షయం: నేల పొరలు పొరలుగా కొట్టుకుపోవడాన్ని పటక్రమక్షయం అంటారు. ఈ ప్రక్రియ పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో జరుగుతోంది.

2) వంక క్రమక్షయం: పట క్రమక్షయం మరింతగా కొనసాగితే దానిపైన చేతివేళ్ల ఆకారంలో గాడులు ఏర్పడతాయి. దీన్నే వంక క్రమక్షయం అంటారు. ఇది ద్వీపకల్పం వెంట జరుగుతోంది.

3) అవనాళికా క్రమక్షయం: వంక క్రమక్షయం ఇంకా కొనసాగితే లోతైన, వెడల్పైన లోయలు ఏర్పడతాయి. వీటినే అవనాళికలు అంటారు. చంబల్, యమునా నదీ ప్రాంతాల్లో 10 మిలియన్‌ హెక్టార్ల భూమి గల్మీలుగా మారిపోయింది. 

4) రిపారియన్‌ క్రమక్షయం: నదుల గట్లు కోసి తీయడాన్ని రిపారియన్‌ క్రమక్షయం అంటారు. ఇది పశ్చిమ బెంగాల్‌లో గంగానది ప్రాంతంలో జరుగుతుంది.

5) పవన క్రమక్షయం: ఎడారుల్లో వీచే గాలుల వల్ల రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హరియాణాల్లో క్రమక్షయం జరుగుతుంది.

 

నివారణ చర్యలు: మృత్తికా క్రమక్షయాన్ని నివారించకపోతే నేల సారాన్ని కోల్పోతుంది. రిజర్వాయర్ల అడుగు భాగంలో మట్టి చేరడంతో వాటి నీటి సామర్థ్యం తగ్గి తిరిగి వ్యవసాయంపైన పరోక్షంగా ప్రభావాన్ని చూపుతుంది. ఆ విధంగా జరగకుండా ఉండటానికి కొన్ని నివారణ చర్యలు చేపట్టాలి.

 

కాంటూర్‌ బండింగ్స్‌: వాలు ప్రాంతాల్లో అడ్డంగా గోడల్లాంటి నిర్మాణాలు చేసి మృత్తికా క్రమక్షయాన్ని ఆపే పద్ధతి. 

 

స్ట్రిప్‌ క్రాపింగ్‌: ఒక పంట పక్కనే మరొక పంటను జతగా వేసి మృత్తికా క్రమక్షయాన్ని ఆపవచ్చు.

 

స్టబుల్‌ మల్చింగ్‌: పంట కోతకొచ్చిన తర్వాత వాటి అడుగు భాగాలను కొంతకాలం నేలలో వదిలేయాలి.

 

టెర్రసింగ్‌: వాలు ప్రాంతాల్లో గట్లు కœట్టి పంటలు పండించాలి.

 

పోడు వ్యవసాయం: పొదలు, చెట్లు నరికి కాల్చి వాటి బూడిదపైన చేసే వ్యవసాయాన్ని నిరోధించాలి.

* మృత్తికా, జలవనరుల సంరక్షణ కోసం 8 ప్రాంతీయ అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 

1) హిమాలయ ప్రాంత పరిశోధనా కేంద్రం - దెహ్రదూన్‌

2) శివాలిక్‌ ప్రాంత పరిశోధనా కేంద్రం - చండీగఢ్‌  

3) రాజస్థాన్‌ అవనాళికా ప్రాంత పరిశోధనా కేంద్రం - కోట

4) గుజరాత్‌ అవనాళికా ప్రాంత పరిశోధనా కేంద్రం - పసద్‌ 

5) యమునా అవనాళికా ప్రాంత పరిశోధనా కేంద్రం - ఆగ్రా

6) నల్లరేగడి నేలల ప్రాంత పరిశోధనా కేంద్రం - బళ్లారి 

7) అటవీ నేలల ప్రాంత పరిశోధనా కేంద్రం - ఉదక మండలం

8) ఎడారి నేలల పరిశోధనా కేంద్రం - జోధ్‌పుర్‌ 

 

రచయిత: జల్లు సద్గుణరావు 


 

Posted Date : 06-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు నిర్వహణ - సంసిద్ధ చర్యలు

సంస్థాగత ఏర్పాట్లతో సంరక్షణ!

 

  విపత్తు నిర్వహణలో సంసిద్ధత అనేది ఒక సంరక్షణ ప్రక్రియ. ఇందులో ప్రభుత్వాలు, వ్యక్తులు విపత్తు    పరిస్థితులకు సత్వరమే స్పందించడానికి అనుగుణంగా చర్యలు ఉంటాయి. ముందస్తుగా తగిన ప్రణాళికలు వేయడం, చట్టబద్ధమైన సంస్థల ఏర్పాటు, తగిన   హెచ్చరిక వ్యవస్థలు సిద్ధం చేయడం, వాటి నిర్వహణ, వ్యక్తులకు శిక్షణ వంటివన్నీ ఉంటాయి. విపత్తు    సంభవించినప్పుడు విధ్వంసాన్ని తగ్గించడానికి ముందుగానే తీసుకునే చర్యలన్నీ సంసిద్ధతలో భాగమే.

 

  కమ్యూనిటీ ప్రణాళిక: విపత్తు ఏర్పడినప్పుడు ఆ ప్రాంతానికి పొరుగున ఉన్నవారు లేదా కమ్యూనిటీ ప్రజలే తక్షణం ప్రతిస్పందిస్తారు. స్థానిక అధికారులు, ప్రభుత్వ సంస్థల నుంచి ఏ సహకారం అందకముందే ఇలాంటి ప్రతిస్పందనలు కనిపిస్తాయి.

 

  2004, డిసెంబరు 26న సునామీ తాకిడితో తమిళనాడులో సామియార్‌పెట్టాయ్‌ గ్రామానికంటే దాని చుట్టూ ఉన్న గ్రామాల్లో ఎక్కువ ప్రాణనష్టం జరిగింది. సామియార్‌పెట్టాయ్‌ గ్రామస్థులకు ప్రథమ చికిత్స, శోధన, రక్షణ చర్యలు, తొలి హెచ్చరిక వంటి వాటిలో ముందుగానే శిక్షణ ఇచ్చి ఉండటంతో ప్రాణనష్టం స్థాయి తగ్గింది. ఎలాంటి విపత్తును ఎదుర్కొనేందుకైనా కమ్యూనిటీయే కీలకమని కొన్ని ప్రాధాన్యాలు వివరిస్తాయి.

 

1) మొదటి ప్రతిస్పందకుడు: ఏదైనా విపత్తు జరిగినప్పుడు తక్షణమే స్పందించి కార్యాచరణలోకి దిగేది అక్కడి కమ్యూనిటీయే.

 

2) గరిష్ఠ సమాచారకుడు: ఒక ప్రాంతంలో విపత్తు   జరిగినప్పుడు దాని ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించేది ఆ ప్రాంత నివాసితులే. అందువల్ల విపత్తుకు సంబంధించి అత్యంత నమ్మకమైన సమాచారాన్ని ఆ కమ్యూనిటీయే అందిస్తుంది.

 

3) స్థానిక యంత్రాంగాన్ని కలిగి ఉండటం: కొన్ని ప్రాంతాల్లో విపత్తులు పునరావృతం అవుతుంటాయి. అలాంటిచోట స్థానిక ప్రజలు సంప్రదాయబద్ధమైన యంత్రాంగాలను ముందుగానే కలిగి ఉంటారు.

ఉదా: వరదలు వచ్చే ప్రదేశాలలో ఇళ్లకు దగ్గరగా గట్లు వేసుకుని నీళ్లు రాకుండా చేసుకునే ఏర్పాట్లు వంటివి.

 

4) స్వయం సహాయకుడు: విపత్తుల సమయంలో  స్థానికులకు బయటి నుంచి సహకారం అందేలోపు స్వయంగా వారిలో వారే సహాయం చేసుకుంటారు.

  పాఠశాల వద్ద విపత్తులు ఎదుర్కొనేందుకు నిర్వహణా ప్రణాళిక: 2001, జనవరి 26న గుజరాత్‌లో సంభవించిన కచ్‌ భూకంపంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి కవాతు చేస్తున్న 300 మంది విద్యార్థులపై ఇరువైపులా ఉన్న  భవనాలు కూలడంతో చనిపోయారు. అందువల్ల పాఠశాల విపత్తు నిర్వహణ ప్రణాళిక సైతం సిద్ధంగా ఉంటే    విలువైన ప్రాణాలు కాపాడుకోవచ్చు. 

 

ఈ ప్రణాళికలో ఉండాల్సిన అంశాలు:

* ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యానికి విపత్తులపై అవగాహన కల్పించడం, విపత్తు నిర్వహణ ప్రణాళిక ఆవశ్యకతను తెలియజేయడం.

* విపత్తు నిర్వహణ కమిటీ ఏర్పాటు చేయడం.  ఈ కమిటీకి ప్రిన్సిపల్‌ నాయకత్వం వహించాలి.

* వైపరీత్యాన్ని గుర్తించడం, మదింపు చేయడం.

* మానవ వనరులు, భౌతిక వనరుల జాబితా తయారు చేయడం.

* చిన్నపిల్లలు, ఇతర సిబ్బంది తప్పించుకోవడానికి అందుబాటులో ఉన్న వనరులను గుర్తించే విధంగా మ్యాపులు తయారుచేయడం.

* పాఠశాలలో సురక్షిత ప్రదేశం, ఖాళీ చేసే మార్గం సూచించే చార్టులు అందుబాటులో ఉంచడం.

 

గ్రామ విపత్తు నిర్వహణ ప్రణాళిక: సర్పంచ్‌ నాయకత్వంలో గ్రామ విపత్తు నిర్వహణ కమిటీని ఏర్పాటుచేసుకోవాలని మండల అభివృద్ధి అధికారి (ఎమ్‌డీఓ) గ్రామస్థులకు సూచిస్తారు. ఆ విధంగా ఏర్పాటయ్యే కమిటీలో పాఠశాల ఉపాధ్యాయులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, స్వయం సహాయక సంఘం లీడర్లు, ఆశా వర్కర్లు సభ్యులుగా ఉండాలి. ఈ కమిటీలో వాలంటీర్లుగా యువకులను తీసుకుంటారు. వారికి ప్రాథమిక వైద్యం అందించడంలో, శోధన, రక్షణ చర్యల్లో శిక్షణ ఇస్తారు. వీరంతా విపత్తు సమయంలో ముందుండి రక్షణ చర్యల్లో పాల్గొంటారు.

 

విపత్తు వేళ ప్రతి కుటుంబం వద్ద ఉండాల్సిన కిట్‌: 1) పొడి దుస్తులు 2) ఎండు ఆహార పదార్థాలు, తాగునీరు  3) ముఖ్యమైన పత్రాలు  4) బ్యాటరీలు, టార్చిలైట్, ట్రాన్సిస్టర్‌ 5) ప్రథమచికిత్స పెట్టె  6) అవసరమైన మందులు 7) ఇష్టమైన బొమ్మలు, ఆటవస్తువులు 8) దుప్పటి, దిండు 9) కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువుల ఫొటోలు.

 

దేశంలో విపత్తు నిర్వహణ పరిణామక్రమం

 

1) 1937లో బిహార్‌ - నేపాల్‌ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. ఈ తర్వాత బ్రిటిష్‌ హయాంలోనే విపత్తు నిర్వహణపై వ్యవస్థీకృత నిర్మాణం ప్రారంభమైంది. దీనికోసం ఒక శాఖను ఏర్పాటుచేసి ప్రధాన ఉపశమన అధికారి (సెంట్రల్‌ రిలీఫ్‌ కమిషనర్‌) ఆధ్వర్యంలో నిర్వహించారు.

 

2) ఈ వ్యవస్థ విపత్తు సంభవించిన ప్రదేశంలో  ఉపశమన సామగ్రిని అందించడం, డబ్బు, వస్త్రాలు, మందుల పంపిణీ వంటి పరిమిత  విధులు నిర్వర్తించేది.

 

3) స్వాతంత్య్రానంతరం కూడా విపత్తు నిర్వహణ ప్రధాన   ఉపశమన అధికారి ఆధ్వర్యంలోనే చాలాకాలం కొనసాగింది.

 

4) 1990లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా 1990 - 2000ను ప్రకటించింది. ఆ వెంటనే మన దేశంలో  శాశ్వతమైన సంస్థాగత విపత్తు నిర్వహణ విభాగాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

 

5) మహారాష్ట్రలోని లాతూర్‌ భూకంపం (1993), ఉత్తరాఖండ్‌లోని మాల్పా భూపాతం (1998), ఒడిశాలో సూపర్‌ సైక్లోన్‌ (1999) వంటి వరుస విపత్తుల నేపథ్యంలో 1999, అక్టోబరులో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి జె.సి.పంత్‌ ఛైర్మన్‌గా విపత్తులపై అత్యున్నత స్థాయి సంఘాన్ని ఏర్పాటుచేశారు.

 

6) 10వ పంచవర్ష ప్రణాళికలో విపత్తు నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధి పథకాల్లో విపత్తు నిర్వహణ, తీవ్రతను తగ్గించే పథకాలను కూడా  కలిపినప్పుడే దీర్ఘకాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ ప్రణాళికలో పేర్కొన్నారు.

 

7) 2002, ఫిబ్రవరి 2న విపత్తు నిర్వహణ విభాగాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోకి తీసుకొచ్చారు. అప్పటినుంచి హోం మంత్రిత్వ శాఖలోని  ఒక సంయుక్త కార్యదర్శి  ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ కొనసాగుతోంది.

 

8) ప్రస్తుతం విపత్తు నిర్వహణ సంస్థాగత నిర్మాణం కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఉంది. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు బహుళ భాగస్వామ్య వ్యవస్థగా పనిచేస్తోంది. ఇందులో పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖల పాలనా సంస్థలు పాలుపంచుకుంటాయి. ఈ విధంగా దేశంలో విపత్తు   నిర్వహణ ఏదైనా సంఘటన  జరిగినప్పుడే ప్రతిస్పందించే స్థాయి నుంచి విపత్తుకు ముందే దానికి దారితీసే కారణాలు  అన్వేషించి, వాటిని నివారించే వ్యవస్థాగత స్థాయికి అభివృద్ధి చెందింది. అంటే ఏక ప్రావీణ్య పరిధి నుంచి బహుముఖ సామర్థ్య  స్థాయికి చేరింది.

 

విపత్తు నిర్వహణ చట్టం: సమర్థ విపత్తు నిర్వహణకు, విపత్తుకు సంబంధించిన లేదా దానివల్ల యాదృచ్ఛికంగా జరిగిన ఘటనల నిర్వహణకు భారత ప్రభుత్వం చట్టం చేసింది. 2005, డిసెంబరు 23న ‘విపత్తు నిర్వహణ చట్టం’ను రూపొందించింది. 

Posted Date : 21-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శక్తి వనరులు

హరిత ఇంధనం.. ప్రగతి సాధనం!

 

  ఆధునిక మానవుడి జీవనంలో ఇంధనం విడదీయలేని భాగం. వంటకు గ్యాస్, బండికి పెట్రోల్, ఇంటా బయటా విస్తృతంగా వినియోగించే విద్యుత్తు ఇవన్నీ ఇంధనాలే. వ్యక్తిగత వృద్ధి, దేశ ఆర్థిక ప్రగతి అంతా ఇంధన వినియోగంపైనే ఆధారపడి సాగుతోంది. మొదటి నుంచి మానవుడు ప్రకృతి ఇచ్చిన వనరుల నుంచే ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకుని అభివృద్ధి చెందాడు. ఇటీవలి కాలంలో పర్యావరణ స్పృహతో శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గిస్తూ హరిత ఇంధనాలపై దృష్టి సారించాడు. ఈ శక్తివనరుల రకాలు, మన దేశంలో వాటి ఉత్పత్తి తీరుతెన్నులు, వీటి విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యాల గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

 

  ఏదైనా వస్తువు ఒక ప్రాంతం నుంచి చలించాలంటే శక్తి అవసరం. మానవ అభివృద్ధి మొత్తం ఇంధన వనరుల పైనే ఆధారపడి ఉంది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలు అభివృద్ధి చెందడానికి కావాల్సిన ముఖ్యమైన మౌలిక వనరుల్లో ఇంధన వనరులు ప్రధానమైనవి. వినియోగిస్తున్న కాలాన్ని బట్టి వాటిని రెండు రకాలుగా విభజించారు. 

 

1) సంప్రదాయ ఇంధన వనరులు: మానవుడు అభివృద్ధి చెందిన మొదటి దశ నుంచి సంప్రదాయంగా వినియోగిస్తున్న ఇంధన వనరులు.

ఉదా: థర్మల్‌ విద్యుత్తు, జల విద్యుత్తు, అణు విద్యుత్తు, ఇందులో జల విద్యుత్తు, మినహా మిగిలినవి పునరుత్పాదనకు వీలు కానివి. అవి పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయి.

 

2) సంప్రదాయేతర ఇంధన వనరులు: పెరిగే అవసరాలకు తగినట్లుగా ఇటీవల కాలంలో అభివృద్ధి చేసుకున్న, అధిక ప్రాచుర్యంలో ఉన్న ఇంధన వనరులు. ఇవి తిరిగి రెండు రకాలు.

 

ఎ) పునరుత్పాదక ఇంధన వనరులు: మానవుడు వినియోగించినప్పటికీ తిరిగి పునరుత్పత్తి చేయడానికి లేదా పునరుత్పత్తి అయ్యే శక్తి వనరులు. సౌర శక్తి, పవన శక్తి, బయోగ్యాస్, బయో మాస్, బయో డీజిల్, బయో ఇథనాల్, బగస్సీ కోజనరేషన్, చిన్నతరహా జలవిద్యుత్తు లాంటివి. ఇవి పూర్తిగా కాలుష్య రహితమైనవి. వీటినే హరిత ఇంధనాలు అంటారు.

 

బి) నవీన ఇంధన వనరులు: ఇప్పుడిప్పుడే వినియోగంలోకి వస్తున్న కొత్తతరం శక్తి వనరులు. హైడ్రోజన్‌ శక్తి, జియోథర్మల్‌ శక్తి, సముద్ర తరంగ శక్తి, టైడల్‌ శక్తి, ఓషన్‌ థర్మల్‌ గ్రేడియంట్‌ ఎనర్జీ, బ్యాటరీ ఆపరేటెడ్‌ వెహికల్‌్్స, షెల్‌ గ్యాస్, కోల్‌బెడ్‌ మీథేన్, గ్యాస్‌ హైడ్రేట్స్‌ శక్తి లాంటివి. 1981లో భారత ప్రభుత్వం కమిషన్‌ ఫర్‌ అడిషనల్‌ సోర్సెస్‌ ఆఫ్‌ ఎనర్జీ ్బదితిళీన్శిను ఏర్పాటు చేసింది. దేశంలో పర్యావరణ శత్రువైన శిలాజ ఇంధన వనరుల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతోంది.

 


* ప్రస్తుతం దేశంలో స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 4,16,059 వాట్లు.

 

జల విద్యుత్తు: జలవిద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంలో భారతదేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. దేశంలో మొదటి జల విద్యుత్తు కేంద్రాన్ని 1897లో పశ్చిమ బెంగాల్‌లోని డార్జీలింగ్‌ దగ్గర స్థాపించారు (సిద్రపోంగ్‌ జలవిద్యుత్‌ కేంద్రం). దీని సామర్థ్యం 130 కిలోవాట్లు. దేశంలో మొదటి భారీ జల విద్యుత్తు కేంద్రాన్ని కర్ణాటకలోని శివసముద్రం జలపాతంపై 1902లో స్థాపించారు. దీని సామర్థ్యం 700 మెగావాట్లు.

 

థర్మల్‌ విద్యుత్తు: బొగ్గు, నీటిఆవిరి, డీజిల్, సహజ వాయువుల ఆధారంగా విద్యుత్తు ఉత్పత్తి చేయడాన్ని థర్మల్‌ విద్యుత్తు అంటారు. దేశంలో థర్మల్‌ విద్యుత్తు ఉత్పాదన నిర్వహణకు 1975లో ఎన్‌టీపీసీ (నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌)ని ఏర్పాటు చేశారు. బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో పెద్దది మధ్యప్రదేశ్‌లోని వింధ్యాంచల్‌ థర్మల్‌ పవర్‌స్టేషన్‌. దీని సామర్థ్యం 4,760 మెగావాట్లు.

 

సౌర శక్తి: భారతదేశంలో ఫొటో ఓల్టాయిక్‌ సెల్స్‌ను ఉపయోగించి సూర్యరశ్మి నుంచి శక్తిని పొందుతున్నారు. థార్‌ ఎడారిని సోలార్‌ ఎనర్జీ ఎంటర్‌ప్రైజ్‌గా అమెరికాలోని నెవడాతో పోల్చవచ్చు. వ్యవసాయ రంగంలో శిలాజ ఇంధన వినియోగాన్ని నివారించి రైతులను సౌరవిద్యుత్తు వైపు ప్రోత్సహించడానికి ‘ప్రధానమంత్రి కుసుమ్‌’ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. సోలార్‌ ఎనర్జీలో చైనా, అమెరికా, జపాన్, జర్మనీ తర్వాత భారత్‌ అయిదో స్థానంలో ఉంది.

 

వాయు శక్తి: గాలి బాగా వీచే ప్రాంతాల్లో గాలి మరలను తిప్పడం ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును వాయు శక్తి అంటారు. 1986 నుంచి దేశంలో పవన విద్యుత్తు ఉత్పత్తికి అంకురార్పణ జరిగింది. తమిళనాడులోని ముప్పందల్‌లో పెద్ద పవన విద్యుత్తు ప్లాంటును ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 1500 మెగా వాట్లు. ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల, అనంతపురంలో పవన విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. పవన విద్యుత్తు ఉత్పత్తిలో చైనా, అమెరికా, జర్మనీ తర్వాత మన దేశం నాలుగో స్థానంలో ఉంది.

 

బయోగ్యాస్‌ ఎనర్జీ: జంతువులు, చేపలు, పాడి పరిశ్రమలు, గృహాలు, మురుగు నీటి శుద్ధి కర్మాగారాల వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు. ముఖ్యంగా పశువుల పేడను కిణ్వ ప్రక్రియ/మురగబెట్టడం ద్వారా ఈ శక్తిని ఉత్పత్తి చేస్తారు. దీన్నే గోబర్‌ గ్యాస్‌/స్వాంప్‌ గ్యాస్‌ అంటారు. 1983 నుంచి బ్రౌన్‌ రెవల్యూషన్‌ను గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టడానికి పొగరాని పొయ్యి ్బద్త్యిఃః్చ్త్శలు పంపిణీ చేశారు. వ్యర్థాల నుంచి పెద్దఎత్తున బయో గ్యాస్‌ ఉత్పత్తి చేస్తున్న దేశం డెన్మార్క్‌. బయోగ్యాస్‌లో మీథేన్, కార్బన్‌డయాక్సైడ్‌ వాయువులు ఎక్కువగా ఉంటాయి.

 

బయోమాస్‌ ఎనర్జీ: చెరకు పిప్పి, తవుడు, కొబ్బరి చిప్పలు, సోయా, కాఫీ, జూట్‌ వ్యర్థాలు మండించడం వల్ల బయోమాస్‌ ఎనర్జీ లభిస్తుంది. భారత్‌లో వ్యవసాయ వ్యర్థాలతో నేచురల్‌ గ్యాస్‌ను తయారుచేసే మొదటి బయో సీఎన్‌జీ ప్లాంట్‌ను పుణెలో 2016లో ప్రారంభించారు.

 

బయోడీజిల్‌ ఎనర్జీ: ట్రాన్స్‌ ఎస్టరిఫికేషన్‌ అంటే ఆల్కహాల్, ఆమ్లాలను ఉపయోగించి ప్రతిచర్య ద్వారా ఉత్పత్తి చేసే ఎనర్జీ. జట్రోపా, కానుగ, సోయాబీన్స్, పామాయిల్, రెడ్‌ సీడ్స్‌ మొక్కల విత్తనాల నుంచి ఈ బయోడీజిల్‌ను తయారు చేస్తారు. దీనికి కొంత డీజిల్‌ను కలపడం ద్వారా బయోడీజిల్‌ తయారవుతుంది. దీనివల్ల కాలుష్యం తగ్గుతుంది.

 

బయో ఇథనాల్‌: చెరకు, స్వీట్‌కార్న్, స్వీట్‌ క్యారెట్, చిలగడ దుంప, గోధుమలు, మొక్కజొన్న మొదలైన వాటి నుంచి సంగ్రహించిన గ్లూకోజ్‌ను కిణ్వ ప్రక్రియ (మురగబెట్టడం)కు గురి చేస్తారు. ఇలా తయారయ్యే ఇంధనాన్ని బయో ఇథనాల్‌ అంటారు. దీనికి పెట్రోలియం కలిపితే జీవ ఇంధనంగా మారి కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మన దేశం 2022లో పెట్రోల్‌లో 10% ఇథనాల్‌ని కలిపే లక్ష్యసాధనలో విజయం సాధించింది. 2030 నాటికి పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ని కలపాలన్నది కేంద్రం ప్రస్తుత లక్ష్యం.

 

వేవ్‌ ఎనర్జీ: సముద్ర కెరటాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేయడాన్ని వేవ్‌ ఎనర్జీ అంటారు. ఇది ఖరీదైన ప్రక్రియ. మొదటి ప్లాంట్‌ను కేరళలోని తిరువనంతపురంలోని విజింగం వద్ద ప్రారంభించారు.

 

టైడల్‌ ఎనర్జీ: సముద్ర తీరంలో పోటుపాట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టైడల్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చు. గుజరాత్‌లో గల్ఫ్‌ ఆఫ్‌ కచ్, కాంబే వద్ద, పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌ ప్రాంతంలో ఈ రకం విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. దేశంలో 8 వేల మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తికి అవకాశాలున్నాయి.

 

ఓషన్‌ థర్మల్‌ ఎనర్జీ: సముద్ర నీటి లోతు ఆధారంగా ఉష్ణోగ్రతల్లో తేడాలుంటాయి. ఈ భేదంతో విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. దీన్ని ఓషన్‌ థర్మల్‌ గ్రేడియంట్‌ ఎనర్జీ అంటారు. తమిళనాడులోని ట్యుటికోరిన్, కులశేఖరపట్నం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఇందుకు అవకాశాలున్నట్టు అంచనా.

 

జియోథర్మల్‌ ఎనర్జీ: భూమిలోని వేడి వల్ల కొన్ని ప్రాంతాల్లో వేడి నీటి బుగ్గలు (గీజర్స్‌) బయటపడతాయి. వీటి నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌లో మణికరన్‌ వద్ద ఈ రకం విద్యుత్తును ఉత్పత్తి చేసి శీతల గిడ్డంగులకు వినియోగిస్తున్నారు. పుగాలోయ (లద్దాఖ్‌), సూరజ్‌కుండ్‌ (ఝార్ఖండ్‌), తపోవన్‌ (ఉత్తరాఖండ్‌), జలగావ్‌ (మహారాష్ట్ర) ప్రాంతాల్లో ఈ తరహా ఉత్పత్తి జరుగుతోంది.

 

హైడ్రోజన్‌ ఎనర్జీ: హైడ్రోజన్‌ అయాన్లను ఆక్సిజన్‌తో చర్యకు గురిచేస్తే విడుదలయ్యే రసాయన శక్తిని ఫ్యూయల్‌ సెల్స్‌ విద్యుచ్ఛక్తిగా మారుస్తాయి. ఇది చాలా ఖరీదైన ప్రక్రియ. కేంద్రం 2021-22 బడ్జెట్‌లో నేషనల్‌ హైడ్రోజన్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)ను ప్రకటించింది.

 

గ్రీన్‌ ఎనర్జీ లక్ష్యం:  గ్రీన్‌ రెవల్యూషన్‌లో భాగంగా 2030 నాటికి 500 గిగా వాట్ల గ్రీన్‌ ఎనర్జీ స్థాపిత సామర్థ్యం ఉండాలని భారత ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. ఇందులో 280 గిగా వాట్ల సోలార్‌ ఎనర్జీ, 140 గిగావాట్ల విండ్‌ ఎనర్జీ ఉండాలని నిర్ణయించింది.

 

రచయిత: జల్లు సద్గుణరావు
 

Posted Date : 01-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సంస్థాగత ఏర్పాట్లు

 

సమస్త యంత్రాంగం సంసిద్ధం!

 

ఇటీవల ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన వెంటనే ఎక్కడెక్కడి నుంచో అనేకమంది సిబ్బంది గంటల్లో మోహరించారు. వేగంగా సహాయక చర్యలను చేపట్టి ప్రాణ నష్టం మరింత తీవ్రం కాకుండా నివారించారు. విపత్తు అనివార్యం. కానీ  దాని వల్ల కలిగే ఇబ్బందులను అడ్డుకునే అవకాశం ఉంది. అందుకోసం ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించింది. అది విపత్తు నివారణ, ఉపశమన కార్యక్రమాలను నిర్వహించే అధికారాన్ని సంబంధిత అధికార వర్గాలకు అందిస్తుంది. వివిధ స్థాయుల్లో సమన్వయాన్ని సులభతరం చేస్తుంది. సమస్త యంత్రాంగం సమష్టి బాధ్యతతో సంసిద్ధమయ్యే విధంగా చూస్తుంది. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

 

విపత్తు నిర్వహణ అమలు విధానం రూపకల్పన, పర్యవేక్షణకు అవసరమైన వ్యవస్థాగత యంత్రాంగాలను సిద్ధం చేయడానికి భారత ప్రభుత్వం 2005, డిసెంబరు 23న విపత్తు నిర్వహణ చట్టాన్ని రూపొందించింది. విపత్తు నివారణ, దాని ప్రభావ మదింపు, ఏదైనా విపత్తు తలెత్తినప్పుడు ప్రభుత్వంలోని వివిధ విభాగాలు చేపట్టాల్సిన చర్యలను ఈ చట్టం వివరిస్తుంది. 

 

చట్టం ప్రకారం సంస్థాగత ఏర్పాట్లు

1) ప్రాధికార సంస్థలు: విపత్తు నిర్వహణ మూడు దశల్లో జరుగుతుంది. 

* ప్రధాన మంత్రి అధ్యక్షతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎమ్‌ఏ - నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ).

* ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎస్‌డీఎమ్‌ఏ - స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ).

* జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (డీడీఎమ్‌ఏ - డిస్ట్రిక్ట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ). 

 

2) కార్యనిర్వాహక కమిటీలు: విధి నిర్వహణ కోసం జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో కార్యనిర్వాహక కమిటీలను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఎన్‌డీఎమ్‌ఏ ఆధ్వర్యంలో జాతీయ కార్యనిర్వాహక కమిటీ, ఎస్‌డీఎమ్‌ఏ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తారు.

 

3) సామర్థ్య నిర్మాణం కోసం: ఎన్‌డీఎమ్‌ఏ సామర్థ్య నిర్మాణం కోసం కేంద్రం స్థాయిలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎమ్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌)ను ఏర్పాటు చేస్తారు.

 

4) సహాయక చర్యలు చేపట్టేందుకు: విపత్తుల సమయంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి కేంద్ర స్థాయిలో జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళాన్ని (ఎన్‌డీఆర్‌ఎఫ్‌ - నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) ఏర్పాటు చేయాలి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందనా దళాన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు.

 

 

5) ప్రణాళికలు రూపొందించడం: విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ ప్రణాళికకు అనుగుణంగా రాష్ట్రాలు, జిల్లాలు, అన్ని రకాల మంత్రిత్వ శాఖలు, వాటి విభాగాలు తమ సొంత విపత్తు నిర్వహణ ప్రణాళికలు రూపొందించుకోవాలి.

 

వివిధ సంస్థల కూర్పు

జాతీయ విపత్తు ప్రాధికార సంస్థ: విపత్తు నిర్వహణ చట్టం చేసిన తర్వాత 2006, సెప్టెంబరు 27న ప్రధానమంత్రి అధ్యక్షుడిగా లాంఛనంగా ఈ సంస్థను ఏర్పాటు చేశారు. మరో తొమ్మిది మంది సభ్యులను నియమించి అందులో ఒకరిని ఉపాధ్యక్షులుగా ఎంపిక చేస్తారు. ఈ కార్యాలయంలో ఒక ఆర్థిక సలహాదారు,  అయిదుగురు సంయుక్త కార్యదర్శులు, పది మంది జాయింట్‌ అడ్వైజర్లు, మరికొంత మంది సిబ్బంది ఉంటారు. ఈ సంస్థ విపత్తు నిర్వహణ విధానాలను రూపొందిస్తుంది. జాతీయ ప్రణాళికలను ఆమోదిస్తుంది. విపత్తు నిర్వహణలో రాష్ట్ర ప్రాధికార సంస్థలు రాష్ట్ర స్థాయి ప్రణాళికల రూపకల్పనలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను జారీ చేస్తుంది. 

 

జాతీయ కార్యనిర్వాహక కమిటీ: ఎన్‌డీఎమ్‌ఏకు విధి నిర్వహణలో సాయపడేందుకు జాతీయ కార్య నిర్వాహక కమిటీ ఉంటుంది. దీనికి కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. వ్యవసాయం, విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం-అడవులు, రక్షణ శాస్త్ర సాంకేతిక రంగం తదితర శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. రక్షణ దళాల సంయుక్త అధిపతి అయిన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) కూడా సభ్యులుగా ఉంటారు.

 

రాష్ట్ర విపత్తు ప్రాధికార సంస్థ: అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ అథారిటీల ఏర్పాటును చట్టంలోని చాప్టర్‌-3 సెక్షన్‌-14 వివరిస్తోంది. 2003 నుంచి గుజరాత్, డామన్, డయ్యూ ఆ విధమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 

 

రాష్ట్ర కార్య నిర్వాహ‌క‌ కమిటీ: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేయవచ్చని విపత్తు నిర్వహణ చట్టం చెబుతోంది. ఆయనతో పాటు మరో నలుగురు ఇతర ప్రభుత్వ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.

 

 

జిల్లా విపత్తు ప్రాధికార సంస్థ: జిల్లా కలెక్టర్‌ దీనికి ఛైర్మన్‌. జిల్లా పరిషత్తు అమల్లో ఉంటే జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ ఈ సంస్థకు సహ ఛైర్మన్‌గా ఉంటారు. ఛైర్మన్‌ నియామకం జరగపోతే, జిల్లా స్థానిక సంస్థలకు ఎన్నికైన ఒక ప్రతినిధి (జడ్పీటీసీ) సహ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో జిల్లా ప్రధాన కార్యనిర్వాహక అధికారి (జడ్పీ సీఈఓ), జిల్లా సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్, జిల్లా ముఖ్య వైద్యాధికారి, ఇద్దరు జిల్లా స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు.

 

మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఏర్పాటు: రెండో పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సు ప్రకారం 25 లక్షలు పైబడిన జనాభా ఉన్న పెద్ద నగరాల్లో సంక్షోభాల నిర్వహణకు మేయర్‌ ప్రత్యక్ష బాధ్యత వహిస్తారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్, నగర పోలీసు కమిషనర్‌ సహకారం అందిస్తారు.

 

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎమ్‌): విపత్తును సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు, విపత్తు నిర్వహణ పరిశోధన, విద్యా సంబంధ కోర్సులు, సమావేశాలు, సెమినార్లు తదితరాలను జరిపే అవకాశాన్ని చట్టం కల్పించింది. అందుకోసం ఏర్పాటైన ఈ సంస్థకు కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షుడిగా, ఎన్‌డీఎమ్‌ఏ వైస్‌ ఛైర్మన్‌ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 

 

జాతీయ ప్రతిస్పందనా దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌): పారా మిలిటరీ దళాల నుంచి తీసుకున్న 12 బెటాలియన్ల దళాన్ని విపత్తులకు స్పందించి సహకారం అందించడానికి సిద్ధంగా ఉంచుతారు. ఒక బెటాలియన్‌లో వెయ్యి మంది ఉంటారు. వీరు దేశవ్యాప్తంగా 12 కేంద్రాల్లో సిద్ధంగా ఉంటారు. ఎన్‌డీఎమ్‌ఏ వైస్‌ ఛైర్మన్‌ ఈ దళానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

 

జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎమ్‌సీ): విపత్తుల సందర్భంగా పునరావాస, సహాయక చర్యలను సమర్థంగా సమన్వయం చేయడానికి జాతీయ స్థాయిలో జాతీయ క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఉంటుంది. దీనికి కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ ఛైర్మన్‌గా ఉంటారు. 15 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. 

 

రాష్ట్ర సంక్షోభ నిర్వహణ కమిటీ: దీనికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడిగా ఉంటారు. రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.

 

పౌరరక్షణ దళం: పౌర రక్షణ చట్టం 1968 ప్రకారం అత్యవసర ఉపశమన వ్యవస్థ పథకంలో భాగంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో పౌర రక్షణ చర్యలు తీసుకోవడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన పౌర రక్షణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. ప్రజలకు స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని కల్పించడానికి వీలుగా 2010లో ఈ చట్టాన్ని సవరించారు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు చేసింది?

1) 2005  2) 2007  3) 2003  4) 2015

 

2. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు ఛైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?

1) ప్రధానమంత్రి  2) హోంశాఖ మంత్రి  3) హోంశాఖ సెక్రటరీ  4) వ్యవసాయశాఖ మంత్రి

 

3. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఎవరు?

1) కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ  2) హోంశాఖ సెక్రటరీ  3) ఎన్‌డీఎమ్‌ఏ ఉపాధ్యక్షుడు 4) ఎన్‌డీఎమ్‌ఏ అధ్యక్షుడు

 

4. జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

1) ఆగస్టు 15  2) నవంబరు 5  3) అక్టోబరు 5 4) అక్టోబరు 29

 

5. జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళానికి ఛైర్‌పర్సన్‌ ఎవరు?

1) ఎన్‌డీఎమ్‌ఏ ఛైర్మన్‌ 2) ఎన్‌డీఎమ్‌ఏ వైస్‌ ఛైర్మన్‌ 3) హోం సెక్రటరీ  4) కేబినెట్‌ సెక్రటరీ

 

సమాధానాలు: 1-1; 2-2; 3-1; 4-4; 5-2.

 

రచయిత: జల్లు సద్గుణరావు 
 

 

Posted Date : 13-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవ వైవిధ్యం

భిన్నత్వంతోనే జీవజాతికి స్థిరత్వం!

 

 

జీవసంపద పుష్కలంగా, వైవిధ్యంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. భిన్న వాతావరణ పరిస్థితులు, పర్యావరణ అనుకూలతలు కలిగి రకరకాల వృక్ష, జంతు జాతులతో గొప్ప జీవవైవిధ్య కేంద్రంగా నిలిచింది. భూమిపై జీవవైవిధ్యం అసమానంగా, కొన్ని ప్రాంతాలకే పరిమితం కాగా మన దేశం మాత్రం అనాదిగా జైవిక సంపదతో అలరారుతోంది. పిచ్చుక నుంచి ఏనుగు వరకు, గడ్డిపోచల నుంచి మహావృక్షాల వరకూ లక్షలాది రకాల జీవజాలం ఇక్కడ ఉన్నాయి. ఈ తరహా విశేషాల గురించి పోటీ పరీక్షలు రాసేవారికి శాస్త్రీయ అవగాహన ఉండాలి. దేశంలోని జీవ భౌగోళిక మండలాల ప్రత్యేకతలు, పెరిగే జీవజాతుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

 

భూమిపై ఉన్న జీవసంపద సంక్లిష్టం, వైవిధ్యభరితం. ఆ జీవ జాతుల మధ్య ప్రత్యేకతలను తెలియజేసేదే జీవ వైవిధ్యం. భౌమ, జలావరణ వ్యవస్థల్లోని సమస్త జీవజాతుల మధ్య జన్యు పరమైన, జాతి సంబంధిత, ఆవరణ వ్యవస్థల తీరుల్లో ఉన్న తేడాలను జీవ వైవిధ్యం అంటారు. 1992లో బ్రెజిల్‌లోని రియోలో జరిగిన జీవవైవిధ్య ఒప్పంద సదస్సులో ఈ మేరకు నిర్వచనం ఇచ్చారు. రేమండ్‌ ఎఫ్‌.డోస్‌మన్‌ అనే శాస్త్రవేత్త మొదట 1967లో జీవసంబంధ వైవిధ్యం (బయోలాజికల్‌ డైవర్సిటీ) అనే పదాన్ని ఉపయోగించాడు. దీన్నే 1985లో డబ్ల్యూ.జి.రోజెన్‌ అనే శాస్త్రవేత్త జీవవైవిధ్యం (బయో డైవర్సిటీ)గా ప్రయోగించాడు. జీవవైవిధ్యాన్ని మూడు విధాలుగా పేర్కొంటారు.

 

1) జన్యు వైవిధ్యం: ఒక జాతి జీవుల్లోని జన్యువుల లక్షణాల్లో ఉన్న భేదాలతోపాటు విభిన్న జాతుల జీవుల మధ్య ఉన్న జన్యువుల సంఖ్యలోని తేడాలనూ జన్యు వైవిధ్యం అంటారు. అలాంటి వైవిధ్యాలు తర్వాతి తరాలకు సంక్రమిస్తాయి. ఆ వైవిధ్యం అధికంగా ఉన్న జాతుల్లో పరిసరాలకు అనుగుణంగా శరీర అవయవాల్లో మార్పులు ఏర్పడి, ఎక్కువకాలం మనుగడ సాగిస్తాయి.

 

ఉదా: మనిషిలో 35 వేల నుంచి 45 వేల జన్యువులు, వరిలో 30 వేల నుంచి 50 వేల జన్యువులు ఉంటాయి.

 

2) జాతుల వైవిధ్యం: ఒక ప్రమాణ వైశాల్యం ఉన్న ప్రాంతంలో నివసించే జాతుల మధ్య శారీరకమైన తేడాల్లో ఉండే వైవిధ్యాన్ని జాతుల వైవిధ్యం అంటారు. ఒక ప్రాంతంలో ఎన్ని రకాల జీవులు నివసిస్తే అక్కడ అంత జాతి వైవిధ్యం ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఒక భౌగోళిక ప్రాంతంలో జాతుల ఆధిపత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా అక్కడి జాతుల ఆధిపత్యం, సంపన్నత్వం, సమానత్వం గురించి తెలుసుకోవచ్చు. భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ జాతుల వైవిధ్యం సాధారణంగా తగ్గుతుంది. ఇందుకు కారణం శీతోష్ణ పరిస్థితుల్లో మార్పు ఉండటమే. సముద్ర ఆవరణ వ్యవస్థలో కూడా ఖండతీరపు అంచులో జాతుల సంపన్నత్వం ఎక్కువగా ఉంటుంది. జాతుల వైవిధ్యంపై ఆధారపడి ఒక జాతి ఆహారం పొందడమనేది అక్కడ లభించే ఇతర జాతులను బట్టి ఉంటుంది. ఆ విధంగా జాతుల వైవిధ్యం ఆవరణ వ్యవస్థ స్థిరత్వాన్ని సూచిస్తుంది.

 

3) ఆవరణ వ్యవస్థల వైవిధ్యం: జీవావరణంలోని విభిన్న ఆవరణ వ్యవస్థల మధ్య తేడాలు, వైవిధ్యాలనే ఆవరణ వ్యవస్థల వైవిధ్యం అంటారు. శీతోష్ణస్థితి, నైసర్గిక స్వరూపాల్లోని వైవిధ్యం వల్ల ఒక ఆవరణ వ్యవస్థలో అనేక రకాల జాతులు, వివిధ పరిమాణాల్లో నివసిస్తుంటాయి.

 

ఉదా: ఉష్ణమండల వర్షాధార ఆవరణ వ్యవస్థ, గడ్డి భూముల ఆవరణ వ్యవస్థ, మాంగ్రూవ్‌ అడవుల ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ తదితరాలు.

 

జీవ వైవిధ్య గణన: 1972లో విట్టేకర్‌ అనే శాస్త్రవేత్త జీవ వైవిధ్య గణనకు మూడు కొలమానాలు సూచించాడు.

 

1) ఆల్ఫా వైవిధ్యం: ఇది ఒక ప్రాంతంలో లేదా ఒక ఆవరణ వ్యవస్థలో జాతుల వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా ఒక ఆవరణ వ్యవస్థలోని జాతుల సంఖ్య లేదా జాతుల సంపన్నత్వాన్ని సూచిస్తుంది. 

 

2) బీటా వైవిధ్యం: విభిన్న ఆవరణ వ్యవస్థల మధ్య భిన్నత్వాన్ని తెలియజేస్తుంది. ఇది సాధారణంగా ఆవరణ వ్యవస్థల మధ్య జాతుల సంఖ్యలో మార్పులను అంచనా వేసే విధానం.

 

3) గామా వైవిధ్యం: ఒక ప్రాంతంలోని విభిన్న ఆవరణ వ్యవస్థల మధ్య వైవిధ్యాన్ని, ఆవరణ వ్యవస్థలోని జీవ సముదాయాలు, కలిగే మార్పులను, జాతుల సంపన్నత్వాన్ని సూచిస్తుంది.

 

 

భారతదేశ జీవవైవిధ్య సంపద - ప్రాంతీయ విభాగాలు:

* ప్రపంచ వైశాల్యంలో భారత్‌ భూభాగం 2.4% మాత్రమే ఉన్నప్పటికీ జీవజాతుల్లో 7% కలిగి ఉంది. మానవ జనాభాలో 18% ఇక్కడే ఉంది.

* ప్రపంచంలోని మెగా జీవవైవిధ్య ప్రాంతాల్లో భారతదేశం ఒకటి. క్షీరదాల్లో 7వ స్థానం, సరీసృపాల్లో 5వ స్థానం, పక్షుల్లో 9వ స్థానం కలిగి ఉంది.

* దేశంలోని వృక్షజాతుల్లో 33%, జంతు జాతుల్లో 50% స్థానికమైనవి ఉన్నాయి.

 

రెండు.. అయిదు.. పది!


మన దేశంలోని జీవ సంపదను రెండు జీవరాజ్యాలు, అయిదు సహజ మండలాలు, పది జీవభౌగోళిక ప్రాంతాలుగా విభజించవచ్చు.


జీవరాజ్యాలు:  ఒకే రకమైన లక్షణాలున్న చెట్లు, జంతువులతో కూడిన ఖండం లేదా ఉపఖండమంత విస్తీర్ణం ఉన్న ప్రాంతాలను జీవరాజ్యం అంటారు. అక్కడి ఆవరణ వ్యవస్థలన్నీ విశాలంగా ఒకే లక్షణాలు కలిగి ఉంటాయి. ప్రపంచంలో 8 ప్రాదేశిక జీవ భౌగోళిక రాజ్యాలు ఉన్నాయి. వాటిలో రెండింటిని మన దేశం కలిగి ఉంది. అవి 1) హిమాలయాల ప్రాంతంలో పాలియార్కిటిక్‌ జీవరాజ్యం 2) దేశంలో మిగిలిన ఉపఖండమంతా ఉన్న మలయన్‌ జీవరాజ్యం.


సహజ జీవ మండలాలు: నిర్దిష్టమైన శీతోష్ణ పరిస్థితుల్లో వృక్ష, జంతు సముదాయాలు ఉండే ప్రదేశాలను సహజ జీవ మండలాలు అంటారు. అవి అక్కడి మృత్తికలకు, పరిస్థితులకు అలవాటు పడి మనుగడ సాగిస్తాయి. మన దేశంలో సహజ జీవమండలాలను అయిదు రకాలుగా విభజించారు. 1) ఉష్ణమండల తేమ అడవుల మండలం 2) ఉష్ణమండల పొడి లేదా ఆకురాల్చే అడవుల మండలం (ఇందులో రుతుపవన అడవులు కలిసి ఉంటాయి) 3) వెచ్చని ఎడారి, అర్ధ ఎడారి మండలం 4) శృంగాకార అడవుల మండలం 5) హిమాలయ అంచుల్లోని ఆల్ఫైన్‌ గడ్డి మండలాలు


జీవ భౌగోళిక ప్రాంతాలు: భౌగోళికంగా వృక్షాలు, జంతువుల విస్తరణను తెలియజేసేదే జీవ భౌగోళిక శాస్త్రం. దీని ప్రకారం వృక్ష, జంతు జాతులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి.


హిమాలయాల పైభాగం (ట్రాన్స్‌హిమాలయాలు): టిబెట్‌ పీఠభూమి, జమ్ము-కశ్మీర్‌లోని లద్దాఖ్, హిమాచల్‌ ప్రదేశ్‌లోని లాహౌల్‌ - స్పితిలతో కూడిన ప్రాంతం. ఇది దేశ వైశాల్యంలో 5.7% ఆక్రమించి ఉంది. ఇక్కడ పర్వత సంబంధ మొక్కలే పెరుగుతాయి. అడవి మేకలు, గొర్రెలు లాంటి జంతువులు ఉంటాయి. కొన్ని వలస పక్షులు కూడా నివసిస్తాయి. ఈ ప్రాంతంలో ఉండే క్రూర మృగం మంచు చిరుత.


హిమాలయ భాగం: ఇది జమ్ము-కశ్మీర్‌లో వాయవ్యం నుంచి ఈశాన్యంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు విస్తరించి ఉంది. దేశ భూభాగంలో 6.9% ఆక్రమించిన ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది. సాల్, సీసం, జమూన్‌ లాంటి వృక్షాలు; 3000 మీటర్ల ఎత్తులో సిల్వర్‌ ఫర్, రెడో డెండ్రాన్లు లాంటి ఆల్ఫైన్‌ వృక్ష సంపద ఉంటుంది. గొర్రెలు, మేకలు, జింకలు వంటి జంతు సంపద, వివిధ రకాల పక్షులు కనిపిస్తాయి.


ఎడారి ప్రాంతం: ఈ ప్రాంతం ఆరావళి పర్వతాలకు పశ్చిమ భాగాన రాజస్థాన్‌లో, గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. దేశ వైశాల్యంలో 6.9% ఆక్రమించింది. ఇక్కడ వార్షిక వర్షపాతం 25 సెం.మీ. కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల బాష్పోత్సేకాన్ని నిరోధించే తుమ్మ, బలుసు, రేగు, బ్రహ్మజెముడు, నాగజెముడు లాంటి జిరోఫైట్స్‌ వర్గానికి చెందిన పొదలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ భౌమ మండలంలో సింహాలు, పులులు, జింకలు, తోడేళ్లు, గాడిదలు, బట్ట మేకల పక్షి లాంటివి నివసిస్తాయి.


అర్ధ శుష్క మండలం: మధ్యప్రదేశ్‌లో కొంత ప్రాంతం, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో కొంత ప్రాంతం ఈ జీవ భౌగోళిక మండలంలో ఉంది. ఇది ఎడారికి, దక్కన్‌ పీఠభూమికి మధ్య ప్రాంతం. దేశ వైశాల్యంలో 15.6% ఆక్రమించిన ఈ ప్రాంతం పాక్షిక ఎడారి లక్షణాలతో ఉంటుంది. ఆకురాల్చే అడవులు ఎక్కువ. టేకు, మోదుగ, తంగేడు లాంటి చెట్లు ఉంటాయి. పులులు, జింకలు, నక్కలు, దుప్పులు లాంటి జంతు సంపద ఉంటుంది.


పశ్చిమ కనుమల ప్రాంతం: ఇది మహారాష్ట్ర నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన కొండల ప్రాంతం. నైరుతి రుతువులో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. మహాగని, ఎబోని, రోజ్‌వుడ్‌ లాంటి బలమైన చెట్లు పెరుగుతాయి. ఎప్పుడూ ఆకుపచ్చగా ఉండే సతత హరితారణ్యాలు విస్తరించి ఉంటాయి. ఏనుగులు, పులులు, బ్లాక్‌ మంకీస్‌ లాంటి రకరకాల కోతులు, నీలగిరి తహర్‌ దుప్పులు, జింకలు వంటి గొప్ప జీవవైవిధ్యం ఉంది.


దక్కన్‌ ద్వీపకల్ప ప్రాంతం: చోటా నాగ్‌పుర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు వరకు విస్తరించి ఉంది. ఈ మండలంలో వార్షిక వర్షపాతం 100 సెం.మీ. ఉన్న పీఠభూములు ఉంటాయి. చాలావరకు తేమ ఆకురాల్చే పర్వత వెనుక భాగాల్లో శుష్క ఆకురాల్చే అడవులు విస్తరించి ఉంటాయి. టేకు, మద్ది, గంధపుచెట్టు, ఎర్రచందనం, వెదురు, మోదుగ లాంటి వృక్షాలకు ప్రసిద్ధి. పులులు, జింకలు, దుప్పులు, అడవి దున్నలు, తోడేళ్లు లాంటి జంతువులు నివసిస్తాయి.


ఈశాన్య భారత ప్రాంతం: అత్యంత జీవవైవిధ్యమున్న ప్రాంతం. అత్యధిక వర్షపాతం ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ నుంచి అన్ని ఈశాన్య రాష్ట్రాలు ఇందులో ఉంటాయి. సాల్, చెంప, ఎత్తయిన వెదురు లాంటి వృక్ష సంపద, గిబ్బస్‌ కోతులు, రెడ్‌ పాండా, ఖడ్గమృగాలు, బెంగాల్‌ రాయల్‌ టైగర్స్‌ లాంటి జంతుసంపదకు ప్రసిద్ధి. నెపెంథిస్‌ లాంటి కీటకాహార మొక్కలకు ఈ ప్రాంతం ప్రత్యేకం. అనేక రకాల పక్షులు కనిపిస్తాయి.


గంగా మైదాన ప్రాంతం: ఇది గంగా, దాని ఉపనదుల ప్రాంతమైన ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. దేశ వైశాల్యంలో 11% ఆక్రమించింది. సారవంతమైన నేలలు జంతు, వృక్షసంపద కంటే వివిధ రకాల పాడిపంటలకు అనుకూలం. వేప, చింత, మామిడి లాంటి కొన్నిరకాల వృక్షాలు; దుప్పులు, జింకలు వంటి జంతువులకు అనుకూలం.


దీవులు: బంగాళాఖాతంలోని అండమాన్‌ నికోబార్‌ దీవులు, అరేబియా సముద్రంలోని లక్షదీవులు జీవభౌగోళిక, సముద్ర ప్రభావిత ప్రాంతాలు. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వర్షాలు ఎక్కువ. అందువల్ల దట్టమైన అడవులు, చెట్లపై నివసించే పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. మధ్యస్థ వర్షపాతం ఉండే లక్షదీవుల్లో ఆకురాల్చే పలుచని అడవులు విస్తరించి ఉంటాయి. ప్రవాళ బిత్తికలతో ఆవరించిన ఈ దీవులు ప్రత్యేక జీవ వైవిధ్య సంపదగా నిలిచాయి.


తీర ప్రాంతాలు: భారతదేశానికి 7,516 కి.మీ. పొడవైన తీరం ఉంది. తీరం అంచుల్లో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. లక్షదీవులు తప్ప తీరం ఉన్న అన్ని ప్రాంతాల్లో విస్తరించిన మడ అడవులు గొప్ప జీవ వైవిధ్యానికి ప్రతీకలు.

 

 

రచయిత: జల్లు సద్గుణరావు
 

Posted Date : 19-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవవైవిధ్య సంరక్షణ

జీవజాతులను కాపాడుకుందాం!

 


   సృష్టిలోని ప్రతి జీవి సహజ ఆవరణ వ్యవస్థలో భాగమే. పరస్పర ఆధారితమే. మనిషి చేసే అభివృద్ధి కార్యకలాపాలు, మితిమీరిన వనరుల వినియోగం వల్ల ఎన్నో జీవజాతుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పటికే కొన్ని వేల రకాల జంతు, వృక్ష జాతులు కనుమరుగయ్యాయి. చాలా జాతుల ఉనికి ప్రమాదపుటంచుల్లో కొనసాగుతోంది. ఈ పరిస్థితిపై అవగాహన పెంచి జీవవైవిధ్యాన్ని సంరక్షించేందుకు ప్రపంచవ్యాప్త కృషి జరుగుతోంది. అందులోనూ భూభాగం కంటే జీవ వైవిధ్య వాటా నాలుగు రెట్లున్న భారతదేశంలో గట్టి ప్రయత్నమే సాగుతోంది. పర్యావరణ పరిరక్షణను పౌరుల ప్రాథమిక విధిగా, వన్యప్రాణుల సంరక్షణను ప్రభుత్వాల బాధ్యతగా రాజ్యాంగం నిర్దేశించింది. ప్రమాద పరిస్థితుల్లో ఉన్న జాతుల వర్గీకరణ, వాటి సంరక్షణకు చేపడుతున్న చర్యలను పోటీపరీక్షల అభ్యర్థులు తెలుసుకోవాలి.

 

 
  అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ -IUCN) అనేది ప్రకృతి, వనరుల పరిరక్షణ కోసం పాటుపడుతుంది. ఈ సంస్థ అధ్యయనం, విశ్లేషణల ద్వారా ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో మోర్గెస్‌లోని గ్లాండ్‌ ప్రాంతంలో ఉంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవ చర్యల వల్ల ప్రమాద స్థితిలో ఉన్న వృక్ష, జంతు జాతులను గుర్తించి, వాటి సంరక్షణ, నిర్వహణ చర్యలను సూచిస్తూ మొదటిసారిగా రెడ్‌ డేటా బుక్‌ను 1966లో ప్రచురించింది. ఈ బుక్‌లోని గులాబీ రంగున్న పేజీల్లో తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జీవజాతులను నమోదు చేస్తారు. ఆకుపచ్చ పేజీల్లో గతంలో అంతరించే స్థాయిలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ స్థితిలో లేని జాతులను పేర్కొంటున్నారు. ఈ ఆకుపచ్చ పేజీలు పెరుగుతూ ఉంటే జీవసంరక్షణ చర్యలు అధికమవుతున్నట్లు భావించవచ్చు. IUCN సంస్థ వివిధ జాతుల వివరాల ఆధారంగా వాటిని రకరకాలుగా విభజించింది.

 


1) అంతరించిపోయిన జాతులు: వీటినే విలుప్తం చెందిన జీవులు అని కూడా అంటారు. ఒక జాతికి చెందిన జీవి ప్రాంతీయంగా/దేశాల్లో/ఖండాల్లో/ప్రపంచంలో ఎక్కడా జీవించే ఆనవాళ్లు లేని లేదా చివరి జీవి కూడా అంతరించినట్లయితే దాన్ని గతించిన జాతిగా గుర్తిస్తారు. ఉదా: డైనోసార్లు, దొడా పక్షి, ఆసియా చిరుతలు, ఊదారంగు తల ఉండే బాతు.

 


2) తీవ్ర అంతర్థాన స్థితిలో ఉన్న జాతులు: వీటినే విలుప్త స్థితికి దగ్గరగా ఉన్న జీవులు అంటారు. దాదాపు అంతరించే స్థితికి చేరిన జీవులను ఈ జాబితాలో చేరుస్తారు. అంటే మనిషి ప్రత్యక్షంగా వాటిని సంరక్షిస్తే తప్ప వాటి మనుగడ సాధ్యం కాని స్థితిలో ఉన్న జీవజాతులు అని అర్థం. ఈ జాతి జీవులుగా పేర్కొనాలంటే వాటికి కొన్ని లక్షణాలు ఉండాలి.


ఎ) గత పదేళ్లలో వాటి సంఖ్య 90% కంటే తగ్గిపోయి ఉండాలి. 


బి) వాటి జనాభా సంఖ్య 50 కంటే తక్కువగా ఉండాలి.


సి) అటవీ జీవులు అయితే పదేళ్లలో వాటి సంఖ్య 50% తగ్గిపోయి ఉండాలి.


ఉదా: ఇండియన్‌ వైల్డ్‌యాస్, ఇండియన్‌ రైనో, లయన్‌ టైల్డ్‌ మకాక్, మలబార్‌ కెవిట్, అతిచిన్న అడవి పంది, ఎగిరే ఉడుత (అరుణాచల్‌ప్రదేశ్‌లో నమ్‌దపా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కనిపిస్తుంది), శేషాచలం అడవుల్లో కనిపించే పునుగు పిల్లి, బంగారు బల్లి, ఉడుము, హిమాలయాల్లో కనిపించే కస్తూరి మృగం, బట్టమేకల పక్షి, అండమాన్‌ స్రౌ, గుడ్లగూబలు.

 


3) అంతర్థాన స్థితిలో ఉన్న జీవులు: ఆవాసాల ఆక్రమణలు, వేటాడటం లాంటి చర్యల వల్ల కొన్ని జాతుల్లో అక్కడక్కడా మిగిలి ఉన్నజీవులు ఇవి. వీటిని కాపాడకపోతే భవిష్యత్తులో విలుప్త స్థితికి దగ్గరవుతాయి. ఈ విభాగానికి కొన్ని లక్షణాలు ఉండాలి.


ఎ) గత పదేళ్లలో వీటిసంఖ్య 70% కంటే తక్కువకు పడిపోవాలి.


బి) ప్రస్తుతం వీటి సంఖ్య 250 వరకు ఉండాలి.


సి) అవి క్రూర జీవులైతే గత 20 ఏళ్లలో 20% వరకు అంతరించి ఉండాలి.

ఉదా: బెంగాల్‌ టైగర్, రెడ్‌ పాండా, బ్లూవేల్, ఇండియన్‌ ఎలిఫెంట్, సాంగై దుప్పి, గంగానది డాల్ఫిన్, ఏషియాటిక్‌ లయన్, గ్రీన్‌ టర్టిల్, ఈజిప్ట్‌ రాబందు లాంటివి.

 


4) దుర్బల స్థితిలోని జీవులు: ఎలాంటి పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ప్రమాదస్థితికి చేరే జీవులు. ఈ జాబితాలో చేర్చడానికి నిర్దేశిత లక్షణాలు ఉండాలి.


ఎ) గత పదేళ్లలో ఆ జీవులు 50 శాతానికి తగ్గిపోయి ఉండాలి.


బి) ఆ జాతి సంఖ్య 10,000 కంటే తక్కువ ఉండాలి.


సి) క్రూర జీవులైతే గత వందేళ్లలో 10% తగ్గిపోయి ఉండాలి.


ఉదా: నాలుగు కొమ్ముల దుప్పి, బరసింగా దుప్పి, బ్రౌన్‌ బేర్, స్లాత్‌ బేర్, అడవిదున్న, యాక్, మంచు పులి, సారస్‌క్రేన్, ఆలివ్‌రిడ్లే తాబేళ్లు.


5) ప్రమాదపుటంచులో ఉన్న జీవులు: తీవ్ర అంతర్థాన స్థితి, అంతర్థాన స్థితి, దుర్భల స్థితుల్లో ఉన్న జీవులన్నీ ప్రమాదపుటంచులో ఉన్న జీవులే.


6) సమీప భవిష్యత్తులో ప్రమాదంలో పడే జీవులు: తీవ్ర అంతర్థాన స్థితి, అంతర్థాన స్థితి, దుర్భల స్థితుల జాబితాల్లో చేరనివి. కానీ, భవిష్యత్తులో ఆ జాబితాల్లో చేరే అవకాశం ఉన్న జాతులు. వీటిని కాపాడుకోవాలి.

 


భారత్‌లో జీవసంరక్షణ చర్యలు


భారతదేశంలో చాలా కాలం నుంచీ జీవవైవిధ్య సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.

 


వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు: వన్యప్రాణుల సంరక్షణ కోసం మొదటగా 1895లో తమిళనాడులోని వేదాంతగళ్‌ ప్రాంతంలో పక్షుల సంరక్షణ కేంద్రం ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో 567 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కొనసాగుతున్నాయి.

 


జాతీయ పార్కులు: ఆవరణ వ్యవస్థను కాపాడటానికి, ప్రాంతీయ వృక్ష, జంతు జాతులకు రక్షణ కల్పించే ప్రాంతాలు. మొదట 1935లో ఉత్తరాఖండ్‌లో జిమ్‌కార్బెట్‌ నేషనల్‌ పార్కును ప్రారంభించారు. ఇప్పుడు దేశంలో 106 జాతీయ పార్కులు కొనసాగుతున్నాయి.

 


టైగర్‌ ప్రాజెక్టులు: పులుల సంరక్షణ కోసం 1973 నుంచి పులుల సంరక్షణ ప్రాజెక్టులు ప్రారంభించారు. దేహ్రాదూన్‌లోని ‘వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రకారం 2023, జనవరి నాటికి దేశంలో 53 టైగర్‌ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పులుల జనాభా లెక్కించడానికి M-STIPES (మానిటరింగ్‌ సిస్టమ్‌ ఫర్‌ టైగర్స్‌ ఇంటెన్సివ్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఎకలాజికల్‌ స్టేటస్‌) అనే సాఫ్ట్‌వేర్‌ వాడుతున్నారు.

 


ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌: ఏనుగుల రక్షణ కోసం 1992లో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో 33 ఎలిఫెంట్‌ ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. ఏనుగులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారత పర్యావరణశాఖ ‘హాథీ మేరా సాథీ’ (ఎలిఫెంట్‌ ఈజ్‌ మై ఫ్రెండ్‌) కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.


ప్రాజెక్ట్‌ గిర్‌ లయన్‌: గుజరాత్‌లోని కథియావార్‌ ప్రాంతంలోని ఆకురాల్చే గిర్‌ అటవీ ప్రాంతాన్ని సింహాల పరిరక్షణ ప్రాంతంగా కొనసాగిస్తున్నారు. దేశంలో ఇక్కడ మాత్రమే ఈ జాతి సింహాలు కనిపిస్తాయి. ఇవి ప్రస్తుతం 674 ఉన్నాయి.


ప్రాజెక్ట్‌ రైనోస్‌ విజన్‌: దీన్ని 2005లో ప్రకటించారు. దేశంలో రైనోల సంఖ్యను 3 వేల వరకు పెంచాలని నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్‌లోని జలదాపరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ‘ఎ హోమ్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ వరల్డ్‌ రైనోస్‌’ అంటారు.


ప్రాజెక్ట్‌ క్రొకడైల్స్‌: దీన్ని 1975లో ప్రకటించారు. అత్యంత వేగంగా అంతరించిపోతున్న జాతిగా ఘరియల్‌ మొసళ్లని నిర్ణయించారు. ఇవి మధ్యప్రదేశ్‌లోని చంబల్‌ ప్రాంతంలో ప్రసిద్ధి. ఒడిశాలోని బిత్తరకనిక ప్రాంతం రాకాసి ఉప్పునీటి మొసళ్లకు ప్రసిద్ధి.


ప్రాజెక్ట్‌ సీ టర్టిల్‌: ఒడిశాలోని తీర ప్రాంతానికి ఏటా శీతాకాలంలో గాలపోగస్‌ దీవుల నుంచి ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు వలస వస్తుంటాయి. మనదేశంలో గ్రీన్‌ తాబేళ్లు, నక్షత్ర తాబేళ్ల లాంటి జాతులు కూడా నివసిస్తున్నాయి. వీటి రక్షణ కోసం 1999లో యూఎన్‌ఓతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టారు.


ప్రాజెక్ట్‌ స్నో లెపర్డ్స్‌: మన దేశంలో జమ్ము-కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో మాత్రమే మంచు చిరుతలు ఉన్నాయి. వీటి రక్షణ కోసం 2009లో ఈ ప్రాజెక్టుని ప్రారంభిస్తారు.

 


ప్రాజెక్ట్‌ చీతా: చీతాల ‘రీ ఇంట్రడక్షన్‌’ పేరుతో మన దేశంలో అంతరించిపోయిన చిరుత పులులను తిరిగి ప్రజననం చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం ఆఫ్రికాలోని నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి రెండు విడతలుగా చీతాలు తీసుకొచ్చారు. వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో ప్రవేశపెట్టారు. చివరి చీతాను 1948లో వేటాడి చంపిన తర్వాత 1952లో భారత ప్రభుత్వం ఈ జాతి దేశంలో అంతరించిపోయినట్లు ప్రకటించింది.

 


రచయిత: జల్లు సద్గుణరావు


 

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు నిర్వహణలో అవశిష్ట నైపుణ్యాలు

ప్రాణాలు కాపాడే నేర్పరితనం!

 


  
  హఠాత్తుగా అనుకోని సంఘటనలు ఎదురైతే దాదాపు అందరూ కాసేపు స్తంభించిపోతారు. అలాంటిది పెద్ద ప్రమాదమే జరిగితే దాన్ని చూసిన, అందులో ఉన్న బాధితుల మానసిక స్థితిని ఊహించడం కష్టం. కానీ ఆ విధమైన విపత్కర పరిస్థితుల్లో కూడా విపరీత భావోద్వేగాలకు గురికాకుండా, పరిస్థితులకు అనుగుణంగా, సృజనాత్మకంగా ఆలోచించడం, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవడం, సరైన సమాచారాన్ని అందించడం, సమన్వయం చేసుకోవడం వంటి చర్యలను అవశిష్ట నైపుణ్యాలు అంటారు. విపత్తు నిర్వహణలోని ఆ నేర్పరితనం ప్రాణాలను కాపాడుతుంది. ఆస్తులు సహా ఇతర నష్టాలను గణనీయంగా తగ్గిస్తుంది. 

 


  విపత్తు ఎప్పుడు, ఎక్కడ సంభవించినా మొదట స్పందించేది స్థానికులే. వారే వేగంగా తక్షణ, రక్షణ చర్యలు మొదలుపెడతారు. శిక్షణ, సరైన వనరులు లేకుండా విపత్తుల నుంచి బాధితులను రక్షించడం స్థానికులకు కష్టతరమైన అంశం. విపత్తు తర్వాత అక్కడి భౌతిక, పర్యావరణ పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో శోధన, రక్షక చర్యలు (సెర్చ్, రెస్క్యూ) కీలకపాత్ర పోషిస్తాయి. ఎక్కువ మంది ప్రాణాలు కాపాడటం శోధన, రక్షక చర్యల బృందాల బలం, సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది.

 


  అత్యంత అననుకూల పరిస్థితుల్లో కూడా ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన వ్యక్తి/వ్యక్తుల సమూహం నిర్వహించే ఒక సాంకేతిక చర్యను శోధన, రక్షక చర్యలుగా నిర్వచించవచ్చు. వీటిని కమ్యూనిటీ సాన్నిహిత్య సహకారం, బృంద దృక్పథంతో నిర్వహిస్తారు

 


శోధన, రక్షక చర్యల బృందం కూర్పు: నిజాయతీ, భావోద్వేగం, వృత్తిపరంగా తిరుగులేని నైపుణ్యం, శారీరక దారుఢ్యం, ప్రదర్శనా సామర్థ్యం, అత్యవసర పరిస్థితుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉండే స్త్రీ, పురుష వాలంటీర్లతో రక్షక బృందాన్ని ఏర్పాటు చేస్తారు. వీరికి 18 ఏళ్లు నిండి, స్థానిక భాషలో చదివే, రాయగలిగే సామర్థ్యం ఉండాలి. మాజీ సైనిక సిబ్బందికి ప్రాధాన్యం ఉంటుంది.

 


ప్రధాన లక్ష్యాలు:  * కూలిన భవనాల శిథిలాల నుంచి లేదా తుపాను, సునామీ, వరదలు లాంటి కల్లోలాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడటం.


* బాధితులకు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యచికిత్సకు పంపడం.

 

* కూలేందుకు సిద్ధంగా/ప్రమాదంలో ఉన్న భవనాలను తాత్కాలికంగా కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవడం.


* ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించి, అక్కడినుంచి తొలగించి, సంబంధీకులకు అందజేయడం.


* స్థానిక వనరులను ఎలా ఉపయోగించుకోవాలో శిక్షణ, ప్రదర్శన ద్వారా కమ్యూనిటీ ప్రజలకు అవగాహన కల్పించడం.

 


విధులు: దుర్ఘటన ఏ ప్రాంతంలో జరిగిందో తెలుసుకుని వేగంగా సహాయక చర్యలు చేపట్టడం బృంద సభ్యుల ప్రాథమిక విధి. ఇది సమర్థ రక్షణకు ఉపయోగపడుతుంది. నష్టం జరిగిన ప్రాంతం పరిధి, వివరాలు, ఇంకా ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా లాంటి సమాచారం సేకరించడం చాలా ముఖ్యం.

 


మూడు కీలక సూత్రాలు: బృంద సభ్యులు శోధన, రక్షక చర్యల్లోకి దిగే ముందు కింది సూత్రాలు పాటించాలి.

 


పరిశీలించు (Look): జరిగిన సంఘటన ఏ రకమైందో కళ్లతో చూసి తనిఖీ చేయాలి.

 


విను (Listen): జరిగిన సంఘటన వివరాలు కమ్యూనిటీ (స్థానిక ప్రజలు) నుంచి లేదా ప్రభుత్వ రికార్డులు, మీడియా వంటి వనరుల నుంచి పూర్తిస్థాయిలో సేకరించి చర్యల్లోకి దిగాలి.

 


స్పందించు (Feel): ప్రమాద తీవ్రత గురించి వాస్తవాన్ని గ్రహించి, దానికి ప్రతిస్పందించి చర్యల్లోకి దిగే ముందు వనరులను, సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి.

 


రక్షక బృందం వద్ద ఉండాల్సిన వస్తువులు: 1) తాడు  2) నిచ్చెన  3) కత్తిరించే చిన్న సాధనాలు  4) ప్రథమ చికిత్స పెట్టె  5) గునపం 6) సుత్తి  7) బాధితుడిని మోసుకెళ్లే జోలె (స్ట్రెచర్‌). అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి సామగ్రి బృందానికి అందుబాటులో లేనప్పుడు స్థానికంగా లభించే పీపాలు, టిన్‌ డబ్బాలు, గొట్టాలు, కర్రలు లాంటి వస్తువులు వినియోగించుకునే సమయస్ఫూర్తి ఉండాలి.

 


రక్షక బృందం సభ్యుడి వద్ద ఉండాల్సిన వస్తువులు: 1) హెల్మెట్‌  2) టార్చ్‌లైట్‌  3) గమ్ముతో అతికించిన బూట్లు  4) లైఫ్‌ జాకెట్‌  5) విజిల్‌

 


ప్రథమ చికిత్సే ప్రధానం: ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముందుగా ప్రజల ప్రాణాలు కాపాడటానికి చేయాల్సిన అత్యంత ముఖ్యమైన చర్య ప్రథమ చికిత్స. గాయం తగిలిన లేదా అకస్మాత్తుగా జబ్బు పడిన బాధితుడికి అధునాతన వైద్యం అందించడానికి ముందు ప్రమాదం జరిగిన చోట లభించే మానవ, ఇతర వనరులతో తొలి సంరక్షణ అందించడమే ప్రథమ చికిత్స. దీనికి బంగారు సూత్రం.. ‘ప్రశాంతంగా ఉండాలి, భయాందోళన చెందవద్దు.’

 


కార్యాచరణ ప్రణాళిక: ప్రథమ చికిత్స అవసరమా, లేదా అని మదింపు చేసుకోవడంలో బృంద సభ్యులకు ఒక కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. లేదంటే ప్రాణం పోయిన శవాన్ని ఆస్పత్రిలో చేర్చినట్లవుతుంది. అందుకోసం రక్షక చర్యల బృందం సభ్యులు ముందుగా కింది పరిశీలనలు చేయాలి. వీటినే DRABC అంటారు.


* D - డేంజర్‌ (ప్రమాదం): మీకు/బాధితులకు/ఇతరులకు ఏదైనా ప్రమాదం ఉందేమో గమనించాలి.


* R - రెస్పాన్స్‌ (ప్రతిస్పందన): బాధితుడు స్పృహలో ఉన్నాడా లేదా అచేతనంగా ఉన్నాడా అని పరిశీలించాలి.


* A - ఎయిర్‌వే (వాయునాళం): ముక్కు తెరచుకుని ఉందో లేదో చూడాలి.


* B - బ్రీతింగ్‌ (శ్వాస): బాధితుడి శ్వాస శబ్దం వినిపిస్తుందా, గుండె కొట్టుకుంటుందా అనేది పరిశీలించాలి.


* C - సర్క్యులేషన్‌ (రక్తప్రసరణ): బాధితుడి నాడీ కొట్టుకుంటుందో లేదో పరిశీలించాలి.



ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాల్సిన 12 వస్తువులు: 1) దూది  2) టేపు  3) బ్యాండేజ్‌  4) డ్రెస్సింగ్‌ క్లాత్‌  5) ట్రయాంగులర్‌ బ్యాండేజ్‌ 6) థర్మామీటర్‌ 7) కత్తెర  8) గ్లౌజులు 9) సబ్బు  10) నొప్పి నివారణ మందులు 11) యాంటాసిడ్‌ 12) ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు.

 


స్పృహ కోల్పోయిన వ్యక్తికి ప్రథమ చికిత్స:


ఆ వ్యక్తిని పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. తల వెనక్కి వంచి, చేతులు శరీరానికి లంబకోణంలో ఉంచాలి.


* కాలిని 8 నుంచి 12 అంగుళాలు ముందుకు జరపాలి. దీనివల్ల మెదడుకు రక్తప్రవాహం పెరుగుతుంది.


* దుస్తులు బిగుతుగా ఉంటే తొలగించాలి.


* బాధితుడి చుట్టూ జనం గుమికూడనీయకూడదు. 

 


కాలిన గాయాలకు చికిత్స: * కాలిన భాగాన్ని వెంటనే చల్లటి నీటిలో ముంచిన వస్త్రాలతో తుడవాలి.

 

* మంటల్లో చిక్కుకున్నట్లయితే వెంటనే బయటకు లాగి వస్త్రంతో కప్పి దొర్లించాలి. లేదా తక్షణమే దుప్పటి చుట్టాలి.


* కాలిన ప్రాంతంలో వెన్న, నూనె, ఐస్‌ లాంటివి పూయకూడదు.


* గాయంపై నేరుగా నీటిని ధారాళంగా పోయకూడదు.

 


ఎముకలు విరగడం లేదా బెణకడం:  * విరిగిన ప్రదేశంలో దన్నుగా సరైన ప్యాడింగ్‌ చేయాలి.


* విరిగిన ప్రదేశాన్ని కదలకుండా ఉంచాలి.


* గాయం తగిలిన ప్రాంతంలో నొప్పి తగ్గే విధంగా వాపు రాకుండా ఐసు ముక్కతో రుద్దాలి.


* గాయంపై షాక్‌ తగలకుండా చికిత్స చేయాలి.

 


విద్యుదాఘాతం జరిగినప్పుడు: * కరెంట్‌ షాక్‌ తగిలిన వ్యక్తికి చికిత్స చేయడానికి ముందు విద్యుత్తు ప్రవాహాన్ని నిలిపివేయాలి.


* విద్యుత్తు నిరోధకం సాయంతో బాధితులను అక్కడి నుంచి తీయాలి.


* ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు షాక్‌ తగిలిన భాగాన్ని శుభ్రమైన వస్త్రంతో కప్పి ఉంచాలి.


*  DRABC ని పాటించాలి.

 


పాము కాటుకు గురైనప్పుడు: 


* పాము కాటుకు గురైన భాగాన్ని గుండె ఉన్న ఎత్తు కంటే తక్కువ ఎత్తులో ఉండేలా చూడాలి.


* కాటు వేసిన భాగం నుంచి 15 నుంచి 30 సెకన్ల వరకు రక్తం కారనివ్వాలి.


* కాటు వేసిన ప్రాంతానికి రెండు అంగుళాలపైన బిగువైన రోలర్‌ బ్యాండ్‌ వేయాలి.


* కాటు వేసిన భాగాన్ని శుభ్రంగా సబ్బుతో కడగాలి.


* పాము కాటు వేసిన వెంటనే అక్కడి రక్తాన్ని నోటితో పీల్చి ఉమ్మివేయాలి. అలా చేసిన తర్వాత నీళ్లతో నోటిని పుక్కిలించాలి.


ఈ విధంగా చేసే ప్రథమ చికిత్స అనేక సందర్భాల్లో మరణం నుంచి వ్యక్తులను కాపాడుతుంది.

 


రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 06-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవావరణ మండలాలు

సకల జీవ సమూహాలకు సంరక్షణ!

 

 జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి.  సుస్థిరాభివృద్ధిని సాధించాలి. అందుకు తగిన సహజ, భౌగోళిక పరిస్థితులు ఉండాలి. అవసరమైన శాస్త్రీయ పరిశోధనలు జరగాలి. అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. ఈ లక్ష్యంతోనే ప్రపంచ వ్యాప్తంగా నిర్ణీత ప్రాంతాలను జీవావరణ మండలాలుగా గుర్తించారు. అంతరించి పోతున్న జాతులను అక్కడ రక్షిస్తారు. సహజ పర్యావరణ ప్రక్రియలను ప్రోత్సహిస్తారు. దాని కోసం భూమిని, వనరులను సమీకరిస్తారు. నిర్వహణ విధానాలను రూపొందిస్తారు. జీవావరణాన్ని సంరక్షిస్తారు. పర్యావరణ అంశాల అధ్యయనంలో భాగంగా ఆ విశిష్ట మండలాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


    విశాల ప్రపంచంలోని జీవులన్నింటినీ జీవావరణం అంటారు. ప్రతి జీవికి తన చుట్టూ ఉన్న సహజ, భౌగోళిక అంశాలతో అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే మనిషితోపాటుగా అన్ని జీవజాతులకు అంతర్జాతీయ ప్రాధాన్యం ఇచ్చేందుకు యునెస్కో కృషి చేస్తోంది. యునెస్కోలోని ఇంటర్నేషనల్‌ కోఆర్డినేషన్‌ కౌన్సిల్‌ నియమించిన టాస్క్‌ఫోర్స్‌ నిర్ణయం మేరకు జీవావరణ మండలాల గుర్తింపు కోసం ‘మ్యాన్‌ అండ్‌ బయోస్ఫియర్‌ ప్రోగ్రామ్‌’ MAB ని 1974లో ఆమోదించింది. 1976 నుంచి అమలు ప్రారంభించింది. దేశాలు నిర్ణయించిన జీవావరణ మండలాల్లో ఆయా దేశాలు చేపట్టిన సుస్థిరాభివృద్ధి కార్యకలాపాల ఆధారంగా కొన్నింటిని యునెస్కో ఎంపికచేసి MAB లో చేర్చింది.


* అన్ని జీవజాతులతో పాటు, పర్యావరణంలో మనిషి మనుగడను కూడా పరిశీలనలోకి తీసుకుంటూ నిర్ణయించిన భూ, సముద్ర ప్రాంతాలు జీవావరణ మండలాల్లో భాగమవుతాయి. అంతర్జాతీయ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాటి పరిరక్షణకు దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు.


* జీవావరణ మండలాలు సహజ జీవ మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అనేక జీవవైవిధ్య సమూహాల ఏకత్వాన్ని ఒక ప్రాంతంగా సంరక్షణ అవసరాన్ని తెలియజేస్తాయి.


* జీవావరణ మండలాల్లో మొత్తం పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా పరిశోధన, విద్య, శిక్షణ లాంటి కార్యక్రమాలను చేపడతారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కుల్లో ఇందుకు అవకాశం ఉండదు.


* ఈ ప్రాంతాల్లో సహజత్వాన్ని, ఆవరణ వ్యవస్థను, జాతులు, జెనిటిక్‌ వైవిధ్యాన్ని సంరక్షిస్తారు.


* ప్రపంచం మొత్తంలో మ్యాన్‌ అండ్‌ బయోస్ఫియర్‌ నెట్‌వర్క్‌లో 134 దేశాల నుంచి 738 ప్రాంతాలను యునెస్కో గుర్తించింది. వీటిలో భారత్‌ నుంచి 12 ప్రాంతాలున్నాయి.

భారతదేశంలో జీవావరణ మండలాలు: భారత ప్రభుత్వం జాతీయ జీవావరణ రిజర్వు ప్రోగ్రామ్‌ని 1986లో ప్రారంభించింది. మొదటి జీవావరణ మండలంగా నీలగిరి ప్రాంతాన్ని 1986లో ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం 18 జీవావరణ మండలాలున్నాయి.



జీవావరణ మండలాల ఎంపిక - లక్షణాలు:

* ఈ ప్రాంతాలు మృత్తికలు, సూక్ష్మ శీతోష్ణ పరిస్థితుల వైవిధ్యంతో ఉండి అనేక రకాల స్థానీయ జీవజాతులకు ఆలవాలమై ఉండాలి.


* కొద్దికాలంలో అంతరించిపోయేందుకు దగ్గరలో ఉన్న, అరుదైన, ప్రమాదపు అంచులో ఉన్న జీవులు నివసిస్తూ ఉండాలి.


* పర్యావరణంతో సామరస్యపూర్వక జీవనం సాగించే సంప్రదాయక గిరిజన జాతులు ఆ ప్రాంతాల్లో అధికంగా నివసిస్తూ ఉండాలి.


* ఒక ఆవరణ వ్యవస్థలోని వృక్షజాతులు, జంతు జాతుల మధ్య వైవిధ్యాన్ని, సమగ్రతను కాపాడటం ఈ ప్రాంతాల ప్రధాన లక్షణం.


* జాతుల జెనిటిక్‌ వైవిధ్యానికి రక్షణ కవచంగా ఉంటూ వాటి ప్రజన ప్రక్రియను కొనసాగించడానికి ఆటంకం లేకుండా చర్యలు చేపడతారు.


* ఈ ప్రాంతాల్లో జీవజాతుల సంరక్షణకు, పర్యావరణ పరిరక్షణకు కావాల్సిన బహుముఖ పరిశోధన, విద్య, శిక్షణ కార్యకలాపాలు చేపడతారు.


* సుస్థిరాభివృద్ధితో కూడిన సరైన సాంకేతికత వినియోగం ద్వారా సహజ వనరులను స్థానిక ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే విధంగా పర్యవేక్షిస్తారు.

 

జీవావరణం - విభాగాలు: జీవులు, జన్యు ఆధారాలు, గిరిజనుల జీవన శైలి, సహజసిద్ధ పరిసరాల పరిరక్షణ మొదలైన బహుళ ప్రయోజనకర పరిరక్షణ ప్రాంతాలైన బయోస్ఫియర్‌ రిజర్వులను మూడు మండలాలుగా విభజిస్తారు.

1) కోర్‌ జోన్‌: ఈ ప్రాంతం పూర్తిగా మానవ కార్యకలాపాల నిషిద్ధ ప్రాంతం. ప్రశాంతతను దెబ్బతీసే కార్యకలాపాలు చేపట్టడానికి వీల్లేదు. ఈ ప్రాంతాల శిఖర స్థాయిలో వేట ద్వారా ఆహారాన్ని సేకరించే జీవులతో పాటు అనేక రకాల జంతు, వృక్ష జాతులు వాటి స్థలాలకు పరిమితమై జీవిస్తుంటాయి. సహజత్వానికి, అటవీ జీవన విధానానికి ఆటంకం కలగకుండా పరిశోధన, నిర్వహణ లాంటి అంశాలకు అవకాశం కల్పిస్తారు.


2) తటస్థ మండలం (Buffer Zone): ఈ ప్రాంతం కోర్‌ జోన్‌ చుట్టూ విస్తరించి ఉంటుంది. ఇందులో కోర్‌ జోన్‌ పరిరక్షణే ధ్యేయంగా కార్యకలాపాలు చేపడతారు. ఈ ప్రాంతంలో పరిశోధన, విద్యా కార్యకలాపాలకు అవకాశం ఉంటుంది. ఆవరణ వైవిధ్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా సహజ మానవ కార్యకలాపాలకు అవకాశం ఇస్తారు. సహజవనరుల విలువను పెంచే విధంగా పునరుద్ధరణ, ప్రదర్శన, విహారం, వినోదం, చేపల పెంపకం, పశుగ్రాసం పెంపకం లాంటి కార్యకలాపాలు కోర్‌ జోన్‌ ప్రశాంతతను కాపాడుతూ చేపట్టే అవకాశం ఉంటుంది.


3) పరివర్తన మండలం (Transition Zone): ఇది జీవావరణ మండలంలో పూర్తిగా బయట విస్తరించి ఉన్న ప్రాంతం. నివాసాలు, వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. వినోద, ఆర్థిక కార్యకలాపాలు చేపట్టవచ్చు. పరివర్తన మండలానికి సరిహద్దులు నిర్ణయించి ఉండవు. సంరక్షణ, నిర్వహణ సామరస్యపూర్వకంగా, సహకార స్ఫూర్తితో ఉంటుంది. జీవావరణ మండలాల ఆశయానికి అనుకూలంగా కార్యకలాపాలు నిర్వహిస్తారు.


ప్రత్యేకతలు:

* జాతులు, జెనిటిక్స్, జీవులు, మానవసహిత సహజత్వాన్ని మొత్తంగా పర్యావరణాన్ని కాపాడే ప్రాంతాలివి.

 

* విశాలమైన జీవావరణ మండలాల్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నేషనల్‌ పార్కులు అంతర్భాగంగా ఉంటాయి.

 

* స్నేహపూర్వక, పర్యావరణహిత అభివృద్ధితో కూడిన సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యం ఉంటుంది.


* ఈ ప్రాంతాల అభివృద్ధికి, సంరక్షణకు మధ్య సమస్యలు తలెత్తకుండా తీవ్రతను తగ్గించే చర్యలు తీసుకుంటారు.

 

* ఈ ప్రాంతాల సంరక్షణ కోసం బహుళ భాగస్వామ్య వ్యవస్థలు కలిసి పనిచేయడమే కాకుండా విశాల దృక్పథంతో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తారు.

 

* వీటిలో కొన్నింటిని సహజత్వమే ప్రపంచం అనే దృక్పథంతో యునెస్కో మ్యాన్‌ అండ్‌ బయోస్ఫియర్స్‌ నెట్‌వర్క్‌లో చేర్చడం ప్రపంచీకరణకు అద్దం పడుతోంది.

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 18-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ కాలుష్యం

కలుషిత పరిసరాల్లో జీవావరణ వధ!

వాతావరణంలో ఆకస్మిక మార్పులతో వ్యవసాయంలో వ్యతిరేక ఫలితాలు. ఆస్తమా, ఎలర్జీ అందరికీ వచ్చే ఆరోగ్య సమస్యలు. ఒత్తిడి, నిద్ర పట్టకపోవడం తదితరాలు తరచూ ఎదురయ్యే ఇబ్బందులు. ఇవన్నీ పర్యావరణ కాలుష్యం వల్ల కలిగే పరిణామాలు. ప్రకృతి సహజ స్వభావానికి అంతరాయం ఏర్పడి, జీవులకు ప్రతికూలంగా పరిసరాలు ప్రభావం చూపడమే పర్యావరణ కాలుష్యం. మనిషి సాధించిన పారిశ్రామిక ప్రగతి, కనుగొనే కొత్త ఉపకరణాల వల్ల పలువిధాలుగా పరిసరాలు కలుషితమవుతున్నాయి. శాస్త్ర, సాంకేతికత అభివృద్ధి చెందేకొద్దీ కాలుష్యం అధికమై జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ప్రస్తుతం ప్రపంచానికి పెద్ద విపత్తుగా మారిన ఈ పర్యావరణ కాలుష్యం రకాలు, జరిగే నష్టాలు, నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఉద్యోగార్థులు తెలుసుకోవాలి.


ఉత్పత్తి, వినియోగ కార్యకలాపాలతో వచ్చే వ్యర్థాలను అనేక విధాలుగా పర్యావరణంలోకి వదిలివేస్తున్నారు. ఈ వ్యర్థాలను జీర్ణించుకునే శక్తి పర్యావరణానికి ఒక స్థాయి వరకే ఉంటుంది. ఆ స్థాయి దాటి వ్యర్థాలు పెరిగితే దాని నాణ్యత తగ్గుతుంది. ఆ విధంగా ఏర్పడే పర్యావరణ క్షీణతను పర్యావరణ కాలుష్యం అంటారు. భారత పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986 ప్రకారం ‘‘ఘన, ద్రవ, వాయు స్థితిలో ఉన్న ఏవైనా అవాంఛనీయ పదార్థాలు పరిమితికి మించి గాలి, నీరు, నేల అనుఘటకాల్లోకి చేరి, వాటి సహజ సంఘటనంలో మార్పు తీసుకొచ్చి మానవుడికి, ఇతర జీవుల మనుగడకు అంతరాయం కలిగించే స్థితే పర్యావరణ కాలుష్యం’’. కాలుష్యాన్ని ఆంగ్లంలో పొల్యూషన్‌ అంటారు. ఇది పొల్యుటోనియం అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. దీనర్థం ‘అపరిశుభ్రత’.


పారిశ్రామిక, హరిత విప్లవాల వల్ల ముందు తరం కంటే తర్వాత తరం జీవన నాణ్యత పెరుగుతూ వచ్చింది. అయితే దాని వెనుక తలెత్తిన పర్యావరణ సంక్షోభాలు మానవ జీవనానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నాయి. పీల్చే గాలి, తాగే నీరు, నివసించే నేల కలుషితమై జీవరాశుల మనుగడకే అంతరాయం కలుగుతోంది. ఈ విధంగా మనిషి జీవనసరళి వల్ల తటస్థపడే పరిసరాల క్షీణత క్షయాన్ని ‘జీవావరణ వధ’గా 1972లో స్టాక్‌హోమ్‌లో జరిగిన ‘మానవుడు-పర్యావరణం’ అనే అంతర్జాతీయ సదస్సులో అభివర్ణించారు. కాలుష్యానికి కారణమైన పదార్థాలను కాలుష్యకాలు అంటారు. ఉదా: సీసం, పాదరసం, కార్బన్‌ మోనాక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్‌ లాంటివి.

ఉనికి: ఉనికి ఆధారంగా కాలుష్యాలు రెండు రకాలుగా ఉన్నాయి.

1) పరిమాణాత్మక కాలుష్యకాలు: సహజసిద్ధంగా పర్యావరణంలో ఉండి పరిమితికి మించి పర్యావరణం అనుఘటకాల్లోకి ప్రవేశించి వాటి నిష్పత్తిలో మార్పు తీసుకొచ్చి నష్టపరిచేవి. ఉదా: కార్బన్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్‌ లాంటివి.

2) గుణాత్మక కాలుష్యకాలు: ఇవి సహజసిద్ధంగా పర్యావరణంలో ఉండవు. మానవ చర్యల వల్ల పర్యావరణంలోకి విడుదలై కాలుష్య కారకాలవుతాయి.

ఉదా: రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, పరిశ్రమల నుంచి వెలువడే వాయువులు, వ్యర్థాలు.

స్వభావం: క్షయ స్వభావం ఆధారంగా కాలుష్యకాలను రెండు రకాలుగా పేర్కొన్నారు. 

1) జీవక్షయం చెందే కాలుష్యకాలు: కొన్ని వ్యర్థాలు సూక్ష్మజీవుల చర్యల వల్ల పర్యావరణ విభాగాల్లో కలిసిపోతాయి. ఆ విధంగా పర్యావరణానికి అనుకూలంగా మారిపోయే కాలుష్యాలను జీవక్షయం చెందే కాలుష్యకాలుగా భావిస్తారు. ఉదా: చెత్త, వృక్ష, జంతు సంబంధ అవశేషాలు, వ్యవసాయ సంబంధ వ్యర్థాలు.

2) జీవక్షయం చెందని కాలుష్యకాలు: సూక్ష్మజీవుల చర్యల వల్ల క్షయం కాకుండా కొన్ని వందల ఏళ్ల వరకు వాతావరణ విభాగాల్లో అదే స్థితిలో ఉండి పర్యావరణానికి హాని కలిగించేవి. ఉదా: ప్లాస్టిక్‌ సంబంధ వస్తువులు, గాజు, పాలిథీన్‌ సంచులు, క్లోరినేటెడ్‌ హైడ్రోకార్బన్స్‌

మార్పు: పర్యావరణంలో మార్పు చెందే కాలుష్యకాలు రెండు రకాలు.

1) ప్రాథమిక కాలుష్యకాలు: పర్యావరణంలోకి విడుదలకాక ముందు ఏ స్థితిలో ఉన్నాయో, విడుదలయ్యాక కూడా అదే స్థితిలో ఉండి పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యేవి. ఉదా: డీడీటీ, పాదరసం లాంటివి.

2) ద్వితీయ కాలుష్యకాలు: ప్రాథమిక కాలుష్యకాలు పర్యావరణంలోకి విడుదలైన తర్వాత రసాయనిక మార్పుల కారణంగా కొత్త కాలుష్యకాలుగా మారడం.

ఉదా: వాతావరణంలోని నైట్రోజన్‌ ఆక్సైడ్, హైడ్రోకార్బన్లు కాంతి సమక్షంలో చర్య జరిపి పైరోగ్జిఎసిటైల్‌ నైట్రేట్‌గా మారుతుంది.

కాలుష్యంలోని విభాగాలు: పర్యావరణంలో ఏ భాగమైతే కాలుష్యానికి గురవుతుందో వాటి ఆధారంగా కాలుష్యాన్ని వివిధ రకాలుగా విభజించవచ్చు. 1) వాయు కాలుష్యం 2) నీటికాలుష్యం 3) భూమి కాలుష్యం 4) ఘన వ్యర్థ కాలుష్యం 5) సముద్ర కాలుష్యం 6) ధ్వని కాలుష్యం 7) ఉష్ణ కాలుష్యం 8) కిరణధార్మిక కాలుష్యం.


ప్రపంచంలో పెద్ద పర్యావరణ ప్రమాదాలు:

భోపాల్‌ గ్యాస్‌ దుర్ఝటన: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ అనే క్రిమిసంహారక మందులు తయారుచేసే పరిశ్రమ నుంచి 1984, డిసెంబరు 2 - 3 తేదీల్లో అర్ధరాత్రి సమయంలో మిథైల్‌ ఐసోసైనేట్‌ (ఎమ్‌ఐసీ) అనే విషవాయువు విడుదలైంది. పరిశ్రమ చుట్టూ 40 చ.కి.మీ. ప్రాంతంలో ప్రభావం చూపించడంతో, సుమారు 3,700 మంది చనిపోయారు, వెయ్యి మంది అంధులయ్యారు. 5,58,000 మంది విషవాయువు బారిన పడ్డారు.

చెర్నోబిల్‌ అణుప్రమాదం: ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్తు కేంద్రంలో 1986, ఏప్రిల్‌ 26న అణు రియాక్టర్‌ పేలిపోయింది. రేడియో అయోడిన్‌-131, సీజియం-137 లాంటి రేడియోధార్మిక పదార్థాలు విడుదలైన వెంటనే 31 మంది మరణించగా, ఆస్పత్రిలో 239 మంది చనిపోయారు. అణు రేడియేషన్‌ చుట్టుపక్కల ఉన్న పోలండ్, డెన్మార్క్, నార్వే దేశాలకూ విస్తరించింది. పాలల్లో కూడా రేడియేషన్‌ విస్తరించి పాలు తాగే చాలామంది చిన్నారులు చనిపోయారు.

సామూహిక విధ్వంస ఆయుధాలు: రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అమెరికా అణ్వాయుధాల దాడి పర్యావరణాన్ని అతలాకుతలం చేసింది. 1945, ఆగస్టు 6న మొదటిసారిగా లిటిల్‌ బాయ్‌ అనే అణుబాంబును బాంబర్‌ ఎనోలాగే అనే యుద్ధ విమానం నుంచి హిరోషిమా నగరంపై జారవిడిచారు. ఈ ఘటనలో 66 వేల మంది చనిపోగా 90% పట్టణం నాశనమైంది. 10 చ.కి.మీ. ప్రాంతం ప్రభావితమైంది. రెండోసారి ఆగస్టు 9న ప్యాట్‌ మాన్‌ అనే బాంబును అదే యుద్ధవిమానంతో నాగసాకి నగరంపై వేశారు. ఈసారి 1/3వ వంతు నగరం నాశనం కాగా 39 వేల మంది చనిపోయారు.


రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 28-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూకంపాలు - భూపాతాలు

భూగోళంలోని అన్ని ప్రదేశాల్లో భూకంపాలు నిరంతరం వస్తుంటాయి. కొన్నింటిని మనం కనీసం గుర్తించలేం కూడా. భూకంపాలు సంభవించినప్పుడు పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇలాంటి భూకంపాల వల్ల భవనాలకు, వంతెనలకు, ఆనకట్టలకు, ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. కొన్ని సందర్భాల్లో భూకంపాల వల్ల వరదలు, కొండ చరియలు విరిగి పడటం, సునామీ రావడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది.
ఉదా: 2004, డిసెంబరు 24న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ వల్ల భారతదేశ తూర్పు తీరప్రాంతంలో, అండమాన్ నికోబార్ దీవుల్లో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది.


భూకంపం ఎందుకు వస్తుంది?

భూమి అంతర్భాగంలో ఎక్కడైనా ఒకచోట ఆకస్మిక అలజడి వచ్చినప్పుడు కంపనాలు ఉపరితలాన్ని చేరడాన్నే భూకంపం అంటారు. అంటే భూ ఉపరితల భూభాగం కొన్ని పొరలతో నిర్మితమై ఉంటుంది. ఇలా భూమి పొరల్లో అన్నింటి కంటే పెద్దదైన 'భూపటలం' అంతర్భాగంలో అత్యధిక శక్తి వల్ల ఏర్పడే అలజడితో భూకంపాలు ఏర్పడతాయి. వీటినే 'పలక చలనాలు' అంటారు.

భూమి లోపల ఉన్న పలకల కదలికల వల్ల కొన్ని ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు రావడానికి అవకాశం ఉంటుంది. భూకంపాలు ఆ ప్రాంత ఉపరితలాన్ని బలహీన ప్రాంతంగా మారుస్తాయి. ఇలాంటి బలహీన ప్రాంతాలను 'సిస్మిక్ ప్రాంతాలు' లేదా 'భూకంప ప్రభావిత ప్రాంతాలు' అంటారు.

భూకంపాలు - కారణాలు

భూకంపాలు ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తాయో ముందుగా చెప్పడం కష్టం. అయితే కింది కారణాల వల్ల భూకంపాలను కొంతవరకు గుర్తించవచ్చు.

అవి: 1) అగ్నిపర్వతాల ఉద్భేదన ప్రక్రియ

     2) అంతర్భాగంలో జరిగే కేంద్రక విస్ఫోటనం

     3) గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడం

     4) భూ అంతర్భాగంలో పలక చలనాలు (ప్లేట్స్ ఆఫ్ టెక్టానిక్స్)


పై కారణాల వల్ల భూ అంతర్భాగంలో ఎక్కడైన అత్యధిక శక్తి విడుదలైనప్పుడు కంపనాలు ప్రారంభమైన మూల స్థానాన్ని 'భూకంపనాభి' అంటారు. నాభి నుంచి ఉపరితలానికి చేరే ప్రాంతాన్ని 'అధికేంద్రం' అంటారు. భూకంప నాభి నుంచి ప్రకంపనాలు పరావర్తనం చెంది వక్రీభవిస్తాయి.

భూకంప కదలికలు - తరంగాలు

భూ అంతర్భాగంలో కదలికలు/ పలక చలనాలు భూ ఉపరితలంపై తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. వీటినే 'సిస్మిక్ తరంగాలు' అంటారు. వీటిని భూకంప లేఖిని ద్వారా గుర్తిస్తారు.

ఇవి మూడు రకాలు:

ఎ) భూమిలో ప్రారంభమయ్యే మొదటి తరంగాలను 'p' లేదా ప్రాథమిక తరంగాలు అంటారు. ఇవి ఒత్తిడితో కూడిన శబ్ద తరంగాలు. అన్ని మాధ్యమాల ద్వారా ప్రయాణిస్తాయి.

బి) రెండో తరంగాలను 's' లేదా గౌణ తరంగాలు అంటారు. ఇవి నిటారుగా/ ఊర్థ్వ వ్యాప్తంగా, ఘన పదార్థాల్లో మాత్రమే ప్రయాణిస్తాయి. భూ కేంద్రం ద్వారా ప్రయాణించవు.

సి) 'p', 's' తరంగాల వల్ల వచ్చే ఉపరితల తరంగాలను 'L' లేదా దీర్ఘ తరంగాలు అంటారు. వీటి వల్ల భూ ఉపరితల నష్టం తీవ్రంగా ఉంటుంది.

భూకంపాలు - విస్తరణ

* భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి.

* ఇవి అగ్నిపర్వత ప్రాంతాల్లో, ముడుత పర్వతాలు ఉన్నచోట ఎక్కువగా సంభవిస్తాయి.

* ఇప్పటివరకు భూకంపాలను గుర్తించని ప్రాంతం ఆస్ట్రేలియా.

* భూకంపాలను ముందుగా పిల్లులు, పాములు, పశువులు గుర్తిస్తాయి.

ప్రపంచంలో భూకంపాలు 68% పసిఫిక్ మహాసముద్రం, 21% మధ్యదరా ప్రాంతాలు, 11% ఇతర ప్రాంతాల్లో సంభవిస్తాయి.
 

భూకంపాలు - పరికరాలు

* భూకంపాలను నమోదు చేసే పరికరాన్ని సిస్మోగ్రాఫ్/ భూకంప లేఖిని అంటారు. దీన్నే మెర్కెలి స్కేలు అని పిలుస్తారు. ఈ స్కేలును  ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ఉపయోగించవచ్చు.

* భూకంపం సంభవించిన ప్రదేశాన్ని, సమయాన్ని గుర్తించేదే భూకంప దర్శిని.

* భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేలుతో గుర్తిస్తారు. దీన్ని ట్రైనైట్రోటోల్యూన్ (TNT) పదార్థం ఆధారంగా లెక్కిస్తారు. రిక్టర్ స్కేలుపై 09 పాయింట్లు ఉంటాయి. అయితే రిక్టర్ స్కేలు కొలత 7.0 కంటే ఎక్కువ న‌మోదైన‌ప్పుడు తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది.

* భూకంప తీవ్రతను మరో పద్ధతి ద్వారా 'భ్రామక పరిమాణ' స్కేలును ఉపయోగించి కనుక్కోవచ్చు.

రిక్టర్ స్కేలు రీడింగ్ - భూకంప ప్రభావం

      రిక్టర్‌స్కేలు           -              భూకంప ప్రభావం

ఎ) 3.5 కంటే తక్కువ   -      మానవులు గుర్తించలేరు. రోజుకు 1000 సార్లు సంభవిస్తాయి.

బి) 3.5 - 5.4             -     కిటికీలు, కిచెన్ వస్తువులు కదులుతాయి. ఏడాదికి 49 వేల సార్లు వస్తాయి. విధ్వంసం ఉండదు.

 సి) 5.5 - 6.0            -     భవనాలు, నాణ్యతలేని నిర్మాణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఏడాదికి 6,200 సార్లు వస్తాయి.

డి) 6.1 - 6.9           -    100 కి.మీ. వైశాల్యంలో తీవ్రత ఉంటుంది.

ఇ) 7.0 - 7.9           -    పెద్ద భూకంపాలు, ఆస్తి, ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది.

ఎఫ్) 8.0 కంటే ఎక్కువ  -  తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. ఏడాదికి ఒకసారి వస్తుంది. అతి పెద్ద భూకంపాలు

 

ఇప్పటివరకు రిక్టర్‌స్కేలుపై 9.0 వచ్చిన భూకంపాలు

1) 1960 చిలీ  2) 1964 అలస్కా 3) 2004 ఇండోనేసియా, భారతదేశం

భూకంపాలు - ఫలితాలు

* భూకంపాలు నిర్ణీత వ్యవధిలో (ఒక నిమిషంలోపే) వస్తాయి.

* భూకంపాలకు పగలు, రాత్రి సమయాలుండవు. అన్ని వేళల్లో సంభవిస్తాయి. వీటివల్ల ప్రాణ నష్టం అధికంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య  ఉంటాయి.

* భూకంపాల వల్ల చమురు బావులు, గ్యాస్ పైపులు పగిలి అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. సునామీ కూడా సంభవిస్తుంది.

భారతదేశంలో భూకంపాలు

* భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా హిమాలయ పర్వత పాదాల వద్ద సంభవిస్తాయి. దేశంలో తరచుగా అసోం, గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూ, బిహార్‌లో వస్తున్నాయి.

ఉదా: 1897లో ఈశాన్య షిల్లాంగ్‌లో రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.

* జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ హైదరాబాద్ భూకంపాలను 5 జోన్లుగా నిర్ధారించింది. 2002లో జోన్ - I ను జోన్ - II లో విలీనం చేశారు. ప్రస్తుతం 4 జోన్లు ఉన్నాయి. వీటిలో జోన్ V అత్యంత తీవ్రమైన విధ్వంసం కలిగిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర జమ్మూ, బిహార్, ఉత్తరాఖండ్, పశ్చిమ గుజరాత్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులు జోన్ - V లో ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీ 4వ జోన్ పరిధిలో ఉంది

* భారత భౌగోళిక ప్రాదేశిక ప్రాంతంలో భూకంపాల వల్ల సుమారు 59% దుర్బలత్వం సంభవిస్తుంది.

ఉదా: 1) 2001, జనవరి 26 - గుజరాత్ భుజ్ భూకంపం

          2) 2005, అక్టోబరు 8 - జమ్మూ కశ్మీర్ ఉరి, తంగదర్ భూకంపం

          3) 2011, అక్టోబరు 5 - సిక్కిం భూకంపం

          4) 2015, ఏప్రిల్ 25 - కాఠ్‌మాండూ, బిహార్ భూకంపం

* ప్రాంతీయ భూకంప ప్రమాదాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయ ప్రాంతంలోని చిత్తూరు, కడప, నెల్లూరు, కృష్ణా, గోదావరి మైదానాలు 3వ జోన్‌లోనూ, హైదరాబాద్ నగరం 2వ జోన్‌లోను ఉన్నాయి.

భూకంప అధ్యయనాలు - పరిశోధన

* భూకంపాలను సిస్మాలజీ ద్వారా అధ్యయనం చేస్తారు.

* సమాన భూకంప ప్రాంతాలను కలిపే రేఖలను 'ఐసో సిస్మిల్స్' అంటారు.

* అంతర్జాతీయ భూకంప అధ్యయన కేంద్రం - లండన్.

* జాతీయ భూకంప పరిశోధన సమాచార కేంద్రం - న్యూదిల్లీ.

* ఇండో రష్యా భూకంప పరిశోధన కేంద్రం - న్యూదిల్లీ.

* జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ - హైదరాబాద్.

*  1898లో మొదటి భూకంప అధ్యయన కేంద్రాన్ని కోల్‌కతాలో ఏర్పాటు చేశారు.

*  రూర్కీ (ఉత్తర్ ప్రదేశ్)లోని కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ భూకంపం వచ్చినప్పుడు తట్టుకునే భవన నిర్మాణ ప్రణాళికలను రూపొందించింది.
 

భూపాతాలు

* వాలుగా ఉండే నిర్మాణ ప్రదేశాల్లో ప్రకృతి కారకాల వల్ల కొంత భాగం విడివడి బయటకు కొట్టుకుని పోయి క్రమక్షయం చెందడాన్ని 'భూపాతం' అంటారు. వీటినే కొండ చరియలు విరిగి పడటం లేదా పదార్థ నాశనం అంటారు. ఇటీవల 2018 ఆగస్టులో కేరళలో అధిక వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

* ఇవి ఎక్కువగా పర్వత వాలు ప్రదేశాలు, నదీ వక్రతల ప్రాంతాలు, అధిక వర్షం కురిసే కొండ ప్రాంతాల్లో సంభవిస్తాయి. అందుకే ఇలాంటి ప్రదేశాల్లో గృహ నిర్మాణం 'పిరమిడ్' ఆకారంలో ఉండటం వల్ల భూపాతాల నుంచి రక్షణ పొందవచ్చు.

* భారతదేశంలో వీటి వల్ల 15 శాతం దుర్బలత్వం ఏర్పడుతుంది. ఉత్తర భారతదేశంలోని హిమాలయాలు 7 పొరల అవక్షేప శిలలతో ఏర్పడి ఉన్న కారణంగా ప్రపంచ భూపాతాల్లో అధికంగా 30 శాతం ఇక్కడే సంభవిస్తున్నాయి.

ఉదా: 2013, జూన్ 16, 17 తేదీల్లో ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ప్రాంతంలో కొండచరియలు ఎక్కువగా విరిగిపడ్డాయి.

* దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండల్లో అధిక వర్షం, అడవులను నరికివేయడం వల్ల ఎక్కువగా భూపాతాలు ఏర్పడుతున్నాయి.

* భూపాతాలను 'లాండ్‌స్త్లెడ్ జోనేషన్ మ్యాపింగ్ పద్ధతి' ద్వారా ముందే గుర్తిస్తారు. 2004 నుంచి భూపాతాలకు నోడల్ ఏజెన్సీగా జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్‌కతా బాధ్యత వహిస్తుంది.

 

హిమపాతాలు:

* వీటినే మంచుకొండలు విరిగి పడటం అంటారు. ఇవి ఎక్కువగా అతి శీతల, ఎత్తయిన ప్రాంతాల్లో భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల పర్వతం పైభాగం నుంచి కిందికి జాలువారుతూ తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి.

* ఈ రకమైన మంచు లేదా హిమపాతాలు సాధారణంగా ద్రాస్, ఫెర్ పంజాల్, స్పిటి, లేహ్, బద్రీనాథ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

* హిమాలయ ప్రాదేశిక ప్రాంతంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లోని చంబా, కులు, స్పిటి, కిన్నార్; ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ, చమోలీ ప్రాంతాల్లో హిమపాతాలు సంభవిస్తాయి.

 

ఉరుములు, మెరుపులు:

మేఘాలు ప్రయాణించేటప్పుడు గాలిలోని కణాలతో ఘర్షణ వల్ల ఆవేశపూరితం అవుతాయి. ఒక ఆవేశపూరిత మేఘానికి దగ్గరగా మరో మేఘం వచ్చినప్పుడు అది రెండో మేఘంపై వ్యతిరేక ఆవేశాన్ని ప్రేరేపిస్తుంది. అందువల్ల ధన, రుణ ఆవేశాల మధ్య ఉత్సర్గం (discharge) జరిగి పెద్ద ఎత్తున వెలుగు చారికలు/ రేఖలతో పాటు ధ్వని ఉత్పత్తి అవుతుంది. వీటినే మెరుపులు, ఉరుములు అంటారు. ఈ ప్రక్రియను 'విద్యుత్ ఉత్సర్గం' అంటారు. ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ మేఘాల మధ్య జరుగుతుంది. ఇవి ఎక్కువగా వర్షం వచ్చే ముందు వస్తాయి. వీటిని 'లైట్నింగ్ డిటెక్టర్ల' ద్వారా 90 శాతం కచ్చితత్వంతో కనిపెట్టవచ్చు. దీని ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని పుణెలో ఉంది. లైట్నింగ్ డిటెక్టర్లను ఫిన్‌లాండ్ తయారు చేస్తుంది. పిడుగులు/ మెరుపుల నుంచి పెద్ద భవనాలను, కట్టడాలను రక్షించడానికి 'తటి ద్వాహకం' (Lightning) లను ఉపయోగిస్తారు.

                                      

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కరవులు - వరదలు

ప్రస్తుత ప్రపంచంలో జనాభా విస్ఫోటనం, వన నిర్మూలన, మానవ జీవ వ్యర్థాలు, అధిక పరిశ్రమల వ్యర్థాల వల్ల కార్బన్ల సంఖ్య అధికమై పర్యావరణం క్షీణించి అనేక ఖండాలు, దేశాల్లో భూతాపం పెరిగి కరవులు, వరదలు సంభవిస్తున్నాయి. ప్రత్యేకంగా పశ్చిమ పసిఫిక్‌లో ఎల్‌నినో, లానినో పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా అధిక కరవు కాటకాలు, వరదలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పోటీ పరీక్షల్లో విపత్తు నిర్వహణ - పర్యావరణ అంశాలపై ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు.

 

కరవు ఎలా వస్తుంది?

 కరవు అనేది వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం. ఒక ప్రాంతంలో కురవాల్సినంతగా వర్షం కురవకపోతే ఆ ప్రాంతం పొడిగా మారుతుంది. దాన్నే కరవు అంటారు. కరవును క్షామం, అనావృష్టి అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో అవి ఉన్న భౌగోళిక స్థితుల వల్ల తక్కువ వర్షపాతం పడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పుడు వాటిని 'కరవు పీడిత ప్రాంతాలు' అంటారు.

ఉదా: తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ప్రతి అయిదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరవు ఏర్పడే అవకాశం ఉంది.

* ఒక ప్రాంతంలో అధిక లేదా అల్ప వర్షపాతాన్ని (70 - 100 సంవత్సరాల) సగటు సాధారణ వర్షపాతంతో పోల్చి కింది విధంగా చెబుతారు.

a) అధిక: + సగటు వర్షపాతం కంటే 20% ఎక్కువ.

b) సాధారణ: + సగటు వర్షపాతం కంటే 19% ఎక్కువ నుంచి 19% తక్కువ.

c) అల్ప: - సగటు వర్షపాతం కంటే 20% నుంచి 59% తక్కువ.

d) అత్యల్ప: - సగటు వర్షపాతం కంటే 60% తక్కువ.

* జాతీయ వ్యవసాయ కమిషన్ (National Commission for Agriculture) కరవును మూడు రకాలుగా పేర్కొంది.

a) వాతావరణ కరవు: ఈ రకమైన కరవు సాధారణ అవపాతంలో (వర్షం) 10% కంటే ఎక్కువ అవపాతం లోపించడం.

b) వ్యవసాయ కరవు: మృత్తికల్లో తేమ లోపించడం, నేలలు సరిగా లేకపోవడం.

c) జల సంబంధ కరవు: భూగర్భ జలాలు ఇంకిపోవడం, మృత్తికలు అంతర్ భౌమ జలాలను గ్రహించకపోవడం.

 

కరవు సంభవించిన ప్రాంతాల్లో దాని ప్రభావం క్రమేణ తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.* 2016 డిసెంబరు జాతీయ కరవు నిర్వహణ కరదీపిక (Manual of Drought Management) లో కరవును నాలుగు రకాలుగా పేర్కొన్నారు.

a) 750 mm కంటే తక్కువ వర్షం - దీర్ఘకాలిక కరవు - 33%

b) 750 mm - 1125 mm మధ్య వర్షం - కరవు పీడిత ప్రాంతం - 35%

c) 1126 mm - 2000 mm అధిక వర్షం - సాధారణ కరవు - 24%

d) 2000 mm కంటే అధిక వర్షం - కరవులేని ప్రాంతం - 8% గా దేశభౌగోళిక వైశాల్యంలో కలిగి ఉంది.

* భారత వాతావరణ శాఖ (IMD) న్యూదిల్లీ కరవును 5 రకాలుగా వర్గీకరించింది. భారతదేశభౌగోళిక వైశాల్యంలో 68% కరవులు సంభవిస్తున్నాయి.
 


కరవు ప్రభావం:

* భూగర్భ జల నీటి మట్టం పడిపోవడం, తాగు నీటి కొరత.

* పంటల విస్తీర్ణం తగ్గడం, వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గిపోవడం.

* ఆహార ధాన్యాల, పశుగ్రాస కొరత; పశువులు చనిపోవడం.

* పోషకాహార లోపం ప్రత్యేకించి చిన్న పిల్లల్లో అతిసారం, కలరా లాంటి రోగాలు; ఆహార కొరత వల్ల కంటి చూపు దెబ్బతినడం, పని కోసం ప్రజలు వలస వెళ్లడం.

 

 

కరవు నివారణ, దాన్ని ఎదుర్కోవడం:

* కరవు ఒక్కసారిగా సంభవించే ప్రమాదం కాదు. అది నిదానంగా వస్తుంది. దీన్నే Creeping Disaster అంటారు.

* మన దేశంలో ఇప్పటివరకు 25 ప్రధాన కరవులు సంభవించాయి.

* బెంగాల్ కరవు వల్ల 1770లో మొత్తం జనాభాలో 33% ( 1/3వ వంతు) మంది మరణించారు.

* 1943 - 44లో మన దేశంలో 3 - 4 మిలియన్ల మంది ప్రజలు కరవు బారిన పడ్డారు.

* మన దేశంలో తరచూ రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరవులు ఏర్పడతాయి.

* కరవును నివారించడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక అధికారులు నీటి సంరక్షణ విధానాలపై అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు.

* వర్షపు నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించడం ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చు.

* కరవు ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం సమగ్ర వాటర్‌షెడ్ యాజమాన్య పథకాలను (IWMP) అమలు చేస్తుంది.
 

వరదలు (Floods)

ఒక ప్రాంతంలో కొంతకాలం పొడిగా ఉండి అకస్మాత్తుగా అధిక వర్షాలతో ఆ ప్రాంతం పొంగి పొర్లడాన్ని వరదలు అంటారు. అంటే కురవాల్సిన వర్షం కంటే అధిక వర్షం రావడాన్ని 'వరద బీభత్సం' లేదా 'అతివృష్టి' అంటారు.

సాధారణంగా వాతావరణ శాఖ (IMD) ప్రకారం భూ ఉపరితలంపై 12 అంగుళాల వర్షం కురిసినప్పుడు వరదగా ప్రకటిస్తారు.

 

ప్రధానంగా వరదలు అనేవి

a) అధిక వర్షం కురిసే మైదాన ప్రాంతాల్లో

b) పర్వత వాలు ప్రదేశాల్లో

c) నదీ వక్రత, తీర ప్రాంతాల్లో

d) పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.

* ప్రకృతి విపత్తుల్లో వరదలు అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి ఆయా దేశాలను అకస్మాత్తుగా ముంచేస్తాయి. ఇవి ఆరు అంగుళాల వరదలో మనిషిని ప్రమాదంలోకి నెట్టి వేస్తాయి.

* ప్రపంచంలో ఎక్కువగా వరదలు ఆసియా తూర్పు దేశాల్లో (80%) సంభవిస్తున్నాయి.

* వరదల నుంచి కాపాడటానికి ఆయా ప్రాంత ప్రజలను హెచ్చరించేందుకు 'నైలో మీటర్' సాధనాన్ని ఉపయోగిస్తారు.

* గ్రామీణ ప్రాంతంలోని మైదాన వరదల కంటే పట్టణ ప్రాంతంలోని వరదలు వైశాల్యంలో 6 రెట్లు, ఎత్తులో 8 రెట్లు ఎక్కువగా వస్తాయి. కారణం పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీ సరిగా లేకపోవడం, ఇరుకు రోడ్లు, భూమి నీటిని పీల్చుకోకపోవడం.
 


భారతదేశం - వరదలు

మన దేశంలో వరదలు ప్రధానంగా అతిపెద్ద నదులైన గంగా - సింధూ - బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థల్లో వస్తున్నాయి. వాటిలో ఆకస్మిక వరదలు ఎక్కువగా బ్రహ్మపుత్ర నది వల్ల సంభవిస్తున్నాయి.

A) ఉత్తర భారతదేశంలో 60% వరదలు గంగా - బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థల వల్ల సంభవిస్తున్నాయి.

గంగా నది  దాని ఉపనది ప్రాంతాలైన ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, బెంగాల్‌లో అత్యధిక భౌగోళిక వైశాల్యం వరద ప్రమాదంలో ఉంది. అలాగే గంగా - బ్రహ్మపుత్ర నదుల వల్ల తరచుగా అసోం, బెంగాల్, ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్‌లో వరదలు వస్తున్నాయి.

ఉదా: 2013 జూన్ 17 నాటి ఉత్తరాఖండ్ వరదల వల్ల సుమారు 5 వేల మంది మరణించారు.
2016 సెప్టెంబరు 3 - 6 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీలం నది వరద వల్ల 300 మంది మరణించారు.

B) ద్వీపకల్ప భారత్‌లో 40% వరదలు స్థానిక నదుల వల్ల వస్తున్నాయి. దక్షిణ భారత్‌లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎక్కువగా వరదలు వస్తాయి.

ఉదా: 2009లో తుంగభద్ర నది వల్ల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన వరదలు వచ్చాయి.
              మన దేశంలో సగటున ప్రతి సంవత్సరం 7.5 మిలియన్ హెక్టార్లలో వరదలు వస్తున్నట్లు జాతీయ వరద కమిషన్ పేర్కొంది. దేశ  భౌగోళిక వైశాల్యంలో 40 మిలియన్ హెక్టార్ల భూభాగంలో వరద ప్రమాదం ఉన్నట్లు గుర్తించింది.
              జాతీయ విపత్తు వరద అంచనా ప్రకారం భౌగోళిక ప్రాంతంలో 12% వరదలు వస్తున్నట్లు పేర్కొంది. 2016 UNISDR ప్రకారం ప్రతి సంవత్సరం 5% వరదలను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నట్లు, విపత్తులకు ఖర్చు చేసే వ్యయంలో కేవలం వరదలకే 33% వెచ్చిస్తున్నట్లు అంచనా వేసింది.


 

వరదలు - నివారణ చర్యలు

* 1937లో బ్రిటిష్‌వారు వరదలను నివారించడానికి ఒక సివిల్ సర్వెంట్ ద్వారా 'ఫ్లడ్ రిలీఫ్ కమిషన్‌'ను ఏర్పాటు చేసి నివారణ చర్యలు చేపట్టేవారు.

* 1954లో 'జాతీయ వరద నియంత్రణ మండలి'ని (National Flood Control Board - NFCB) ఏర్పాటు చేశారు.

* 1980లో జాతీయ వరద కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

* 2010లో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీని NDMA మార్గదర్శకాల ప్రకారం పట్టణ వరద విపత్తు నివారణ (UFDM)ను రూపొందించారు.

* వరదలు వస్తున్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) హెచ్చరిస్తుంది.

* ప్రతి సంవత్సరం వరదల వల్ల 8.1 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమి, 3.6 మిలియన్ హెక్టార్ల పంటలు నష్టపోతున్నాయి.

* వరదలను నివారించడానికి 2007-12 మధ్య 11వ ప్రణాళికలో రూ.8 వేల కోట్లను కేటాయించారు.

 

వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

a) మరిగించిన నీటిని తాగాలి.

b) డయేరియా ప్రబలినప్పుడు టీ - డికాషన్లు, గంజి, లేతకొబ్బరి నీరు తీసుకోవాలి.

c) వ్యాధులు వ్యాప్తి చెందకుండా చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ చల్లాలి.

d) నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్ (Halogen) బిళ్లలు ఉపయోగించాలి.

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వరద విపత్తులు

మానవ మనుగడకు ప్రకృతి ప్రాణాధారం.. అది వికృత రూపం దాలిస్తే మాత్రం ప్రమాదకర పరిణామం.. ఇలాంటి ప్రమాదకర విపత్తుల్లో వరదలు ఒకటి. వివిధ రీతుల్లో ముంచుకొచ్చే ఈ వరదల కారణంగా భూమండలంపై ఎన్నో ప్రాంతాల్లో అపార నష్టం వాటిల్లుతోంది. భారతదేశంలోనూ వీటి ప్రభావం తీవ్రంగానే ఉంది. తెలుగు రాష్ట్రాలకూ అప్పుడప్పుడూ ఈ ముప్పు తప్పడం లేదు. అసలు వరదలెలా సంభవిస్తాయి? ఏవిధంగా తీవ్ర నష్టాలకు కారణమవుతున్నాయి? తదితర అంశాలు తెలుసుకుందామా! 
ప్రకృతి సహజ వికృత రూపాల్లో వరదలు ఒకటి. ఏటా వరదల వల్ల ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, పర్యావరణ పరంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాణ నష్టం కూడా ఎక్కువే. సూర్యపుటం (సూర్యుడి నుంచి భూమి గ్రహించే ఉష్ణోగ్రత) వల్ల భూమి వేడెక్కి.. నేల మీద ఉన్న తేమ, జలాశయాల్లోని నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడతాయి. ఈ మేఘాలు అనుకూల పరిస్థితుల్లో వర్షం లేదా మంచు లేదా వడగళ్లుగా మారి నేలపై అవపాతం చెందుతాయి. ఈ ప్రక్రియ విపరీతంగా జరిగి అధిక వర్షాలు పడినప్పుడు సాధారణంగా వరదలు ఏర్పడతాయి. ఏదైనా ప్రాంతంలో సాధారణ ప్రవాహస్థాయిని మించి నీరు ప్రవహించినప్పుడు వరదలు సంభవిస్తాయి. వరద ఉద్ధృతి పెరగడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. అయితే ఆనకట్టలు తెగిపోవడం, భారీ వర్షాలు తదితర ప్రక్రియల వల్ల ఎలాంటి హెచ్చరిక లేకుండానే అకస్మాత్తుగా వరదలు వస్తాయి.
 

వరదలు.. రకాలు

 

1. నదీ వరదలు

నది తనలో ఉంచుకోగల నీటి పరిమాణాన్ని పారుదల సామర్థ్యం (ఛానెల్ కెపాసిటీ) అంటారు. సముద్రంలోకి పంపే నీరు కంటే ఎక్కువ నీరు నదిలో ఉన్నప్పడు ఆ నీరు పొంగి నది గట్టును దాటి వరదలు సంభవిస్తాయి. వీటిని 'నదీ వరదలు అంటారు.
 

 

2. మెరుపు వరదలు

కుండపోత వర్షాలు.. మంచు హఠాత్తుగా కరిగి నదిలో చేరడం.. ఆనకట్టలు విరిగిపోవడం లాంటివి జరిగినప్పుడు అకస్మాత్తుగా వచ్చే వరదలను 'మెరుపు వరదలు అంటారు.
 

 

3. తీర ప్రాంత వరదలు

సముద్రంలో ఉప్పెనలు, సునామీలు వచ్చినప్పుడు తీర ప్రాంతంలో ఏర్పడిన వరదలను 'తీర ప్రాంత వరదలు అంటారు.
 

 

4. నదీ ముఖద్వార వరదలు

సముద్రంలోని ఉప్పెన కారణంగా సముద్రంలోని అలలు నదీ నీటి ప్రవాహాన్ని వెనక్కి నెడతాయి. ఫలితంగా నదులు సముద్రంలో కలిసే ప్రదేశాల్లో ఏర్పడిన వరదలను 'నదీ ముఖద్వార వరదలు అంటారు.
 

 

5. పట్టణ వరదలు

సరైన మురుగునీటి వ్యవస్థ లేని నగరాలు, పట్టణాల్లో భారీ వర్షాలు సంభవించినప్పుడు ఏర్పడిన వరదలను 'పట్టణ వరదలు అంటారు.


 

6. ప్రమాద కారణ వరదలు

అధిక పరిమాణంలో నీటిని సరఫరా చేసే గొట్టాలు పగిలిపోయినప్పుడు చుట్టు పక్కల ప్రాంతాలు నీటిలో మునిగిపోతాయి. ఇలా ఏర్పడే వరదలే 'ప్రమాద కారణంగా ఏర్పడిన వరదలు.


 

కొత్త సవాళ్లు

ప్రాచీన కాలంలో మానవులు జలాశయాలకు దగ్గరలోనే నివసించేవారు. అయితే వరదల ప్రభావాన్ని తప్పించుకోవడానికి తగినంత దూరంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకునేవారు. నాగరకతలు అభివృద్ధి చెందిన కాలంలో మానవులు నదీలోయ ప్రాంతాల్లో జీవించేవారు. యూఫ్రటిస్, టైగ్రిస్ నదీ లోయల్లో మెసపటోమియా నాగరకత; నైలు నదీలోయలో ఈజిప్టు నాగరకత; సింధు నదీ ప్రాంతంలో సింధు నాగరకత; యాంగ్జీ, పసుపు నదీ ప్రాంతంలో చైనా నాగరకత ఇలాంటివే. 21వ శతాబ్దంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవుడి జీవిత కాలం పెరిగింది. అదే సమయంలో అనేక విపత్తుల వల్ల ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. అభివృద్ధి, జనాభా, నగరీకరణ తరచూ వరదలు రావడానికి కారణమవుతున్నాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ సహజ వనరులపై ఒత్తిడి అధికమవుతోంది. ఇది మానవ జీవితాలను అత్యంత అపాయంలోకి నెడుతోంది. కొన్ని చోట్ల సరైన అభివృద్ధి ప్రణాళిక లేకపోవడం వల్ల వరదలు ఏర్పడుతుండగా మరికొన్ని చోట్ల అతి అవస్థాపనా సౌకర్యాల కల్పన వల్ల వరదలు సంభవిస్తున్నాయి. మెక్సికోలోని మిసిసిపీ నదీ ప్రాంతం, బంగ్లాదేశ్‌లోని హోండూరస్ పర్వత ప్రాంతాల్లోని అభివృద్ధి చెందుతున్న (జనసాంద్రత ఎక్కువగా ఉన్న) ప్రాంతాల్లో ఈ వరదల బీభత్సం ఎక్కువగా ఉంది. ఈ విధంగా మానవుడి అభివృద్ధి కూడా కొత్త సవాళ్లను విసురుతోంది.
 

 

రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీ

వివిధ రకాల విపత్తుల వల్ల జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాలను లెక్కించడానికి, నమోదు చేయడానికి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సంస్థ పనిచేస్తోంది. వాతావరణ విపత్తుల్లో వరద విపత్తు వల్ల ప్రపంచంలో అత్యధిక ఆస్తి, ప్రాణ నష్టాలు, అత్యధిక ప్రాంతాల్లో సంభవిస్తున్నాయని ఈ సంస్థ పేర్కొంది.
 

భారతదేశంలో వరదల ప్రభావం

ప్రపంచ వ్యాప్తంగా వరదల కారణంగా మరణిస్తున్నవారిలో 20% భారతదేశంలోనే ఉన్నారు. ఇక్కడ వరద ముప్పునకు గురయ్యే ప్రదేశాలు కూడా ఎక్కువే. ఇక్కడ దాదాపు అన్ని నదీ పరీవాహక ప్రదేశాల్లోనూ వరదలు సంభవిస్తున్నాయి.
 

1. గంగానదీ పరీవాహక ప్రాంతం

ఉపనదుల వల్ల గంగానదీ పరీవాహక ప్రాంతంలో ఉత్తర భాగం తీవ్ర వరదలకు గురవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ్ బంగ రాష్ట్రాల్లోని ఉత్తర భాగాలు ప్రతి సంవత్సరం వరదల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో శారద, గాగ్రా నదులు వరదలకు కారణమవుతున్నాయి. బిహార్‌లో ఏటా కోసి, గండక్ నదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి. పశ్చిమ్ బంగలోని దామోదర్, అజయ్ నదుల చుట్టుపక్కల ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి.
 

2. బహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం

బ్రహ్మపుత్ర, బరాక్ నదులు.. వాటి ఉపనదుల కారణంగా అసోం ఎక్కువగా వరదలకు గురవుతోంది. జల్దాకా, తీస్తా, తోర్సా నదుల వల్ల పశ్చిమ్‌బంగ ఉత్తర ప్రాంతం నీటి ముంపునకు గురవుతోంది.
 

 

3. వాయవ్య నదీ పరీవాహక ప్రాంతం

వాయవ్య భారతదేశంలో జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్, గగ్గర్ నదుల పరీవాహక ప్రాంతాలు జలసమాధి అవుతున్నాయి.
 

 

4. మధ్య, దక్కన్ భారతదేశం

గోదావరి, కృష్ణా, కావేరి, పెన్నా, తుంగభద్ర, నర్మదా తదితర నదులు.. మధ్య, దక్కన్ భారతదేశంలో ఏటా వరదలకు కారణమవుతున్నాయి. ఒడిశాలో మహానది, వైతరణి, బ్రాహ్మణి నదీపరీవాహక ప్రాంతాలు కూడా వరదల బీభత్సాన్ని ఎదుర్కొంటున్నాయి.
 

 

5. ముప్పు ముంగిట తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులు ప్రధానంగా వరదలకు కారణమవుతున్నాయి. ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో నాగావళి, వంశధార నదులు; దక్షిణ ఆంధ్రాలో పెన్నా నదీ ప్రాంతం వరదలకు కారణమవుతున్నాయి. 2009లో కృష్ణానదికి వచ్చిన వరదల వల్ల మహబూబ్‌నగర్, కర్నూలు, నల్గొండ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు అపార నష్టం వాటిల్లింది. ముంబయి, కోల్‌కత లాంటి పెద్ద నగరాల్లోనూ మురుగునీటి వ్యవస్థ ప్రణాళికాయుతంగా లేదు. అధిక వర్షాలు వచ్చినప్పుడు నగరాలు నీట మునుగుతున్నాయి. 2005లో ముంబయిలో ఒకే రోజున 10 సెంటీ మీటర్ల వర్షం కారణంగా ఆ మహానగరాన్ని వరదలు ముంచెత్తాయి.

ముఖ్యాంశాలు

» జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం భారతదేశ భూభాగంలో 12.8 శాతం (40 మిలియన్ల హెక్టార్లు) వరదలకు గురవుతోంది. ఇందులో అధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 21.9 శాతం, బిహార్‌లో 12.7 శాతం భూభాగంలో వరదలు సంభవిస్తున్నాయి.

» వరదల కారణంగా 1953-2009 మధ్య భారతదేశం ఏడాదికి సగటున రూ.1,650 కోట్లను నష్టపోయింది. ప్రతి సంవత్సరం సగటున 1,464 మంది చనిపోతుండగా, 86,288 పశువులు మృత్యువాత పడుతున్నాయి.

» మన దేశంలో వరద ఉద్ధృతిని తెలుసుకోవడానికి శాటిలైట్, రిమోట్ సెన్సింగ్ పరికరాలు లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.

» మన దేశంలో వరదల హెచ్చరికలను కేంద్ర జలసంఘం లేదా సాగునీరు, వరద నియంత్రణ శాఖ లేదా జలవనరుల శాఖ జారీ చేస్తాయి.

» సహజ వైపరీత్యమైన వరదలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధంగా ఉండాలి. అప్పుడే అవి విపత్తులుగా మారకుండా ఉంటాయి. తద్వారా విలువైన సంపదను కాపాడుకోవచ్చు.
 

మాదిరి ప్రశ్నలు

 

1. బిహార్‌లో ఎక్కువగా ఏ నదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి?

ఎ) సోన్, శారద     బి) శారద, కోసి     సి) కోసి, గండక్    డి) కోసి, శారద

జ: కోసి, గండక్
 

 

2. వరదలు ఏ రకమైన విపత్తు?

ఎ) భౌగోళిక     బి) నీటి వాతావరణ సంబంధిత     సి) ప్రమాద     డి) రసాయన

జ: నీటి వాతావరణ సంబంధిత
 

 

3. వరదలు ఏ రకమైన వైపరీత్యం?

ఎ) సహజ విపత్తు     బి) మానవకారక విపత్తు     సి) సహజ, మానవకారక విపత్తు     డి) ఏదీకాదు

జ: సహజ, మానవకారక విపత్తు
 

 

4. వరదల విపత్తును కింది ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది?

ఎ) జలవనరుల మంత్రిత్వశాఖ     బి) నీటిపారుదల శాఖ     సి) గ్రామీణాభివృద్ధి శాఖ      డి) ఏదీకాదు

జ: జలవనరుల మంత్రిత్వశాఖ
 

 

5. 'జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది?

ఎ) ముంబయి     బి) కోల్‌కత     సి) దిల్లీ     డి) బెంగళూరు

జ: కోల్‌కత
 

 

6. అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఎక్కడ ఉంది?

ఎ) జెనీవా     బి) మనీలా    సి) వాషింగ్టన్     డి) టోక్యో

జ: జెనీవా
 

 

7. రెడ్‌క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ఎక్కడ ఉంది?

ఎ) వాషింగ్టన్    బి) మలేసియా    సి) లండన్     డి) జెనీవా

జ: జెనీవా
 


8. ఎత్తయిన ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోవడం ... ?

ఎ) వరద నివారణ చర్య     బి) భూకంప నివారణ చర్య     సి) కరవు నివారణ చర్య     డి) ఏదీకాదు

జ: వరద నివారణ చర్య

 

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 వాయు కాలుష్యం


శాస్త్రీయ విధానాలతో స్వచ్ఛమైన శ్వాస!

ప్రపంచదేశాలన్నీ భూతాపం, వాతావరణ మార్పులతో సతమతమవుతున్నాయి. ప్రజలకు మంచి ఆహారం, గాలి దొరకడం కష్టమవుతోంది. సగటు మనిషి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ అనర్థాలన్నింటికీ కారణం వాయుకాలుష్యం. భూమిపై జంతుజాలాన్ని, మొక్కలను, నీటిలోని జలచరాలను, చివరకు కట్టడాలను కూడా ఇది ప్రభావితం చేస్తోంది. వృక్షాల్లో కిరణజన్య సంయోగక్రియను సరిగా సాగనీయడం లేదు. ఇళ్లు, వాహనాల రంగులను మార్చేస్తోంది. సహజసిద్ధ ప్రకృతి రమణీయ ప్రాంతాల నాణ్యతను క్షీణింపజేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన శ్వాసను అందించాలంటే శాస్త్రీయ విధానాలను అవలంబించాలి. ఆ వివరాలతోపాటు వాయు కాలుష్య రకాలు, వాటి నివారణ చర్యలను పోటీపరీక్షల అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.
 

భూమి చుట్టూ ఆవరించిన వాయు పొరలను వాతావరణం అంటారు. ఇందులో నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్‌ డయాక్సైడ్, హీలియం, నియాన్‌ లాంటి అనేక వాయువులు సహజంగా పర్యావరణానికి సరిపడా రీతిలో ఉంటాయి. అయితే ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉన్న కొన్ని అవాంఛనీయ పదార్థాలు వాతావరణంలో పరిమితికి మించి చేరి వాతావరణ సంఘటనంలో మార్పులు తీసుకొస్తాయి. ఫలితంగా వీటి ద్వారా జీవజాతులు, వాటి పరిసరాలకు హాని కలిగే స్థితి ఏర్పడుతుంది. దీన్నే ‘వాయుకాలుష్యం’గా పేర్కొంటారు. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు విడుదలైన వాయువులు, అడవులు తగలబడిపోవడం వల్ల మార్స్‌ గ్యాస్, మీథేన్‌ లాంటి ప్రకృతిపరమైన కాలుష్యకాలు ఒక వైపు; వాహనాలు, పరిశ్రమలు, ఇంధనాలు మండించడం వంటి వాటితో విడుదలవుతున్న కార్బన్‌ డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్, పొగ లాంటి మానవ కారక కాలుష్యాలు మరోవైపు స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తున్నాయి. వాయు కాలుష్యాలను కణరూప, వాయు రూప కాలుష్యకాలుగా విభజించవచ్చు.


1) కణరూప కాలుష్యకాలు: గాలిలో తేలియాడుతూ, 10 మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసార్ధం ఉండే ఘన, ద్రవ రూప రేణువులను కణరూప కాలుష్యకాలు అంటారు. రేణువులు, ద్రవ బిందువులు వాయువులతో కలిసి ఏర్పడే మిశ్రమాన్ని ‘ఏరోసాల్స్‌’ అంటారు. ఇవి రెండు రకాలు.


ఎ) సూక్ష్మ కణరూప కాలుష్యకాలు: 2.5 మైక్రాన్ల లోపు పరిమాణంలో ఉండే కణరూప కాలుష్యకాలివి. వాహనాలు, పరిశ్రమల నుంచి; జీవపదార్థాలు మండించినప్పుడు, వ్యవసాయ సంబంధ] వ్యర్థాల నుంచి విడుదలవుతాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) సూచనల ప్రకారం గాలిలో PM 2.5 స్థాయికి మించితే జీవులకు చాలా హానికరం. ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తే ఉబ్బసం, దీర్ఘకాలిక శ్వాసనాళాల వాపు (బ్రాంకైటీస్‌), గుండె స్పందనలో వ్యత్యాసాలు లాంటి అనారోగ్యాలకు కారణమవుతాయి.


బి) స్థూల కణరూప కాలుష్యకాలు:   PM 10 గా పిలిచే 2.5 - 10 మైక్రాన్ల పరిమాణం ఉన్న కాలుష్యకాలు. ఇవి లోహ ఆక్సైడ్‌లు, సల్ఫర్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ లాంటి కాలుష్యాలు.


కణరూప కాలుష్యకాల దుష్ప్రభావాలు: వీటితో శ్వాసకోశ, గొంతు, కళ్ల సంబంధిత వ్యాధులు వస్తాయి.
 

1. సిలికోసిస్‌ వ్యాధి: స్టోన్‌క్రషింగ్‌ పరిశ్రమల నుంచి విడుదలైన సిలికా సంబంధ ఏరోసాల్స్‌ ఊపిరితిత్తుల్లో చేరి సిలికోసిస్‌ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి మొక్కలకు సోకితే పత్రాలు వడలిపోతాయి. పంట పెరుగుదల దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది.

2. బయాప్సినోసిస్‌ వ్యాధి (వైట్‌ లంగ్స్‌): నూలు వస్త్ర పరిశ్రమ నుంచి విడుదలయ్యే కాటన్, ధూళి వల్ల కార్మికులకు బయాప్సినోసిస్‌ అనే దగ్గు, శ్వాసకోశ సంబంధ వ్యాధి వస్తుంది.

3. ఆస్‌బెస్టాసిస్‌ వ్యాధి: ఆస్‌బెస్టాస్‌ తవ్వకాలు, ఆస్‌బెస్టాస్‌ సిమెంట్‌ రేకుల పరిశ్రమల నుంచి విడుదలైన ధూళి ఊపిరితిత్తుల వ్యాధికి కారణమవుతోంది. అందుకే ఈ ఖనిజం తవ్వకాలను ప్రపంచవ్యాప్తంగా అరికట్టారు.

4. బెరీలియోసిస్‌ వ్యాధి: బాక్సైట్‌ గనుల్లో పనిచేసే వారికి ఈ రకం ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది.

5. న్యూమోనియోసిస్‌ (బ్లాక్‌ లంగ్స్‌): బొగ్గు గనుల్లో పనిచేసే వారికి వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి.

2) వాయు రూప కాలుష్యకాలు:


1. కార్బన్‌ డయాక్సైడ్‌: గ్లోబల్‌ వార్మింగ్‌కు ప్రధాన కారణమైన వాయువు కార్బన్‌ డయాక్సైడ్‌. శిలాజ ఇంధనాలు పూర్తిగా దహనం కాకపోవడం వల్ల; విద్యుత్తు కేంద్రాలు, పరిశ్రమల నుంచి ఈ వాయువు విడుదలవుతుంది. కేవలం శిలాజ ఇంధనాల వినియోగం వల్లే ఏటా సుమారు 2.5 × 10*13 టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ వాతావరణంలో కలుస్తోంది.


2. కార్బన్‌ మోనాక్సైడ్‌: ఇది చాలా ప్రమాదకర విషవాయువు. శిలాజ ఇంధనాలు అసంపూర్తిగా దహనమవడం, వంట చెరకును మండించినప్పుడు, బొగ్గును కాల్చినప్పుడు ఎక్కువగా విడుదలవుతుంది. దీన్ని పీల్చడం వల్ల రక్తంలోని ‘హీమోగ్లోబిన్‌’ ఆక్సిజన్‌కు బదులు, ఈ వాయువుతో ఆక్సీకరణం చెంది ‘కార్బాక్సీ హీమోగ్లోబిన్‌’గా మారుతుంది. దీంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. దీన్నే ‘హైపోక్సియా’ అంటారు. ఇంకా మెదడు దెబ్బతినడం, కంటిచూపు మందగించడం, మతి భ్రమించడం లాంటి మస్తిష్క వ్యాధులకు దారితీస్తుంది.


3. సల్ఫర్‌డయాక్సైడ్‌: ప్రధానంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గును మండించినప్పుడు, మోటారు వాహనాల నుంచి విడుదలవుతుంది. దీనిస్థాయి వాతావరణంలో 1 PPM దాటినప్పుడు చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. దీనివల్ల ఆమ్లవర్షాలు కురుస్తాయి. ఫలితంగా చర్మక్యాన్సర్లు రావచ్చు. ఈ వ్యాధికారక గాలి మొక్కల పెరుగుదలను నిరోధిస్తుంది. చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయి.

ఉదా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర ఆయిల్‌ రిఫైనరీ నుంచి విడుదలైన సల్ఫర్‌డయాక్సైడ్‌ వల్ల తెల్లని తాజ్‌మహల్‌ క్రమేపీ పసుపు రంగులోకి మారుతోంది. మరిన్ని చారిత్రక కట్టడాల గోడలు పగుళ్లు బారుతున్నాయి. దీన్నే రాతి కుష్ఠువ్యాధి అంటారు.


4. నైట్రోజన్‌ ఆక్సైడ్‌: పెట్రోల్, డీజిల్‌తో నడిచే మోటారు వాహనాలు; విద్యుత్తు జనరేటర్లు, పంట పొలాల్లో వాడిన నత్రజని ఎరువుల వాడకం ద్వారా సాధారణంగా నైట్రోజన్‌ ఆక్సైడ్‌ గాలిలో కలుస్తుంది. దీనివల్ల గ్రీన్‌హౌస్‌ వాయువులు విడుదలై భూతాపానికి (గ్లోబల్‌ వార్మింగ్‌) కారణమవుతున్నాయి. కాలేయం, మూత్రపిండాలకు నష్టం కలగడం, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.


5. క్లోరోఫ్లోరో కార్బన్లు: మస్కిటో కాయిల్స్, ఫ్రిజ్‌లు, అత్తరు నుంచి ఇవి విడుదలై భూతాపాన్ని పెంచుతున్నాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతినడం; అధిక రక్తపోటు, ఆస్తమా లాంటి వ్యాధులకు కారణమవుతాయి. వీటితో పాటు భార లోహలైన మెర్క్యూరీ, లెడ్, కాడ్మియం లాంటివి వాతావరణంలోకి విడుదలై కేంద్ర నాడీవ్యవస్థ, మెదడు దెబ్బతింటాయి. కాడ్మియం నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది. మెర్క్యూరీ ప్రభావంతో జింజివాటా, మినిమాటా లాంటి వ్యాధులు వస్తాయి.


వాయు కాలుష్య నివారణ పద్ధతులు:

* వాహనాల్లో సీసం లేని పెట్రోల్‌ను వాడాలి.

* సంప్రదాయ ఇంధన వనరులకు బదులుగా బయోడీజిల్, బయోగ్యాస్, బయోమాస్‌ లాంటివి వినియోగించాలి.

* థర్మల్‌ విద్యుత్తు పరిశ్రమల నుంచి వెలువడే రేణు రూప పదార్థాలను తొలగించడానికి ఎలక్ట్రోస్టాటిక్‌ ప్రెసిపిటేటర్స్‌ అనే ఫిల్టర్‌లను తప్పనిసరిగా వాడాలి.

* పరిశ్రమల నుంచి వెలువడే కొన్ని సూక్ష్మ రేణువుల్లాంటి వాయుకాలుష్య కారకాలను తీసివేయడానికి స్క్రబ్బర్‌ వాడాలి. అంటే సున్నపురాయి తెట్టు లేదా సిమెంట్‌ బూడిద స్లర్రీ వినియోగించాలి.

* వాహనాల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి, వాయు నాణ్యత ప్రమాణాలను ప్రజలకు తెలియజేయడానికి భారత్‌/యూరో ఇంధన ప్రమాణాలను మరింత కఠినతరం చేయాలి. ఇప్పటివరకు యూరో - 6 ప్రమాణాలు అమల్లో ఉన్నాయి.

* ఇళ్లలో వంటచెరకుగా పిడకలు, కర్రలకు బదులుగా ఎల్‌పీజీ గ్యాస్‌ వాడకం పెంచాలి. శీతలీకరణ యంత్రాల్లో సి.ఎఫ్‌.సి. లకు బదులుగా ద్రవ నత్రజని వినియోగించాలి.

* దేశవ్యాప్తంగా రైల్వేట్రాకులను విద్యుదీకరించాలి.

* రవాణా రంగంలో చమురు ఆధారిత పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ కంప్రెసర్, నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) హైడ్రోజన్‌ ఇంధనం, బ్యాటరీ ఆపరేటెడ్‌ వెహికల్స్‌ వినియోగాన్ని పెంచాలి.

* వాయు ఉద్గారాల్లో 20 శాతం మేరకు ఉద్గారాలను భారీ స్థాయిలో చెట్ల పెంపకం ద్వారా కార్బన్‌ సింక్‌ చేయవచ్చని యూఎన్‌ఓ చెబుతోంది. దీనికోసం UNO - REDD (Reducing Emissions from deforestation and Degradation) అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. భారీ స్థాయి అటవీకరణ ద్వారా కార్బన్‌ డయాక్సైడ్‌ను తొలగించే ప్రక్రియను కార్బన్‌ సీక్వెస్ట్రేషన్‌ అంటారు.

* కాలుష్య బాధితులకు నష్టపరిహారం ఇవ్వడం అనే ‘పొల్యూటర్‌ పే’ సూత్రాన్ని పర్యావరణ చట్టం (1986)లో చేర్చాలని సుప్రీంకోర్టు 1996లో సూచించింది. ఈ సూచనను అన్ని మంత్రిత్వ శాఖల్లో అమలుచేయాలి.

* వాహనాల పొగ గొట్టాల్లో కెటాలిటిక్‌ కన్వర్టర్లను అమర్చాలి. వీటితోపాటు ఇంకా అనేక శాస్త్రీయ విధానాలు అమలు చేసి, ప్రజలను అప్రమత్తం చేస్తేనే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన శ్వాస అందుతుంది.

రచయిత: జల్లు సద్గుణరావు

 

 

Posted Date : 15-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జలకాలుష్యం

 హానికర జలాలు.. అనర్థాలకు మూలాలు!

 



 

జలుబు చేయడం, జ్వరం రావడం, శ్వాసకు ఇబ్బంది కలగడం, నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం, అతిసారం, జలాశయాల్లో వ్యర్థాల తెట్టు ఏర్పడటం, సముద్రపు అలలు ఎర్రగా మారడం, మొక్కలు పెరగకపోవడం, పంటల దిగుబడులు తగ్గిపోవడం తదితరాలన్నింటికీ కారణం కలుషిత జలాలు. మనిషి ఆరోగ్య సమస్యలకు, మరెన్నో జీవరాశుల ప్రాణాలకు నీరు ప్రమాదకరంగా పరిణమించడానికి మూలం కాలుష్యం.  ఈ నేపథ్యంలో జలకాలుష్యం రకాలు, దాని వల్ల కలిగే వ్యాధులు, నివారణకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలపై పోటీ పరీక్షార్థులకు తగిన అవగాహన ఉండాలి. 

భూమిని ఆవరించి ఉన్న జలావరణంలోని సముద్రాలు, మహాసముద్రాల్లో 97.25% ఉప్పునీరు, మిగిలిన 2.75% మంచినీరు ఉంది. ఆ మంచినీటిలోనూ 2% హిమం, హిమానీ నదాల్లోనే ఉంది. వాస్తవానికి జలావరణంలో సుమారు 1% మాత్రమే మనిషి అవసరాలకు భూగర్భం, భూఉపరితలం నుంచి మôచినీరుగా లభిస్తోంది. ఇదే సమస్త జీవరాశుల మనుగడకు ఆధారం. కానీ మనిషి అదుపు లేని అభివృద్ధి కార్యకలాపాల వల్ల అందుబాటులో ఉన్న ఆ కాస్త నీరు కూడా కలుషితమైపోతోంది.  

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ‘ఏవైనా అవాంఛనీయ పదార్థాలు నీటిలో కలిసి భౌతిక, రసాయనిక, జీవసంబంధ మార్పులకు కారణమై, ఆ నీటిని తాగడానికి, మొక్కలు ఆహ్లాదకరంగా పెరగడానికి వీలు లేకుండా చేయడాన్ని జలకాలుష్యం అంటారు’. భారతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్‌ఐ) ప్రకారం నాణ్యమైన తాగునీటికి రంగు, రుచి, వాసన అనే లక్షణాలు ఉండవు. నీటి గాఢత 6.0  9.0 pH మధ్యలో ఉంటుంది. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ 3 ppm (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) ఉండాలి.

 పరిశ్రమల నుంచి వెలువడే అనేక కర్బన, అకర్బన పదార్థాలు; విషతుల్య రసాయనాలు జలాలను కలుషితం చేస్తున్నాయి. గృహ సంబంధ వ్యర్థాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం వల్ల వచ్చిన వ్యవసాయ సంబంధ వ్యర్థాలు, అణు రియాక్టర్ల నుంచి వెలువడే రేడియోధార్మిక పదార్థాలు, సముద్రాలపై పేరుకుపోయిన చమురు తెట్టులాంటి అనేక వ్యర్థాలు నిత్యం స్వచ్ఛ జలాలు కాలుష్యం బారిన పడేందుకు కారణమవుతున్నాయి.

వివిధ అంచనాలు: జలకాలుష్యాన్ని రకరకాలుగా అంచనా వేస్తారు.

1) విలీన ఆక్సిజన్‌ (DO - డిజాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌): నీటిలో కరిగిన ఆక్సిజన్‌ను విలీన ఆక్సిజన్‌ అంటారు. ఇది నీటి నాణ్యతను నిర్ధారించేందుకు మంచి కొలమానం. జలాల్లో ఆక్సిజన్‌ పరిమాణం 5ppm కంటే ఎక్కువగా ఉన్నప్పుడే ఆ నీరు తాగడానికి, వ్యవసాయానికి, జలచరాల నివాసానికి ఉపయోగపడుతుంది. విలీన ఆక్సిజన్‌ 5ppm కంటే తగ్గితే ఆ జలాలు కాలుష్యం బారిన పడినట్లు పేర్కొంటారు.

2) జీవ ఆక్సిజన్‌ గిరాకీ (BOD - బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌): నిర్ణీత ఘనపరిమాణం ఉన్న నీటిలో కర్బన వ్యర్థ పదార్థాలను సూక్ష్మజీవులు జీవ, రసాయన ఆక్సీకరణ చర్య జరపడంలో వినియోగించుకునే ఆక్సిజన్‌ పరిమాణాన్ని జీవ ఆక్సిజన్‌ గిరాకీ అంటారు. నీటిలో ఆక్సిజన్‌ పరిమాణం సూక్ష్మజీవులు 5 లేదా 7 రోజులకు వినియోగించుకోగలిగిన అవధి ఆధారంగా జీవ ఆక్సిజన్‌ గిరాకీని కొలుస్తారు. 

3) రసాయన ఆక్సిజన్‌ గిరాకీ (COD- కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌): నిర్ణీత ఘనపరిమాణం ఉన్న నీటిలో కర్బన పదార్థాలను ఆక్సీకరించడానికి, బలమైన రసాయన కారకాలకు అవసరమైన ఆక్సిజన్‌కు సమానంగా పొటాషియం డై క్రోమేట్‌ ద్రావణం నుంచి పొందగలిగే ఆక్సిజన్‌ను రసాయన ఆక్సిజన్‌ గిరాకీ అంటారు. గంటల వ్యవధిలో ఎంత ఆక్సిజన్‌ అవసరం ఉంటుందనే అంశం ఆధారంగా రసాయన ఆక్సిజన్‌ డిమాండ్‌ను లెక్కిస్తారు.

4) యూట్రోఫికేషన్‌: జలాశయాల్లో పోషకాల పరిమాణం పెరిగినప్పుడు ఆకుపచ్చని శైవలాలు, అకశేరుకాలు గుంపుగా నీటిపై చేరి తెట్టు మాదిరిగా తేలియాడుతుంటాయి. దాంతో నీరు చిక్కగా, ఆకుపచ్చగా మారి చెడు వాసనను వెదజల్లుతుంది. ఈ స్థితిని యూట్రోఫికేషన్‌ అంటారు. దీన్నే శైవల మంజరులుగా వ్యవహరిస్తారు. ఈ చర్య వల్ల నీటిలోని ఆక్సిజన్‌ తగ్గి చేపలు, జలచరాలు చనిపోతాయి. పంట పొలాలు, రొయ్యలు, చేపల చెరువుల నుంచి వెలువడే ఫాస్ఫేట్స్, నైట్రేట్స్‌ లాంటి పోషకాల వల్ల; నివాస, పారిశ్రామిక ప్రాంతాల నుంచి విడుదలయ్యే మురుగు నీటి వల్ల యూట్రోఫికేషన్‌ కాలుష్యం ఏర్పడుతుంది. ఫలితంగా నీటి ద్వారా సంక్రమించే పోలియో, అతిసారం, టైఫాయిడ్, కామెర్ల లాంటి వ్యాధులు వస్తాయి. టెర్రర్‌ ఆఫ్‌ బెంగాల్‌గా పిలిచే నీటి ‘హైయాసింత్‌’ ప్రపంచంలోనే అత్యంత సమస్యాత్మకమైన నీటి కలుపు మొక్క. పోషకాలు ఎక్కువగా ఉన్న యూట్రోఫిక్‌ నీటి ఆవాసాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. తద్వారా నీటి కుంటల జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. 

5) ఓలిగోట్రోఫికేషన్‌: ఇది యూట్రోఫికేషన్‌కు వ్యతిరేకమైన స్థితి. కొత్తగా తవ్విన బావులు, చెరువులు, సరస్సుల్లో సాధారణంగా నీరు నిలకడగా ఉంటుంది. సరైన పోషక పదార్థాలు ఉండక యూట్రోఫికేషన్‌ కాలుష్యం జరగదు. నీరు స్వచ్ఛంగా ఉంటుంది. జలాశయాలకు ఉండే ఈ స్థితినే ఓలిగోట్రోఫికేషన్‌ అంటారు.

6) రెడ్‌ టైడ్స్‌: సముద్రాల్లోకి మానవ జనిత ఉద్గారాలు చేరినప్పుడు ఆ వ్యర్థాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో అక్కడి డైనోఫ్లాజెల్లేట్స్‌ అనే సూక్ష్మజీవులు కొన్ని రసాయనాలను నీటిలోకి విడుదల చేస్తాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో సముద్రపు నీరు ఎర్రగా మారుతుంది. దీని ప్రభావం వల్ల తీరం వద్ద అలలు ఎర్రగా కనిపిస్తాయి. వీటిని రెడ్‌ టైడ్స్‌ అంటారు. 

7) భారలోహ కాలుష్యం: పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు నీటిలో కలవడంతో జింక్, కాపర్, కాడ్మియం, మెర్క్యురీ, ఆర్సెనిక్, క్రోమియం, కోబాల్ట్‌ లాంటి భార లోహాల వల్ల మానవులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. 

8) చమురు కాలుష్యం: సముద్ర నీటిపై ఓడల నుంచి ఆయిల్‌ స్పిల్‌ జరిగి సముద్ర జలాలు చమురుతో కలుషితమవుతున్నాయి. వీటి నుంచి విడుదలయ్యే పారాఫిన్, మీథేన్, ఈథేన్‌ లాంటి వాయువులను పీల్చినప్పుడు శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. ఆక్సిజన్‌ నీటిలో కరగకుండా చమురు తెట్టు అడ్డుకుంటుంది. దాంతో ఆక్సిజన్‌ డిమాండ్‌ పెరిగి సముద్ర జలచరాలకు ప్రాణహాని కలుగుతుంది. సముద్ర జలాల్లో పేరుకుపోయిన చమురును సూడోమోనాస్‌ బ్యాక్టీరియా ద్వారా విక్షాళనం చెందించవచ్చు. భారత సంతతికి చెందిన ఆనంద చక్రవర్తి అనే అమెరికన్‌ శాస్త్రవేత్త సముద్ర జలాల్లోని చమురు కాలుష్యాన్ని తొలగించే ‘ఆయిల్‌ ఈటింగ్‌ బ్యాక్టీరియా’ అనే సూపర్‌ బగ్‌ను రూపొందించారు.


వ్యాధులు: కొన్ని రకాల భార లోహాలు కరిగిన నీటిని తాగడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి. 

పాదరసం: సాధారణంగా నీటిలో 0.001 మి.గ్రా./లీటర్‌ పాదరసం కరిగి ఉండటం వల్ల ఎలాంటి హాని ఉండదు. కానీ ఆ మోతాదుకు మించి పాదరసం నీటిలో కలిస్తే పెదవులు, చేతులు స్పర్శజ్ఞానాన్ని కోల్పోవడం, వినికిడి సామర్థ్యం, కంటి చూపు తగ్గిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. జపాన్‌లోని మినమాటా గ్రామంలో ఇలాంటి వ్యాధి లక్షణాలు గమనించడం వల్లే దీన్ని మినమాటా వ్యాధి అంటారు. కాగితం, రంగుల పరిశ్రమల నుంచి వచ్చే మెర్క్యురీ జలాల్లో కలిసి డై మిథైల్‌ మెర్క్యురీగా నీటిలో కరుగుతుంది. ఈ నీటిలోని చేపలను ఆహారంగా తీసుకునే మనిషిలోకి ఇది ప్రవేశిస్తుంది.

కాడ్మియం: ఇది సాధారణంగా జలాల్లో 0.01 మి.గ్రా./లీటర్‌ కరిగి ఉంటే ప్రమాదం లేదు. అంతకుమించి ఉంటే మూత్రపిండాలు, కేంద్రీయ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఎముకలు విరూపణ చెందడం, రక్తహీనత, స్త్రీలలో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. జింక్‌ తయారు చేసే పరిశ్రమల నుంచి కాడ్మియం విడుదలవడం వల్ల జపాన్‌లోని ఇటాయ్‌ ప్రాంతంలో దీని ప్రభావాన్ని మొదట కనుక్కున్నారు. అందుకే ఆ వ్యాధిని ఇటాయ్‌ ఇటాయ్‌ అంటారు.

నైట్రేట్స్‌: తాగునీటిలో సాధారణంగా 4.5 మి.గ్రా/లీటర్‌ పరిమాణంలో నైట్రేట్స్‌ ఉంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉంటే అవి రక్తంలోని హిమోగ్లోబిన్‌తో కలిసి మెటా హిమోగ్లోబినియాగా మారి శరీర కణజాలాలకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోతుంది. దాంతో దుష్ప్రభావాలు కలుగుతాయి. శిశువులు నీలి రంగులో జన్మించడం, క్యాన్సర్‌ వ్యాధులు ప్రబలడం లాంటి పరిణామాలు జరుగుతాయి. తాగునీటిలో నైట్రేట్‌ మలినాలు ఎక్కువగా చేరడానికి కారణం పరిమితికి మించి ఎరువులను వినియోగించడం, భూగర్భజలంలో నైట్రేట్స్‌ గాఢత పెరిగిపోవడమే.

కాపర్‌: తాగేనీటిలో కాపర్‌ అధికంగా ఉంటే అధిక రక్తపోటు, అప్పుడప్పుడు జ్వరం రావచ్చు.

క్రోమియం: తాగునీటిలో ఎక్కువ పరిమాణంలో క్రోమియం ఉంటే క్యాన్సర్, కేంద్రనాడీ మండలానికి సంబంధించిన రుగ్మతలు, మూత్రపిండాల వాపు లాంటివి సంభవిస్తాయి.

కోబాల్ట్‌: పరిమితికి మించి కోబాల్ట్‌ నీటిలో కరిగి ఉంటే ఆ నీటిని స్వీకరించడం వల్ల పక్షవాతం, అతిసారం, రక్తపోటు తగ్గడం,  ఎముకల బలహీనత లాంటివి వస్తాయి.


జల కాలుష్య నివారణ చర్యలు:

ట్రిక్లింగ్‌ ఫిల్టర్‌: ఇదో రకమైన మురుగు నీటి శుద్ధి వ్యవస్థ. చిన్న గులకరాళ్లతో తయారుచేసిన బెడ్‌ లాంటి నిర్మాణం. దీనిపైకి మురుగు నీటిని ప్రవేశపెట్టినప్పుడు నీరు వడపోతకు గురై పరిశుభ్రమైన నీరుగా మారుతుంది.

రొటేటింగ్‌ బయలాజికల్‌ కాంటాక్టర్‌: వలయాకార ప్లాస్టిక్‌ ఫలకలు ఒకదాని పక్కన మరొకటి అమరి ఉంటాయి. వీటిపై మురుగు నీరు ప్రవేశించినప్పుడు సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తాయి.

తిరోగమన ద్రవాభిసరణ: ఇది నీటిలో కరిగి ఉన్న అవాంఛనీయ లవణాలను తొలగించే ప్రక్రియ. ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకు అయాన్లు, అణువులను రవాణా చేసి నీటిని శుద్ధి చేసే కార్యక్రమం.

అడ్వాన్స్‌డ్‌ సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌: ఇది యంత్రాల ద్వారా జరిగే నీటి శుద్ధి కార్యక్రమం. ఇదొక ఆధునిక మురుగు శుద్ధి ప్రక్రియ.


నీటి కాలుష్య నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు: 

* జల కాలుష్య నియంత్రణ చట్టం - 1974 

* గంగా కార్యాచరణ ప్రణాళిక - 1985 

* జాతీయ నదీ సంరక్షణ కార్యక్రమం - 1995 

* జాతీయ గంగానది పరీవాహక అథారిటీ - 2009 

* నమామి గంగే - 2015 - 22

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 23-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

నేల కాలుష్యం

 
భూసారం ఆగమాగం!

 

 


నేలలు సారాన్ని కోల్పోతున్నాయి. పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఆహార కొరత ఏర్పడుతోంది. అందరి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. కారణం నేల కాలుష్యం. పరిశ్రమల విషపూరిత వ్యర్థాలను భూమిలోకి వదిలేస్తున్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. రేడియో ధార్మికాలను నేలలోకి నెట్టేస్తున్నారు. దీంతో మట్టి సహజత్వాన్ని కోల్పోయి హానికరంగా మారుతోంది. భూసారం ఆగమాగమైపోతోంది. అది అన్ని రకాల విపరిణామాలకు దారితీస్తోంది. పర్యావరణం అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఈ అంశాలను, నివారణ మార్గాలను తెలుసుకోవాలి. పలు రకాల పోటీ పరీక్షల్లో వాటిపై ప్రశ్నలు అడుగుతున్నారు. 

సహజ వనరుల్లో మృత్తికలు/నేలలు అత్యంత ప్రధానమైనవి. భూమిని ఆవరించి ఉన్న శిలావరణంపై జీవ సంబంధమైన పదార్థాలు, అనేక లవణాలు, రసాయనాలతో కూడిన వదులుగా ఉండే పొరను నేలగా పిలుస్తారు. నేలలో ఉన్న భౌతిక, రసాయనిక ధర్మాల ఆధారంగా ఎర్రనేలలు, నల్లనేలలు, ఒండ్రు నేలలు, పర్వతాలపై ఉండే లేటరైట్‌ నేలలు లాంటి ఎన్నో రకాలు భూగోళాన్ని ఆవరించి ఉంటాయి. మనిషికి ఆహారాన్ని ఇచ్చే పంటలు, అవసరాలు తీర్చే వృక్షాలు ఈ నేలల ఆధారంగానే వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. రాతిపై ఒక సెంటీమీటరు మందం ఉన్న మృత్తిక ఏర్పడాలంటే కనీసం 400 ఏళ్లు పడుతుందని ఒక అంచనా. అంత ప్రాముఖ్యం ఉన్న మృత్తికల్లో వివిధ రకాల వ్యర్థ పదార్థాలు కలవడంతో సహజ లక్షణాలను కోల్పోయి నేల కాలుష్యం లేదా భూకాలుష్యం జరుగుతోంది.


వ్యవసాయ, పారిశ్రామిక, గృహ సంబంధ వ్యర్థాలు; మురుగు నీరు, భార లోహాలు, ఘనపదార్థాలు నేలలో కలవడం వల్ల ఏర్పడే దాన్ని ధనాత్మక నేల కాలుష్యంగా పిలుస్తారు. అడవుల నరికివేత, పశువులు అతిగా మేత మేయడం, గనుల తవ్వకాలు, బ్లాస్టింగ్, మట్టి తవ్వకాలు, అశాస్త్రీయ వ్యవసాయ విధానాల కారణంగా నేల సహజ నిర్మాణం దెబ్బతినడం కూడా నేల కాలుష్యమే. దీన్ని రుణాత్మక నేల కాలుష్యం అంటారు.


నేల కాలుష్య కారకాలు


పారిశ్రామిక వ్యర్థాలు: ఆధునిక మానవుడి అభివృద్ధికి పరిశ్రమలే సోపానాలు. అయితే పరిశ్రమల నుంచి వెలువడే ఆమ్లాలు, క్షారాలు, విష సేంద్రియ పదార్థాలు, పాదరసం, సీసం, రాగి, జింక్, కాడ్మియం, సైనైడ్లు, థియోసైనేట్స్‌ లాంటి అనేక రసాయన పదార్థాలు నేలపై వ్యర్థాలుగా పడేయడం నేల కాలుష్యానికి ప్రధాన కారణం.


ఎరువులు, క్రిమిసంహారక మందులు: ప్రస్తుత వ్యవసాయ రంగంలో అధిక పంట దిగుబడికి ఎరువులు, పురుగుమందులు, కలుపు మొక్కల నివారిణులు, శిలీంధ్రనాశనుల వినియోగం తప్పనిసరిగా మారింది. వీటి అవశేషాలు నేలలో కలిసి నేల కలుషితంగా మారడమే కాకుండా భూగర్భ జలాల్లో చేరి మానవ మనుగడను దెబ్బతీస్తున్నాయి.


మానవ వినియోగ వ్యర్థాలు: గృహావసరాలకు లేదా వాణిజ్యపరంగా వినియోగించగా మిగిలిన వ్యర్థాలను నేలపై చెత్తకుప్పల దగ్గర పారవేయడంతో నేల కాలుష్యం పెరిగిపోతోంది.


ఉదా: పాలిథిన్‌ కవర్లు, ప్లాస్టిక్‌ బాటిళ్లు, గ్లాసులు, పేపరు వేస్ట్‌లు, గృహ నిర్మాణంలో మిగిలే కాంక్రీట్, మిగిలిన ఆహార పదార్థాలు లాంటివన్నీ కాలుష్య కారకాలే.


రేడియోధార్మిక వ్యర్థాలు: అణు విద్యుత్తు కేంద్రాలు, అణు రియాక్టర్ల నుంచి వెలువడిన యురేనియం, థోరియం లాంటి రేడియోధార్మిక పదార్థాలు, ద్రావణాలు నేలలో కలిసి భూమిని కలుషితం చేస్తుంటాయి.


జీవన సంబంధ కారకాలు: మానవులు, జంతువులు, పక్షుల మలమూత్రాలు నేలను చేరతాయి. ఈ విసర్జకాల్లో రోగకారక సూక్ష్మజీవులు ఉండటం వల్ల నేల కలుషితమవుతుంది. ఈ విధంగా నేల స్వభావాన్ని మార్చి మొక్కల వేర్లపై దాడి జరిగి పంటల సామర్థ్యం తగ్గుతుంది.


గనుల తవ్వకాలతో కాలుష్యం: ఇనుము, బొగ్గు లాంటి గనుల తవ్వకాలు జరిగినప్పుడు వెలువడే భారలోహ, కర్బన, ధూళి కణాలు నేల మీద పోగుపడి నేల కాలుష్యానికి దారిదీస్తాయి. ఇవి నేల గాఢతను మారుస్తాయి. దానివల్ల గనుల ప్రాంతాల్లో వ్యవసాయ ఫలసాయం తగ్గిపోతుంది.
 

వ్యర్థ పదార్థం నేలలో విచ్ఛిన్నానికి పట్టే కాలం (సుమారుగా)
కాగితం నెల
ఊలు ఒక సంవత్సరం
చెక్క 10-15 సంవత్సరాలు
తోలు వస్తువులు 50 సంవత్సరాలు
అల్యూమినియం వస్తువులు 100 సంవత్సరాలు
డిస్పోజబుల్‌ డైపర్స్‌ 500 సంవత్సరాలు
పాలిథీన్‌ క్యారీ బ్యాగులు లక్ష సంవత్సరాలు


నేల కాలుష్య ప్రభావాలు:


వ్యవసాయంపై: నేల కాలుష్యానికి గురైతే మొదట వ్యవసాయంపై ప్రభావం చూపుతుంది. వివిధ కాలుష్యాలతో నేలల సారం తగ్గిపోతుంది. తద్వారా పంట దిగుబడి తగ్గి ప్రజలకు ఆహార కొరత ఏర్పడుతుంది. నేలలో నైట్రోజన్‌ సార్ధకత, లవణాలు తగ్గుతాయి. నేల క్రమక్షయం పెరిగి చెరువులు, జలాశయాల్లో పూడిక చేరుతుంది.


ఆరోగ్యంపై: ప్రమాదకరమైన రసాయనాలు భూగర్భ జలాల్లో కలిసిపోతాయి. కొన్ని భార లోహాలు మొక్కల ద్వారా మానవ, జంతు శరీరాల్లోకి బయోమాగ్నిఫికేషన్‌ జరిగి వ్యాధులు వస్తాయి. వ్యర్థాలు కుళ్లి హానికర వాయువులు విడుదలై వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. రేడియోధార్మిక పదార్థాలు విడుదల చేసే కిరణాలు జీవుల మనుగడకు ప్రమాదకరంగా మారతాయి.


పర్యావరణంపై: నేల కాలుష్యం వల్ల వృక్ష సంపద తగ్గి పర్యావరణ అసమతౌల్యత ఏర్పడుతుంది. జీవజాతుల మధ్య సమగ్రత దెబ్బతింటుంది. ఆహార గొలుసులు విచ్ఛిన్నమవుతాయి.

నగరాలపై ప్రభావం: నగరాల్లోని వ్యర్థాల కారణంగా మురుగు నీటిపారుదల పెద్ద సమస్యగా మారుతుంది. జనాభా పెరగడం వల్ల  నగరపాలక సంస్థలకు వ్యర్థాల నిర్వహణ పెనుభారంగా మారుతుంది. నగరాల్లో మురికివాడలు పెరిగిపోతున్నాయి.

ఉదా: మన దేశంలో అతిపెద్ద మురికివాడ సెంట్రల్‌ ముంబయిలోని ధారావి ప్రాంతం. ఇది ప్రపంచంలోని పెద్ద మురికి వాడల్లో ఒకటి.


నివారణ మార్గాలు


* పురుగుమందుల వాడకాన్ని తగ్గించి వీటికి ప్రత్యామ్నాయంగా జీవామృతం, బీజామృతం లాంటి పర్యావరణ హితమైన క్రిమిసంహారిణులు వాడాలి.


రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సహజ ఎరువులు, వర్మీకంపోస్టు లాంటి ఎరువులు వినియోగించాలి.


* కలుపు మొక్కల నివారణ ఔషధాలను నియంత్రించి అవి మొక్కలు పెరగకుండా యాజమాన్య పద్ధతుల్లో మార్పు తీసుకురావాలి.


* పారిశ్రామిక విసర్జితాలను భూమిలోకి విడుదల చేయకుండా వాటిని శుద్ధి చేసి పునర్వినియోగంలోకి తీసుకురావాలి.


పారిశ్రామిక ప్రాంతాల్లో బఫర్‌ జోన్‌గా వృక్షాలను విరివిగా పెంచాలి.


పారిశ్రామిక వ్యర్థాల నుంచి రసాయనాలను తొలగించి భూమిలో చిన్న గుంతల్లో విడిచిపెట్టాలి.


గృహాల నుంచి వెలువడిన బయోగ్యాస్, బయోమాస్‌ లాంటి వ్యర్థాలను విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించాలి.


* వినియోగ వ్యర్థాలను రీసైక్లింగ్‌ విధానంలో వినియోగించుకోవడం వల్ల నేలపై కాలుష్యాలను సమర్థంగా తగ్గించడం సాధ్యమవుతుంది.


* సూపర్‌ థర్మల్‌ కేంద్రాల నుంచి వెలువడిన బూడిదను (ఫ్లైయాష్‌) ఇటుకల నిర్మాణంలో వినియోగించవచ్చు.


* న్యూక్లియర్‌ రియాక్టర్ల నుంచి విడుదలైన రేడియోధార్మిక పదార్థాలను కాలుష్య రహిత పదార్థాలుగా చేయడంలో తగిన చర్యలు చేపట్టాలి.


మాదిరి ప్రశ్నలు

1. కాడ్మియం కాలుష్యం ఏ వ్యాధికి కారణం అవుతుంది?

 1) బ్లాక్‌ ఫుట్‌           2) మినమాటా 

3) మలేరియా           4) ఇటాయి-ఇటాయి 


2. బెంగాల్‌ మైదాన ప్రాంతాలు ప్రధానంగా ఏ భూకాలుష్యానికి గురవు తున్నాయి?

 1) కాడ్మియం    2) క్రోమియం    3) కాపర్‌    4) సీసం


3. భూకాలుష్యాల్లో సుదీర్ఘకాలం నిర్వీర్యం కాని వ్యర్థ పదార్థం ఏది?

1) ఖనిజోద్గ్రహణ వల్ల వెలువడే వ్యర్థాలు    2) అణుధార్మిక వ్యర్థం

 3) బయోమెడికల్‌ వ్యర్థాలు        4) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం


4. ఇటీవల జపాన్‌ ప్రభుత్వం ఏ మహా సముద్రంలోకి ఫుకుషిమా దైచి అనే అణు రియాక్టర్‌ నుంచి అణుధార్మిక వ్యర్థ జలాలను విడుదల చేస్తోంది?

1) పసిఫిక్‌ మహాసముద్రం        2) హిందూ మహాసముద్రం

3) అట్లాంటిక్‌ మహాసముద్రం        4) ఆర్కిటిక్‌ మహాసముద్రం


5. ఏ వ్యర్థాలు భూమిలో విచ్ఛిన్నం కావడానికి సుదీర్ఘకాలం పడుతుంది?

 1) అల్యూమినియం వస్తువులు    2) ఊలు వస్తువులు

  3) తోలు వస్తువులు        4) ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు


6. అశాస్త్రీయ వ్యవసాయ విధానాల వల్ల నేల సహజ నిర్మాణం దెబ్బతినడాన్ని ఏవిధంగా భావిస్తారు?

 1) రుణాత్మక నేల కాలుష్యం        2) ధనాత్మక నేలకాలుష్యం

 3) న్యూట్రల్‌ నేల కాలుష్యం        4) అసాధారణ నేలకాలుష్యం


7. కిందివాటిలో ప్రాథమిక కాలుష్యకాలు ఏవి?

  1) హైడ్రో కార్బన్లు  2) నైట్రేట్స్‌ 3) సల్ఫేట్స్‌  4) పైవన్నీ


8. హరిత విప్లవం సందర్భంలో పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అధికంగా రసాయన ఎరువులు వినియోగించడం వల్ల నేల కాలుష్యానికి గురై ఏర్పడిన నిస్సారమైన నేలలను ఏమని పిలుస్తారు?

1) రే నేలలు   2) కల్లార్‌ నేలలు   

3) ఉషర్‌ నేలలు   4) రకర్‌ నేలలు


9. నేల కాలుష్యం వల్ల ఏర్పడిన ప్రతిఫల కాలుష్యం ఏది?

1) వాయు కాలుష్యం  2) భూగర్భ జలాల కాలుష్యం

3) ఓజోన్‌ కాలుష్యం  4) జీవ కాలుష్యం


10. పరిశ్రమల నుంచి విడుదలయ్యే కణయుత కాలుష్యాన్ని తొలగించడానికి ఏ సాంకేతిక పద్ధతి సరైంది?

1) ఎలక్ట్రో డయాలసిస్‌   2) వెట్‌ స్క్రబ్బర్స్‌

3) ఫ్యాబ్రిక్‌ ఫిల్టర్స్‌  4) ఎలక్ట్రోస్టాటిక్‌ ప్రెసిపిటేటర్స్‌


సమాధానాలు

1-4; 2-1; 3-2; 4-1; 5-4; 6-1; 7-4; 8-1; 9-2; 10-4. 


 


రచయిత: జల్లు సద్గుణ
 

Posted Date : 01-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఉష్ణ కాలుష్యం

వేడి మోతాదు మించితే ముప్పు!


 

అప్పుడప్పుడు పరిశ్రమల సమీపంలోని జలాశయాల్లో జలచరాలు చనిపోయి నీటిపై తేలియాడటం కనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో నేల గాఢతలో మార్పులు వచ్చి, సారం తగ్గిపోయి, ఉత్పత్తి దెబ్బతింటుంది. వీటికి కారణం పరిశ్రమలు విచక్షణరహితంగా వేడి నీటిని జలాశయాల్లో వదలడం, నదులు, చెరువుల ఒడ్డున ఉన్న చెట్లను మనుషులు విచ్చలవిడిగా నరికి వేయడం. ఫలితంగా వాటిల్లోని నీళ్లు వేడెక్కి, ఉష్ణ కాలుష్యం ఏర్పడి, రకరకాల అనర్థాలకు కారణమవుతున్నాయి. జనం వ్యాధులకు గురవుతున్నారు. ఇతర జీవులు నశించిపోయి పర్యావరణానికి హాని కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఉష్ణకాలుష్యం కారకాలు, ప్రభావాలు, నివారణ చర్యల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

మనిషి కార్యకలాపాల వల్ల జలచరాలు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగే విధంగా నీటి ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు సంభవిస్తున్నాయి. ఈ రకమైన కాలుష్యాన్ని థర్మల్‌/ఉష్ణ కాలుష్యంగా భావిస్తారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా థర్మల్‌ కాలుష్యం పెరుగుతోందని, ఫలితంగా జలచరాలకు తీరని నష్టం జరుగుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. థర్మల్, అణు విద్యుత్తు కేంద్రాలు, పరిశ్రమల నుంచి వెలువడే ఉష్ణం చాలా తక్కువగా యంత్రాలు పనిచేయడానికి ఉపయోగపడితే, ఎక్కువ భాగం వ్యర్థ ఉష్ణంగా బయటకు వెలువడుతోంది. ఇది  పరిసరాలను వేడెక్కిస్తోంది. ఈ వ్యర్థాలను చల్లబరచడానికి సమీపంలోని నదులు/జలాశయాల నీటిని ఉపయోగిస్తారు. ఆ విధంగా విడుదలైన ఉష్ణ జలాలను తిరిగి నదులు/జలాశయాల్లో వదులుతారు. అప్పుడు జలాశయాల నీటి ఉష్ణోగ్రత సుమారు 6 నుంచి 10 డిగ్రీల వరకు పెరుగుతోంది. ఫలితంగా నీటిలోని ఆక్సిజన్‌ పరిమాణం తగ్గి జలచరాల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. మరొకవైపు నదులు, జలాశయాల వెంట విస్తరించి ఉన్న చెట్లను విచక్షణారహితంగా నరికివేస్తున్నారు. దీంతో సాధారణ జలాల్లో ఉష్ణోగ్రత పెరిగి మోతాదుకు మించి వేడెక్కుతున్నాయి. చివరకు జలచరాల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. కొన్ని పరిశ్రమల నుంచి అతి చల్లని నీరు కూడా విడుదలై నీళ్లలోని ప్రాణులకు హానికరంగా మారుతోంది. ఈ విధంగా ఇతర కాలుష్యాలకు తీసిపోని విధంగా థర్మల్‌ కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా జలచరాల జీవన స్థితిగతులను, తద్వారా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తోంది. 


ఉష్ణ కాలుష్య కారకాలు:  
 

1) పరిశ్రమలు 


2) థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు 


3) జలవిద్యుత్తు కేంద్రాలు 


4) అణువిద్యుత్తు కేంద్రాలు 


5) గృహ సంబంధిత వ్యర్థాలు 


ఉష్ణకాలుష్య ప్రభావాలు:


1) నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ తగ్గుదలs (Reduction of Dissolved Oxygenz): ఉష్ణ కాలుష్యం వల్ల నీటిలో ఆక్సిజన్‌ పరిమాణం తగ్గిపోయి జలచరాలు చనిపోతాయి. 32°F వద్ద కరిగి ఉన్న ఆక్సిజన్‌ గాఢత 14.6 ppm ఉంటే, 64°F వద్ద నీటిలో ఆక్సిజన్‌ గాఢత 6 ppmమాత్రమే ఉంటుంది. చల్లని నీటిలో చేపలు జీవించడానికి కనీసం 6 ppm ఆక్సిజన్‌ అవసరం. 


2) జీవక్రియలకు అంతరాయం: ఉష్ణ కాలుష్యం వల్ల జీవుల శరీర ధర్మాలు, జీవక్రియలు, జీవరసాయన ప్రక్రియలు ప్రభావితమవుతాయి. తద్వారా జీవరాశుల శ్వాస, జీర్ణ, విసర్జక వ్యవస్థలు ప్రభావితమై జీవుల మనుగడ కష్టమవుతుంది. 


3) నీటి ధర్మాల్లో మార్పు: సాధారణ స్థాయికి మించి నీటిలో ఉష్ణోగ్రతలు పెరిగితే నీటి భౌతిక, రసాయన ధర్మాల్లో మార్పులు వస్తాయి. ఉష్ణకాలుష్యం వల్ల నీటి బాష్పీభవన ప్రక్రియ పెరగడమే కాకుండా, నీటి సాంద్రత తగ్గి, స్నిగ్ధతలో మార్పులు వస్తాయి. దాంతో నీటి కణాలు వేగంగా స్పందన ప్రక్రియకు గురవుతాయి. దానివల్ల జలచరాల ఆహారంపై ప్రభావం పడుతుంది.


4) జలచరాల ప్రత్యుత్పత్తికి అంతరాయం: అనుకూల ఉష్ణోగ్రతల వద్ద చేపలు తదితర జలచరాలు గుడ్లు పెట్టడం, పొదగడం వంటి ప్రత్యుత్పత్తి ప్రక్రియలు నిర్వహిస్తాయి. అలాగే వలసలు కూడా నీటి ఉష్ణోగ్రత మీద ఆధారపడతాయి. ఉష్ణ కాలుష్యం చేపలు గుడ్లు పెట్టడంపై ప్రభావం చూపుతుంది. పొదగాల్సిన గుడ్లు నాశనమవుతాయి. 


ఉదా: ట్రౌట్‌ జాతి చేపలు గుడ్లు పెట్టడానికి 8.9°C అనుకూలమైన అత్యధిక ఉష్ణోగ్రత కావాలి.


5) జలచరాల జీవితకాలం తగ్గుదల: ఉష్ణ కాలుష్యం వల్ల నీటి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు జలచరాల క్రియాశీలత పెరిగి క్రమంగా జీవక్రియల సామర్థ్యం, జీవితకాలం తగ్గిపోతాయి. ఉదా: క్రస్టేషియన్‌ జాతికి చెందిన డాఫ్నియా జీవి 8°C వద్ద 108 రోజులు జీవిస్తుంది..అదే జీవి 21°C వద్ద 29 రోజులు మాత్రమే బతుకుతుంది.  


6) శైవలాల వృద్ధి వల్ల ఆహారపు గొలుసులో మార్పులు: వేడి నీటిని జలాశయాల్లోకి వదిలే సమయంలో, వ్యవసాయ భూముల నుంచి వచ్చే వ్యర్థాల్లోని పోషకాలు ఆ నీటిలో కలుస్తాయి. పోషకాల వల్ల జలాశయాల్లో శైవలాలు విపరీతంగా పెరిగి యూట్రోఫికేషన్‌ జరుగుతుంది. దీంతో నీటిలో ఆక్సిజన్‌ పరిమాణం తగ్గి జలచరాలు త్వరగా నశించిపోతాయి. ఫలితంగా జల ఆహారపు గొలుసుకు విఘాతం ఏర్పడుతుంది. 


7) చల్లటి నీటిలోని జీవులకు ప్రాణ సంకటం: ఒక పెద్ద విద్యుత్తు కేంద్రం రోజుకు సుమారుగా 500 మిలియన్‌ గ్యాలన్ల నీటిని కండెన్సర్ల ద్వారా నదులు/జలాశయాల నుంచి తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో చల్లటి నీటిలోని చిన్న చేపలు, ప్లవకాలు (చిన్న నీటి మొక్కలు), కీటకాల లార్వాలు వంటి వాటిని కండెన్సర్‌ పీల్చుకోవడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రత మారిపోతుంది. దాంతో నీటి సాంద్రత, పీడనంలో తేడాలు వచ్చి జల జీవరాశులు మరణిస్తున్నాయి.


మనిషిపై ఉష్ణకాలుష్య ప్రభావం:
 

* పరిశ్రమల నుంచి వచ్చే మలినాలు నీటిలో కలిసి ఆక్సిజన్‌ పరిమాణాన్ని తగ్గిస్తాయి. వేడి నీటిలోని పాదరసం, కాపర్, కాడ్మియం, ఆర్సెనిక్, క్లోరిన్‌ లాంటి విష మలినాలు మనుషుల్లో వ్యాధులను కలుగజేస్తాయి.


* ఉష్ణ కాలుష్యం వల్ల నీలి ఆకుపచ్చ శైవలాలు వేగంగా పెరుగుతాయి. దాంతో విష పదార్థాలు (టాక్సిన్లు) ఉత్పత్తి అయ్యి నీటి నాణ్యత తగ్గి మనుషులకు ప్రాణాంతకంగా మారుతుంది. 


* పరిశ్రమలు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నుంచి కండెన్సర్ల ద్వారా విడుదలైన వేడినీటిని తట్టుకునే కొన్ని థర్మోఫైల్స్‌ సూక్ష్మజీవులు సురక్షితంగా బయటపడి వ్యాధికారకాలు అవుతాయి. 


* వేడినీరు పంట పొలాలపై ప్రవహించినప్పుడు లవణాలను కరిగించడమే కాకుండా నేల గాఢతలో మార్పు తీసుకొస్తుంది. తద్వారా వ్యవసాయ ఉత్పాదకత తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు చిన్నాభిన్నమవుతాయి.


 

ఉష్ణకాలుష్య నివారణ చర్యలు:
 

* యంత్రాలు ఎక్కువగా వేడెక్కకుండా చర్యలు తీసుకొని, వాటి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఉష్ణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు.  


* జలాశయాల్లోని నీటిని యంత్రాల్లోకి పంపి యంత్రభాగాలను చల్లబరచి, తిరిగి వేడి నీటిని జలాశయంలోకి పంపించేందుకు శీతలీకరణ ప్రక్రియను చేపట్టాలి.  


* కృత్రిమ సరస్సులు, చెరువులను ఏర్పాటు చేసి వ్యర్థ నీటిని గొట్టాల ద్వారా ఒకటి లేదా రెండు మీటర్ల లోతులోకి వదలాలి. అదే సరస్సులు, చెరువుల నుంచి తిరిగి 15 మీటర్ల లోతులో అమర్చిన గొట్టాల ద్వారా మళ్లీ యంత్రాల్లోకి ప్రవేశపెట్టాలి. దాంతో పైనున్న నీటిపొర బాష్పీభవనం వల్ల క్రమంగా చల్లబడుతుంది.


* వేడినీరు భూమిలో ఇంకే విధంగా చూడాలి. 


* సరైన కూలింగ్‌ టవర్స్, పాండ్స్‌ని ఏర్పాటు చేయాలి. 


* పరిశ్రమల నుంచి వెలువడిన వేడినీటిని చల్లార్చి, తిరిగి అదే పరిశ్రమలో వినియోగించాలి. 


* వ్యర్థజలాల్లోని విష రసాయనాలను వడబోసి శుద్ధజలాలను మాత్రమే జలాశయాల్లోకి పంపించాలి. 


* పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే సమయంలో ప్రభుత్వాలు యంత్రాల దక్షత, నాణ్యతను పరిశీలించాలి. 


* పారిశ్రామిక ఉష్ణజలాలను ఎక్కువ దూరం ప్రవహింపజేస్తే కొంత నీరు ఆవిరై, కొన్ని రసాయనాలు వడపోతకు గురవుతాయి. దాంతో కొంత నష్టాన్ని తగ్గించవచ్చు. 


   మాదిరి ప్రశ్నలు


1. కాలుష్య కారకాలు పర్యావరణంలోనికి ప్రవేశించిన తర్వాత రసాయన చర్యల ద్వారా ఏర్పడే కాలుష్యాన్ని ఏ విధంగా పిలుస్తారు?

1) ప్రాథమిక కాలుష్యాలు    2) గుణాత్మక కాలుష్యాలు 

3) ద్వితీయ కాలుష్యాలు    4) ఏదీకాదు



2. కిందివాటిలో జీవ విచ్ఛిన్న కాలుష్య జనితాలు ఏవి?

1) గృహ విసర్జితాలు        2) ఉష్ణ కాలుష్యం

3) 1, 2                 4) ఏదీకాదు



3. మైనింగ్‌ పరిశ్రమ నుంచి విడుదలయ్యే కాలుష్యకాలు ఏవి?

1) హైడ్రోజన్‌ సల్ఫైడ్‌   2) ఫెర్రస్‌ సల్ఫేట్‌

3) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం   4) పైవన్నీ



4. కిందివాటిలో రుణాత్మక మృత్తికా కాలుష్య కారకాలు ఏవి?

1) మైనింగ్‌ కాలుష్యాలు   2) బ్లాస్టింగ్‌ కాలుష్యాలు 

3) అడవుల నరికివేత     4) పైవన్నీ



 

5. న్యూక్లియర్‌ రియాక్టర్ల నుంచి విడుదలయ్యే రేడియోధార్మికత వ్యర్థ పదార్థాలు ఏవి?

1) స్ట్రాన్షియం - 90      2) అయోడిన్‌ - 129      3) సీజియం - 137      4) అన్నీ



 

6. నీటిలోని ఏ వ్యాధి కారకాలు మురుగు నుంచి ఉత్పత్తవుతాయి?

1) బ్యాక్టీరియా     2) ప్రోటోజోవా      3) 1, 2      4) 1 మాత్రమే




7. తాజ్‌మహల్‌ సౌందర్యానికి దేని నుంచి ప్రమాదం ఉంది?

1) యమునా నది     2) మురుగు నీరు    3) మధురై రిఫైనరీ    4) మార్బుల్స్‌పై ఉష్ణోగ్రత, వర్షం ప్రభావం



8. డిటర్జెంట్‌ పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యాలు?

1) క్షారాలు    2) అమ్మోనియా సమ్మేళనాలు

3) 1, 2      4) ఏదీకాదు



9. ఉష్ణ కాలుష్యం వల్ల ఏ నష్టాలు జరుగుతాయి?

ఎ) నీటిలోని ఆక్సిజన్‌ తగ్గుతుంది.

బి) జీవుల జీవక్రియకు అంతరాయం.

సి) నీటి ధర్మాల్లో మార్పులు. 

డి) శైవలాలు వృద్ధి చెందుతాయి.

1) ఎ, బి      2) బి, సి     3) ఎ, బి, సి     4) పైవన్నీ



10. ఉష్ణ కాలుష్యం వల్ల నీటిలో ఏ పదార్థం తగ్గితే జలరాశులకు హాని కలుగుతుంది?

1) ద్రావిత ఆక్సిజన్‌     2) ద్రావిత నైట్రోజన్‌      3) కాల్షియం      4) క్లోరిన్‌


సమాధానాలు: 1-3;     2-3;    3-4;   4-4;    5-4;    6-3;   7-3;    8-3;    9-4;   10-1.


 రచయిత: జల్లు సద్గుణరావు


 

 

Posted Date : 08-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆ నగరం అత్యంత కలుషితం!


పర్యావరణ కాలుష్యం

ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పర్యావరణ కాలుష్యం ఒకటి. రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం మనిషి జీవనానికి మహా విపత్తుగా మారుతోంది. అనేక రకాల సవాళ్లను విసురుతోంది. ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కాలుష్యం రకాలు, కారకాలు, దాని వల్ల కలిగే రుగ్మతలు, నివారణ చర్యలపై పోటీ పరీక్షార్థులకు పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. దేశంలో కాలుష్యాన్ని కొలిచేందుకు ఉన్న ప్రమాణాలు, నియంత్రణకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా అవగాహన పెంచుకోవాలి. 

 ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 


1.    దేశంలో జాతీయ వాయు కాలుష్య సూచిక ఎప్పటినుంచి ప్రారంభమైంది?

    1) 2014  2) 2016  3) 2017  4) 2018


2.     2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరం ఏది?

1) న్యూదిల్లీ 2) కాన్పుర్‌ 3) హసన్‌ 4) అసోపుర్‌


3.     నీటి కాలుష్యాన్ని కొలవడానికి తొలిసారిగా ఏ దేశంలో బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీఓడీ)ను ఉపయోగించారు?

1) బ్రిటన్‌  2) అమెరికా  3) ఫ్రాన్స్‌  4) భారత్‌


4.     ఏ భారీ లోహ కాలుష్యం ద్వారా మనిషిలో ఇటాయి-ఇటాయి వ్యాధి సంభవిస్తుంది?

1) ఆర్సెనిక్‌     2) పాదరసం 

3) కాడ్మియం     4) మాంగనీస్‌


5.     ప్రపంచంలో అత్యధిక మోతాదులో ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను విడుదల చేస్తున్న దేశం- 

1) చైనా  2) అమెరికా   3) జపాన్‌  4) జర్మనీ


6.     సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) ముంబయి 2) న్యూదిల్లీ 3) చెన్నై 4) హైదరాబాద్‌


7.     హిమోగ్లోబిన్‌ తయారీని అడ్డుకునే భార లోహం-

1) పాదరసం 2) సీసం 3) మాంగనీస్‌ 4) బేరియం


8.     పారిస్‌ ఒప్పందంలో భాగంగా భారత్‌ తనవంతు చర్యలను తెలిపే Nationally Determined Contributions (NDCs) ను తొలుత ఎప్పుడు ప్రకటించింది?

1) అక్టోబరు 2, 2015    2) అక్టోబరు 2, 2014

3) అక్టోబరు 2, 2016     4) అక్టోబరు 2, 2017


9.     ఘన వ్యర్థాల సమస్యను తగ్గించడానికి కిందివాటిలో ఏ పద్ధతి మెరుగైంది?

1) చెత్త కుప్పలను కాల్చేయడం     2) పునర్వినియోగం (పునఃచక్రీయం)

3) సముద్రంలో పారవేయడం    4) ఒత్తిడి ద్వారా కుదించడం


10. దిల్లీలోని వాయు కాలుష్యానికి కిందివాటిలో ఏది ఎక్కువ కారణం?

1) రాజస్థాన్‌లో పంట కోసిన తర్వాత గడ్డి మోళ్లను తగలబెట్టడం

2) పంజాబ్‌లో పంట కోసిన తర్వాత మోళ్లను తగలబెట్టడం

3) పంజాబ్‌లో వంటచెరకు వాడకం

4) రాజస్థాన్‌లో వంటచెరకు వాడకం


11.    భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనకు కారణమైన విషవాయువు?

1) మిథైల్‌ ఐసో సయనైడ్‌    2) మీథేన్‌ ఐసో సయనైడ్‌

3) మిథైల్‌ ఐసో సయనేట్‌    4) మీథేన్‌ ఐసో సయనేట్‌


12. ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’ (నదుల కోసం యాత్ర) అంటే ఏమిటి?

1) నదులను రక్షించేందుకు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ చేపట్టిన జాతీయ ఉద్యమం.

2) నదులను రక్షించేందుకు ఈశా ఫౌండేషన్‌ చేపట్టిన జాతీయ ఉద్యమం.

3) కేరళలోని వార్షిక బోటు ర్యాలీ

4) ‘నమామి గంగే’ కార్యక్రమం ద్వారా నదుల ప్రక్షాళనకు ప్రభుత్వం చేపట్టిన పథకం.


13. పారిస్‌ వాతావరణ మార్పు ఒప్పందం ప్రకారం భారతదేశం కర్బన ఉద్గారాల విషయంలో తన కోసం నిర్దేశించుకున్న దేశీయ నిర్ధారిత వాటా (INDC) ఎంత? 

1) 2030 నాటికి 2005 స్థాయి కంటే 33-35% తక్కువ 

2) 2020 నాటికి 1990 స్థాయి కంటే 20-25% తక్కువ

3) 2020 నాటికి 2000 స్థాయి కంటే 23-25% తక్కువ

4) 2030 నాటికి 1990 స్థాయి కంటే 15-20% తక్కువ 


14. భూమిపై ఓజోన్‌ పొరకు అతిపెద్ద రంధ్రం ఏ ప్రాంతంలో ఏర్పడింది?

1) ఆర్కిటిక్‌ ప్రాంతం     2) అంటార్కిటిక్‌ ప్రాంతం

3) భూమధ్యరేఖా ప్రాంతం    4) ఉత్తర అమెరికా


15. వ్యర్థాల పునర్‌ నిర్వహణలో ళిళిళిలు ఏవి?

1) తగ్గించడం, పునర్వినియోగం, పునఃచక్రీయం (Reduce, Reuse, Recycle)

2) సరిగ్గా, పునఃచక్రీయం, పునరుద్ధరణ (Right, Recycle, Revive)

3) సరిగ్గా, తొలగించడం, పునఃచక్రీయం (Right, Removes, Recycle)

4) తగ్గించడం, పునఃప్రేరేపం, పునఃచక్రీయం (Reduce, Reactive, Recyle)


16. కాలుష్య నివారణకు అతి సమర్థ సాధనం?

1) కాలుష్య పన్ను                  2) కాలుష్య ప్రోత్సాహం (సబ్సిడీ) 

3) నైతికంగా నచ్చజెప్పడం       4) సామాన్య న్యాయం


17. ‘కేటలిటిక్‌ కన్వర్టర్‌’ ఉపకరణాన్ని దేనిలో ఉపయోగిస్తారు? 

1) పాలిమర్‌ తయారీ కేంద్రం                2) న్యూక్లియర్‌ రియాక్టర్‌

3) ఆటోమొబైల్‌ ఎగ్జాస్ట్‌ యూనిట్‌-1        4) నీటిశుద్ధి ప్లాంటు 


18. బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ దేన్ని కొలుస్తుంది?

1) పారిశ్రామిక కాలుష్యం    2) వాయు కాలుష్యం

3) అకర్బన కాలుష్యం

4) సేంద్రియ వ్యర్థాలను డీకంపోజ్‌ చేసే సూక్ష్మజీవులకు కావాల్సిన కరిగి ఉన్న O2 


19. బొగ్గును పర్యావరణానికి అత్యంత హానికర కారకంగా పరిగణిస్తారు. ఎందుకంటే దాన్ని దహనం చేయడం వల్ల ఎక్కువ మోతాదులో వెలువడేది?

ఎ) బొగ్గుపులుసు వాయువు    బి) సల్ఫర్‌ డయాక్సైడ్‌

సి) నైట్రోజన్‌ ఆక్సైడ్‌             డి) మీథేన్‌

1) ఎ, డి         2) ఎ, బి, సి, డి    3) ఎ, బి, సి         4) ఎ, సి, డి 


20. కిందివాటిలో ఏ దేశానికి సొంతంగా గ్రీన్‌హౌస్‌ వాయువులను పర్యవేక్షించే ఉపగ్రహం లేదు?

1) యూఎస్‌ఏ       2) జపాన్‌        3) భారత్‌         4) చైనా


21. ‘కార్బన్‌ మోనాక్సైడ్‌’కి సంబంధించి కింద పేర్కొన్న వాటిలో సరైంది?

ఎ) మానవ శరీరంలో ఉత్పత్తి అవుతుంది.

బి) సికిల్‌సెల్‌ ఎనీమియా చికిత్సకు సహాయపడుతుంది.

సి) న్యూరో ట్రాన్స్‌మీటర్‌లా పనిచేస్తుంది.

1) ఎ, బి, సి     2) ఎ మాత్రమే 

3) ఎ, సి     4) సి మాత్రమే


22. కిందివాటిని జతపరచండి.

ఎ) గంగా కార్యాచరణ ప్రణాళిక 1) 1986
బి) వాయు (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం  2) 1974
సి) పర్యావరణ (సంరక్షణ) చట్టం 3) 1985
డి) జల (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 4) 1980
  5) 1981

1) ఎ-2, బి-1, సి-5, డి-3              2) ఎ-2, బి-3, సి-5, డి-1

3) ఎ-3, బి-5, సి-1, డి-2              4) ఎ-3, బి-4, సి-1, డి-5


23. పెట్రోల్‌ యంత్రాల నుంచి విడుదలయ్యే ప్రధాన కాలుష్యాలు-

ఎ) కాల్చని హైడ్రోకార్బన్లు    బి) సల్ఫర్‌ డై ఆక్సైడ్‌

సి) కార్బన్‌ మోనాక్సైడ్‌   డి) సీసం (లెడ్‌)

సరైన జవాబును ఎంపిక చేయండి.

1) ఎ, బి, డి        2) ఎ, బి, సి            3) ఎ, సి, డి         4) ఎ, బి, సి, డి


24. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పులకు కారణమయ్యే గ్రీన్‌హౌస్‌ వాయువులు-

ఎ) కార్బన్‌ డైఆక్సైడ్‌       బి) మీథేన్‌

సి) క్లోరోఫ్లోరో కార్బన్‌లు     డి) ఆర్గాన్‌  ఇ) నీటిఆవిరి

సరైన జవాబులను ఎంపిక చేయండి.

1) బి, సి, డి        2) ఎ, బి, సి

3) ఎ, సి, ఇ       4) ఎ, బి, సి, ఇ


25. భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరగడానికి తోడ్పడే ‘గ్రీన్‌హౌస్‌ వాయువు’ ప్రధాన పాత్ర?

1) సూర్యకాంతి రావడానికి, ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ పోవడానికి పారదర్శకంగా ఉండటం.

2) సూర్యకాంతి రావడాన్ని, ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ పోవడాన్ని రెండింటినీ ఆపగలగడం.

3) ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ పోవడానికి తోడ్పడి, సూర్యకాంతి రావడాన్ని ఆపడం.

4) సూర్యకాంతి రావడానికి తోడ్పడి, ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ పోవడాన్ని ఆపడం.


26. కిందివాటిని జతపరచండి.

ఎ) చెర్నోబిల్‌ విపత్తు  1) పెరాక్సీ ఎసిటైల్‌ నైట్రేట్‌

బి) భోపాల్‌ విషాదం   2) క్లోరోఫ్లోరో కార్బన్‌లు

సి) ఓజోన్‌ రంధ్రం   3) రేడియోధార్మిక పదార్థాలు

డి) కాంతి రసాయన స్మాగ్‌  4) మిథైల్‌ ఐసోసైనేట్‌

1) ఎ-4, బి-3, సి-1, డి-2         2) ఎ-3, బి-4, సి-2, డి-1

3) ఎ-2, బి-1, సి-4, డి-3         4) ఎ-2, బి-4, సి-1, డి-3


27. కిందివాటిలో జీవక్షయం చెందని కాలుష్యకాలు ఏవి?

ఎ) క్లోరినేటెడ్‌ హైడ్రోకార్బన్‌ కీటక నాశకాలు

బి) పాలీ ఎథిలీన్‌ సంచులు

సి) మార్కెట్‌లో ఏర్పడే చెత్త, కుళ్లిన పండ్లు, కూరగాయలు

డి) మున్సిపల్‌ సీవేజ్‌ (మురుగు)

 పైవాటిలో సరైనవి గుర్తించండి.

1) ఎ, బి           2) ఎ, సి          3) బి, సి        4) సి, డి 


28. కిందివాటిలో కణయుత పదార్థాలు (Particulate matter)  అని వేటిని పిలుస్తారు?

ఎ) మసి                      బి) పొగ     

సి) దుమ్ము, ధూళి     డి) ఆస్బెస్టాస్‌ నారపోగులు

పైవాటిలో సరైనవి గుర్తించండి.

1) ఎ, బి         2) ఎ, బి, సి           3) బి, సి          4) ఎ, బి, సి, డి


29. కిందివాటిలో ‘మినమాటా’ వ్యాధికి కారణమైన కాలుష్యకం ఏది?

1) మెర్క్యురీ       2) కాడ్మియం        3) లెడ్‌        4) జింక్‌


30. కిందివాటిలో ఆమ్ల వర్షానికి కారణమైన వాయు కాలుష్యకాలు ఏవి?

1) కార్బన్‌ డయాక్సైడ్‌    2) కార్బన్‌ మోనాక్సైడ్‌

3) ప్రొపేన్‌                     4) నైట్రోజన్, సల్ఫర్‌ ఆక్సైడ్‌లు


31. తాగునీటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే వాయువు ఏది?    

1) హీలియం            2) క్లోరిన్‌      

3) ఫ్లోరిన్‌                  4) కార్బన్‌ డయాక్సైడ్‌


32. కిందివాటిని జతపరచండి.

 కాలుష్యకం  వ్యాధి
1) ఆర్సెనిక్‌ ఎ) ఫ్లోరోసిస్‌
2) ఫ్లోరైడ్‌ బి). మెలనోసిస్‌
3) సిలికా ధూళి సి) ప్రెస్‌బైక్యూసిస్‌
4) శబ్దాలు డి) సిలికోసిస్‌

1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి  2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి

3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి     4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి

 

 


సమాధానాలు

11; 23; 31; 43; 51; 62; 72; 82; 92; 102; 113; 122; 131; 142; 151; 161; 173; 184; 193; 203; 211; 223; 233; 244; 254; 262; 271; 284; 291; 304; 312; 323.

 

రచయిత: ఇ.వేణుగోపాల్‌ 

 

 ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


 

Posted Date : 08-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఘన వ్యర్థ కాలుష్యం - నిర్వహణ

పోగుపడే వ్యర్థాలతో పొంచి ఉన్న ప్రమాదాలు!

 పర్యావరణ వ్యవస్థకు, మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన వాటిలో ఘన వ్యర్థ కాలుష్యం ఒకటి. అభివృద్ధి పోకడలు, వస్తు వినియోగం, ఆహార వృథాతో వ్యర్థాలూ పెరిగిపోతున్నాయి. గాలి, నీరు, నేలలను కలుషితం చేస్తున్నాయి. పరిసరాలు దెబ్బతినడానికి, అంటువ్యాధులు ప్రబలడానికి ఈ పరిణామమే ప్రధాన కారణం. ప్లాస్టిక్, విద్యుత్తు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వంటివి మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు సవాలు విసురుతున్నాయి. సమస్త జీవజాలానికి సమస్యలు సృష్టిస్తున్న ఈ ఘన వ్యర్థాలు, వాటి మూలాలు, రకాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటి నిర్వహణ, దుష్ప్రభావాలను తగ్గించగలిగే శాస్త్రీయ విధానాల గురించి అవగాహన పెంచుకోవాలి.

ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి, ఆధునిక జీవనశైలి అలవరుచుకుంటున్నారు. దాంతో వస్తు వినియోగం అధికమైంది. ‘ఉపయోగించు-పారవేయు’ పద్ధతిలోనే వస్తువులను తయారు చేస్తుండటంతో వాటి ఉత్పత్తి పెరుగుతోంది. ఫలితంగా ఘన వ్యర్థాల సమస్య అంతకంతకూ ఎక్కువవుతోంది. పట్టణ, నగర జనావాసాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ‘జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డు’ నివేదిక ప్రకారం మన దేశంలో రోజుకు సుమారు 1.60 లక్షల టన్నుల వ్యర్థాలు పోగు పడుతున్నాయి. ఇందులో 95.4% సేకరిస్తున్నారు. అత్యధిక వ్యర్థాలు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నగరాలపరంగా దిల్లీ, ముంబయి, చెన్నై ముందంజలో ఉన్నాయి.


దుష్ప్రభావాలు: ఘనవ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోతే అనేక రకాల పర్యావరణ, ఆరోగ్య, ఆర్థికపరమైన దుష్ప్రభావాలు తలెత్తుతాయి.


* ఘనవ్యర్థాలు పోగుపడటం వల్ల భూ, జల వనరులు కలుషితమవుతాయి. ఫ్లోరిన్, పాదరసం, సీసం లాంటి భారలోహ కాలుష్యాలు మానవ ఆహార శృంఖలాల్లో జీవ ఆవర్తనం చెంది ప్రజలు ఫ్లోరోసిస్, డయేరియా, మతిభ్రమించడం లాంటి వ్యాధులకు గురవుతారు.


* ఘనవ్యర్థాలు కుళ్లి గాలి విషవాయువులతో దుర్గంధమై వ్యాధులు సంక్రమిస్తాయి.


* ఘనవ్యర్థాలు పేరుకుపోయి పరిసరాలు సహజ సౌందర్యాన్ని కోల్పోతాయి.


* ఎలుకలు, పందికొక్కులు లాంటి పరాన్నబుక్కులు ఎక్కువై సూక్ష్మజీవుల ప్రవాహకాలుగా మారి ప్లేగు తదితర వ్యాధులు విజృంభించడానికి కారణమవుతాయి.


* గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం స్థానిక సంస్థలకు ఆర్థిక భారంగా మారుతోంది.


ఘన వ్యర్థ మూలాలు


1) గృహసంబంధ వ్యర్థాలు: మున్సిపాలిటీలు, మెట్రో నగరాల్లో గృహ సంబంధ వ్యర్థాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వంటింట్లో మిగిలిన, పాడైన ఆహార పదార్థాలు, చిరిగిన దుస్తులు, కాగితం, లెదర్‌ లాంటి జీవక్షయం చెందే వస్తువులు/పదార్థాలు ఇందులో ఉంటాయి. ప్లాస్టిక్, పాలిథిన్, గ్లాసు, లోహ సంబంధమైన జీవక్షయం చెందని వస్తువులూ ఉంటాయి.


2) పారిశ్రామిక వ్యర్థాలు: ఇనుము, ఉక్కు, అల్యూమినియం కర్మాగారాలు; రబ్బరు, ప్లాస్టిక్, గాజు తయారుచేసే పరిశ్రమల్లో మిగిలిపోయిన వ్యర్థాలు; సిమెంట్‌ కర్మాగారాల నుంచి వెలువడే ఫ్లైయాష్‌ లాంటి పారిశ్రామిక ఘనవ్యర్థాలు భూమి, జలాలను కలుషితం చేస్తాయి.


3) రేడియోధార్మిక వ్యర్థాలు: యురేనియం, థోరియం మూలకాలను భూమి నుంచి వెలికి తీసినప్పుడు లేదా వాటిని శుద్ధి చేసినప్పుడు వెలువడే వ్యర్థాలను నీటిలో/భూమిలో కలపకూడదు. భూమి లోపల ప్రత్యేక జాలీల్లో భద్రపరచాలి.


4) మైనింగ్‌ వ్యర్థాలు: గనుల తవ్వకాల్లో, ఖనిజాల్లోని మలినాలు తొలగించినప్పుడు ఏర్పడిన స్లాగ్‌ కూడా భారీగా పోగుపడిన ఘన వ్యర్థమే. బొగ్గు, ఇనుప గనుల నుంచి వెలువడే ధూళి తీవ్రస్థాయి శ్వాసకోస వ్యాధులను కలగజేస్తుంది.


5) వ్యవసాయ సంబంధ వ్యర్థాలు: వ్యవసాయ రంగంలో ఉత్పత్తులను పెంచుకోవడానికి విచక్షణారహితంగా ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు నేల, నీటిపై పేరుకుపోతాయి. వీటివల్ల నేలలు నిస్సారంగా మారుతున్నాయి. జీవజాతులకు పలు అనారోగ్యాలకు గురవుతున్నాయి.


6) బయో మెడికల్‌ వ్యర్థాలు: ఆస్పత్రుల్లో వాడేసిన సిరంజీలు, సెలైన్‌ బాటిళ్లు, బ్యాండేజీలు, బ్లేడ్‌లు, రక్తవ్యర్థాలు లాంటి వాటిని బయోమెడికల్‌ వ్యర్థాలు అంటారు. ఘన వ్యర్థాలన్నింటిలో ఇవి చాలా హానికరమైనవి. వీటిని సరైన పద్ధతిలో నిర్వహించాలి.


7) ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌: కాలం చెల్లిన, పాడైపోయిన కంప్యూటర్లు, టెలివిజన్లు, ప్రింటర్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉపయోగించే విషపూరిత రసాయనాలు; లోహ సంబంధ భాగాల ద్వారా చేరిన వ్యర్థాలను ఈ-వేస్ట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ అంటారు. వీటి నుంచి ఆర్సెనిక్, బేరియం, కాడ్మియం, కోబాల్ట్, సీసం, పాదరసం, జింక్‌ లాంటి హానికర మూలకాలు విడుదలై తిరిగి మానవ జీవనంపై దుష్ప్రభావం చూపుతాయి.


8) కెమికల్‌ వేస్ట్‌: వినియోగించని ఔషధాలు, నెయిల్‌ పాలిష్‌ టిన్నులు, పెర్‌ఫ్యూమ్‌ బాటిళ్లు, టాయిలెట్‌ కెమికల్స్, కాస్మోటిక్‌ వ్యర్థాలు లాంటి వాటిని కెమికల్‌ వేస్ట్‌ అంటారు. ఈ రసాయన మూలకాల వ్యర్థాల వల్ల హాని కలుగుతుంది. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ప్రభావానికి గురవుతారు.


ఘన వ్యర్థాల నిర్వహణ: ఇది మున్సిపాలిటీలకు భారంగా మారుతోంది. వ్యర్థాలను సేకరించడం, తరలించడం, నిల్వ చేయడం ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారుతోంది. అయితే కొన్ని నిర్వహణ విధానాల ద్వారా వాటి దుష్ప్రభావాన్ని తగ్గించవచ్చు.


వ్యర్థాలను వేరుచేసే ప్రక్రియ: వ్యర్థ పదార్థాలను సేకరించినప్పుడే తడి, పొడి చెత్తను వేరు చేయాలి. ఆ తర్వాత అందులోని జీవక్షయం చెందే తడి చెత్తను గుంతలు తీసి పూడ్చివేయాలి. ఇది క్రమంగా కుళ్లిపోయి ఎరువుగా మారుతుంది. ఈ విధానం వల్ల చెత్త పరిమాణం తగ్గించుకోవచ్చు.


5 R విధానం: ఘన వ్యర్థాల నిర్వహణకు ఇది అత్యంత శాస్త్రీయమైన పద్ధతి. ఈ విధానంపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలి.


1) Refuse -  చెత్త వేయకూడదు.


2) Reduce - చెత్త ఉత్పత్తిని తగ్గించుకోవాలి


3) Re-use - నీళ్ల సీసాలు, ప్యాకింగ్‌ మెటీరియల్స్‌ లాంటివి తిరిగి ఉపయోగించుకోవాలి.


4) Re-purpose - ఇతర ప్రయోజనాలకు ఉపయోగించాలి.


ఉదా: మెటల్‌ క్యాన్లు, బకెట్‌లను మొక్కలు పెంచుకోవడానికి వాడాలి.


5) Recycle - వ్యర్థాలను పునఃచక్రీయం చేయాలి.


ఉదా: కాగితం, ప్లాస్టిక్, లోహాలు, గాజు లాంటి వ్యర్థాలతో పరిశ్రమల ద్వారా తిరిగి కొత్త వస్తువులు తయారుచేయాలి.

పల్వరైజేషన్‌: సేకరించిన వ్యర్థాలను గ్రైండింగ్‌ మిషన్స్‌ ద్వారా ముక్కలు చేసి వాటి భౌతిక స్వరూపాన్ని, పరిమాణాన్ని మార్చే విధానం. ముక్కలైన వ్యర్థాలు రుచి, లక్షణాలు మారి కీటకాలను ఆకర్షించలేని విధంగా తయారవుతాయి. ఈ పదార్థాలను గుంతల్లో పూడ్చవచ్చు. అయితే ఈ ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది.


లోతట్టు ప్రాంతాల్లో పూడ్చవచ్చు: జీవక్షయం కాని, పునర్వినియోగానికి, పునఃచక్రీకరణకు పనికిరాని వ్యర్థాలను లోతట్టు ప్రాంతాల్లో మట్టితో కప్పివేయాలి. దీన్ని ల్యాండ్‌ ఫిల్లింగ్‌ అంటారు.


సముద్రాలకు దూరంగా పారబోయడం: ప్రపంచంలో సముద్రాల్లోకి అత్యధికంగా వ్యర్థాలను విడుదల చేస్తున్న దేశాల్లో చైనా, భారత్‌ ముందంజలో ఉన్నాయి. ఇది జలచరాలకు అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. తీర ప్రాంత పట్టణాల్లోని చెత్తను తీరానికి 20 కి.మీ. దూరంలో, 30 మీటర్ల లోతైన ప్రాంతాల్లోకి తరలించాలి.


ఉపాధి సృష్టి: జీవక్షయం చెందే వ్యర్థాలను కంపోస్ట్‌ చేయడం ద్వారా ఎరువు, మీథేన్‌ వాయువును ఉత్పత్తి చేయవచ్చు. వ్యర్థాన్ని వానపాముల చర్య ద్వారా వర్మికంపోస్ట్‌గా మార్చొచ్చు. ఆస్పత్రి సంబంధ వ్యర్థాలను 800 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద వేడి చేసి ‘ఇన్సినరేషన్‌’ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు.


బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ

ఎ) తెలుపు రంగు డబ్బాలు: సూదులు, బ్లేడ్లు వేయాలి.


బి) నీలి రంగు డబ్బాలు: గాజు సీసాల వ్యర్థాలు వేయాలి.


సి) పసుపు రంగు డబ్బాలు: జంతు, మానవ, ప్రయోగశాలల వ్యర్థాలు; శరీర ద్రవాలు వేయాలి.


డి) ఎరుపు రంగు డబ్బాలు: సిరంజీలు, సెలైన్‌ బాటిళ్లు, ట్యూబ్‌లు, క్యాథటర్స్‌ లాంటివి వేయాలి.

 

ఈ-వేస్ట్‌ నిర్వహణ: కాలం చెల్లిన, ఉపయోగంలో లేని ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్‌ సంబంధ వ్యర్థాలను ఈ-వేస్ట్‌ అంటారు. అసోచామ్‌ గ్రూప్‌ నివేదిక ప్రకారం మన దేశం ఏటా 20 లక్షల టన్నుల ఈ-వేస్ట్‌ ఉత్పత్తితో ప్రపంచంలో అయిదో స్థానంలో ఉంది. దేశంలో ఈ-వేస్ట్‌ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, నగరం ముంబయి.


ఈ-వేస్ట్‌లు మూడు రకాలు 


1) White Goods: పాడైపోయిన వాషింగ్‌ మిషిన్లు, గ్రైండర్లు, రిఫ్రిజిరేటర్లు.

 

2) Brown Goods:వాణిజ్య సముదాయాలు, గృహాల నుంచి ఉత్పత్తయ్యే పాడైపోయిన టెలివిజన్లు, కెమెరాలు.

 

3) Grey Goods: ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లోని పాడైపోయిన కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు, మొబైల్‌ ఫోన్లు.

 

రచయిత: జల్లు సద్గుణరావు

 

Posted Date : 21-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గ్లోబల్‌ వార్మింగ్‌ (భూతాపం)

భూగోళం భగభగ!

ఏటేటా ప్రపంచం అంతటా ఉష్ణోగ్రతలు తీవ్రమైపోతున్నాయి. వేసవిలో వడగాలులు, శీతాకాలంలో చలితీవ్రత అంతకంతకు అధికమవుతూ జీవుల మనుగడకు సవాలు విసురుతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు ఏర్పడి పర్యావరణ సమతౌల్యత ప్రమాదంలో పడిపోతోంది. నదులతో పాటు సముద్రాల్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువై జలచరాలు, భూమిపై కొన్ని సున్నిత జీవజాతులు అంతరించిపోతున్నాయి. తుపాన్లు, వరదలు, దుర్భిక్షంతో మానవ జీవనం రోజురోజుకూ దుర్భరమైపోతోంది. ఇన్ని అనర్థాలకు కారణం భూగోళ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే. మనిషి విపరీత చర్యలతో తలెత్తుతున్న ఈ భూతాపానికి ప్రధాన కారణాలు, వాటి పర్యవసానాలు, నివారణ చర్యలపై పరీక్షార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.

వేసవికాలం పెరిగిపోయి ఎండలు మండిపోతున్నాయి. శీతాకాలం తగ్గిపోయి రుతువులు క్రమం తప్పుతున్నాయి. అకాల వర్షాలతో వరదలు, వర్షాభావ పరిస్థితులతో కరవు కాటకాలు వంటి పరిస్థితులను శీతోష్ణస్థితి మార్పులుగా అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. వాటి ప్రభావం భూమిపై అన్ని ప్రాంతాల్లో స్పల్ప నుంచి తీవ్రస్థాయికి చేరినట్లు అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. శీతోష్ణస్థితి మార్పుల అధ్యయనానికి వరల్డ్‌ మెటిరియోలాజికల్‌ ఆర్గనైజేషన్‌ (WMO), యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రోగ్రామ్‌(UNEP) సంయుక్త ఆధ్వర్యంలో 1988లో జెనీవా వేదికగా ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌(IPCC)ను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఇచ్చిన వివరాల ప్రకారం ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతలు 1.80Cనుంచి  40C వరకూ పెరగవచ్చని అంచనా. సాధారణంగా భూగోళం సగటు ఉష్ణోగ్రత 15.4oC ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత పెరగడాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ (భూగోళం వేడెక్కడం లేదా భూతాపం)గా పిలుస్తారు.


సూర్యుడి నుంచి నిరంతరం బయటకు వెలువడే సౌరశక్తిని సౌర వికిరణం అంటారు. ఇందులో చాలా తక్కువ పరిమాణంలో శక్తి భూమిని చేరుతుంది. ఈ సౌరశక్తిని సూర్యపుటం అంటారు. దీని ద్వారా భూమి వేడెక్కిన తర్వాత కొంత శక్తిని భూమి నుంచి పరారుణ కిరణాల రూపంలో, దీర్ఘ తరంగాలుగా వాతావరణం తిరిగి తీసుకుంటుంది. దీనినే భూవికిరణం అంటారు. మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి విడుదలవుతున్న కార్బన్‌ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్‌ ఆక్సైడ్‌ లాంటి హరిత గృహ వాయువులు భూవికిరణాన్ని అడ్డుకుని తిరిగి భూమి వేడెక్కడానికి కారణమవుతున్నాయి. ఈ విధంగా భూవికిరణం వల్ల భూమి చల్లబడటానికి బదులు తిరిగి భూవాతావరణం వేడెక్కడాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ లేదా భూతాపంగా పిలుస్తారు.


అతిశీతల వాతావరణంలో పెరగడానికి అనుకూలంగా లేని సున్నిత మొక్కలను ఆకుపచ్చని గాజు గదిలో పెంచినప్పుడు లోపలి వేడి పైకి వెళ్లకుండా కాపాడి మొక్కల పెరుగుదలకు సహకరించినట్లు గ్రీన్‌హౌస్‌ వాయువులు కూడా భూమి చుట్టూ వేడిని పెంచుతాయి. అయితే ఈ హరితగృహ వాయువులు పెరిగే కొద్దీ భూగోళ సగటు ఉష్ణోగ్రతలు అధికమై క్రమంగా గ్లోబల్‌ వార్మింగ్‌కు దారితీస్తుంది. దీనినే హరితగృహ ప్రభావం అంటారు. హరితగృహ వాయువు ఉద్గారాల్లో ఇంధన రంగం నుంచే అధికంగా విడుదలవుతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌కు ప్రధానంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ (72%), మీథేన్‌ (21%), నైట్రస్‌ ఆక్సైడ్‌ (7%) కారణమవుతున్నాయి.

కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేస్తున్న దేశాలు: 1) చైనా (29.18%), 2) అమెరికా (14.02%), 3) ఇండియా (7.09%), 4) రష్యా (4.65%).


గ్రీన్‌హౌస్‌ ఘన కారకాలు:

1) బ్లాక్‌ కార్బన్‌: ఇది వాతావరణాన్ని వేడి చేసే ఘన స్థితిలోని  ప్రధాన కాలుష్యం, వాతావరణంలోని పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ లేదా ఏరోసాల్‌. దీనినే మసి (Sooty) గా పిలుస్తారు. ఇది కార్బన్‌డై ఆక్సైడ్‌ తర్వాత వాతావరణాన్ని వేడెక్కించే రెండో ప్రధాన కారకం. జీవ సంబంధ పదార్థాలు/బొగ్గు/పెట్రోలియం అసంపూర్తిగా మండినప్పుడు బ్లాక్‌ కార్బన్‌ ఎక్కువగా విడుదలవుతుంది. సూర్యుడి నుంచి భూమి గ్రహించిన సౌరశక్తికి, భూమి వెనుకకు పంపిన భూవికిరణానికి మధ్య నిష్పత్తిని తెలియజేసే అల్బిడో సామర్థ్యాన్ని ఇది తగ్గిస్తుంది. అంటే బ్లాక్‌ కార్బన్‌ సౌర వికిరణాన్ని ఎక్కువగా గ్రహించి మంచు ప్రాంతాల్లో నిక్షిప్తం చేస్తుంది. దాంతో హిందూ కుష్, హిమాలయాల్లో గ్లేసియర్స్‌ హెచ్చు పరిమాణంలో కరిగిపోతున్నాయి.

2) బ్రౌన్‌ కార్బన్‌: ఆర్గానిక్‌ ఏరోసాల్స్‌నే బ్రౌన్‌ కార్బన్‌ అంటారు. కర్ర, పంట అవశేషాలు; బొగ్గు, పిడకలు లాంటి జీవసంబంధ పదార్థాలను మండించినప్పుడు ఏర్పడతాయి. ఇవి కూడా వాతావరణంలోకి చేరి గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమవుతాయి.

 

గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల నష్టాలు:

* భూమి చుట్టూ వేడి అధికమవడంతో ధ్రువాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి. దాంతో మాల్దీవులు లాంటి కొన్ని దీవులు సముద్రంలో మునిగిపోతాయి. 

* సైబీరియా భూభాగంలో కప్పి ఉన్న శాశ్వత మంచుపొర అయిన ‘ఫెర్మాప్రాస్ట్‌’ కరిగిపోతే అందులోని మీథేన్‌ వాయువు విడుదలై భూతాపాన్ని మరింత పెంచుతుంది.

* వ్యవసాయ దిగుబడులు తగ్గి ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది.

* వరదలు, సునామీలు, టోర్నడోలు, తుపాన్లు లాంటి విపత్తులు మరింత విరుచుకుపడతాయి. 

* అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొన్నిరకాల సూక్ష్మజీవుల వ్యాప్తి ఎక్కువై సంక్రమణ వ్యాధులు పెరుగుతాయి.

* హిమనీనదాలు త్వరగా కరిగిపోయి గంగానది లాంటి కొన్ని నదుల్లో స్వల్పకాల వ్యవధిలో వరదలు వస్తాయి. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో దుర్భిక్షానికి దారితీస్తుంది.

* వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ అధికమైన కొద్దీ సముద్రపు నీటిలో దాని మోతాదు కూడా పెరుగుతుంది. సముద్రపు నీటిలో కార్బానిక్‌ ఆమ్లం ఎక్కువై నీటి ఆమ్లత్వం పెరుగుతుంది. దీనినే ‘ఓషన్‌ ఎసిడిఫికేషన్‌’ అంటారు. ఫలితంగా సముద్ర జీవవైవిధ్యం దెబ్బతింటుంది.

 

గ్లోబల్‌ వార్మింగ్‌ నియంత్రణ వ్యూహాలు:

1) కార్బన్‌ ట్రేడింగ్‌ విధానం: హరిత విధానాన్ని అనుసరించే వర్ధమాన, పేద దేశాల్లోని పరిశ్రమలు తమ ప్రాజెక్టుల నుంచి తగ్గించే ప్రతి టన్ను కార్బన్‌ డై ఆక్సైడ్‌కు ఒక కార్బన్‌ క్రెడిట్‌ను పొందుతాయి. ఆ విధంగా సంపాదించిన పాయింట్లను అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలు నిర్ధారించిన కర్బన వాయు ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను చేరుకోలేనప్పుడు వర్ధమాన దేశాలు విక్రయించే ఈ కర్బన క్రెడిట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఏటా జరిగే కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ ్బదివీశ్శి సదస్సుల్లో ఈ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను నిర్ణయిస్తుంటారు.

2) కార్బన్‌ శోషక విసర్జిత విధానం: దీన్నే కార్బన్‌ శోషక నిల్వ విధానం అంటారు. వాతావరణంలో పరిమితికి మించి చేరిన కర్బన ఉద్గారాలను తగిన సాంకేతిక విధానం ద్వారా సేకరించి సముద్రాలు, అడవులు, ఎండిపోయిన ముడిచమురు బావులు, తవ్వకాలు చేపట్టని, మిగిలిపోయిన గనులు లాంటి ప్రాంగణాల్లో నిల్వ చేస్తారు. లేదా భూగర్భంలో పాతిపెడతారు.

3) జీవసంబంధ కార్బన్‌ శోషక విధానాలు: వృక్ష జాతులు కిరణజన్య సంయోగక్రియ ద్వారా కార్బన్‌ను గ్రహించి కార్బోహైడ్రేట్స్‌గా మార్చి తమలో విలీనం చేసుకుంటాయి. దీనినే గ్రీన్‌ కార్బన్‌ శోషకం అంటారు. అడవులను పెంచడం వల్ల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు. తీర ప్రాంతాలు, మంచి నీటి ప్రాంతాల్లో పెరిగే మాంగ్రూవ్, సర్గోసా, నాచు లాంటి జలావరణ వ్యవస్థలో పెరిగే వృక్షజాతులు వాతావరణం, సముద్రాల్లోని కార్బన్‌ను తొలగించి వాటిని నిల్వ చేసుకుంటాయి లేదా వాటి నేల అడుగున సహజ ప్రక్రియ ద్వారా నిక్షిప్తం చేస్తాయి. దీన్నే బ్లూకార్బన్‌ శోషక విధానం అంటారు. గ్లోబల్‌ వార్మింగ్‌ తగ్గించడానికి తీర ప్రాంత ఆవరణ వ్యవస్థను పెంచాలి.

4) కార్బన్‌ ట్యాక్స్‌ విధానం: కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి అనుసరించే అత్యంత సమర్థ విధానమిది. ఇందులో కార్బన్‌ డయాక్సైడ్‌ను విడుదల చేసే పరిశ్రమలు, మైనింగ్‌ సంస్థలు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు కర్బన పన్ను (కార్బన్‌ ట్యాక్స్‌) విధిస్తారు. ఈ విధంగా చేయడాన్ని Cap and Trade అంటారు. దీనివల్ల ఉత్పిత్తిదారులను కర్బన ఉద్గారాలను వెదజల్లే ఇంధన వినియోగం నుంచి కర్బన రహిత ఇంధనాల వినియోగం వైపు మళ్లించవచ్చు.

5) జియో ఇంజినీరింగ్‌: ఇదొక ప్రయోగాత్మక నూతన సాంకేతిక విధానం. భూమి వైపు ప్రసరించే సౌర వికిరణ పరిమాణాన్ని తగ్గించడానికి అంతరిక్షంలో గ్లాస్‌ రూమ్‌ను ఏర్పాటు చేయడం, సల్ఫేట్‌ ఏరోసాల్స్‌ను స్ట్రాటోస్ఫియర్‌లోకి పంపించడం ద్వారా ఆ ప్రాంతాన్ని తెల్లగా చేయవచ్చు. నివాసాల పైకప్పులకు వైట్‌వాష్‌ చేయడం, ఇనుము సంబంధిత ప్లేట్స్‌ను సముద్రంలో ఉంచడం ద్వారా ఆల్గే లాంటి నాచు మొక్కలు ఒక చోట ఎక్కువగా పెరిగే విధంగా చూడవచ్చు. ఈ తరహా సాంకేతిక విధానాలను గ్లోబల్‌ వార్మింగ్‌ నియంత్రణకు అనుసరిస్తారు. అధిక సాంకేతికత గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమైతే, అత్యాధునిక సాంకేతికతతో దాన్ని నివారించాల్సిన అవసరం ఉంది.

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 05-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శీతోష్ణ మార్పులు

ప్రకృతి రక్షణ కవచాలకు తూట్లు!

 


చెట్ల ఆకుల్లో పచ్చదనం తగ్గిపోతోంది. ఎండిపోయి రాలిపోతున్నాయి. పంటచేలు బీడుబారి, వ్యవసాయ ఉత్పత్తులు క్షీణిస్తున్నాయి. చారిత్రక కట్టడాల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. జలాశయాల్లో ఆమ్లత్వం పెరిగి జీవరాశులు అంతరించిపోతున్నాయి. ఇవన్నీ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల సంభవించే విపరిణామాలు. మనిషి ఆధునిక జీవన విధానంతో శీతోష్ణస్థితిపై పడుతున్న ప్రభావం వల్ల పర్యావరణానికి కలుగుతున్న హాని, దుష్ఫలితాలు, వాటి నివారణ చర్యల గురించి పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు, నిర్వహించిన సదస్సులు, చేసిన నిర్ణయాలపై అవగాహన పెంచుకోవాలి. 

ఒక భౌగోళిక ప్రాంతంలో గాలిలోని తేమ, ఉష్ణోగ్రత, మేఘాలు, పవనాలు, వర్షపాతం లాంటి వాతావరణ అంశాలను దీర్ఘకాలంలో సగటుగా తీసుకుని శీతోష్ణస్థితిగా పేర్కొంటారు. భూమిపై జీవరాశి అవతరించిన నాటి నుంచి వాటికి శీతోష్ణస్థితితో అన్యోన్యత కొనసాగుతూనే ఉంది. అయితే గత రెండు శతాబ్దాల నుంచి మనిషి సున్నిత, యాంత్రికమైన జీవితం వల్ల కలుషిత వాయువులు గాలిలోకి విడుదలై వికృతీకరణ జరుగుతోంది. ఫలితంగా ఆమ్లవర్షాలు, ఓజోన్‌ పొర క్షీణత లాంటి శీతోష్ణ మార్పులు ఏర్పడి జీవజాతుల మనుగడకు ప్రమాదంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత, జీవనోపాధి, సుస్థిర అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి.


ఆమ్ల వర్షాలు: థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గును మండించినప్పుడు విడుదలైన సల్ఫర్‌ డయాక్సైడ్, వాహనాల నుంచి విడుదలవుతున్న నైట్రోజన్‌ ఆక్సైడ్, అగ్నిపర్వత విస్ఫోటాల ద్వారా బయటపడిన సల్ఫర్, నైట్రోజన్‌ వాయువులు వాతావరణంలోని తేమ, కాంతితో రసాయన చర్య జరుపుతాయి. ఇవి వెంటనే సల్ఫ్యూరిక్‌ ఆమ్లం, నత్రికామ్లం, హైడ్రోక్లోరిక్‌ ఆమ్లంగా మారి వర్షపు నీటితో కలిసి భూమిని చేరతాయి. ఆ విధంగా కురిసిన వర్షాలను ఆమ్ల వర్షాలు అంటారు. ఒక శతాబ్దం క్రితమే ఇంగ్లండులోని మాంచెస్టర్‌ నగరంలో ఆమ్ల వర్షాలను మొదటిసారిగా గుర్తించారు. అప్పట్లో ఈ సమస్య తీవ్రతను అంతగా పట్టించుకోలేదు. తర్వాత అది పెనుసవాలుగా మారింది. మన దేశంలో మొదటి ఆమ్ల వర్షాన్ని 1974లో ముంబయిలో గుర్తించారు. ఆమ్ల వర్షం అనే పదాన్ని మొదట 1852లో స్కాట్‌లాండ్‌కు చెందిన రాబర్ట్‌ అంగస్‌ స్మిత్‌ అనే రసాయన శాస్త్రవేత్త ఉపయోగించారు.


ఆమ్ల వర్షాల ప్రభావం:

* మొక్కల్లో పత్రహరితం క్షీణించి పంటల ఉత్పాదకత తగ్గుతుంది.


* మానవుల్లో నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. శ్వాస సంబంధ వ్యాధులు, చర్మ క్యాన్సర్‌లు వస్తాయి.


* నేలలో ఆమ్లత్వం పెరిగి నిస్సారంగా మారతాయి.


* జలాశయాల్లో ఆమ్లత్వం పెరిగి ఆల్గల్‌ బ్లూమ్‌ ఎక్కువగా వ్యాపిస్తుంది. దాంతో బ్యాక్టీరియాలు నశించి, జీవులకు ఆక్సిజన్‌ అందక జలచరాలూ చనిపోతాయి.


* అడవుల్లో ఈ వర్షాలు కురిసినప్పుడు సున్నితమైన కోనిఫెరస్‌ లాంటి వృక్షజాతులు నశించిపోతాయి.


* తాజ్‌మహల్‌ లాంటి చారిత్రక కట్టడాలు కళావిహీనమై, పగుళ్లు, గుంతలు లాంటి స్టోన్‌ లెప్రసీకి గురవుతున్నాయి.


ఆమ్ల వర్షాల ప్రభావాన్ని తగ్గించే చర్యలు


* ఆమ్లత్వం కలిగిన నీటిని, దానిలో గాఢతను నియంత్రించడానికి కాల్షియం ఆక్సైడ్, కాల్షియం కార్బొనేట్‌ రూపంలో సున్నాన్ని కలపాలి.


* సల్ఫర్‌ తక్కువగా ఉండే ఇంధనాలను వాడాలి. బొగ్గును మండించినప్పుడు అందులోని సల్ఫర్‌ని తొలగించాలి.


* శిలాజ ఇంధనాలకు బదులుగా సౌర, పవన, తరంగ ఆధారిత శక్తిని, హైడ్రోజన్‌ లాంటి హరిత ఇంధనాలను వినియోగించాలి.


* కలుషిత వాయువులను ఎక్కువగా విడుదల చేసే యంత్రాలను నవీకరించాలి.


* సల్ఫర్, నైట్రోజన్‌లను ఆధునిక సాంకేతికతను వినియోగించి హానిరహిత వాయువులుగా మార్చాలి.

ఓజోన్‌ క్షీణత: O3 రూపంలో లేత నీలిరంగులో ఉండే ఓజోన్‌ భూమి ఉపరితలం నుంచి రెండో వాతావరణ పొర అయిన స్ట్రాటో ఆవరణంలో విస్తరించి ఉంటుంది. దీనిని 1913లో ఫ్రెంచి భౌతిక శాస్త్రవేత్తలు ఛార్లెస్‌ ఫాబ్రి, హెన్రీ బుయేసన్‌ కనుక్కున్నారు. ఓజోన్‌ ధర్మాలను జి.ఎమ్‌.బి.డాబ్సన్‌ అనే బ్రిటిష్‌ శాస్త్రవేత్త వివరించాడు.ఓజోన్‌ పొర మందాన్ని ‘డాబ్సన్‌ యూనిట్‌’లలో కొలుస్తారు. అందుకు వినియోగించే పరికరాన్ని ‘డాబ్సన్‌ ఓజోన్‌ స్పెక్ట్రో ఫొటో మీటర్‌’ అంటారు. ఓజోన్‌ పొర స్ట్రాటో ఆవరణంలో 25-35 కి.మీ. ఎత్తులో 90% కేంద్రీకృతమై ఉంటుంది. మిగిలిన 10% ట్రోపో ఆవరణంలో విస్తరించి ఉంటుంది. ఓజోన్‌ పొర సూర్యుడి నుంచి వస్తున్న సౌర వికిరణంలో శక్తిమంతమైన అతినీలలోహిత కిరణాలను వడపోసి, శక్తిని మాత్రమే భూమి పైకి పంపిస్తుంది. అందువల్ల ఓజోన్‌ పొరను భూమికి రక్షణ కవచం అంటారు.ఓజోన్‌ పొర క్షీణతకు ప్రధాన కారణం రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్లు, కంప్యూటర్లు, ప్లాస్టిక్, ఫోమ్‌ల నుంచి విడుదలవుతున్న క్లోరోఫ్లోరో కార్బన్లు (CFC). ఈ ఫ్రియాన్‌ వాయువులకు అత్యధిక స్థిరత్వం ఉండటంతో ఓజోన్‌ను ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. ఒక క్లోరిన్‌ పరమాణువు రెండేళ్లపాటు స్ట్రాటో ఆవరణంలో ఉండి O3 ని క్షీణింపజేస్తుంది. పరిశ్రమలు, ఎరువుల కర్మాగారాల నుంచి విడుదలయ్యే నైట్రస్‌ ఆక్సైడ్‌ కూడా ఓజోన్‌ను హరింపజేస్తుంది. మంటలార్పడానికి ఉపయోగించే బ్రోమిన్‌ విడుదల చేసే బ్రోమో ఫ్లోరో కార్బన్లు (BFC) క్లోరిన్‌ కంటే మరింత సమర్థంగా ఓజోన్‌ పైన ప్రభావం చూపిస్తాయి. బెలూన్ల ద్వారా డాబ్సన్‌ ఓజోన్‌ స్పెక్ట్రో ఫొటో మీటర్‌ను పంపించడం ద్వారా తెలుసుకున్న వివరాల ప్రకారం 1970 నుంచి యూరప్‌పై 8% ఓజోన్‌ క్షీణించింది. అంటార్కిటికాపైన ఓజోన్‌కు పెద్ద రంధ్రం ఏర్పడింది. ఇప్పటివరకు భూమి ఉపరితలంపై సరాసరిగా 4% ఓజోన్‌ క్షీణించినట్లు తేలింది.

ఓజోన్‌ క్షీణత - ప్రభావాలు: 

* 4% ఓజోన్‌ తగ్గడం వల్ల 3% అతినీలలోహిత కిరణాలు భూమిని చేరుతున్నాయి. వీటి వల్ల మానవుల్లో కార్సినోమా, మెలనోమా అనే క్యాన్సర్లు వస్తున్నాయి.


* రక్తనాళాల్లో రక్తప్రవాహ రేటు పెరిగి, చర్మం ఎర్రబారి బొబ్బలు ఏర్పడుతున్నాయి.


* ల్యూకేమియా (బ్లడ్‌ క్యాన్సర్‌), స్త్రీలలో రొమ్ము క్యాన్సర్లు వస్తున్నాయి. కంటి సంబంధ వ్యాధులు కలుగుతున్నాయి.  


* డీఎన్‌ఏ ప్రభావితమై రోగనిరోధక శక్తి తగ్గుతోంది.


* మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ రేటు, పత్రాల్లో పత్రహరితం తగ్గి త్వరగా రాలిపోతున్నాయి. దాంతో ఉత్పాదకత, వృక్షసంపద తగ్గుతోంది.


* జీవ ఎరువుల్లో ఉపయోగించే సయనో బ్యాక్టీరియా అతినీల లోహిత కిరణాల వల్ల క్షీణించి పంట దిగుబడి తగ్గిపోతుంది. 


* ఓజోన్‌ పొర పలుచగా మారడం వల్ల భౌగోళిక ఉష్ణోగ్రతలు అధికం కావడంతో పాటు ధ్రువాల్లో మంచు కరిగి సముద్రనీటి మట్టం పెరుగుతుంది. ఆ విధంగా జరిగితే అనతికాలంలోనే మాల్దీవులు లాంటి ద్వీప దేశాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. 


ఓజోన్‌ క్షీణత అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు


వియన్నా కన్వెన్షన్‌: ఆస్ట్రియా రాజధాని వియన్నాలో 1985లో జరిగిన సమావేశంలో ఓజోన్‌ క్షీణతకు సంబంధించి పలు సూచనలతో ఒప్పందం రూపొందింది. దీనిపై భారత్‌ సహా 20 దేశాలు సంతకాలు చేశాయి.


మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం: కెనడాలోని మాంట్రియల్‌ నగరంలో 1987లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందాన్ని 197 దేశాలు ఆమోదించాయి. దీనిపై 1992లో మనదేశమూ సంతకం చేసింది. 2000 నాటి కల్లా ప్రపంచవ్యాప్తంగా క్లోరోఫ్లోరో కార్బన్ల వినియోగాన్ని నిలిపేయాలని ఈ ప్రోటోకాల్‌లో నిర్ణయించారు. ఈ సమావేశం జరిగిన సెప్టెంబరు 16వ తేదీని ‘అంతర్జాతీయ ఓజోన్‌ దినోత్సవం’గా పాటించాలని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. దీని ఆధ్వర్యంలో ‘గ్లోబల్‌ క్లైమేట్‌ అబ్జర్వింగ్‌ సిస్టమ్‌’, ‘వరల్డ్‌ వెదర్‌ వాచ్‌’ సంస్థలు పనిచేస్తుంటాయి. ఇవి ప్రపంచ శీతోష్ణ మార్పులపై వివరాలను సేకరిస్తాయి.


లండన్‌ సదస్సు: క్లోరోఫ్లోరో కార్బన్‌లకు ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని, అభివృద్ధి చెందిన దేశాలు ఆ పరిజ్ఞానాన్ని తృతీయ ప్రపంచ దేశాలకు బదిలీ చేయాలని 1992లో లండన్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు వీటిని పూర్తిగా నిషేధించాయి. 2030 కల్లా ఓజోన్‌ క్షీణతకు కారణమైన హైడ్రో ఫ్లోరో కార్బన్ల విడుదలను పూర్తిగా నియంత్రిస్తామని భారత్‌ ప్రకటించింది. ఈ మేరకు క్లోరోఫ్లోరో కార్బన్లకు బదులుగా 134-ఎ పదార్థాన్ని తయారుచేసి రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్లలో ఉపయోగిస్తున్నారు.


కిగాలి ఒప్పందం: హైడ్రో ఫ్లోరో కార్బన్లను నియంత్రించడమే లక్ష్యంగా 2016, అక్టోబరులో రువాండా రాజధాని కిగాలిలో ఒప్పందం కుదిరింది. ఇది మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ ఒప్పందానికి జరిగిన సవరణ. క్లోరోఫ్లోరో కార్బన్లకు బదులుగా హైడ్రో ఫ్లోరో కార్బన్లు వాడిన దేశాలకు కూడా నష్టాన్ని వివరించి, నిషేధించాల్సిందిగా ఒప్పందం చేశారు. ఈ సమావేశంలో 197 దేశాలు పాల్గొన్నాయి. సభ్యదేశాలను మూడు గ్రూపులుగా విభజించారు. భారత్‌ను వీటిలో 3వ గ్రూప్‌లో చేర్చారు. ఓజోన్‌ పొర పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక సమావేశాలు, ఒప్పందాలు జరుగుతూనే ఉన్నప్పటికీ వాటి అమలులో చిత్తశుద్ధి కరవవుతోంది. ప్రతి దేశం సామాజిక బాధ్యతతో మెలిగి ఒప్పంద నియమాలను అమలుచేస్తేనే ప్రపంచానికి మేలు జరుగుతుంది.


 

రచయిత: జల్లు సద్గుణరావు


 

 

Posted Date : 16-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 జాతీయ పర్యావరణ పరిరక్షణ చర్యలు 

 ప్రకృతి సంరక్షణకు ప్రభుత్వం సంసిద్ధం! 


 

  అధిక జనాభా, నాగరిక జీవనం, విచ్చలవిడిగా వనరుల వినియోగం, ఆధునిక సాంకేతికత తదితరాల కారణంగా సహజ పర్యావరణం రోజురోజుకు క్షీణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నాగరికత విస్తరిస్తున్న ప్రతిచోటా నీరు, గాలి నాణ్యత తగ్గిపోతోంది. ఆ పరిస్థితిని, అలాంటి మానవ కార్యకలాపాలను నియంత్రించేందుకు, అభివృద్ధి ఏదైనా పర్యావరణహితంగా సాగే విధంగా చేసేందుకు చట్టబద్ధమైన యంత్రాంగాలు, నిబంధనలు అవసరమవుతాయి. ప్రకృతి సమతౌల్యాన్ని, వన్యప్రాణుల మనుగడను కాపాడటంతో పాటు నష్టాలను సాధ్యమైనంత మేర నివారించాలి. ఈ లక్ష్యాలతో దేశంలో చేసిన పర్యావరణ పరిరక్షణ చట్టాలు, ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలు, వాటి ఉద్దేశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.


 


మానవుడు భూమిపై ఆవిర్భవించిన తర్వాత కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు ప్రకృతికి అనుగుణంగానే జీవించాడు. గత కొన్ని శతాబ్దాల నుంచి మానవ నాగరికత అభివృద్ధి చెందే క్రమంలో ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక అవసరాల కోసం ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకొని జీవనం సాగించడం ప్రారంభించాడు. దాంతో ప్రకృతి వనరులు దెబ్బతినడం, తరిగిపోవడం మొదలైంది. శీతోష్ణస్థితిలో మార్పులకు కారణమైంది. పర్యావరణ సమస్యలు ఒక ప్రాంతానికి పరిమితం కావు. అవి జనబాహుళ్యానికి, జీవజాతుల మనుగడకు హాని కలిగిస్తాయి. అందువల్ల పర్యావరణ సమస్యల నివారణకు అంతర్జాతీయ స్థాయిలో సమావేశాలు, సదస్సులు, ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో భాగంగానే మన దేశంలో జాతీయ స్థాయిలో కొన్ని చట్టాలు చేశారు.


1972లో స్టాక్‌హోంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మొదటిసారి జరిగిన ‘మానవుడు - పర్యావరణం’ సదస్సు తర్వాత భారత ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 253ని అనుసరించి కొన్ని సవరణలు, చట్టాలు చేసింది. అందులో భాగంగా ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేయాలని, అడవులు, వన్యప్రాణులను రక్షించాలని ఆర్టికల్‌ 48(ఎ) ద్వారా ఆదేశించింది. దేశంలోని ప్రతి పౌరుడు సహజ పర్యావరణాన్ని రక్షించాలని, అడవులను, వన్యప్రాణులను ఆదరించాలని ఆర్టికల్‌ 51(ఎ) చెబుతోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా 1980లో పర్యావరణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. 1985లో దీన్ని పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖగా మార్చారు.


వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972:  ఈ చట్టాన్ని భారత పార్లమెంటు 1972లో ఆమోదించింది. 2002లో సవరణలు చేశారు. దీని ప్రకారం ‘జాతీయ వన్యప్రాణి ప్రాధికార సంస్థ (నేషనల్‌ వైల్డ్‌ లైఫ్‌ అథారిటీ)’ అనుమతితో జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు, బయోస్పియర్‌ రిజర్వులు ఏర్పాటు చేసి వాటి సరిహద్దులు నిర్ణయిస్తారు. వన్యప్రాణులు, పక్షుల వేటను నియంత్రించడం; వాటి ఉత్పత్తులతో జరిగే వాణిజ్యంపై నియంత్రణ; నిబంధనలను అతిక్రమిస్తే తగిన జరిమానాలు, శిక్షలు విధిస్తారు. రాష్ట్రాల్లో వన్యప్రాణి పరిరక్షణ సలహా బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఈ చట్టం కింద మొదటగా అంతరించి పోతున్న మొక్కలతో పాటు జీవజాతుల జాబితాను సిద్ధం చేశారు. దాంతోపాటు పులిని జాతీయ జంతువుగా ప్రకటించారు. 1973 నుంచి పులుల సంరక్షణ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.


జలకాలుష్య నియంత్రణ చట్టం-1974: దీని ప్రకారం నీటి స్వచ్ఛతను మెరుగుపరచడం కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో కాలుష్య నియంత్రణ బోర్డులను ఏర్పాటు చేయవచ్చు. 1988లో సవరణలు చేసి మరింత బలోపేతం చేశారు. కాలుష్య నియంత్రణలు, ప్రమాణాలు పాటించని పరిశ్రమలను మూసివేసే అధికారాలను ఈ చట్టం రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులకు కల్పించింది.

 

అటవీ పరిరక్షణ చట్టం-1980: స్థానిక గిరిజనులు కలపను పొందే హక్కులను హరిస్తూ, అటవీ ఉత్పత్తులను సేకరించుకోవడాన్ని నిషేధిస్తూ, పోడు వ్యవసాయం విధానాలను కట్టడి చేస్తూ బ్రిటిష్‌ ప్రభుత్వం 1927లో అటవీ చట్టాన్ని చేసింది. దీనికి సంస్కరణలు చేస్తూ భారత ప్రభుత్వం 1980లో అటవీ పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. 1988లో మరోసారి సవరించింది. దీని ప్రకారం కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని అడవుల అభివృద్ధి కార్యకలాపాలను అడ్డుకోకూడదు. గనుల తవ్వకాలు చేపట్ట కూడదు. అరణ్యాలను అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగిస్తే ఆ మేరకు అటవీ విస్తీర్ణం పెంచాలి. అటవీ భూములను కాఫీ, తేయాకు, సుగంధద్రవ్యాలు, కొబ్బరి, ఔషధ మొక్కలు, ఉద్యాన పంటల కోసం ఉపయోగించకూడదు. వీటితోపాటు అటవీ వనరులను అవసరం మేరకు వాడుకుంటూ, దుర్వినియోగాన్ని అరికట్టి సుస్థిరతను పెంచే విధంగా అనేక నిబంధనలను చట్టంలో పొందుపరిచారు.


వాయుకాలుష్య నియంత్రణ చట్టం-1981: ఈ చట్టం ప్రకారం రాష్ట్రస్థాయి జలకాలుష్య నియంత్రణ బోర్డుల పరిధిని పెంచి, వాయుకాలుష్య నియంత్రణను కూడా అందులో  చేర్చారు. అంతేకాకుండా జలకాలుష్య నియంత్రణ బోర్డులు లేని రాష్ట్రాల్లో వాయుకాలుష్య నియంత్రణ బోర్డులను కొత్తగా ఏర్పాటు చేశారు. ఇవి వాయు ప్రమాణాలను మెరుగుపరచడం, వాయుకాలుష్య నిర్మూలనను చేపట్టడం తదితర విధులు నిర్వహిస్తాయి. 1987లో చట్టాన్ని సవరించి శబ్ద కాలుష్యాన్ని కూడా వాయుకాలుష్యంలో భాగంగా పేర్కొన్నారు.


పర్యావరణ పరిరక్షణ చట్టం-1986:  1986లో ఈ చట్టం చేశారు.  మనదేశంలో పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేసిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి నవంబరు 19 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 1986లో జరిగిన భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనను దృష్టిలో ఉంచుకొని, పర్యావరణ పరిరక్షణ కోసం అప్పటివరకు రూపొందించిన చట్టాలు, వ్యవస్థల్లో ఉన్న లోపాలను సవరిస్తూ,  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 253ని అనుసరించి చట్టాన్ని తీసుకొచ్చారు. పర్యావరణ పరిరక్షణకు, మెరుగుకు చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి, ఆ చర్యలను సమన్వయపరచడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ చట్టం అధికారం కల్పించింది.


పర్యావరణ పరిరక్షణకు, పర్యావరణ నాణ్యతను మెరుగుపరిచేందుకు, కాలుష్యాన్ని నివారించేందుకు ఈ చట్టంలోని షెడ్యూళ్లు 1-4 ప్రకారం కొన్ని నిబంధనలు రూపొందించారు. ఇవి విసర్జిత వ్యర్థపదార్థాలు, ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు నీటిలోకి వదిలిన వ్యర్థ పదార్థాల గరిష్ఠ పరిమితి 30 PPM ఉండాలి. ఒకవేళ తూముల్లోకి వదిలితే 350 PPM ఉండవచ్చు. భూతలంపై లేదా కోస్తా ప్రాంతానికి వదిలితే 100 PPM ఉండవచ్చు. ఈ చట్టం ప్రకారం పర్యావరణ పరిరక్షణకు కొన్ని ముఖ్య నిబంధనలను ప్రవేశపెట్టారు. అవి * ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ నిబంధనలు - 1989 

 

* ప్రమాదకర రసాయనాల ఉత్పత్తి, నిల్వ, దిగుమతులపై నిబంధనలు - 1989 

 

* హానికర సూక్ష్మజీవులు/జన్యుపరంగా అభివృద్ధి చేసిన జీవులు, కణాల ఉత్పత్తి, వాడకం, దిగుమతి, ఎగుమతి నిల్వలపై నిబంధనలు - 1989 

 

* జీవ, వైద్య సంబంధిత వ్యర్థాల నిర్వహణ కలిగి ఉండటంపై నిబంధనలు - 1998 


* రీ సైకిల్డ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తి వాడకంపై నిబంధనలు - 1999  * మున్సిపల్‌ ఘన వ్యర్థపదార్థాల నిర్వహణ చట్టం - 2000


ఎకో మార్క్‌-1991: దీన్ని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ సంస్థ ఏర్పాటు చేసింది. పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులకు ఎకో మార్క్‌ సర్టిఫికెట్‌ను ఈ సంస్థ జారీ చేస్తుంది. పర్యావరణంపై ప్రభావం చూపించే ఉత్పత్తులకు అనుమతులు ఇవ్వదు.


జాతీయ పర్యావరణ ట్రైబ్యునల్‌ చట్టం-1995:  వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలు జరిపేటప్పుడు వ్యక్తులు/ఆస్తులు/పర్యావరణానికి నష్టం జరిగితే తగిన పరిహారం ఇప్పించేందుకు ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.


జీవవైవిధ్య చట్టం-2002: అంతర్జాతీయ జీవవైవిధ్య కన్వెన్షన్‌ 1992, జూన్‌ 5న యూఎన్‌ఓ ఆధ్వర్యంలో బ్రెజిల్‌లోని రియో డి జెనీరొలో జరిగింది. ఈ కన్వెన్షన్‌లో భాగంగా భారత ప్రభుత్వం 2000లో జీవవైవిధ్యంపై జాతీయ విధానాలను, కార్యాచరణ వ్యూహాన్ని విడుదల చేసింది. దీని అమలు కోసం 2002, డిసెంబరులో జీవవైవిధ్య చట్టాన్ని చేసింది. దాని ప్రకారం కేంద్ర, రాష్ట్ర, స్థానిక బోర్డులతో కూడిన మూడంచెల వ్యవస్థ ఏర్పాటైంది. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం; జీవచౌర్యాన్ని అరికట్టడం; వృక్ష, జంతు జాతుల జన్యు వనరుల దోపిడీని నియంత్రించడం దాని ముఖ్య విధులు.


షెడ్యూల్డ్‌ తెగల అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006: గిరిజనులకు అటవీ ఉత్పత్తులపై హక్కులు కల్పిస్తూ, అటవీ వనరుల సంరక్షణ, గిరిజన తెగల జీవన చర్యలను సమీకృతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. సహజ వనరులను సంరక్షిస్తూ, గిరిజన సమాజాల్లో పేదరిక నిర్మూలన, అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టడం ద్వారా వారి జీవన విధానాన్ని పెంపొందిస్తారు.


నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ బిల్లు-2010: పర్యావరణ న్యాయస్థానాలను ఏర్పాటు చేయమని 2003, సెప్టెంబరులో భారత న్యాయ వ్యవహారాల కమిషన్‌ తన 186వ నివేదికలో కోరింది. ఆ మేరకు ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ప్రధాన కార్యాలయం భోపాల్‌లో ఉంది. పర్యావరణ చట్టాలను అమలు చేయడానికి, ప్రజలందరికీ పర్యావరణ హక్కులను కల్పించడానికి దీన్ని రూపొందించారు. పర్యావరణ కాలుష్యంతో హాని జరిగిన ఏ వ్యక్తికైనా హాని కలిగితే ఈ ట్రైబ్యునల్‌ ద్వారా పరిహారం పొందొచ్చు.


పర్యావరణ ప్రభావ మదింపు (ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌- ఈఐఏ): బహుళార్థ సాధక ఆనకట్టల నిర్మాణం, భారీ పరిశ్రమల ఏర్పాటు లాంటి పర్యావరణ కార్యక్రమాల వల్ల అడవుల నిర్మూలన, జంతువులు నశించడం; నేల, నీరు, వాయు కాలుష్యాలు ఏర్పడి సహజ పర్యావరణం దెబ్బతింటుంది. అందువల్ల అలాంటి పర్యావరణ భారీ మార్పును ఈఐఏ విధానం ద్వారా బేరీజు వేసుకుని,  ప్రభావాల ఉద్ధృతిని తగ్గించి, పర్యావరణ సమతౌల్యతకు, జీవ నాణ్యత విలువలు పెంచడానికి ప్రత్యామ్నాయ మార్గాలు రూపొందించడానికి వీలవుతుంది. పర్యావరణ ప్రతికూల పరిస్థితుల తీవ్రతను తగ్గించడానికి ముందుగానే అనుకూల మార్గాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అమెరికా 1970లోనే జాతీయ పర్యావరణ విధానాన్ని చట్టబద్ధం చేసి మొదటిసారిగా అమలుచేసింది. ఈ విధానం నేడు ప్రపంచానికే మార్గదర్శకంగా మారింది. భారతదేశం ఈఐఏ విధానాన్ని 1994 నుంచి రూపొందించినప్పటికీ, 1986లోనే పర్యావరణ చట్టం చేసినప్పటి నుంచి ప్రాజెక్టుల నిర్మాణానికి, ప్రణాళికల రూపకల్పనకు ముందస్తు అనుమతి తీసుకోవాలనే షరతును అమలుచేస్తోంది.

 

రచయిత: జల్లు సద్గుణరావు


 

 

Posted Date : 02-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ ఉద్యమాలు

రక్షించు.. పెంచు.. ఉపయోగించు!

 

 

ఆధునిక ప్రగతి పేరుతో పర్యావరణానికి కలిగిస్తున్న హానికి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో ప్రజలు ఉద్యమించారు. భావితరాల భద్రతకు, సుస్థిరాభివృద్ధికి పోరాటాలు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను హత్తుకొని కాపాడుకున్నారు. పాలకులను ఎదిరించి ఎందరో ప్రాణాలను పోగొట్టుకున్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరిగిన అలాంటి ఉద్యమాలు, వాటి సారథులు, ప్రజా భాగస్వామ్యం, నైతిక మద్దతు, సాధించిన ఫలితాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

 

ప్రకృతి వనరులను అవసరం మేరకు వినియోగించుకుంటూ, కొంత భావితరాలకు మిగిల్చే సుస్థిర అభివృద్ధి విధానాలకు వ్యతిరేకంగా అపరిమిత ప్రగతి ధ్యేయంతో భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు. అభివృద్ధితో పాటు పెరుగుతున్న కాలుష్య కారకాలు, నేల క్రమక్షయం, ఆమ్ల వర్షాలు, గ్లోబల్‌ వార్మింగ్, ఓజోన్‌ క్షీణత లాంటి సమస్యలకు కారణమవుతున్నాయి. ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టినప్పటికీ తగిన ఫలితాలు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో భూగోళ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అనేక ఉద్యమాలు జరిగాయి. 1962లో అమెరికాలోని సిల్వర్‌స్ప్రింగ్‌ ప్రాంతంలో పంట తెగుళ్ల నివారణకు డి.డి.టి. పురుగుమందులు ఎక్కువగా వినియోగించారు. అందులోని అవశేషాలు పంట మొక్కల్లో జీవ సాంద్రీకృతమై పర్యావరణాన్ని ఏ విధంగా దెబ్బతీశాయో ‘రేచల్‌ కార్సన్‌’ అనే ప్రపంచ పర్యావరణవేత్త ‘సైలెంట్‌ స్ప్రింగ్‌’ అనే పుస్తకంలో వివరించారు. ఇదే ఒరవడిలో భారతదేశంలో పలు పర్యావరణ ఉద్యమాలు పుట్టుకొచ్చాయి.


బిష్ణోయి ఉద్యమం: ఇది భారతదేశంలో తొలి పర్యావరణ ఉద్యమంగా చరిత్రకెక్కింది. 1730లో రాజస్థాన్‌లోని జోథ్‌పుర్‌ జిల్లాలో ఖెజార్లీ/ఖెజాడ్లి గ్రామానికి చెందిన ఉద్యమం. బిష్ణోయి జాతి (కమ్యూనిటీ) ప్రజలకు ఖేజ్రీ వృక్షాలు చాలా పవిత్రమైనవి. అయితే అప్పటి మార్వాడీ పాలకుడు మహారాజా అభయ్‌ సింగ్‌ ఆదేశంతో సైనికులు ఖేజ్రీ వృక్షాలను నరికేయడానికి సిద్ధమయ్యారు. అమృతాదేవి నాయకత్వంలో బిష్ణోయి ప్రజలు చెట్లను కౌగిలించుకుని సైనికులు వాటిని  నరకకుండా అడ్డుకున్నారు. దాంతో సైనికులు అమృతాదేవితో పాటు 363 మందిని నరికివేశారు. నిశ్చేష్టుడైన రాజు వెంటనే బిష్ణోయి గ్రామాల్లో చెట్లు నరకకుండా నిషేధం విధించాడు.


చిప్కో ఉద్యమం: చిప్కో అంటే చెట్లను హత్తుకోవడం అని అర్థం. చిప్కో ఉద్యమకారులు చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ, వాటిని హత్తుకుంటూ ఉద్యమం చేశారు. సుందర్‌లాల్‌ బహుగుణ, గౌరీదేవి, చండీప్రసాద్‌ బట్‌ మొదలైనవారు నాయకత్వం వహించారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా 1964లో ఏర్పాటుచేసిన ‘దశోలి గ్రామ స్వరాజ్య మండల్‌’ ఈ ఉద్యమానికి నాంది పలికింది. 1927లో ఆంగ్లేయులు చేసిన అటవీ చట్టంలోని ఆంక్షలను వ్యతిరేకిస్తూ 1930లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని తిలారి ప్రాంతంలో భారీ ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా 17 మంది సామాన్య ప్రజలను రాజ సైనికులు చంపేశారు. క్రమక్రమంగా ఈ ఉద్యమం బలపడి 1970 నాటికి చిప్కో ఉద్యమంగా మారింది. 1974 నుంచి గిరిజన మహిళలు గౌరీదేవి నాయకత్వంలో చెట్లను నరకకుండా రేయింబవళ్లు కాపలా కాశారు. 1980 నాటికి హిమాలయ అడవుల్లో చెట్లు నరకడాన్ని నిషేధించడంతో చిప్కో ఉద్యమం విజయం సాధించింది.


సైలెంట్‌ వ్యాలీ రక్షణ ఉద్యమం: సైలెంట్‌ వ్యాలీ అనేది కేరళలో పలక్కాడు జిల్లాలోని ఒక ఉష్ణమండల సతతహరిత అటవీ ప్రాంతం. 1973లో కేరళ ప్రభుత్వం ఈ ప్రాంతం మీదుగా ప్రహిస్తున్న కుంతిపూజ నదిపై జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టింది. దీనివల్ల ఆ ప్రాంతం పర్యావరణం దెబ్బతింటుందని, అనేక రకాల మొక్కలు, జంతువులు ముఖ్యంగా అరుదైన సింహం తోక ఉండే కోతులు అంతరించిపోతాయని శాస్త్ర సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభమైంది. చివరికి 1985లో ఆ ప్రాంతాన్ని ‘సైలెంట్‌  వ్యాలీ నేషనల్‌ పార్కు’గా ప్రకటించారు.


అప్పికో ఉద్యమం: అడవుల సంరక్షణ కోసం చిప్కో ఉద్యమం తరహాలోనే కర్ణాటకలోని ఉత్తర కన్నడ ప్రాంతంలోని సాల్కానిలో 1983లో ఈ ఉద్యమం మొదలైంది. కన్నడంలో ‘అప్పికో’ అంటే కౌగిలించుకోవడం అని అర్థం. పాండురంగ హెగ్డే దీనికి నాయకత్వం వహించారు. ఈ ప్రాంతంలో 81% అడవులు విస్తరించి ఉన్నాయి. అయితే ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కొన్ని కాగితం, కలప తయారీ పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ గ్రామ పిల్లలు, పెద్దలు చెట్లను హత్తుకుని కాంట్రాక్టర్ల బారి నుంచి వాటిని రక్షించారు. ఈ ఉద్యమం నినాదం ‘రక్షించు, పెంచు, హేతుబద్ధంగా ఉపయోగించు’.


జంగిల్‌ బచావో ఆందోళన: బిహార్‌ ప్రభుత్వం 1980లో అడవుల్లో ఉండే సాల్‌ వృక్షాల స్థానంలో టేకు వృక్షాలు పెంచాలని ప్రయత్నిచడంతో సింగ్‌బమ్‌ జిల్లాకు చెందిన గిరిజనులు సాల్‌ వృక్షాలను నరకకుండా వాటిని హత్తుకుని నిరసన తెలియజేశారు. ఈ ఉద్యమం క్రమంగా ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు విస్తరించింది.


ఝార్ఖండ్‌ జంగిల్‌ బచావో ఉద్యమం: జీవనోపాధి అందించే అటవీ వనరులను సంరక్షించుకోవడానికి, వారి పోడు వ్యవసాయ విధానాలను కొనసాగించడానికి ఝార్ఖండ్‌లోని ఆదివాసీ తెగలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగించిన ఉద్యమం. దీని తీవ్రతను గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో అటవీ భూములపై గిరిజనుల హక్కులను గుర్తిస్తూ ‘అటవీ హక్కుల చట్టం’ రూపొందించింది.


బీస్‌-నౌ ఉద్యమం:  శ్రీ జంబేశ్వర్‌ అనే మత గురువు పర్యావరణ పరిరక్షణకు 29 సూత్రాలను ప్రతిపాదించారు. అందువల్ల దీనికి బీస్‌-నౌ ఉద్యమం అని పేరొచ్చింది. ఈ ఉద్యమం ఉద్దేశం పంజాబ్, సింధు ప్రాంతాల్లో విస్తరించిన థార్‌ ఎడారి ప్రాంత వృక్ష, జంతుజాలాల రక్షణ, పర్యావరణ పరిరక్షణ. ఈ సూత్రాల ఆరోగ్య పరిరక్షణ, సామాజిక పరివర్తన, దేశభక్తిని ప్రబోధించడం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, పశుసంవర్థక పెంపుదలకు సంబంధించినవి. అవి తర్వాత కాలంలో అమృతాదేవి నాయకత్వంలో జోథ్‌పుర్‌లో బిష్ణోయి ఉద్యమానికి ప్రేరణగా నిలిచాయి.


గంగా పరిరక్షణ ఉద్యమం: గంగానది స్వచ్ఛత కోసం సాధువులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ప్రారంభించిన గాంధియన్‌ అహింసా ఉద్యమం. స్వామి నిగమానంద సనంద్‌ లాంటి సాధువులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగాలు చేశారు. ఈ ఉద్యమానికి గంగాసేవా అభియాన్‌ లాంటి సంస్థలు మద్దతుగా నిలిచాయి. భారత ప్రభుత్వం గంగా నదిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేరకుండా ‘అవిరళ్‌’ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. అవిరళ్‌ అంటే హిందీలో కొనసాగని అని అర్థం. అంటే గంగానదిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేరకుండా నదీ ప్రవాహం కొనసాగాలని చేపట్టిన ప్రాజెక్టు.


నర్మదా బచావో ఆందోళన: నర్మదా నది మధ్యప్రదేశ్‌లో పుట్టి మహారాష్ట్ర, గుజరాత్‌ మీదుగా ప్రయాణిస్తూ చివరగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది పగులు లోయ ద్వారా ప్రయాణిస్తుంది. దీనిపై గుజరాత్‌ ‘సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌’తో పాటు అనేక బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మించాలని తలపెట్టినప్పుడు ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లో పర్యావరణానికి హాని కలుగుతుందని 1985 నుంచి మేధా పాట్కర్‌ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోంది. ఈమెతో పాటు బాబా ఆమ్టే, అరుంధతిరాయ్‌ లాంటి ప్రముఖులు కూడా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. మేధా పాట్కర్‌ ఏర్పాటు చేసిన సంస్థ నర్మదా థరన్‌గ్రస్త్‌ సమితి. ఈ ఉద్యమం కోసం చేసిన కృషికి ఫలితంగా మేధాపాట్కర్‌కు 1991లో స్వీడన్‌కు చెందిన రైట్‌ లైవ్లీ హుడ్‌ అవార్డు లభించడం విశేషం.


నవధాన్య ఉద్యమం: జీవ వైవిధ్య సంరక్షణకు, సేంద్రియ వ్యవసాయానికి రక్షణ కల్పిస్తూ, జన్యు సాంకేతిక పరిజ్ఞానానికి వ్యతిరేకంగా 1982 నుంచి ఈ ఉద్యమం ప్రారంభమైంది. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆహార భద్రతలో ప్రముఖ పాత్ర వహించే నవధాన్యాల పేరుతో ఉద్యమం రూపొందింది. ఇదొక ఎన్జీవో సంస్థ. దీని స్థాపకురాలు వందనా శివ. ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశంలో దాదాపు 50కి పైగా విత్తన నిల్వల బ్యాంకులను స్థాపించారు. వేలమంది రైతులకు శిక్షణ ఇచ్చి సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించారు.


కోయల్‌కరో ఉద్యమం: ఇది కోయల్‌ కరో జలవిద్యుత్తు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఝార్ఖండ్‌లోని కోయల్‌ - కరో బేసిన్‌లో ముండా, బరావన్‌ తెగలు జరిపిన ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగంగా ‘కామ్‌ రోకో అభియాన్‌’ను ప్రారంభించారు. ఇది భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన ఉద్యమంగా నిలిచింది.


నందిగ్రామ్‌ రసాయన ఫ్యాక్టరీ వ్యతిరేక ఆందోళన: ఆర్థిక మండళ్ల ఏర్పాటులో భాగంగా కోల్‌కతా సమీపంలో నందిగ్రామ్‌ ప్రాంతంలో ఇండొనేసియీ కంపెనీ రసాయన ఫ్యాక్టరీ ఏర్పాటుకు 10 వేల ఎకరాల భూసేకరణ సందర్భంలో 2007లో జరిగిన ఆందోళన.


అవతార్‌ ఉద్యమం: ఒడిశాలో గనుల తవ్వకానికి వేదాంత కంపెనీకి అనుమతి ఇచ్చిన సందర్భంలో అక్కడి కొండ తెగలవారు వారి కులదైవమైన అవతార్‌ పేరున పర్యావరణాన్ని, వారి జీవన వనరులను పరిరక్షించుకోవడానికి చేసిన ఉద్యమం


సింగూర్‌-టాటా నానో ఫ్యాక్టరీ వివాదం: పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో టాటా నానో ఫ్యాక్టరీ స్థాపనకు భూముల సేకరణ వివాదాస్పదమైంది. తృణమూల్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ వ్యవసాయ భూమి పరిరక్షణ అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేశారు. అరుంధతీ రాయ్, అనురాధ తల్లావో, మేధాపాట్కర్‌ మద్దతు ప్రకటించారు. చివరికి ఆ కంపెనీ గుజరాత్‌లోని ఆనంద్‌ ప్రాంతానికి తరలివెళ్లింది.


కూడంకుళం అణు విద్యుత్తు ప్రాజెక్టు వివాదం: తమిళనాడులోని కూడంకుళం వద్ద నిర్మించ తలపెట్టిన అణువిద్యుత్తు ప్రాజెక్టు వల్ల అక్కడి మత్స్యకారులు జీవనోపాధి కోల్పోవడమే కాకుండా రేడియో ధార్మిక విషవాయువులు ఆరోగ్యానికి హానికరమనే ఆందోళనలతో ఈ ఉద్యమం జరిగింది.


సోంపేట ఉద్యమం: శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలంలో బీల భూముల్లో థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మించడానికి నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయితే అక్కడి రైతులు, గ్రామస్థులు తమ జీవనోపాధి పోతుందని, అక్కడ విశాలంగా విస్తరించి ఉన్న కొబ్బరి తోటలు నాశనమవుతాయని, పర్యావరణపరంగా నష్టం జరుగుతుందని తిరుగుబాటు చేశారు. 2009, డిసెంబరు 5న రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. పోలీస్‌ కాల్పులు కూడా జరిగాయి. చివరికి ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని విరమించింది.


కాజెన్‌ట్రిక్స్‌ వ్యతిరేక ఉద్యమం: కర్ణాటకలో మంగుళూరు ప్రాంతంలోని నందకూరులో నిర్మించబోయే థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్‌కు వ్యతిరేకంగా గ్రామస్థులు ఉద్యమించారు. 


ఈ విధంగా దేశంలో అనేక సందర్భాల్లో పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, పర్యావరణాన్ని, తమ జీవనోపాధిని కాపాడుకోవడానికి చేసిన ఉద్యమాలు ఎనలేని ప్రజామోదాన్ని పొందాయి.


రచయిత: జల్లు సద్గుణరావు
 

Posted Date : 14-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అతిపెద్ద స్థిర ఆవాసం సముద్రమే!

ఆవరణ వ్యవస్థ

 

 

జీవులు, వాటి పరిసరాలకు మధ్య ఉండే సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని పర్యావరణ శాస్త్రం/ఆవరణ శాస్త్రం అంటారు. ఇంగ్లిష్‌లో  ఇకాలజీగా వ్యవహరిస్తారు. ఆవరణ శాస్త్ర నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం ఆవరణ వ్యవస్థ. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో జీవ, నిర్జీవ కారకాల మధ్య పరస్పరం జీవ-భూరసాయన వలయాల ద్వారా శక్తి, పోషకాల మార్పిడి జరిగే నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని ఆవరణ వ్యవస్థ అంటారు. ఇది సహజ, కృత్రిమ ఆవరణ వ్యవస్థలుగా ఉంటుంది. ఇందులో సముద్రాన్ని అత్యంత స్థిరమైన ఆవరణ వ్యవస్థ పరిగణిస్తారు. జీవులు, నిర్జీవుల మధ్య సంబంధాలు, ఆహార గొలుసు, ఆహార జాలం, జీవావరణ పిరమిడ్, జీవ భూరసాయన వలయాలు, గతిశీలత, ఉత్పాదన లాంటి అంశాలను వివరించే ఈ వ్యవస్థ గురించి అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.

 

1.    కిందివాటిలో ఆవరణశాస్త్ర అధ్యయనంలో ముఖ్య అంశం?

1) పర్యావరణ కారకాలు

2) పర్యావరణంపై వృక్షజాతుల ప్రభావం

3) పర్యావరణానికి అనుకూలంగా వృక్షాల అనుకూలత

4) జీవులకు, వాటి పరిసరాలకు మధ్య సంబంధం


2.     ‘ఆవరణ శాస్త్రం (Ecology)’ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది?

1) టేలర్‌     2) కార్ల్‌ రీటర్‌ 

3) థామ్సన్‌     4) ఎర్నెస్ట్‌ హెకెల్‌


3.     ‘సినికాలజీ’ అనే ఆవరణ శాస్త్ర విభాగం కిందివాటిలో దేని గురించి అధ్యయనం చేస్తుంది?

1) ఒకటి కంటే ఎక్కువ జాతులు    2) ఒకే జాతి జీవులు

3) ఒకటి కంటే ఎక్కువ జంతు జాతులు   4) ఒకటి కంటే ఎక్కువ వృక్ష జాతులు


4.     ‘ఇకలాజికల్‌ పిరమిడ్‌’ అనే భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త?

1) టాన్స్‌లే              2) స్మిత్‌  

3) చార్లెస్‌ ఎల్టన్‌          4) వెబ్‌స్టర్‌


5.     ‘ఆవరణ వ్యవస్థ’ అనే పదాన్ని ప్రతిపాదించింది?

1) ఎర్నెస్ట్‌ హెకెల్‌        2) టాన్స్‌లే 

3) ఒడమ్‌              4) చార్లెస్‌ ఎల్టన్‌ 


6.     ‘ఇకలాజికల్‌ నిషే’ అనే పదం కిందివాటిలో దేన్ని నిర్వచిస్తుంది? 

1) ఒక జాతి జీవులు నివసించే ఆవాసం

2) ఒక జీవసముదాయంలో భిన్నజాతులు నిర్వర్తించే విధులు

3) ఒక జీవి తినే ఆహార రకాన్ని, ఆహార సేకరణ కోసం ఏ జాతులతో పోటీతత్వాన్ని కలిగి ఉంటుందో ఆ ప్రదేశాన్ని తెలియజేస్తుంది

4) పైవన్నీ


7.     ఒకదాంతో మరొకటి అనుసంధానమై ఉండే ఒకటి కంటే ఎక్కువ ఆహారపు గొలుసుల సముదాయాన్ని ఏమని విధంగా పిలుస్తారు?

1) శక్తి పిరమిడ్‌లు     2) ఆహారపు శృంఖలం

3) పోషక వలయం     4) ఆహారపు జాలం


8.     కింది ఏ ఆవరణ వ్యవస్థలో అత్యధిక స్థూల ప్రాథమిక ఉత్పాదన రేటు ఎక్కువగా ఉంటుంది?

1) గడ్డిమైదాన      2) మాంగ్రూవ్‌  

3) ఉష్ణమండల     4) టండ్రా


9.     ఒక జీవి ఇంకొక జీవిని తినడం ద్వారా, ఆ జీవి మరొక జీవికి ఆహారంగా వినియోగపడటం ద్వారా ఏర్పడే క్రియాశీలక వ్యవస్థ?

1) ఆహారపు జాలం        2) ఆహారపు వల 

3) ఆహారపు గొలుసు    4) జీవావరణ పిరమిడ్‌ 


10. శాకాహారుల నుంచి ఆహారాన్ని పొందే జీవులను ఏమని పిలుస్తారు?

1) ప్రాథమిక వినియోగదారులు     2) ద్వితీయ వినియోగదారులు  

3) తృతీయ వినియోగదారులు     4) అంతిమ వినియోగదారులు  


11. ఆవరణ వ్యవస్థలో పోషకాలు జీవులకు, పరిసరాలకు మధ్య చక్రీయంగా బదిలీ అయ్యే విధానాన్ని ఏమని పిలుస్తారు?

1) భూవిజ్ఞాన వలయం         2) భూరసాయన వలయం

3) భూజీవ వలయం     4) జీవ భూరసాయన వలయం


12. ఏ ఆహారపు గొలుసులోనైనా అత్యధిక సంఖ్యలో ఏ జనాభా ఉంటుంది? 

1) ప్రాథమిక వినియోగదారులు     2) తృతీయ వినియోగదారులు 

3) ఉత్పత్తిదారులు    4) విచ్ఛిన్నకారులు 


13. ఏ ఆవరణ వ్యవస్థలో అయినా ఆకుపచ్చని మొక్కలు ఏ విధి పూర్వకస్థాయిని కలిగి ఉంటాయి?

1) విచ్ఛిన్నకారులు     2) ఉత్పత్తిదారులు 

3) వినియోగదారులు     4) రూపాంతరీకరణులు


 14. కిందివాటిలో అతిపెద్ద కార్బన్‌ శోషకంగా పనిచేసేది?

1) పంట మొక్కలు     2) సముద్రాలు 

3) ఉష్ణమండల వర్షారణ్యాలు     4) సమశీతోష్ణ అడవులు


15. కింది గడ్డిమైదాన ఆహారపు గొలుసులో నిజమైన క్రమానుగత శ్రేణిని గుర్తించండి.

1) గడ్డి - కీటకాలు - పక్షులు - పాములు 

2) గడ్డి - పాములు - కీటకాలు - జింకలు 

3) గడ్డి - నక్కలు - జింకలు - ఎద్దులు 

4) బ్యాక్టీరియాలు - గడ్డి - ఎలుకలు - నక్కలు 


16. కింది ప్రవచనాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి.

ఎ) శక్తి పిరమిడ్లు అన్నీ నిట్టనిలువుగా ఉంటాయి.

బి) జీవద్రవ్యరాశి పిరమిడ్లు కొన్ని నిట్టనిలువుగా, మరికొన్ని తలకిందులుగా ఉంటాయి. 

సి) సంఖ్యా పిరమిడ్లు కొన్ని నిట్టనిలువుగా, మరికొన్ని తలకిందులుగా ఉంటాయి.

డి) శక్తి పిరమిడ్లు కొన్ని నిట్టనిలువుగా, మరికొన్ని తలకిందులుగా ఉంటాయి.

1) ఎ, బి, సి         2) ఎ, సి, డి    

3) బి, సి, డి        4) ఎ, బి, సి, డి


17. ఆస్ట్రేలియా తూర్పు తీరం వెంబడి ఉన్న గ్రేట్‌ బ్యారియర్‌ రీఫ్‌ అనేది-     

1) ఒక జనాభా       2) ఒక జీవ సముదాయం 

3) ఒక బయోన్‌      4) ఒక ఆవరణ వ్యవస్థ 


18. సముద్ర ఆవరణ వ్యవస్థలో ఫైటోప్లాంక్టాన్స్‌ (వృక్ష ప్లవకాలు) ఉత్పత్తి ఆగిపోతే కింది ఏ పరిణామాలు సంభవిస్తాయి?

1) సముద్రాలు కార్బన్‌ సింక్‌గా తమ విధిని నిర్వర్తించలేవు. 

2) సముద్ర ఆవరణ వ్యవస్థ ఆహార శృంఖలం విచ్ఛిన్నమవుతుంది.

3) సముద్రాల్లో చేపల ఉత్పత్తి దెబ్బతింటుంది.   4) పైవన్నీ


19. కిందివాటిలో భూగోళంలో కార్బన్‌ వలయానికి, కార్బన్‌ డై ఆక్సైడ్‌ను అందించని అంశం ఏది?    

1) కిరణజన్యసంయోగ క్రియ    2) శ్వాసక్రియ

3) జీవ విచ్ఛిన్నత        4) అగ్నిపర్వత విస్ఫోటం


20. జీవావరణ అనుక్రమం (ఎకలాజికల్‌ ససెషన్‌) అంటే....?

1) పర్వత ప్రాంతాల్లో వివిధ అక్షాంశాల వద్ద ఒక జాతి జీవుల స్థానంలో మరొక జాతి ఆవిర్భవించడం.

2) భౌతిక పరిస్థితుల వల్ల ఏదైనా ఆవరణ వ్యవస్థలో కాలం, ప్రాంతాలను బట్టి శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఒక జీవ సమాజ స్థానంలో మరొక జీవసమాజం ఆవిర్భావం చెందడం.

3) ఒకేసారి అనేక జాతుల జీవులు ఒకే ప్రాంతంలో ఆవిర్భవించడం.

4) ఆహార శృంఖలంలో వరుసగా ఉత్పత్తిదారుల నుంచి శాకాహారులు; శాకాహారుల నుంచి  మాంసాహారులు స్థిరీకరించడం.


21. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఒకే జాతికి చెందిన, ఒకే జీవన విధానాన్ని కలిగి జన్యుపరమైన వినిమయాలున్న సమూహాన్ని ఏమని పిలుస్తారు?    

1) జీవ సమాజం     2) జనాభా  

3) ఎకోటైప్‌     4) ఆవరణ వ్యవస్థ


22. కిందివాటిలో కృత్రిమ ఆవరణ వ్యవస్థను గుర్తించండి.

1) కొలను      2) పంటభూమి 

3) అడవి     4) మాంగ్రూవ్‌


23. కిందివాటిలో అత్యంత స్థిరమైన ఆవరణ వ్యవస్థ ఏది?

1) పర్వతం     2) అడవి     

3) ఎడారి     4) మహాసముద్రం


24. కిందివాటిలో వేటిని ‘ప్రకృతి పాకీపనివారు’ అని పిలుస్తారు?

1) కీటకాలు     2) సూక్ష్మజీవులు 

3) మానవుడు      4) జంతువులు


25. ‘కాంతి, పోషకాలు, ఆవాసాల కోసం తీవ్రంగా పోటీ’ అనేది ఏ జాతుల మధ్య ఉంటుంది?

1) విభిన్న నిషేల్లో నివసిస్తున్న ఒకే జాతికి చెందిన జీవుల మధ్య

2) ఒకే నిషేలో నివసిస్తున్న ఒకే జాతి జీవుల మధ్య

3) ఒకే నిషేలో నివసిస్తున్న భిన్న జాతి జీవుల మధ్య 

4) విభిన్న నిషేల్లో నివసిస్తున్న విభిన్న జాతి జీవుల మధ్య


26. జీవావరణ అనుక్రమంలో అంతిమ జీవ సమాజాలను ఏమని పిలుస్తారు?

1) క్లైమాక్స్‌       2) సెర్‌     

3) పయోనీర్స్‌          4) కార్నిఓరస్‌


27. ప్రపంచంలో అతి పెద్ద ఆవరణ వ్యవస్థ?

1) గడ్డిభూములు      2) సరస్సులు  

3) సముద్రాలు      4) అడవులు


28. ఆవరణ వ్యవస్థలో కొంత నిర్దిష్ట సమయంలో  శ్వాసక్రియలో వినియోగమైన కర్బన పదార్థాలతో సహా కాంతిశక్తి కిరణజన్య సంయోగక్రియ ద్వారా రసాయనిక శక్తిగా మార్పు చెందుతుంది. ఇలా ఏర్పడిన మొత్తం ఉత్పత్తి రేటును.... అంటారు.

1) నికర ద్వితీయ ఉత్పాదన         2) స్థూల ప్రాథమిక ఉత్పాదన 

3) నికర ప్రాథమిక ఉత్పాదన        4) స్థూల ద్వితీయ ఉత్పాదన


29. కిందివాటిలో ఆహరపు గొలుసుకు సంబంధించి నిజమైన దాన్ని గుర్తించండి.

1) వృక్ష ప్లవకాలు - జంతు ప్లవకాలు - చిన్న చేపలు - పెద్ద చేపలు - కొంగలు 

2) వృక్ష ప్లవకాలు - చిన్న చేపలు - జంతు ప్లవకాలు - పెద్ద చేపలు - కొంగలు 

3) జంతు ప్లవకాలు - వృక్ష ప్లవకాలు - చిన్న చేపలు - పెద్ద చేపలు  - తిమింగలాలు 

4) చిన్న చేపలు - వృక్ష ప్లవకాలు  - జంతు ప్లవకాలు - పెద్ద చేపలు - తిమింగలాలు


30. మృత కళేబరాలు - బ్యాక్టీరియా/శిలీంధ్రాలు - వృక్ష ప్లవకాలు - జంతు ప్లవకాలు - చిన్న చేపలు - పెద్ద చేపలు - కొంగలు - తిమింగలాలు.

పైన తెలిపిన ఆహారపు గొలుసు కిందివాటిలో ఏ రకానికి చెందింది?

1) మేత ఆహారపు గొలుసు 

2) భౌమ ఆవరణ వ్యవస్థలోని పూతికాహారపు గొలుసు

3) జలావరణ వ్యవస్థలోని పూతికాహారపు గొలుసు

4) పరాన్నజీవ ఆహారపు గొలుసు


31. కింది ఏ ఆవరణ వ్యవస్థలో జీవద్రవ్యరశి పిరమిడ్‌ తలకిందులుగా ఉంటుంది?

1) కొలను     2) అడవి 

3) గడ్డిభూమి      4) మాంగ్రూవ్స్‌


32. ఎకలాజికల్‌ పిరమిడ్స్‌కు సంబంధించి కింది వాటిలో తప్పుగా పేర్కొన్న వాక్యాన్ని గుర్తించండి.

1) శక్తి పిరమిడ్‌ సముద్ర ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా ఉంటుంది.

2) జీవద్రవ్యరాశి పిరమిడ్‌ మంచినీటి ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా ఉంటుంది.

3) సంఖ్యా పిరమిడ్‌లు గడ్డిమైదాన ఆవరణ వ్యవస్థలో నిట్టనిలువుగా ఉంటాయి.

4) జీవద్రవ్యరాశి పిరమిడ్లు గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థలో నిట్టనిలువుగా ఉంటాయి.


33. ఆవరణ వ్యవస్థలో శక్తి ఏ దిశలో బదిలీ అవుతుంది?

1) రేఖీయంగా  2) పురోగామి  3) అచక్రీయంగా 4) చక్రీయంగా


34. ఏ ఆహారపు గొలుసులోనైనా గరిష్ఠంగా ఎన్ని పోషక స్థాయులు ఉంటాయి?

1) 2  2) 2 లేదా 3  3) 3 లేదా 4 4) 4 లేదా 5


35. జలావరణ వ్యవస్థల్లో ఆక్సిజన్‌ సమృద్ధిగా లభించే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?

1) యుఫోటిక్‌ మండలం 2) ఫోటిక్‌ మండలం 3) ఎఫోటిక్‌ మండలం 4) ఏవీకావు 


36. కింది ప్రవచనాలను పరిశీలించి, సరైంది గుర్తించండి.

ఎ) ఆవరణ వ్యవస్థ అనేది ఒక చదరపు సెం.మీ. పరిధినైనా కలిగి ఉండొచ్చు లేదా జీవావరణం అంతా ఒక ఆవరణ వ్యవస్థ ఉండొచ్చు.

బి) ఆవరణ వ్యవస్థలో ఒకదాని నుంచి మరొకటి స్వతంత్రంగా ఉంటాయి.

1) 1 మాత్రమే సరైంది   2) 2 మాత్రమే సరైంది  3) 1, 2 సరైనవి 4) 1, 2 సరికావు 


37. కింది ప్రవచనాలను పరిశీలించి సరైంది గుర్తించండి. 

ఎ) ఆవరణ వ్యవస్థ అనేది ఒక సంవృత వ్యవస్థ.

బి) ఆవరణ వ్యవస్థ అనేది ఆవరణ శాస్త్రానికి చెందిన ఒక ప్రాథమిక, క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణం.

పైన తెలిపిన వాటిలో నిజమైన వాక్యాన్ని తెలపండి

1) ఎ మాత్రమే  2) బి మాత్రమే 3) 1, 2  4) ఏదీకాదు


38. జతపరచండి.

జాబితా - 1                     జాబితా - 2

1) శాకాహారులు               1) జంతువుల నుంచి మాత్రమే ఆహారాన్ని పొందుతాయి

2) మాంసాహారులు             2) వృక్షాలు, జంతువుల నుంచి ఆహారాన్ని పొందుతాయి

3) సర్వభక్షకులు               3) కుళ్లిన మృతకళేబరాల నుంచి ఆహారాన్ని పొందుతాయి

4) పూతికాహారులు              4) మొక్కల నుంచి మాత్రమే ఆహారాన్ని పొందుతాయి

1) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి   2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి   4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి


39. కింది ప్రవచనాలను పరిశీలించి, సరైంది గుర్తించండి.

ఎ) ఆవరణ వ్యవస్థ అనే భావనను మొదటిసారిగా 1950లో ఎ.జి. టాన్స్‌లే ప్రతిపాదించాడు.

బి) నేలలోని నత్రజని స్థాపక బ్యాక్టీరియాల సంఖ్యలో ఏ మాత్రం మార్పు వచ్చినా ఆవరణ వ్యవస్థలో అనూహ్యమైన మార్పులు సంభవించి, దాని సమతౌల్యం దెబ్బతింటుంది.

1) ఎ మాత్రమే 2)  బి మాత్రమే  3) రెండూ   4) ఏదీకాదు



సమాధానాలు

1-4; 2-2; 3-1; 4-3; 5-2; 6-4; 7-4; 8-3; 9-3; 10-2; 11-4; 12-3; 13-2; 14-2; 15-1; 16-1; 17-4; 18-4; 19-1; 20-2; 21-2; 22-2; 23-4; 24-2; 25-2; 26-1; 27-3; 28-2; 29-1; 30-3; 31-1; 32-1; 33-1; 34-4; 35-1; 36-1; 37-2; 38-1; 39-2. 


రచయిత: ఇ.వేణుగోపాల్‌
 

Posted Date : 20-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలు

భావితరాల క్షేమం కోరే ప్రగతి సుస్థిరం!

ప్రకృతి సిద్ధంగా లభించిన వనరులను అభివృద్ధి పేరుతో ఎన్నో దేశాలు విచ్చలవిడిగా వినియోగించుకుంటున్నాయి. స్వార్థం, తాత్కాలిక ప్రయోజనాల కోసం భవిష్యత్తు తరాల ఉనికిని ప్రమాదంలో పడేస్తున్నాయి. దీని పర్యవసానంగా పర్యావరణ క్షీణత, భూతాపం పెరిగిపోయి సమస్త మానవాళి దుష్పరిణామాలను ఎదుర్కొంటోంది. ప్రకృతి బాగుంటేనే మనిషి బాగుంటాడని, భవిష్యత్తు తరాల ప్రయోజనాలకు విఘాతం లేకుండా ప్రస్తుత అవసరాలను తీర్చేదే అసలైన అభివృద్ధి అన్న స్పృహ ఇప్పుడిప్పుడే క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు అమలుచేస్తున్న పర్యావరణ అనుకూల విధానాల గురించి పోటీ పరీక్షల అభ్యర్థులకు అవగాహన ఉండాలి. వనరులను సమర్థంగా వినియోగించుకునే పద్ధతులు, ఆధునిక పునరుత్పాదక వనరులు, వాటి ప్రయోజనాలు, జీవన నాణ్యతను పెంచే పరిణామాలను తెలుసుకోవాలి.

 

ప్రస్తుత ప్రజల కనీస అవసరాలు తీరుస్తూ భవిష్యత్తు తరాలకు వనరులను మిగిల్చే విధంగా, వాటిని వివేకవంతంగా (జ్యుడీషియస్‌ యుటిలైజేషన్‌) వినియోగిస్తూ సాధించే అభివృద్ధినే ‘సుస్థిరాభివృద్ధి’ అంటారు. అంటే భావితరాల అవసరాలను విస్మరించకుండా ఇప్పటి అభివృద్ధి ఉండాలని అర్థం. అయితే మానవ సంక్షేమాన్ని పెంపొందించుకోవడానికి అభివృద్ధి ఒక్కటే సరిపోదు. పర్యావరణ సంరక్షణతో కూడిన వనరుల వినియోగం, పునఃకల్పనల మధ్య సమతౌల్యతను ఏర్పరిచి అభివృద్ధి కొనసాగిస్తే నిజమైన సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది. పెరుగుతున్న జనాభా అవసరాల కోసం సహజ వనరులను పరిమితికి మించి వినియోగించడం వల్ల భూ, జలవనరులు; వాతావరణం కలుషితమై అనేక పర్యావరణ సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ సుస్థిరాభివృద్ధి సాధించడం అవసరంగా మారింది. సమగ్ర అభివృద్ధి సాధించడానికి వివిధ నూతన పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలను ఆయా రంగాల్లో అనుసరిస్తున్నారు.

సేంద్రియ వ్యవసాయం: వ్యవసాయ పంటలు, పశుసంపదలో ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచుకోవడానికి పర్యావరణానికి హాని చేసే రసాయనిక పురుగు మందులు, ఎరువులు, జన్యుమార్పిడి జీవులు, వృద్ధి హార్మోన్లను ఇటీవల ఉపయోగిస్తున్నారు. వీటి స్థానంలో పర్యావరణానికి అనుకూలమైన జీవ ఎరువులను వినియోగించి చేసే వ్యవసాయ విధానాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. సేంద్రియ వ్యవసాయ పితామహుడిగా ‘సర్‌ ఆల్బర్ట్‌ హూవార్డ్‌’ని పిలుస్తారు. మన దేశంలో సిక్కింను మొదటి సేంద్రియ వ్యవసాయ (ఆర్గానిక్‌ ఫార్మింగ్‌) రాష్ట్రంగా ప్రకటించారు. ఈ తరహా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకే ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ సంస్థ’ను స్థాపించారు.


జీవ ఎరువులు: పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భూసారాన్ని పెంచే సూక్ష్మజీవులు, వాటి మిశ్రమాన్ని జీవ ఎరువులు అంటారు. ఈ సూక్ష్మజీవులు మొక్కలతో సహజీవనం చేస్తూ పంటకు కావాల్సిన అనేక పోషకాలను అందజేస్తాయి. వీటిలో పలు రకాలున్నాయి.


ఉదా: 

* జనుము, సుబాబుల్‌ చెట్ల ఆకులు, కొమ్మలను ఎరువుగా వాడుకునే హరిత ఎరువు.

 * నాస్టాక్, అనబీనా లాంటి నీలి ఆకుపచ్చ శైవలాలు. 

* వేరు బుడిపెల్లో నివసించే రైజోబియం, స్వేచ్ఛాయుత నత్రజని స్థాపన జరిపే అజటోబాక్టర్, క్లాస్ట్రీడియం లాంటి బ్యాక్టీరియాలు.

* ఎత్తయిన మొక్కల వేర్లపై పెరిగి భూమి నుంచి ఫాస్ఫేట్లు, సల్ఫేట్లు, కాపర్, జింక్, ఇనుము లాంటి పోషకాలను మొక్కలకు అందించే శిలీంధ్రాలు జీవ ఎరువులుగా ఉపయోగపడతాయి.

* వరి పంట పొలాల్లో జీవ ఎరువుగా వాడే మొక్క ‘అజొల్లా లేదా టెరిడోఫైట్‌’.


జీవ క్రిమిసంహారాలు: పర్యావరణానికి హానిచేసే రసాయన క్రిమిసంహారాల స్థానంలో పర్యావరణ అనుకూల క్రిమిసంహారాలను వినియోగించడాన్ని జీవ క్రిమిసంహారాలు అంటారు. పంట మొక్కలు, ఉత్పత్తులను నష్టపరిచే తెగుళ్లు, క్రిమికీటకాలు, కీటక డింభకాలను అరికట్టే క్రిమిసంహారిణులను; మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు లాంటి ప్రకృతిపరమైన వాటి నుంచి తీసే ఉత్పత్తులను జీవ క్రిమిసంహారాలు అంటారు.


ఉదా: పత్తి పంటను నష్టపరిచే బోల్‌వార్మ్‌ నివారణకు వాడే బాసిల్లస్‌ తురింజియెన్సిస్‌ లాంటి బ్యాక్టీరియాలు, విరిడే కుటుంబానికి చెందిన వైరస్‌లు, బావేరియా బాసియానా, ట్రైకోడెర్మా లాంటి శిలీంధ్రాలు; కలుపు మొక్కల నివారిణిగా ఉపయోగించే యూకలిప్టస్‌ నూనె, టమాట పంటలో కీటక నాశినిగా ఉపయోగించే లెగ్యూమ్‌ జాతి మొక్కల వేర్ల నుంచి తయారుచేసిన రొటెనాన్‌ లాంటి ఉత్పత్తులను జీవ క్రిమిసంహారాలుగా వాడటం వల్ల పర్యావరణ కాలుష్యం, బయోమాగ్నిఫికేషన్‌ జరగదు.


పునరుత్పాదక ఇంధన వనరులు: వాడేకొద్దీ తిరిగి పునరుత్పత్తి చెందే సామర్థ్యం ఉన్న కాలుష్య రహితమైన ఇంధన వనరులను పునరుత్పత్తి ఇంధన వనరులు అంటారు. కాలుష్య కారకాలైన బొగ్గు, పెట్రోలియం, షెల్‌ గ్యాస్‌ లాంటి సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో పునరుత్పాదక ఇంధన వనరులైన సౌరశక్తి, పవనశక్తి, సముద్ర అలలశక్తి, సముద్ర పోటు-పాట్ల శక్తి, భూతాప శక్తి, హైడ్రోజన్‌ ఇంధనశక్తి లాంటివి వినియోగించడం పర్యావరణ అభివృద్ధికి దోహదం చేస్తుంది.


జీవ ఇంధనాల వాడకం: ఇంధన వనరుల్లో కాలుష్య రహితమైన, తక్కువ ఖర్చుతో కూడిన, సుస్థిరాభివృద్ధిని పెంపొందించేవి జీవ ఇంధన వనరులు. జీవ వ్యర్థాలను నేరుగా మండించడం లేదా సూక్ష్మజీవుల సమక్షంలో కిణ్వన ప్రక్రియకు గురిచేయడం ద్వారా శక్తిని పొందే వనరులను జీవ ఇంధనాలు అంటారు. ప్రపంచంలో అత్యధికంగా పశుసంపద భారతదేశంలోనే ఉండటం, ప్రధానంగా వ్యవసాయ దేశం కావడంతో జీవ ఇంధనాల ఉత్పత్తికి కావాల్సిన జీవ వ్యర్థాలు బాగా లభిస్తాయి. భారత ప్రభుత్వం 2018లో కొత్త జీవ ఇంధన విధానాన్ని ప్రకటించింది.


ఎ) బయోగ్యాస్‌: పశువుల పేడను ఆక్సిజన్‌ రహితంగా కుళ్లబెట్టడం లేదా పట్టణ, చెట్ల వ్యర్థాలను మిథనోమోనాస్, మిథనోకోకస్‌ లాంటి బ్యాక్టీరియాల సమక్షంలో కిణ్వన ప్రక్రియకు గురిచేయడం ద్వారా బయోగ్యాస్‌ను తయారుచేస్తారు. ఇది 60% మీథేన్, 40% కార్బన్‌ డై ఆక్సైడ్‌లతో ఉంటుంది.


బి) బయో డీజిల్‌: జట్రోపా, కానుగ, సోయాబీన్స్, పామాయిల్, రెడ్‌ సీడ్స్‌ లాంటి మొక్కల విత్తనాల నుంచి తీసిన నూనెలను ఆల్కహాల్‌ లేదా ఆమ్లాలను ఉపయోగించి చర్యనొందించే ట్రాన్స్‌ ఎస్టరిఫికేషన్‌ ప్రక్రియ ద్వారా జీవ ఇంధనాన్ని తయారుచేస్తారు. దీన్ని డీజిల్‌తో కలిపి బయోడీజిల్‌గా వినియోగించడం వల్ల పర్యావరణ మిత్రుడిగా మారుతుంది.


సి) బయో ఇథనాల్‌: చెరకు, స్వీట్‌ కార్న్, స్వీట్‌ క్యారెట్, చిలగడ దుంప, గోధుమలు, మొక్కజొన్న లాంటి వాటి నుంచి గ్రహించిన గ్లూకోజ్‌కు ఈస్ట్‌ కలిపి కిణ్వన ప్రక్రియ (మురగబెట్టడం)కు గురిచేస్తే బయో ఇథనాల్‌ తయారవుతుంది. దీన్ని పెట్రోల్‌తో కలిపి బయోపెట్రోల్‌గా వాడొచ్చు. భారత ప్రభుత్వం 2022 నాటికి పెట్రోల్‌లో 10% ఇథనాల్‌ను కలిపి విజయం సాధించింది. 2030 నాటికి 20% ఇథనాల్‌ కలపాలని నిర్ణయించింది.


డి) బయో బ్యుటనాల్‌: బయో ఇథనాల్‌ మాదిరిగా చెరకు లేదా మొక్కజొన్న మొలాసిన్‌ను క్లాస్ట్రీడియం ఎసిటోబ్యుటలికం అనే బ్యాక్టీరియా సమక్షంలో కిణ్వన ప్రక్రియ జరిపినప్పుడు ఎసిటో బ్యుటనాల్‌ ఏర్పడుతుంది. దీన్ని గృహ సంబంధ అవసరాలు, ఇంటర్నల్‌ ఇంజిన్‌ కంబుషన్‌లో వాడవచ్చు. 


ఇ) బయో హైడ్రోజన్‌ గ్యాస్‌: బయోమాస్‌ను హైడ్రోజోనోమోనాస్‌ బ్యాక్టీరియా సమక్షంలో కిణ్వన ప్రక్రియకు గురిచేసినప్పుడు హైడ్రోజన్‌ వాయువు విడుదలవుతుంది. దీన్ని రాకెట్ల ఇంధనంగా, వాహనాలు నడవడానికి ఉపయోగపడే హైడ్రోజన్‌ బ్యాటరీలోనూ వాడవచ్చు.


హరిత నగరాలు: పునరుద్ధరించదగిన కార్బన్‌ రహిత శక్తి వనరులను వినియోగించడం, ప్రత్యేకమైన, వ్యవస్థీకృత వనరులు వినియోగించగలిగేలా రహదారులు ఉండటం, పరిశ్రమలకు దూరంగా, వృక్ష సహిత నగరాలను నిర్మించడం నవీన పట్టణ అభివృద్ధికి సూచిక. ఎకోసిటీ భావనను 1975లో రిచర్డ్‌ అనే పర్యావరణవేత్త ప్రతిపాదించారు. ప్రపంచంలో మొదటి జీరో కార్బన్‌ పట్టణంగా 2008లో అబుదాబిలోని మస్టర్డ్‌ నగరాన్ని అభివృద్ధి చేశారు.


జాతీయ పర్యావరణ విధానం: భారతదేశం జాతీయ పర్యావరణ విధానాన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో భాగంగా 2006లో ప్రకటించింది. సాంఘిక న్యాయాన్ని సాధించడానికి ఆవరణ పరిమితులు తొలగించి సుస్థిరాభివృద్ధిని సాధించడం జాతీయ పర్యావరణ విధాన ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ విధానాలు, పథకాలు, ప్రాజెక్టుల్లో పర్యావరణ అంశాలను చేర్చి ఆర్థిక, సాంఘిక అభివృద్ధిని సాధించడం; జీవనోపాధికి పర్యావరణంపై ఆధారపడే పేదలకు పర్యావరణ వనరులు అందుబాటులో ఉండేలా సహజ వనరులను సంరక్షించడం; జీవనానికి ఆధారమైన సంక్షేమానికి దోహదపడే ఆవరణ వ్యవస్థను సంరక్షించడం.. లాంటి ముఖ్య ఉద్దేశాలతో జాతీయ పర్యావరణ విధానాన్ని రూపొందించారు.


ఎకో ఎఫీషియన్సీ: ‘వరల్డ్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌’ ఎకో ఎఫీషియన్సీని నిర్వచించింది. జీవన నాణ్యతను పెంచుతూ, మానవ అవసరాలను తీరుస్తూ, వస్తుసేవలను అందించే పోటీదారులను సమాజానికి అందించడమే ఎకో ఎఫీషియన్సీ. దీనిలో పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గిస్తూ, సహజవనరులు నాశనం కాకుండా చూస్తూ, వ్యర్థాలను భూమి శోషించుకునే శక్తి నిర్వహించేలా ప్రణాళికలు ఉండాలి.


గ్రీన్‌ జీడీపీ: పారిశ్రామిక వృద్ధి స్థూల దేశీయోత్పత్తిని పెంచుతున్నప్పటికీ పర్యావరణానికి నష్టం చేస్తోంది. పర్యావరణ క్షీణత పారిశ్రామిక ప్రక్రియ, సహజ వనరుల సేకరణ, వ్యవసాయోత్పత్తులను పెంచడం, పారిశ్రామిక వస్తువుల వినియోగంలో అనేక విధాలుగా అంతర్లీనంగా తిరిగి మానవాభివృద్ధికి విఘాతం కలిగిస్తోంది. సంప్రదాయ జీడీపీ పర్యావరణ నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే సంప్రదాయ జీడీపీని పర్యావరణ నష్టానికి సర్దుబాటు చేస్తే గ్రీన్‌ జీడీపీ వస్తుంది.


గ్రీన్‌ జీడీపీ (గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌) = సంప్రదాయ జీడీపీ - ఎన్విరాన్‌మెంటల్‌ (లేదా) ఎకలాజికల్‌ కాస్ట్‌


పర్యావరణ వనరుల నష్టం, పర్యావరణ నష్టాన్ని నిరోధించడానికి, నష్టపోయిన వనరుల పునరుద్ధరణకు, పర్యావరణాన్ని నిర్వహించడానికి చేసే వ్యయం ఎన్విరాన్‌మెంటల్‌ కాస్ట్‌లో ఇమిడి ఉంటుంది. 2006లో చైనా ప్రభుత్వం గ్రీన్‌ జీడీపీని ప్రకటించింది. గాలి, నీరు, ఘనపదార్థాల వల్ల ఏర్పడిన కాలుష్యం; సహజ వనరుల క్షీణత కారణంగా కలిగిన వ్యయాన్ని తీసుకుని దీన్ని గణించింది.


భారత ప్రణాళికా సంఘం గ్రీన్‌ నేషనల్‌ ఎకౌంట్‌ను తయారుచేయడానికి ప్రొఫెసర్‌ పార్థదాస్‌ గుప్తా ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ జాతీయ వనరులపై రుణాత్మక ప్రభావాన్ని లెక్కలోకి తీసుకుని జాతీయ ఉత్పత్తిని తగ్గిస్తుంది. సహజ, మానవ, భౌతిక ఆస్తులను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక ప్రగతిని అంచనా వేసేందుకు రోడ్‌ మ్యాప్‌ తయారుచేసింది. భారతదేశం గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫెసిలిటీ వ్యవస్థాపక సభ్యదేశంగా కొనసాగుతోంది. 1991లో స్థాపితమైన ఈ సంస్థకు 183 దేశాల నుంచి ఆర్థిక సాయం అందుతోంది. ఈ నిధులను ప్రపంచ పర్యావరణ ప్రయోజనాల కోసం వివిధ దేశాలకు అందిస్తున్నారు.

 

 

రచయిత: జల్లు సద్గుణరావు

 

 

Posted Date : 28-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే రేడియో!

విపత్తు నిర్వహణ - వ్యవస్థాగత ఏర్పాట్లు - ఉపశమన వ్యూహాలు

 

 

భారతదేశంలో విపత్తు నిర్వహణ కోసం నిర్దిష్టమైన, వ్యవస్థాగత నిర్మాణం బ్రిటిష్‌ పరిపాలనా కాలంలోనే మొదలైంది. 1937లో బిహార్‌ - నేపాల్‌ సరిహద్దుల్లో సంభవించిన భూకంపాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం భారతదేశ విపత్తు నిర్వహణ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఒకప్పుడు విపత్తులు సంభవించిన తర్వాత పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలు ఉండేవి. ఇప్పుడు విపత్తుల ముందస్తు నివారణ, నియంత్రణ కోసం చొరవ చూపే విధానాలు, సంసిద్ధత కార్యక్రమాలు అమలవుతున్నాయి. నేటి విపత్తు నిర్వహణ వ్యవస్థాగత నిర్మాణం, యంత్రాంగం, ఇందుకోసం చేసిన చట్టాల గురించి అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.  పలు విపత్తులను పర్యవేక్షించే మంత్రిత్వ శాఖలు, శిక్షణ ఇచ్చే సంస్థలు, ఆ శిక్షణలో ఉండే ప్రాథమికాంశాలు, విపత్కర పరిస్థితుల్లో అవలంబించే ప్రత్యామ్నాయ మార్గాలపై తగిన అవగాహన కలిగి ఉండాలి.


1. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM) ఎవరి ఆధ్వర్యంలో కొనసాగుతోంది?

1) వ్యవసాయ మంత్రిత్వశాఖ       2) హోంమంత్రిత్వ శాఖ

3) రక్షణ మంత్రిత్వశాఖ    4) ప్రధానమంత్రి


2.  జాతీయ విపత్తు నిర్వహణ చట్టం-2005 లోని ఏ సెక్షన్‌ ప్రకారం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను (NDRR) ఏర్పాటు చేశారు?

1) 41     2) 42    3) 43     4) 44


3.  14వ ఆర్థిక సంఘం ప్రకారం విపత్తు నిర్వహణకు చేపట్టే ఉపశమన చర్యల కోసం అందించే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి?

1) 75:25  2) 80:20  3) 90:10  4) 50:50


4. జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు?

1) ప్రధానమంత్రి       2) విపత్తు నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు

3) హోంమంత్రి       4) కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి


5. దుర్భిక్షం లేదా కరవు నిర్వహణ ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది?

1) శాస్త్రసాంకేతిక           2) రక్షణ    

3) హోం            4) వ్యవసాయ 


6. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం (NDMA) ఎప్పుడు చేశారు?

1) 2005, మే 25       2) 2005, జులై 25   

3) 2005, జూన్‌ 25       4) 2005, మే 20


7. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM) ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1) 2007, జనవరి 12   2) 2007, డిసెంబరు 25 

3) 2006, మార్చి 13    4) 2007, ఫిబ్రవరి 23


8. విపత్తు సమయాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే కమ్యూనికేషన్‌ సాధనం?

1) అమెచ్యూర్‌ రేడియో      2) ట్రాన్సిస్టర్‌   

3) టెలివిజన్‌       4) పైవేవీకావు


9. హోంగార్డు వ్యవస్థ లేని రాష్ట్రం?

1) మహారాష్ట్ర  2) కర్ణాటక  3) కేరళ  4) ఒడిశా


10. జాతీయ పౌర రక్షణ కళాశాలను దేశంలో ఎక్కడ ఏర్పాటు చేశారు?

1) ఢిల్లీ 2) కోల్‌కతా 3) నాగ్‌పుర్‌  4) జబల్‌పుర్‌


11. కిందివాటిలో విపత్తు సంభవించేందుకు ముందు తీసుకునే చర్యలు ఏవి?

1) నివారణ       2) సంసిద్ధత   

3) ఉపశమనం       4) పైవన్నీ


12. విపత్తు సంభవించాక తీసుకునే చర్యలు ఏవి?

1) పునరావాసం       2) పునర్నిర్మాణం   

3) ఉపశమనం       4) పైవన్నీ


13. కిందివాటిలో విపత్తు నిర్వహణపై ఏది శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది?

1) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌

2) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌

3) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌

4) నేషనల్‌ పోలీస్‌ అకాడమీ


14. జాతీయ విపత్తు నిర్వహణ విధానానికి ఏ సంవత్సరంలో మంత్రివర్గం అనుమతిచ్చింది?

1) 2009  2) 2008  3) 2007  4) 2010


15. పాఠశాల విపత్తు నిర్వహణ ప్రణాళికలో అంతర్భాగాలు?

1) ప్రమాదం గుర్తింపు, అంచనా      2) అధ్యాపకులను, పాఠశాల యాజమాన్యాన్ని చైతన్యం చేయడం

3) పటాలను తయారుచేయడం       4) పైవన్నీ


16. కోస్టల్‌ వల్నరబిలిటీ ఇండెక్స్‌ (C.V.I.) ని హైదరాబాద్‌లో విడుదల చేసినవారు ఎవరు?

1) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ    2) జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ

3) భారత వాతావరణ శాఖ    4) జాతీయ సముద్ర సమాచార సర్వీసుల కేంద్రం


17. విపత్తు నిర్వహణ బృందంలో ఉండాల్సినవి?

1) అన్వేషణ, రక్షణ బృందం           2) ప్రథమ చికిత్స బృందం

3) అవగాహన పెంపుదల బృందం   4) పైవన్నీ


18. విపత్తు నిర్వహణ చట్టం కింద ఏర్పడిన  యంత్రాంగాలు?

1) జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ    2) రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ

3) జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ    4) పైవన్నీ


19. దేశంలో విపత్తు నిర్వహణ కార్యక్రమాలను సమన్వయం చేసే కేంద్ర మంత్రిత్వశాఖ?

1) గ్రామీణాభివృద్ధి శాఖ         2) రక్షణ శాఖ

3) దేశీయ వ్యవహారాల శాఖ   4) ప్రసారాల శాఖ


20. ఏ అఖిల భారత సర్వీసు సభ్యుల ప్రాథమిక శిక్షణలో విపత్తు నిర్వహణను ఒక భాగంగా చేర్చారు?

1) ఐ.ఎ.ఎస్‌.       2) ఐ.పి.ఎస్‌.   

3) ఐ.ఎఫ్‌.ఎస్‌.       4) పైవన్నీ


21. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రచురించే ద్వివార్షిక పత్రిక పేరు?

1) డిజాస్టర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌       2) డిజాస్టర్‌ ఇండియా

3) డిజాస్టర్‌ మిటిగేషన్‌   4) ఇండియన్‌ డిజాస్టర్‌


22. కిందివాటిలో విపత్తు సంసిద్ధత, స్పందన కార్యక్రమాలతో సంబంధం ఉన్నవి?

1) భారత వాతావరణ శాఖ       2) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ

3) కేంద్ర జల కమిషన్‌      4) పైవన్నీ


23. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం సహకారంతో ‘డిజాస్టర్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం’ను ప్రారంభించింది?

1) ఒడిశా       2) తమిళనాడు   

3) గుజరాత్‌       4) కేరళ


24. ‘అమెచ్యూర్‌ రేడియో’కి మరొక పేరు?

1) సునామీ రేడియో       2) విపత్తు రేడియో   

3) పాకెట్‌ రేడియో       4) హామ్‌ రేడియో


25. ఏ విద్యాబోధనలో ఆలిండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్, విపత్తు నిర్వహణపై కార్యక్రమాలు నిర్వహించింది?

1) ఇంజినీరింగ్‌       2) మేనేజ్‌మెంట్‌ 

3) ఆర్కిటెక్చర్‌       4) కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌


26. అంతర్జాతీయ విపత్తుల ప్రతిస్పందనకు కిందివాటిలో దేనిని ఐక్యరాజ్యసమితి జవాబుదారీ చేసింది?

1) ఐక్యరాజ్యసమితి ఆఫీస్‌ ఫర్‌ కోఆర్డినేషన్‌ ఆఫ్‌ హ్యుమానిటేరియన్‌ ఎఫైర్స్‌

2) యునెస్కో

3) ఐక్యరాజ్య సమితి విపత్తు నిర్వహణ టీం

4) ఐక్యరాజ్య సమితి ఆఫీస్‌ ఆఫ్‌ మిటిగేషన్‌ ఆఫ్‌ డిజాస్టర్స్‌


27. విపత్తు నిర్వహణ సిబ్బంది దేనిలో శిక్షణ పొంది ఉండాలి?

1) ప్రాథమిక చికిత్సలో          2) పరిశుభ్రతలో

3) భయాందోళనపై సలహా ఇవ్వడంలో       4) పైవన్నీ


28. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1) 2005, డిసెంబరు 25       2) 2005, డిసెంబరు 24

3) 2005, డిసెంబరు 23       4) 2005, డిసెంబరు 20


29. దుర్భిక్షం మినహాయించి ఇతర సహజ విపత్తుల నిర్వహణ ఏ మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉంటుంది?

1) వ్యవసాయ మంత్రిత్వశాఖ   2) రక్షణ మంత్రిత్వ శాఖ

3) ప్రధానమంత్రి       4) హోంమంత్రిత్వ శాఖ


30. కమ్యూనికేషన్‌ వ్యవస్థలు పనిచేయని సందర్భాల్లో, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే కమ్యూనికేషన్‌ సాధనం?

1) హామ్‌ లేదా అమెచ్యూర్‌ రేడియో  2) గ్రామ్‌ఫోన్‌   

3) టెలివిజన్‌              4) పైవన్నీ


31. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయం
1) భారత వాతావరణ శాఖ (IMA) న్యూఢిల్లీ
2) డిజాస్టర్‌ మిటిగేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (DMI) అహ్మదాబాద్‌
3) సెంటర్‌ ఫర్‌ డిజాస్టర్‌     మేనేజ్‌మెంట్‌ (CDM) పుణె
4) సార్క్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ (SDMC) కాట్‌మాండు


32. సార్క్‌ దూర విపత్తు నిర్వహణ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది?

1) కొలంబో             2) కాట్‌మాండు

3) ఢాకా               4) న్యూఢిల్లీ   


33. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది?

1) టోక్యో (జపాన్‌)     2) జకార్తా (ఇండొనేసియా)

3) మాలె (మాల్దీవులు)  4) హొనొలులు (అమెరికా)


34. విపత్తు నిర్వహణ భాషలో DRABC అంటే?

1) డేంజర్, రెస్పాన్స్, ఎయిర్‌వే, బ్రీతింగ్, సర్క్యులేషన్‌

2) డేంజర్, రిఫ్లెక్షన్, ఎయిర్‌వే, బెడ్, కోల్డ్‌

3) డేంజర్, రిఫరెన్స్, ఎయిర్‌వే, బ్రేక్, కోల్డ్‌

4) డేంజర్, రెస్పాన్స్, ఎయిర్, బ్లడ్‌


35. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయం
1) పసిఫిక్‌ సునామీ వార్నింగ్‌ సెంటర్‌ హవాయి (అమెరికా)
2) సౌత్‌ ఏసియన్‌ డిజాస్టర్‌ నాలెడ్జ్‌ వర్క్‌ మనీలా (ఫిలిప్పీన్స్‌)
3) ఇంటర్నేషనల్‌ స్ట్రాటజీ ఫర్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌ జెనీవా (స్విట్జర్లాండ్‌)
4) ఆసియన్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌ సెంటర్‌ కోబ్‌ (జపాన్‌)


36. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థలో సభ్యుల సంఖ్య ఎంత?

1) 6     2) 9    3) 10     4) 12


37. జాతీయ విపత్తు నిర్వహణ విధానానికి మంత్రివర్గం ఎప్పుడు ఆమోదం తెలిపింది?

1) 2007  2) 2008  3) 2009  4) 2010


38. 15వ ఆర్థిక సంఘం ప్రకారం స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ 2021-2025 కాలానికి ఎంత మొత్తం నిధులు కేటాయించారు?

1) రూ.1,28,122 కోట్లు  2) రూ.61,220 కోట్లు

3) రూ.1,15,330 కోట్లు  4) రూ.92,422 కోట్లు


39. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాల కింద [NDRF] ఎన్ని బెటాలియన్లు ప్రస్తుతం దేశంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి?

1) 10    2) 12     3) 14    4) 16


40. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

విపత్తు రకం నిర్వహణ చేపట్టే మంత్రిత్వశాఖ
1) భూకంపాలు హోం మంత్రిత్వశాఖ
2) పారిశ్రామిక, రసాయన విపత్తులు పర్యావరణం, అటవీ మంత్రిత్వశాఖ
3) బయోలాజికల్‌ విపత్తులు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ
4) తుపాన్లు/ టోర్నడోలు జల మంత్రిత్వ శాఖ



సమాధానాలు

1-3; 2-4; 3-3; 4-4; 5-4; 6-4; 7-4; 8-1; 9-3; 10-3; 11-4; 12-4; 13-4; 14-1; 15-4; 16-4; 17-4; 18-1; 19-4; 20-3; 21-1; 22-4; 23-4; 24-4; 25-1; 26-4; 27-4; 28-3; 29-4; 30-1; 31-4; 32-4; 33-4; 34-1; 35-2; 36-2; 37-3; 38-1; 39-2; 40-4.


రచయిత: ఇ.వేణుగోపాల్‌ 
 

Posted Date : 04-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు

సహజ వనరుల సంరక్షణ కవచాలు! 

 

మానవుడితో పాటు సమస్త జీవరాశి మనుగడకు పర్యావరణమే ఆధారం. అయితే పారిశ్రామికీకరణ, ఆధునిక అభివృద్ధి చర్యల ఫలితంగా పర్యావరణం క్షీణిస్తోంది. దాంతో ఆవరణ వ్యవస్థల్లో అనూహ్య మార్పులు సంభవించి అందరూ అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు, మనిషి గమనాన్ని ప్రకృతికి అనుకూలంగా సాగించేందుకు పర్యావరణ శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇవి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటుతాయి, ప్రజలను చైతన్యపరుస్తాయి, ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాయి. అవసరమైతే ఆ ప్రభుత్వాలతోనే పోరాడతాయి, పర్యావరణ విరుద్ధ కార్యకలాపాలను ప్రత్యక్ష కార్యాచరణతో అడ్డుకుంటాయి. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అలాంటి ఉన్నత ఆశయాలతో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వ్యవస్థల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.


పర్యావరణ క్షీణత నేడు ప్రధాన అంతర్జాతీయ సమస్యగా మారింది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న సహజ వనరుల విధ్వంసం అన్ని దేశాలకు శాపంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సర్వమానవ సౌభ్రాత్రం కోసం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కృషి చేస్తున్నాయి.


ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌(IUCN): ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన, అతిపెద్ద పర్యావరణ సంస్థ ఇది. సహజవనరుల సంరక్షణ, స్థిరత్వం కాపాడేందుకు పనిచేసే సంస్థ. యునెస్కో ఆధ్వర్యంలో ప్రభుత్వాలు, సంరక్షణ సంస్థలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ 1948, అక్టోబరు 5న ఫ్రాన్స్‌లోని ఫౌంటెన్‌బ్లూయి ప్రాంతంలో దీనిని స్థాపించారు. ప్రస్తుతం దీని పేరు వరల్డ్‌ కన్జర్వేషన్‌ యూనియన్‌. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని గ్లాండ్‌ ప్రాంతంలో ఉంది. ఇది అంతరించిపోయే దశలో ఉన్న జంతువులు, మొక్కలు, శిలీంధ్రాలను రెడ్‌ డేటాబుక్‌లో ప్రచురిస్తుంటుంది.


కన్వెన్షన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఇన్‌ ఎన్‌డేంజర్డ్‌ స్పిసీస్‌ ఆఫ్‌ వైల్డ్‌ ఫనా అండ్‌ ఫ్లోరా (CITES) : దీనినే వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ అంటారు. 1963లో IUCN సమావేశంలో ఈ సంస్థ ఏర్పాటును నిర్ణయించారు. 1975, జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో 184 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. అంతరించే దశలో ఉన్న జంతువులు, మొక్కలను వాణిజ్యం నుంచి నిషేధించేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది.


యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(UNEP): దీనిని 1972లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం కెన్యా రాజధాని నైరోబీలో ఉంది. ఐక్యరాజ్యసమితి చేపట్టే పర్యావరణ కార్యక్రమాలను సమన్వయం చేయడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాల అమలుకు సహాయం అందించేందుకు స్థాపించారు. ఈ సంస్థ వాతావరణం, సముద్ర పర్యావరణం లాంటి అంశాల్లో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడం, వివిధ జాతీయ ప్రభుత్వాలతో కలిసి పర్యావరణ విధానాలు అమలుచేయడం, పర్యావరణ సంబంధిత విజ్ఞానాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.


ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (IPCC): దీనిని UNEP, వరల్డ్‌ మెటీరియాలాజికల్‌ ఆర్గనైజేషన్‌ కలిసి 1988లో స్థాపించాయి. ఈ సంస్థ ప్రధానంగా శీతోష్ణస్థితి మార్పు వల్ల కలిగే ఆర్థిక, సామాజిక ఇబ్బందుల గురించి సమాచారం అందిస్తుంది. ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’ నిర్వహించే ధరిత్రీ సమావేశాలు, ప్రపంచ వాతావరణ సదస్సులకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.


వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (WWF-N) : ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం ఈ సంస్థను 1961లో  IUCN స్థాపించింది. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని గ్లాండ్‌లో ఉంది. దీని గుర్తు జెయింట్‌ పాండా. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి సంబంధిత అధ్యయనాలను చేపడుతుంది. అవసరమైతే నిపుణులను ఆయా దేశాలకు పంపి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటుంది. మన దేశంలోని పులుల సంరక్షణ విషయంలో క్రియాశీలక పాత్ర పోషించింది. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే విధంగా వర్క్‌షాపులు, ఎగ్జిబిషన్‌లు, రోడ్‌ షోలు నిర్వహిస్తుంది.  శక్తి ఆదా కోసం ఈ సంస్థ చేపట్టిన అతిపెద్ద ప్రపంచవ్యాప్త ఉద్యమం ఎర్త్‌ అవర్‌. ఇది సాధారణంగా మార్చి చివరి శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 మధ్య సమయంలో లైట్లు ఆపే కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా 200 జీవవైవిధ్య ప్రాంతాలను ఎంపిక చేసి సంరక్షిస్తోంది.


గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఫెసిలిటీ(GEF): ఈ సంస్థను 1991లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్య సంరక్షణకు, శీతోష్ణస్థితి మార్పుల నివారణకు, నీరు- నేల కాలుష్యాలను తగ్గించేందుకు చేపట్టే ఖర్చులకు గ్రాంట్లు ఇస్తుంది.


గ్రీన్‌పీస్‌: కెనడాకు చెందిన పర్యావరణ కార్యకర్తలు పర్యావరణం, శాంతి, సుస్థిరత అనే నినాదాలతో 1969-72 మధ్య కాలంలో బ్రిటిష్‌ కొలంబియాలోని వాంకోవర్‌లో ఈ సంస్థను స్థాపించారు. ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉంది. ఇదొక అంతర్జాతీయ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ విధ్వంసక చర్యలను అడ్డుకుంటుంది. పర్యావరణాన్ని కలుషితం చేసే వివిధ సంస్థలు, దేశాల చర్యలను బయటపెట్టి నిరసనలు, సదస్సులు నిర్వహిస్తుంది. కొన్నిసార్లు బలప్రయోగం ద్వారా కూడా పర్యావరణ విధ్వంసక చర్యలను అడ్డుకుంటుంది.


బర్డ్‌లైఫ్‌ ఇంటర్నేషనల్‌: ప్రపంచవ్యాప్తంగా స్వతంత్రంగా పనిచేస్తున్న అనేక పక్షి సంరక్షణ సంస్థల కలయికతో ఏర్పడిన అతిపెద్ద సంస్థ ఇది. 1922లో గిల్‌బర్ట్‌ పియర్‌సన్, జీన్‌ డెలకోర్‌ స్థాపించారు. కార్యాలయం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని కేంబ్రిడ్జిలో ఉంది. ఈ సంస్థ జీవ వైవిధ్య ప్రాంతాలతో పాటు, పక్షుల ఆవాసాలు, ముఖ్యమైన పక్షులు, వాటి సంరక్షణ ప్రాంతాలను గుర్తిస్తుంది. ‘వరల్డ్‌ బర్డ్‌వాచ్‌’ అనే త్రైమాసిక మేగజీన్‌ను ప్రచురిస్తుంది.


వరల్డ్‌ నేచర్‌ ఆర్గనైజేషన్‌(WNO): ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటైన మరో సంస్థ ఇది. వివిధ దేశాల అంతర ప్రభుత్వ ఒప్పందం ప్రకారం 2014 నుంచి ఉనికిలోని వచ్చింది. జెనీవాలో కార్యాలయం ఉంది. ఇందులో భారత్‌ సభ్యత్వం తీసుకోలేదు. శీతోష్ణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.


భారతదేశంలో


వైల్డ్‌లైఫ్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా(WPSI) : ఇది భారతదేశంలోనే అత్యంత సమర్థ వన్యప్రాణి సంరక్షణ సంస్థ. బెస్ట్‌ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాపర్‌గా అవార్డు అందుకున్న మహిళ బిలిండావైట్‌ 1994లో న్యూఢిల్లీలో దీనిని స్థాపించారు. జంతువుల అక్రమ రవాణాపై ప్రభుత్వానికి సమాచారం అందించడం, వేటను నివారించడం లాంటి లక్ష్యాలతో ఈ సంస్థ పనిచేస్తుంది.


బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ(BNHS): వన్యప్రాణి సంరక్షణ, పరిశోధన కోసం ముంబయి కేంద్రంగా 1883లో ఏర్పడిన పురాతన ప్రభుత్వేతర సంస్థ. ఆవరణ వ్యవస్థలు, వన్యజాతి జీవుల సంరక్షణకు కృషి చేయడమే కాకుండా వన్యప్రాణులకు సంబంధించి చట్టాలు రూపొందించడంలో ప్రభుత్వానికి సహాయం అందిస్తుంది. హార్న్‌బిల్‌ అనే జర్నల్‌ను ప్రచురిస్తుంది.

సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (CSE): ఇది లాభాపేక్ష లేని స్వచ్ఛంద పర్యావరణ పరిశోధనా సంస్థ. అనిల్‌ అగర్వాల్‌ వ్యవస్థాపకులుగా 1980లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైంది. సైన్స్, పర్యావరణ అంశాలతో కూడిన పక్షపత్రిక ‘డౌన్‌ టు ఎర్త్‌’ను ప్రచురిస్తుంది. ఈ సంస్థ మొదటిసారిగా కోకో కోలా సింథటిక్‌ డ్రింక్స్‌లో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించింది. 1954 ఆహార కల్తీచట్టం ప్రకారం బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ వారు వాటర్‌ బాటిల్స్‌కు సర్టిఫికెట్‌ మార్కును 2001 నుంచి తప్పనిసరి చేయడంలో ఈ సంస్థ కృషి ఉంది.


పెటా - ఇండియా: పీపుల్‌ ఫర్‌ ద ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌(PETA)- జంతువుల హక్కుల రీత్యా ప్రపంచంలోనే అతిపెద్ద లాభాపేక్ష రహిత సంస్థ. యూఎస్‌ఏలోని వర్జీనియాలో 1980లో ఇంగ్రిడ్‌ న్యూకిర్క్, అలెక్సో పెచెకో స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా జంతువులను పరిరక్షిస్తూ, పర్యావరణ- జీవ వైవిధ్య సంరక్షణ కోసం శాకాహారాన్ని ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో కార్యకలాపాల కోసం 2000 సంవత్సరంలో ముంబయిలో ‘పెటా-ఇండియా’ను స్థాపించారు. ‘‘జంతువులు ఉన్నది మనుషులు తినడానికో, ప్రయోగాలు చేయడానికో, హింసించడానికో కాదు. అన్ని ప్రాణులూ సమానమే’’ అనే సందేశంతో ప్రజలు, ప్రభుత్వాలను చైతన్యపరుస్తోంది.


వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(WII): వన్యప్రాణుల నిర్వహణ, పరిశోధనలతోపాటు అటవీ అధికారుల శిక్షణ కోసం 1982లో దేహ్రాదూన్‌లో స్థాపించారు. వైల్డ్‌ లైఫ్‌ సైన్సెస్‌లో ఎమ్మెస్సీ లాంటి పలు కోర్సులను అందిస్తోంది.


జాతీయ హరిత ట్రైబ్యునల్‌(NGT): పర్యావరణ చట్టాల ఉల్లంఘన కేసుల సత్వర పరిష్కారం కోసం 2010, అక్టోబరు 18న దిల్లీ కేంద్రంగా ప్రారంభించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 (జీవించే హక్కు) 48-A కింద ఏర్పాటైంది. అడవుల రక్షణ, జీవవైవిధ్యం, కాలుష్యం లాంటి పర్యావరణ కేసులను సమర్థంగా పరిష్కరించడంతో పాటు ఆస్తులు, వ్యక్తి సంబంధ నష్టాలకు పరిహారం ఇప్పిస్తుంది. ఇలాంటి ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసిన మొదటి దేశం న్యూజిలాండ్, రెండో దేశం ఆస్ట్రేలియా, భారత్‌ మూడోది.


దేశంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న మరికొన్ని సంస్థలు: 


* ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ ఫారెస్ట్రీ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ - దేహ్రాదూన్‌ 


* ఇందిరాగాంధీ నేషనల్‌ ఫారెస్ట్‌ అకాడమీ - దేహ్రాదూన్‌ 


* వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా - దేహ్రాదూన్‌ 


* సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ - అహ్మదాబాద్‌ 


* జాతీయ జీవ వైవిద్య సంస్థ - చెన్నై 


* జాతీయ పర్యావరణ సాంకేతిక పరిశోధన సంస్థ - నాగ్‌పుర్‌ 


* వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరో - న్యూదిల్లీ * క్రోకడైల్‌ బ్యాంక్‌ ట్రస్టు - చెన్నై 


* జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా - కోల్‌కతా 


* బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా - కోల్‌కతా

 

 


 

 

 

 

                                                                                                                                                                                                                                                                                                                                                                           రచయిత: జల్లు సద్గుణరావు

 

 

 

 

Posted Date : 14-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - సహజ వనరులు

పశ్చిమ హిమాలయాల్లో వికసించే బ్రహ్మకమలం

జీవరాశులు, ఆవరణ వ్యవస్థల మనుగడకు కావాల్సిన శక్తి అవసరాలను తీర్చే వాటినే సహజ వనరులు అంటారు. అవి ప్రకృతిలో సహజసిద్ధంగా ఆవిర్భవిస్తాయి. ఆధునిక   మానవులు వాటిని విచక్షణారహితంగా వినియోగిస్తూ, కలుషితం చేస్తూ వినాశనానికి కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాలుష్య కారకాలైన సంప్రదాయ ఇంధన వనరుల వాడకాన్ని తగ్గించడం, పునరుత్పాదక శక్తి    వనరుల వినియోగాన్ని పెంచడం లక్ష్యాలుగా ప్రభుత్వాల విధానాలు రూపొందుతున్నాయి. వీటిపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. దేశంలో వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా వివిధ ప్రాంతాల్లో పెరిగే అడవులు, అక్కడి వృక్ష జాతులు, లభించే ఉత్పత్తుల గురించి తెలుసుకోవాలి. అటవీ, జల సంరక్షణ, భూ స్వభావాల ఆధారంగా పాటించాల్సిన నీటిపారుదల పద్ధతులు తదితర పురోగామి అంశాలను అర్థం చేసుకోవాలి. 

 


1.  కిందివాటిలో సాంప్రదాయేతర శక్తి వనరు కానిది  ఏది?

1) చిన్నతరహా జలవిద్యుత్తు  2) కోల్‌బెడెడ్‌ మీథేన్‌ 

3) గ్యాస్‌హైడ్రేట్స్‌       4) బొగ్గు



2.   కిందివాటిలో పునరుత్పాదక శక్తివనరు కానిది ఏది?

1) సౌరవిద్యుత్తు     2) జీవవ్యర్థం 

3) ఓషియన్‌ థర్మల్‌ ఎనర్జీ గ్రేడియెంట్         4) ముడిచమురు



3.  కిందివాటిలో నవీన శక్తివనరు ఏది?

1) హైడ్రోజన్‌ ఎనర్జీ     2) జియోథర్మల్‌ ఎనర్జీ 

3) కోల్‌బెడెడ్‌ మీథేన్‌     4) పైవన్నీ 


 

4.  కిందివాటిలో తప్పుగా పేర్కొన్న దానిని గుర్తించండి.

1) బొగ్గు - సాంప్రదాయ, పునరుత్పత్తి చెందని ఇంధన వనరు

2) బయోగ్యాస్‌ - సాంప్రదాయేతర, పునరుత్పత్తి చెందే సహజ వనరు

3) జియోథర్మల్‌ ఎనర్జీ - నవీన, పునరుత్పత్తి చెందే సహజ వనరు

4) సహజవాయువు - సాంప్రదాయ, పునరుత్పత్తి చెందే సహజ వనరు



5.  కిందివాటిలో పునరుత్పాదక శక్తి వనరు ఏది?

1) జలవిద్యుత్తు      2) చిన్నతరహా జలవిద్యుత్తు 

3) వాయుశక్తి       4) పైవన్నీ 



6.  భారతదేశంలో ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన సతతహరిత అడవులు ఏ ప్రాంతంలో ఉన్నాయి?

1) పశ్చిమ హిమాలయాలు         2) పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతం 

3) పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతం   4) తూర్పు హిమాలయాలు

 


7.  భారతదేశంలో ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించాయి?

1) తేమతో కూడిన సమశీతోష్ణ మండల పర్వత ప్రాంత అరణ్యాలు 

2) ఉప ఉష్ణమండల అనార్ధ్ర సతతహరిత అరణ్యాలు 

3) ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు 

4) ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన సతతహరిత అరణ్యాలు  



8.   షోలా అడవులు భారత్‌లో ఎక్కడ ఉన్నాయి?

1) హిమాలయాల్లో 1800 మీ. - 3300 మీ. ఎత్తులో

2) మధ్యప్రదేశ్‌లో హోషంగాబాద్‌ జిల్లాలో 

3) పంజాబ్‌ హిమాలయాలు

4) నీలగిరి, అన్నామలై కొండల్లో 1200 మీ., అంతకంటే ఎక్కువ ఎత్తులో 



9. సిగరెట్‌ పెట్టెల తయారీకి వాడే కలప పేరు? 

1) సెమూల్‌      2) హల్థా     3) సెడార్‌      4) చెస్ట్‌నట్స్‌ 



10. క్రికెట్‌ బ్యాట్‌ల తయారీకి వాడే కలప పేరు? 

1) విల్లోస్‌    2) దేవదారు    3) సిల్వర్‌ఫర్‌     4) స్ప్రూస్‌



11. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ (IUCN)) భారతదేశంలో అంతరించిపోయే వృక్షాల జాబితాలో చేర్చిన వృక్షం?

1) ఎర్రచందనం     2) మంచి గంధం   3) జిట్టెగ     4) టెక్సాస్‌ 



12. ఏ ప్రాంతంలో నిరుపయోగమైన భూమి ఎక్కువగా విస్తరించి ఉంది?

1) మధ్యప్రదేశ్‌     2) అరుణాచల్‌ ప్రదేశ్‌ 

3) ఉత్తర్‌ప్రదేశ్‌     4) జమ్ము-కశ్మీర్‌ 

 


13. సుగంధద్రవ్యాల్లో వాడే అల్ఫైన్‌ జాతి ‘బ్రహ్మకమలం’ భారతదేశంలో ఏ ప్రాంతంలో పెరుగుతుంది?

1) పశ్చిమ హిమాలయాలు     2) కేరళ కొండలు 

3) తూర్పు హిమాలయాలు     4) గంగా మైదానం 



14. పశ్చిమ బెంగాల్‌లో ‘జల్దపార సంరక్షణ కేంద్రం’లో పరిరక్షించే జంతువులు ఏవి?    

1) అడవి గాడిదలు     2) ఏనుగులు 

3) ఖడ్గమృగాలు     4) పులులు 



15. భారత దేశంలో ఆకర్షణీయ పుష్పాలున్న రోడోడెండ్రాన్‌ జాతికి చెందిన మొక్కలు ఏ ప్రాంతంలో పెరుగుతాయి?

1) లద్దాఖ్‌          2) సిక్కిం హిమాలయాలు 

3) టెరాయి మైదానం   4) వింధ్య పర్వతాలు 



16. కిందివాటిని పరిశీలించండి. 

ప్రవచనం (ఎ): రుతువపన ప్రాంతంలో పెరిగే వృక్షజాతులు వేసవిలో ఆకులు రాలుస్తాయి.

కారణం (ఆర్‌): ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే వృక్షజాతులు వేసవిలో బాష్పోత్సేక ప్రక్రియను నియంత్రించడానికి వాటి ఆకులను రాలుస్తాయి.

1) ఎ, ఆర్‌ లు సరైనవి. ఎ కి ఆర్‌ సరైన వివరణ. 

2) ఎ, ఆర్‌ లు సరైనవి. కానీ, ఎ కి ఆర్‌ సరైన వివరణ కాదు 

3) ఎ సరైంది, ఆర్‌ సరైంది కాదు. 

4) ఎ సరైంది కాదు, ఆర్‌ సరైంది.

 


17. కిందివాటిలో సవన్నా శీతోష్ణస్థితికి సంబంధించి తప్పుగా పేర్కొన్న వాటిని గుర్తించండి.

1) దేశంలో వృక్షాలు లేని సవన్నా శీతోష్ణస్థితి ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా ఉన్న ఎడారి ప్రాంతాల్లో విస్తరించి ఉంది.

2) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని నైరుతి ప్రాంతాల్లో పొడి వాతావరణంతో కూడిన సవన్నా శీతోష్ణస్థితి ఉంది.

3) ఏ ప్రాంతంలోనైతే అనార్ధ్ర ఆకురాల్చు అరణ్యాలు అగ్నిప్రమాదాల వల్ల కాలిపోతాయో ఆ ప్రదేశాలు అనార్ధ్ర సవన్నా ప్రాంతాలుగా మారిపోతాయి.

4) అనార్ధ్ర సవన్నా శీతోష్ణస్థితి ముఖ్య లక్షణం ముళ్లపొదలు, తుప్పలు, గడ్డిజాతులను కలిగి ఉండటం.



18. కిందివాటిని జతపరచండి. 

వృక్షజాతి రకం      అటవీ రకం 

1) టేకు        ఎ) సతతహరిత అరణ్యాలు 

2) యుఫోర్బియా   బి) ఆకురాల్చు అరణ్యాలు 

3) రోజ్‌ఉడ్‌       సి) సవన్నా అరణ్యాలు 

4) సుంద్రీ        డి) మాంగ్రూవ్‌ అరణ్యాలు 

1) ఎ-2, బి-1, సి-3, డి-4    

2) ఎ-1, బి-2, సి-3, డి-4

3) ఎ-2, బి-3, సి-1, డి-4    

4) ఎ-1, బి-3, సి-2, డి-4

 


19. దేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల వరుసను గుర్తించండి.

1) మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా 

2) మిజోరాం, అరుణాచల్‌ ప్రదేశ్, మేఘాలయ,   మణిపుర్‌ 

3) మధ్యప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా 

4) మధ్యప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌

 


20. క్షారత్వాన్ని తట్టుకుని పెరిగే ప్రాంతాల్లోని సతత హరితాలు దేశంలో కింద తెలిపిన ఏ ఉద్భిజ ప్రాంతంలో ఉన్నాయి?

1) ఉష్ణమండల సతతహరిత ప్రాంతాలు 

2) మాంగ్రూవ్స్‌

3) అనార్ధ్ర సతతహరితాలు         

4) ఆర్ధ్ర ఆకురాల్చు అరణ్యాలు 

 


21. దేశంలో జలవనరుల అభివృద్ధి, నియంత్రణ కోసం జాతీయ జలవనరుల మండలి (NWRC)ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1981  2) 1982  3) 1983  4) 1984



22. దేశంలో జలవనరుల నిర్వహణకు మొదటి జలవిధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?

1) 1983  2) 1987  3) 1989  4) 1992 



23. పంట పొలాలకు నీటి లభ్యతను పెంచి, దేశంలో సాగునీటి సదుపాయం ద్వారా సాగు విస్తీర్ణతను పెంచాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015-16లో ప్రారంభించిన కార్యక్రమం పేరు?

1) జలక్రాంతి అభియాన్‌  

2) ప్రధానమంత్రి కృషి సింఛాయి యోజన 

3) ఆగ్జిలరేటెడ్‌ ఇరిగేషన్‌ బెనిఫిట్‌ ప్రోగ్రాం

4) కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం

 

 

24. ఒక నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో, నదీ ప్రవాహ దారిని మళ్లించడానికి తాత్కాలికంగా నిర్మించే ఎత్తయిన కట్టడాలను ఏమని పిలుస్తారు?

1) డైక్‌ డ్యామ్స్‌     2) డైవర్షన్‌ డ్యామ్స్‌ 

3) కాఫర్‌ డ్యామ్స్‌     4) గ్రావిటీ డ్యామ్స్‌ 

 

 

25. దేశంలో రాక్‌ఫిల్‌ డ్యామ్‌ లేదా ఎంబాక్‌మెంట్‌ డ్యామ్‌ కిందివాటిలో దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు?

1) థెయిన్‌ డ్యామ్‌     2) రామ్‌గంగా 

3) నాగార్జున సాగర్‌     4) పైవన్నీ 




26. కిందివాటిని పరిశీలించండి.

ప్రవచనం (ఎ): నల్లరేగడి నేలలు పత్తి పంటకు అనుకూలమైనవి.

కారణం (ఆర్‌): నల్లరేగడి నేలలకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే నీటిపారుదల సౌకర్యాలు లేని వ్యవసాయ సాగు విధానాలకు ఇవి అనుకూలమైనవి.

1) ఎ, ఆర్‌ లు సరైనవి. ఎ కి ఆర్‌ సరైన వివరణ. 

2) ఎ, ఆర్‌లు సరైనవి. కానీ, ఎ కి ఆర్‌ సరైన వివరణ కాదు. 

3) ఎ సరైంది, ఆర్‌ సరైంది కాదు. 

4) ఎ సరైంది కాదు, ఆర్‌ సరైంది. 




27. మృత్తికా క్రమక్షయానికి సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించి, తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి.

1) గల్లీప్లగ్గింగ్‌ అంటే సాగుభూముల్లో అడ్డంగా ఏర్పడిన భూమికోతను నియంత్రించడం

2) కాంటూర్‌ ప్లవ్వింగ్‌ అంటే భూమి వాలుకి అడ్డంగా కాంటూర్‌లను అనుసరించి పొలాన్ని దున్నడం.

3) పర్వత ప్రాంతాల్లో సోపాన వ్యవసాయానికి బదులు పోడు వ్యవసాయాన్ని అనుసరించాలి.

4) మృత్తికా క్రమక్షయ నివారణకు పంటమార్పిడి విధానాన్ని అనుసరించాలి.

1) 1, 3   2) 2, 3   3) 2, 4   4) 1, 4

 


28. రెగర్‌ నేలలు అని వేటిని అంటారు?

1) ఒండ్రు నేలలు     2) నల్లరేగడి నేలలు 

3) ఎర్ర నేలలు     4) లేటరైట్‌ నేలలు


 

29. కాఫీ, తేయాకు తోటలకు అనుకూలమైన నేలలు?

1) ఎర్ర నేలలు     2) డెల్టా నేలలు 

3) పర్వత నేలలు     4) నల్లరేగడి నేలలు 



30. నీటిపారుదల తక్కువగా అవసరమయ్యే నేలలు?

1) ఒండ్రుమట్టి నేలలు     2) నల్లరేగడి నేలలు 

3) ఎర్ర నేలలు     4) లేటరైట్‌ నేలలు



31. భారత్‌లో మొదటిసారిగా జలవిద్యుత్తు ఉత్పత్తి జరిగిన ప్రదేశం?     

1) శివసముద్రం     2) డార్జిలింగ్‌ 

3) మాచ్‌ఖండ్‌     4) నరోరా 

 


32. భారత్‌లో మొదటి అణురియాక్టర్‌ పేరు?

1) కామిని     2) ఊర్వశి 

3) అప్సర     4) రావత్‌భట 



33. కిందివాటిలో సహజవాయు ఆధారిత థర్మల్‌ కేంద్రానికి సంబంధించింది?

1) గుజరాత్‌ - కవాస్‌   2) రాజస్థాన్‌ - అంటా

3) ఒడిశా - తాల్చేర్‌   4) ఉత్తర్‌ప్రదేశ్‌ - గాంధార



34. కిందివాటిలో అణురియాక్టర్లకు సంబంధించి సరికానిది?

1) కాక్రపార - గుజరాత్‌   2) కైగా - కర్ణాటక 

3) నరోరా - పంజాబ్‌    4) కుడంకుళం - తమిళనాడు 



35. న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) ముంబయి  2) హైదరాబాద్‌ 

3) చెన్నై     4) బెంగళూరు



రచయిత: ఇ.వేణుగోపాల్‌

 

సమాధానాలు

1-4; 2-4; 3-4; 4-4; 5-3; 6-3; 7-3; 8-4; 9-2; 10-1; 11-1; 12-4; 13-1; 14-3; 15-2; 16-1;  17-1; 18-3; 19-3; 20-2; 21-3; 22-2; 23-2;  24-3; 25-4; 26-1; 27-1; 28-2; 29-3; 30-2;  31-2; 32-3; 33-4; 34-3; 35-1. 

Posted Date : 22-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మనిషికి తెలిసిన భయంకర వైపరీత్యం!

భూకంపాలు - సునామీలు

 

 

మానవుడు నివారించలేని ప్రకృతి విపత్తుల్లో ప్రధానమైనవి భూకంపాలు, సునామీలు. అయితే తక్షణ స్పందన, సహాయక చర్యలతో ఈ విపత్తుల వల్ల కలిగే నష్టాలను, పర్యవసాలను కొంతవరకు తగ్గించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న విపత్తుల్లో భూకంపాలు, సునామీల వాటా ఎనిమిది శాతం వరకు ఉంది. అనుకోకుండా, అకస్మాత్తుగా విరుచుకుపడే ఈ ప్రకృతి ప్రకోపాలకు కారణాలను అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. భూకంపాలకు భూపటలంలోని ఫలకాల కదలికలు కారణమైతే, సునామీలు సర్వసాధారణ భూకంపాలతోనే సంభవిస్తాయి. ఈ అంశాలపై శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటు భారత దేశం సహా ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాలు, ఇప్పటివరకు ఎదురైన విపత్తుల నష్టాలు, సంబంధిత నివేదికలపై అవగాహన పెంచుకోవాలి. 

 

భూకంపం అంటే భూ పటలం లేదా ప్రావారంలో ఉనికిని పొంది నాభి నుంచి జనించే ప్రకంపన తరంగాల పరంపరలు. ఆకస్మిక, అంతర్జనిత బలాల వల్ల శిలలు ఆకస్మికంగా స్థానభ్రంశం చెందినప్పుడు శక్తి వెలువడుతుంది. ఈ శక్తి తరంగాల రూపంలో నలుదిశలా వ్యాపిస్తుంది. ఈ విధంగా ప్రాథమిక, ద్వితీయ, రేఖాంశ (PSL) తరంగాలు వ్యాపించి ప్రకంపనలు కలగజేస్తాయి. దీన్నే భూకంపం అంటారు. భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మాలజీ అంటారు.

సునామీ అంటే తీర కెరటం అని అర్థం. ఈ పదం జపాన్‌ భాష నుంచి వచ్చింది. ‘సు’ అంటే తీరం, ‘నామి’ అంటే కెరటం. దీన్నే ‘హార్బర్‌ వేవ్‌’ అని పిలుస్తారు. సునామీలు ప్రధానంగా నాలుగు కారణాల వల్ల సంభవిస్తాయి.

1) భూకంపంతో పాటు వచ్చే భ్రంశ చలనాలు (Fault Movements)

2)    జలాంతర్గత భూకంపాలు

3)    భూపాతం (Landslide)

4)    సముద్రంలో అగ్నిపర్వత విస్ఫోటం

5)    సముద్రంలో ఉల్కాపాతం, ఆస్టరాయిడ్స్‌ పడటం


మాదిరి ప్రశ్నలు


1.     భూకంపం ఏ వేళలో సంభవించవచ్చు?

1) ఉదయం       2) మధ్య రాత్రి   

3) మధ్యాహ్నం       4) పైవన్నీ


2. 1997, జూన్‌ 26న సమోవాలో సంభవించిన అతి పెద్ద భూకంపం రిక్టర్‌ స్కేలుపై ఎంతగా నమోదైంది?

1) 8.3   2) 4.3   3) 11.3   4) 9.3


3.     సవరించిన సిస్మిక్‌ జోన్ల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూకంపాలకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతం ఏది?

1) నల్గొండ       2) గుంటూరు   

3) ఒంగోలు       4) కడప


4.     ఇండియాలో ఉన్న ఐదు సిస్మిక్‌ జోన్లలో ఏది ఎక్కువ వాతావరణ మార్పులకు గురవుతుంది?

1) 5     2) 4     3) 3     4) 2


5.     ప్రపంచంలో నమోదైన ప్రాణాంతకమైన భూకంపం ఎప్పుడు సంభవించింది?

1) 1556  2) 1557  3) 1558  4) 1559


6.     1556లో ప్రపంచంలో నమోదైన ప్రాణాంతకమైన భూకంపం ఏ దేశంలో సంభవించింది?

1) ఇండొనేసియా       2) జపాన్‌   

3) చైనా       4) ఇండియా


7.    ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ ఏ సాగరానికి సంబంధించింది?

1) అట్లాంటిక్‌       2) పసిఫిక్‌   

3) ఇండియన్‌       4) అంటార్కిటిక్‌


8.     భూకంపాల వల్ల జరిగే పరిణామాల్లో సమ్మిళితమైంది?

1) కదలిక, నేల పగుళ్లు    2) భూపాతాలు, హిమప్రవాహాలు

3) నేల ద్రవీకరణం    4) పైవన్నీ


9.     ‘బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌’ భూకంపాలు సంభవించడానికి వీలున్న ప్రాంతాలను ఎన్ని మండలాలుగా విభజించింది?

1) 5      2) 6    3) 7    4) 8


10. 2012, ఏప్రిల్‌ 11న ఏ దేశంలో భారీ భూకంపం సంభవించి తూర్పు తీర ప్రాంతంలోని 28 దేశాల్లో సునామీ హెచ్చరికలకు దారితీసింది?

1) బ్రూనై    2) మలేసియా

3) ఇండొనేసియా    4) ఫిలిప్పీన్స్‌


11. భూకంపం నుంచి సంభవించేవి?

1) కంపనాలు            2) ప్రకంపనాలు    

3) కంపనాలు, ప్రకంపనాలు    4) ప్రకంపనాలు, మంటలు


12. ఏ దేశంలో సాధారణంగా భూకంపాలు సంభవించవు?

1) చిలీ    2) పాకిస్థాన్‌    

3) న్యూజిలాండ్‌    4) ఆస్ట్రేలియా


13. భూకంపాలు, అగ్నిపర్వతాలు దేంతో సహసంబంధాన్ని కలిగి ఉంటాయి?

1) ముడత భ్రంశం చెందిన ప్రాంతం    2) అగాథ సముద్ర మైదానం

3) పీఠభూమి ప్రాంతం    4) సముద్ర తీర ప్రాంతం


14. భారతదేశ రాష్ట్రాల విస్తృత వైపరీత్య వివరణను ప్రతిబింబించే వల్నరబిలిటీ అట్లాసును తయారుచేసింది ఎవరు?

1) బిల్డింగ్‌ మెటీరియల్స్, టెక్నాలజీ ప్రమోషన్‌ కౌన్సిల్‌    2) భారత వాతావరణ శాఖ

3) భారత విపత్తు నిర్వహణ సంస్థ    4) యునెస్కో


15. ‘నిఫే’ అనే పదం దేన్ని సూచిస్తుంది?

1) భూకంపాలు    2) భూమి అంతర్భాగం

3) భూపటలం        4) మహాసముద్రపు అడుగు భాగం


16. 2003, డిసెంబరు 26న ఏ దేశంలో శక్తిమంతమైన భూకంపం వచ్చి విపరీతమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది?

1) ఇరాన్‌    2) ఇరాక్‌    

3) సౌదీ అరేబియా    4) జోర్డాన్‌


17. ప్రబలమైన సునామీలు ఎక్కువగా వేటి వల్ల కలుగుతాయి?

1) భూకంపాలు     2) వల్కనోలు 

3) భూపాతాలు     4) తుపాన్లు


18. భారతదేశంలో ఏ రాష్ట్రానికి భూకంపాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి?    

1) ఢిల్లీ    2) ఆంధ్రప్రదేశ్‌    

3) గుజరాత్‌    4) కేరళ


19. ఇండియాలో తరచూ భూకంపాలు సంభవించే రాష్ట్రం?

1) అస్సాం    2) బిహార్‌    

3) మేఘాలయ    4) మహారాష్ట్ర


20. రిక్టర్‌ స్కేల్‌ మీద దేన్ని కొలుస్తారు?

1) ద్రవాల సాంద్రత      2) భూకంపాల తీవ్రత

3) తుపానుల వేగం      4) పర్వతాల ఎత్తు


21. కిందివాటిలో పెద్ద భూప్రకంపనం ఏది?

1) చిలీ (27-02-2010) 2) జపాన్‌ (11-03-2011)

3) ఇండొనేసియా (26-12-2004)   4) పైవన్నీ


22. భూకంపం దేనికి దారితీస్తుంది?

1) భూమి కదలికలు       2) భూపాతం   

3) ఉపరితల పగులు      4) పైవన్నీ


23. కిందివాటిలో ఏది సరైంది?

1) భూకంపం అకస్మాత్తుగా జరిగే విపత్తు.    2) భూకంపాన్ని ముందే ఊహించవచ్చు.

3) భూకంపం 25 నిమిషాల పాటు ఉంటుంది.   4) భూకంపం రాత్రి పూట సంభవిస్తుంది.


24. మధ్య అమెరికా దేశమైన నికరాగువాలో ఏ సంవత్సరంలో భూకంపాలు సంభవించి, భారీ నష్టం కలిగింది?

1) 1972  2) 1973   3) 1974  4) 1975


25. ‘సునామీ’ అనే మాట ఏ భాష నుంచి వచ్చింది?

1) జపనీస్‌       2) రష్యన్‌   

3) అరబిక్‌         4) ఫ్రెంచ్‌


26. సునామీలు తరచుగా ఏ కోస్తా ప్రదేశాల్లో వస్తాయి?

1) తూర్పు కోస్తా ప్రాంతం    2) మలబారు రేవు   

3) గల్ఫ్‌ ఆఫ్‌ కంబాట్‌      4) రాణా ఆఫ్‌ కచ్‌


27. సముద్రం లోపల భూకంపాల వల్ల ఏర్పడేవి?

1) అగ్నిపర్వతాలు      2) భూపాతాలు  

3) సునామీలు      4) వరదలు


28. ఏ రిపోర్టుల నుంచి ఇండియన్‌ సునామీ గురించి పాత రికార్డులు లభించాయి?

1) 1941 భూకంపం  2) 286 బి.సి. భూకంపం   

3) 316 బి.సి. భూకంపం       4) 326 బి.సి. భూకంపం


29. సునామీలు ఎక్కడ ఎక్కువగా సంభవిస్తాయి?

1) హిందూ మహాసముద్రం      2) అట్లాంటిక్‌ మహాసముద్రం

3) పసిఫిక్‌ మహాసముద్రం 4) మధ్యధరా సుముద్రం


30. ఏ రోజున సముద్రం లోపల తీవ్ర భూకంపం సునామీకి దారితీసి జపాన్‌ ఈశాన్య  ప్రాంతాన్ని తాకి 19,000 మంది మరణానికి కారణమైంది?

1) 2011, మార్చి 11       2) 2011, ఫిబ్రవరి 14   

3) 2011, జనవరి 11        4) 2010, మార్చి 14


31. నీటి లోతు ఆధారంగా సునామీ గంటకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది?

1) 600 - 800 కి.మీ.     2) 900 - 1100 కి.మీ. 

3) 800 - 900 కి.మీ.     4) 950 - 1150 కి.మీ.


32. సునామీ అలలు దేనివల్ల ఉద్భవిస్తాయి?

1) సముద్రగర్భ భూకంపాలు    2) అగ్నిపర్వత సంబంధ పగుళ్లు 

3) భూపాతాలు         4) పైవన్నీ


33. 2012, మార్చి 11 నాటికి ఏ దేశపు భూకంపం, సునామీ వల్ల వేలాదిమంది చనిపోయి ఒక సంవత్సరం అయ్యింది?

1) మెక్సికో     2) ఫిలిప్పీన్స్‌ 

3) ఇండొనేసియా     4) జపాన్‌


34. సముద్ర గర్భంలో భూకంపాలు సంభవించడం వల్ల ఏర్పడేవి?

1) తుపాన్లు     2) ఉరుములు 

3) మెరుపులు     4) సునామీలు


35. సునామీ తరంగాలు/అలలు సంభవించే కారణాలు?

1) సముద్రంలో భూకంపాలు     2) అగ్నిపర్వత ఉద్భోదనాలు 

3) భూపాతాలు     4) పైవన్నీ


36. ఏ సంవత్సరంలో ఇండొనేసియాలోని కాక్రటోవా ప్రాంతంలో పర్వత సంబంధ తీవ్ర విస్పోటం వల్ల 40 అడుగుల సునామీలు సంభవించాయి?

 1) 1881   2) 1882  3) 1883   4) 1884


37. భారత్‌లో జాతీయ సునామీ హెచ్చరిక వ్యవస్థ (NTWS) ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది?

1) 2004  2) 2005  3) 2006  4) 2007


38. జపాన్‌ చరిత్రలో 23 అడుగుల సునామీని కలిగించిన భూకంపం ఎప్పుడు వచ్చింది?

1) 2010, మార్చి 11     2) 2011, మార్చి 11 

3) 2010, ఫిబ్రవరి 11     4) 2011, ఫిబ్రవరి 11


39. సునామీలు అధిక భాగం సంభవించే ప్రాంతం?

1) భూకంపాల ప్రాంతం     2) ఇండొనేసియా ప్రాంతం 

3) ఇండియన్‌ సముద్రం     4) పసిఫిక్‌ సముద్రం


40. మొదటిసారిగా క్రీస్తు పూర్వం ఏ సంవత్సరంలో ఏజియన్‌ సముద్రపు ఉత్తర ప్రాంతంలో సునామీలు సంభవించినట్లు సమాచారం లభ్యమైంది?

1) క్రీ.పూ.450     2) క్రీ.పూ.412 

3) క్రీ.పూ.379     4) క్రీ.పూ.479


41. మనిషికి తెలిసిన భయంకరమైన ప్రకృతికారక వైపరీత్యం?

1) తుపాన్లు     2) సునామీలు 

3) భూపాతాలు     4) గాలివానలు


42. పసిఫిక్‌ సునామీ హెచ్చరిక వ్యవస్థని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

1) 1948      2) 1952  

3) 1949      4) 1947



సమాధానాలు


1-4; 2-1; 3-3; 4-1; 5-1; 6-3; 7-2; 8-4; 9-1; 10-3; 11-3; 12-4; 13-1; 14-1; 15-2; 16-1; 17-1; 18-3; 19-1; 20-2; 21-4; 22-4; 23-1; 24-1; 25-1; 26-1; 27-3; 28-4; 29-3; 30-1; 31-1; 32-4; 33-4; 34-4; 35-4; 36-3; 37-4; 38-2; 39-4; 40-3; 41-2; 42-3.


రచయిత: ఇ.వేణుగోపాల్‌ 
 

Posted Date : 01-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవవైవిధ్యం

ఉభయచరాల స్వర్గధామం పశ్చిమ కనుమలు!

 

 

భూమిపై జీవుల మధ్య ఉండే భేదమే జీవవైవిధ్యం. ఇది సృష్టి సహజ లక్షణం. ఆహారచట్రంలో జీవులన్నీ ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తుంటాయి. అయితే  మానవుడి చర్యల కారణంగా ప్రకృతిలోని ఈ సమతూకం దెబ్బతింటోంది. పర్యావరణ కాలుష్యం, పురుగుమందుల వినియోగంతో జీవవైవిధ్యం క్షీణిస్తోంది. ఈ అంశం ప్రాధాన్యం, పర్యవసానాలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవ వైవిధ్య ప్రాంతాలు, వాటి ప్రత్యేకతలు, వ్యవస్థాగతంగా జరుగుతున్న సంరక్షణ చర్యలు, సంబంధిత ఒప్పందాలు, చట్టాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

 

 

జీవావరణంలో భౌమ, జలావరణ వ్యవస్థల్లోని సమస్త జీవజాతుల మధ్య జన్యు, జాతుల, ఆవరణ వ్యవస్థల పరమైన తేడాలు, వైవిధ్యతనే ‘జీవవైవిధ్యం’ అంటారు. 1992లో బ్రెజిల్‌లోని రియోలో జరిగిన జీవవైవిధ్య ఒప్పంద సదస్సులో ఈ నిర్వచనం ఇచ్చారు. 1986లో రోసెన్‌ అనే శాస్త్రవేత్త జీవవైవిధ్యం అనే పదాన్ని ప్రతిపాదించారు. విల్సన్‌ అనే వ్యక్తి ‘బయోడైవర్సిటీ’ అనే   పుస్తకాన్ని విడుదల చేసి జీవ వైవిధ్యానికి విశేష ప్రాచుర్యం కల్పించారు. భూమిపై ఉండే జీవవైవిధ్యాన్ని  3 రకాలుగా పేర్కొంటారు. అవి.. 1) జన్యు వైవిధ్యం  2) జాతుల వైవిధ్యం 3) ఆవరణ వ్యవస్థల వైవిధ్యం


1.    2021, 2022 సంవత్సరాలకు 15వ జీవవైవిధ్య సదస్సు ఎక్కడ జరిగింది?

1) టోక్యో     2) న్యూయార్క్‌   

3) బ్రెజిల్‌       4) చైనా


2.     ‘పర్యావరణ వనరులు, జీవవైవిధ్యం, దేశ వారసత్వ సంపదను పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.’ అని పేర్కొనే రాజ్యాంగంలోని నిబంధన ఏది?

1) 48 ఎ     2) 49 ఎ 

3) 50 ఎ(జి)    4) 51 ఎ(జి)


3.     ‘పర్యావరణ వనరులను, జీవవైవిధ్యతను, దేశ  వారసత్వ సంపదను పరిరక్షించే బాధ్యత దేశ పౌరులదే.’ అని పేర్కొనే రాజ్యాంగంలోనే నిబంధన-

1) 48 ఎ  2) 49 ఎ 3) 50 ఎ(జి) 4) 51 ఎ(జి)


4.     జీవవైవిధ్య ఒప్పందం (సీబీడీ) అమల్లోకి వచ్చిన సంవత్సరం?

1) 1992  2) 1993  3) 1994  4) 1995


5.     కిందివాటిని జతపరచండి. 

పరిశోధన సంస్థ కేంద్ర కార్యాలయం
1) ద ఇంటర్నేషనల్‌ బోర్డ్‌ ఫర్‌ ప్లాంట్‌ జీనోమిక్‌ రిసెర్చ్‌ ఎ) రోమ్‌
2) ఇంటర్నేషనల్‌ క్రాప్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సెమీ ఎరిడ్‌ ట్రాపిక్స్‌ బి) హైదరాబాద్‌
3) ట్రాపికల్‌ బొటానికల్‌ గార్డెన్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సి) త్రివేండ్రం
4) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ జీనోమిక్‌ రిసోర్సెస్‌ డి) న్యూఢిల్లీ

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి        2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి

3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి         4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి


6.     దేశంలో ఉభయచర, సరీసృప జాతుల వైవిధ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం?

1) తూర్పు హిమాలయాలు     2) పశ్చిమ హిమాలయాలు    

3) పశ్చిమ కనుమలు    4) తూర్పు కనుమలు


7.     అంతర్జాతీయ జీవవైవిధ్య ఒప్పందానికి సంబంధించిన సీఓపీ-13వ సదస్సు 2016, డిసెంబరులో ఎక్కడ జరిగింది?

1) జెనీవా     2) రోమ్‌ 

3) డర్బన్‌     4) కాన్‌కున్‌ (మెక్సికో)


8.     కిందివాటిలో వన్యమృగ సంరక్షణకు సంబంధించి ‘స్థానిక జాతులు’ అనే పదాన్ని సంపూర్ణంగా నిర్వచించే వాక్యం ఏది?

1) పరాన్నజీవుల దాడి వల్ల సందిగ్ధ స్థితిలో ఉన్న జాతుల సంఖ్య తగ్గడం.

2) అన్ని ప్రాంతాల్లో నివసించే జాతులు.

3) ప్రమాద స్థితిని ఎదుర్కొంటున్న జాతులు కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే నివసించడం.

4) కొన్ని నిర్దిష్ట ప్రాంతాలను మాత్రమే ఆవాసంగా చేసుకుని నివసించే జాతులు. ఇవి ఇతర ప్రాంతాల్లో నివసించలేవు.


9.     బయోస్ఫియర్‌ పరిధిలోని ఏ ప్రాంతంలో మానవ చర్యలను అనుమతిస్తారు?

1) కోర్‌ మండలం      2) బఫర్‌ మండలం  3) పరివర్తన మండలం      4) సుస్థిర మండలం

10. భారతదేశంలో మామిడి పంటకు సంబంధించి విభిన్న రుచులు, రంగులు, స్థాయుల్లో సుక్రోజ్‌ శాతం, నార శాతంతో భిన్నరకాల జాతులు ఉండటానికి కిందివాటిలో కారణమైన అంశమేది?

1) జాతుల వైవిధ్యం      2) ఉత్పరివర్తనాల ప్రేరేపణ 

3) సంకరీకరణం      4) జన్యు వైవిధ్యం


11. వ్యవసాయ పంట మొక్కలకు సంబంధించి జన్యు వైవిధ్యం (Genetic Diversity) ప్రమాద స్థితిలో పడటానికి కిందివాటిలో కారణమేది?

1) అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ప్రవేశపెట్టడం

2) రసాయనిక ఎరువులను పరిమితికి మించి వినియోగించడం

3) జీవక్రిమిసంహారకాలను పరిమితికి మించి వినియోగించడం    4) పైవన్నీ


12. కిందివాటిని పరిశీలించండి.

ప్రతిపాదన (A): ఉష్ణమండల వర్షారణ్య ఆవరణ వ్యవస్థల్లో జాతుల వైవిధ్యం అత్యధికంగా ఉంది

కారణం (R): జాతుల వైవిధ్యం అంటే ప్రమాణ వైశాల్యం ఉన్న భూభాగంలో ఎక్కువ సంఖ్యలో జీవులు నివసిస్తూ ఉండటం

1) A, R లు నిజమైనవి. A కి R సరైన వివరణ.

2) A, R లు నిజమైనవి. కానీ, A కి R సరైన వివరణ కాదు.

3) A నిజమైంది, R నిజమైంది కాదు.

4) A నిజమైంది కాదు, R నిజమైంది.


13. కిందివాటిలో జాతుల వైవిధ్యం అతి తక్కువగా ఉండే ఆవరణ వ్యవస్థ ఏది?

1) ఎడారి      2) టండ్రా  

3) గడ్డిమైదానం      4) ఆకురాల్చు అడవులు


14. కిందివాటిని జతపరచండి.

పరిశోధనా సంస్థ   కేంద్ర కార్యాలయం
1) ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎ) హైదరాబాద్‌
2) ఫారెస్ట్‌ రిసెర్చ్‌ సెంటర్‌ బి) జబల్‌పుర్‌
3) ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ జెనెటిక్స్‌ అండ్‌ ట్రీ బ్రీడింగ్‌  సి) దేహ్రాదూన్‌
4) ట్రాపికల్‌ ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డి) కోయంబత్తూర్‌ 

1) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి        2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి

3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి         4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి


15. పశ్చిమ కనుమలు - శ్రీలంక ఇకలాజికల్‌ హాట్‌ స్పాట్‌కి సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించి, సరైనవి గుర్తించండి.

ఎ) ఈ ప్రాంతంలో స్థానిక జాతులు తక్కువగా ఉన్నాయి.

బి) 60% ఉభయచరాలు, సరీసృపాలు ఈ ప్రాంతానికి స్థానికమైనవి.

సి) అగస్త్యమలై కొండలు ఇకలాజికల్‌ హాట్‌స్పాట్‌లోని ఎక్కువ జీవజాతులకు నిలయమైన ప్రాంతాలు.

1) ఎ, బి               2) బి, సి   

3) సి మాత్రమే          4) ఎ, బి, సి 


16. కింది ప్రవచనాలను పరిశీలించి, నిజమైన వాటిని గుర్తించండి.

ఎ) జీవవైవిధ్య చట్టం-2002ను పార్లమెంటు చట్టబద్ధం చేసింది.

బి) 1992 ధరిత్రీ సమావేశంలో ఆమోదించిన ‘కన్వెన్షన్‌ ఆన్‌ బయోలాజికల్‌ డైవర్సిటీ (CBD) లోని నిబంధనలను దేశంలో అమలు చేయడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం.

1) ఎ మాత్రమే       2) బి మాత్రమే  

3) ఎ, బి      4) ఏదీకాదు


17. ఏదైనా నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో జీవవైవిధ్య ప్రమాద స్థిÄతిని ఎదుర్కోవడానికి ఉన్న కారణాల్లో కిందివాటిలో ఒక అంశం కానిది?

1) గ్లోబల్‌ వార్మింగ్‌            2) ఆవాసాలు విచ్ఛిన్నమవడం

3) పరస్థానీయ జాతుల ప్రవేశం         4) శాకాహారాన్ని ప్రోత్సహించడం


18. జీవవైవిధ్య క్షీణతకు సంబంధించి కిందివాటిలో మానవ ప్రేరిత కారణాలేవి? 

ఎ) ఆవాసాల విస్తృతి తగ్గిపోవడం

బి) వన్యజాతి జీవుల్లోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విలువలను పరిమితికి మించి దోపిడీ చేయడం

సి) పర్యావరణ కాలుష్యం    డి) గ్లోబల్‌ వార్మింగ్‌

1) ఎ, బి, సి        2) ఎ, బి, డి        

3) సి, డి           4) ఎ, బి, సి, డి 


19. ‘ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ ద కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ సంస్థ’ ప్రచురించే ‘రెడ్‌ డేటా బుక్‌’ కిందివాటిలో ఏ అంశాలను తెలియజేస్తుంది?

1) స్థానీయ వృక్ష, జంతు జాతుల గురించి

2) ప్రమాద స్థితి ఎదుర్కొంటున్న వృక్ష, జంతు జాతుల గురించి

3) వివిధ రక్షిత ప్రాంతాలు, సహజ వనరుల సంరక్షణ గురించి

4) పైవన్నీ


20. కిందివాటిలో జీవవైవిధ్యంలో ముఖ్యమైన అంశం కానిదేది?

1) ఆవరణ వ్యవస్థల వైవిధ్యం       2) జన్యు వైవిధ్యం

3) జాతుల వైవిధ్యం            4) అటవీ వైవిధ్యం


21. ‘జీవవైవిధ్యం’ అనే పదాన్ని మొదటగా సూచించినవారు?

1) విట్టేకర్‌      2) రోసెన్‌  

3) విల్సన్‌      4) నార్మన్‌ మేయర్స్‌


22. పశ్చిమ కనుమలు - ద్వీపసమూహాలతో కూడిన ఇకలాజికల్‌ హాట్‌స్పాట్స్‌కు సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించి, నిజమైన దాన్ని గుర్తించండి.

ఎ) ఈ ప్రాంతంలో జీవవైవిధ్యంలో అత్యధిక శాతం స్థానికమైనవి.

బి) దాదాపు 60% ఉభయచర, సరీసృప జాతులు ఈ ప్రాంతానికి స్థానీయమైనవి.

1) ఎ, బి         2) ఎ మాత్రమే     

3) బి మాత్రమే         4) ఏదీకాదు


23. కింది ప్రవచనాలను పరిశీలించి నిజమైన వాటిని గుర్తించండి.

ఎ) స్థానికత అంటే ఏదైనా ఒక జాతి ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో మాత్రమే నివసిస్తూ, ఇతర ప్రాంతాల్లో నివసించకపోవడం.

బి) ఇకలాజికల్‌ హాట్‌స్పాట్‌ అనే పదాన్ని మొదటగా ‘నార్మన్‌ మేయర్స్‌’ అనే శాస్త్రవేత్త ఉపయోగించారు.

1) ఎ మాత్రమే       2) బి మాత్రమే

3) ఎ, బి            4) ఏదీకాదు 


24. ఇకలాజికల్‌ హాట్‌స్పాట్‌ అనే భావనను మొదటిసారిగా అభివృద్ధి పరిచిన శాస్త్రవేత్త?

1) విల్సన్‌      2) లోజాయ్‌  

3) నార్మన్‌ మేయర్స్‌      4) రోసెన్‌


25. నిమ్నజాతి జీవుల మధ్య ఉండే జన్యువుల సంఖ్యలోని తేడాలు, ఒక జాతి జీవుల్లోని జన్యువుల లక్షణాల్లో తేడాలను సూచించేది?

1) జన్యు వైవిధ్యం     2) జాతుల వైవిధ్యం  

3) ఆవరణ వ్యవస్థల వైవిధ్యం      4) జీవ సముదాయాల వైవిధ్యం


26. కిందివాటిలో భారతదేశంలో ఇకలాజికల్‌ హాట్‌స్పాట్‌ కానిది-

1) పశ్చిమ కనుమలు - శ్రీలంకలో ద్వీప సమూహాలు          2) హిమాలయాలు

3) ఇండో-బర్మన్‌ ప్రాంతం                           4) తూర్పు కనుమలు

 


సమాధానాలు

1-4; 2-1; 3-4; 4-2; 5-1; 6-3; 7-4; 8-4; 9-3; 10-4; 11-1; 12-3; 13-2; 14-4; 15-2; 16-3; 17-4; 18-4; 19-2; 20-4; 21-2; 22-1; 23-3; 24-3; 25-1; 26-4.


రచయిత: ఇ.వేణుగోపాల్‌

Posted Date : 16-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూపాతాలు - వరదలు - కరవులు - తుపానులు

మేలో తరుముకొచ్చే దుమ్ము తుపానులు!

 

 

ప్రకృతిలో సహజ పరిణామాలు, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే విపత్తుల్లో తుపాను, వరద, భూపాతం, కరవు ప్రధానమైనవి. అవి ప్రభావిత ప్రాంతాల్లో అతివృష్టి, అనావృష్టి లాంటి పరిస్థితులను సృష్టించి, అక్కడి సమాజానికి తీరని ఇబ్బందులు కలిగిస్తాయి.  ఈ విపత్తులకు కారణాలు, ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, చూపే ప్రభావాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. దేశంలో సంభవించిన ప్రధాన విపత్తులు, ప్రాంతాలవారీగా పీడ కలలుగా మిగిలిన సంఘటనలు, జరిగిన నష్టాలను గణాంక సహితంగా గుర్తుంచుకోవడంతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన నివారణ చర్యలపై అవగాహన పెంచుకోవాలి.

 

భూపాతం: కొండలు, గుట్టలపై ఉన్న రాళ్లు/మట్టి దిబ్బలు వాటంతటవే లేదా వర్షాలు, వరదలు, భూకంపాలు, తుపానులు, ఇతర కారణాల వల్ల జారి కిందకు పడటాన్ని కొండచరియలు విరగడం, భూపాతం అంటారు. ఎత్తయిన నదీ తీర ప్రాంతాలు, హిమాలయాలు, తూర్పు కనుమలు, ఈశాన్య భారతదేశ ప్రాంతాలు లాంటి పర్వతాలు అధికంగా ఉన్న ప్రదేశాల్లో కొండచరియలు విరగడం సర్వసాధారణం.


వరద: అధిక భూప్రాంతం కొంతకాలంపాటు నీటిలో మునిగిపోవడాన్ని వరదలు రావడం అంటారు. కుండపోత వర్షం, తుపాన్లు, రిజర్వాయర్లు నిండిపోవడం వరదలకు ప్రధాన కారణాలు. భూకంపాలు, తుపాను గాలులు, తుపాను అలలు, సునామీ, మంచు కరగడం, ఆనకట్టలు, కరకట్టలు తెగిపోవడం వల్ల వరదలు సంభవిస్తాయి.

 


కరవు: ఎక్కువకాలం పాటు నీటికొరత వల్ల ఏర్పడే అనార్ద్ర పరిస్థితిని కరవు అంటారు. సంవత్సర సగటు వర్షపాతంలో 50% కంటే తక్కువ వర్షం కురిసినప్పుడు ఆ పరిస్థితిని కరవు అని పేర్కొంటారు. దేశంలో దాదాపు 24% ప్రాంతం కరవు బారినపడే అవకాశం ఉంది. వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, బావులు ఎండిపోవడం, నదులు, రిజర్వాయర్లు ఎండిపోవడం, వ్యవసాయోత్పత్తులు భారీగా తగ్గిపోవడం లాంటివి కరవు లక్షణాలు.


తుపాను: అల్పపీడనం ఉన్న ప్రదేశాల్లో సుడిగాలి వల్ల వాతావరణంలో కలిగే మార్పులనే తుపాను అంటారు. ఒక అల్పపీడన ప్రాంతం చుట్టూ ఉత్తరార్ధ గోళంలో అపసవ్య దిశలో, దక్షిణార్ధ గోళంలో సవ్యదిశలో అతి వేగంగా గాలి తిరుగుతున్నట్లయితే అలా తిరిగే పవన వ్యవస్థను చక్రవాతం అంటారు. చక్రవాతాల మధ్య అల్ప పీడనం ఏర్పడుతుంది. వీటినే వాయుగుండాలు అంటారు. ‘సైక్లోన్‌’ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. చుట్టుకున్న పాము అని దీనర్థం. ఈ వైపరీత్యం సముద్రంలో జరుగుతుంది.


మాదిరి ప్రశ్నలు


1.    భూపాతాలు దేనివల్ల కలుగుతాయి?

1) వర్షపాతం తీవ్రత      2) ఏటవాలులు  

3) నేలకోతకి దారితీసే అటవీ నిర్మూలన    4) పైవన్నీ


2.     ఈ ప్రాంతాల్లో ప్రధానంగా భూపాతాలు, నైసర్గిక ఆపదలు ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తాయి?

1) హిమాలయ పర్వతాలతో సహా భారతదేశంలోని  పర్వత ప్రాంతాలు    2) తూర్పు భారతదేశ పర్వత ప్రాంతాలు

3) పశ్చిమ భారతదేశ పర్వత ప్రాంతాలు   4) దక్షిణ భారతదేశ పర్వత ప్రాంతాలు


3. భూపాతాలు ఏర్పడటానికి కారణం?

1) వర్షపాతం తీవ్రత      2) ఎత్తయిన వాలులు   

3) ఎక్కువగా విచ్ఛేదం చెందిన శిలా పొరలు      4) పైవన్నీ


4. భారతదేశంలో దుమ్ము తుపాన్లు (డస్ట్‌ స్టోర్మ్‌) ఏ నెలలో ఎక్కువగా వస్తాయి?

1) మార్చి  2) మే   3) జులై   4) అక్టోబరు


5.     1980 నుంచి ఇండియాలో భూపాతాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడానికి వాడుతున్న పద్ధతి?

1) లాండ్‌స్లైడ్‌ జొనేషన్‌ మ్యాపింగ్‌  2) లాండ్‌ డెవలప్‌మెంట్‌ జూమింగ్‌

3) లాండ్‌ రిక్లమేషన్‌ జూమింగ్‌    4) లాండ్‌ డిజాస్టర్‌ మ్యాపింగ్‌


6.     ఇండియాలో భూపాతాలు ఎక్కువ నుంచి అత్యంత ఎక్కువగా ఉండే ప్రాంతాలు?

1) హిమాలయాలు  2) తూర్పు కనుమలు (ఘాట్స్‌)  

3) వింధ్యాచలాలు 4) పశ్చిమ కనుమలు (ఘాట్స్‌)


7.     కింది రాష్ట్రాల్లో ఎక్కడ తీవ్ర హిమప్రవాహాలు సంభవిస్తాయి?

1) జమ్ము-కశ్మీర్‌      2) హిమాచల్‌ ప్రదేశ్‌  

3) ఉత్తరాఖండ్‌      4) పైవన్నీ


8.     భూపాతం కలగడానికి కారణం?

1) జలాశయంలో మార్పు         2) భూగర్భ జలాల్లో కదలిక  

3) దిగ్భ్రాంతి, కంపనాలు      4) పైవన్నీ


9.     భారతదేశంలో ఏ నెలల్లో వరదలు సంభవించే అవకాశం ఉంది?

1) ఏప్రిల్‌-జూన్‌       2) మే-అక్టోబరు 

3) జూన్‌-డిసెంబరు       4) జూన్‌-సెప్టెంబరు


10. ‘కోస్టల్‌ వల్నరబిలిటీ ఇండెక్స్‌’ని హైదరాబాద్‌లో ఇటీవల ఎవరు విడుదల చేశారు?

1) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ

2) జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ

3) భారత వాతావరణ శాఖ

4) భారత జాతీయ సముద్ర సమాచార సర్వీసుల కేంద్రం


11. ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వరదలకు గురయ్యే ప్రాంతాలు?

1) పెన్నా డెల్టా ప్రాంతాలు      2) కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలు

3) రాయలసీమ ప్రాంతాలు        4) ఉత్తర కోస్తా ప్రాంతాలు


12. వరదల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఒక నమూనా బిల్లును తయారు చేయాలని ఏ కమిషన్‌కు సూచించింది?    

1) జాతీయ వరదల కమిషన్‌      2) జాతీయ విపత్తుల కమిషన్‌

3) కేంద్ర జల కమిషన్‌       4) కేంద్ర విద్యుత్‌ కమిషన్‌


13. వరదలు సంభవించడానికి ప్రధాన కారణం?

1) అధిక ఉష్ణోగ్రత      2) భారీ వర్షపాతం   

3) గాలిలో తేమ      4) తుపాన్లు


14. వరదల హెచ్చరిక సమాచారం దేని ద్వారా ప్రసారమవుతుంది?

1) ఆల్‌ ఇండియా రేడియో           2) దూరదర్శన్‌  

3) వార్తాపత్రికలు          4) పైవన్నీ


15. భారతదేశం మొత్తం భూభాగంలో ఎంత శాతానికి వరదలు సంభవించే అవకాశం ఉంది?

1) 11%  2) 12%  3) 13%  4) 14%


16. వరదలు వేటివల్ల కలుగుతాయి?

1) అధిక వర్షపాతం       2) చెరువులకు గండ్లు  

3) తీవ్రమైన గాలులు     4) చెరువుల నుంచి నీరు పైకి రావడం


17. భారతదేశంలోని ఏ నది వల్ల వరదలు ఎక్కువగా వస్తాయి?    

1) గోదావరి      2) గోమతి   

3) బ్రహ్మపుత్ర      4) కావేరీ


18.తీవ్రమైన కరవు’ అని దేనిని పేర్కొంటారు?

1) వర్షపాతం 50% కంటే తక్కువగా ఉంటే

2) వర్షపాతం 26-50 శాతానికి మధ్య ఉన్నట్లయితే

3) పైరెండూ       4) ఏదీకాదు


19. నీటిపారుదల కమిషన్‌ క్షామ ప్రాంతాల్ని నిర్వచిస్తూ 10 సెం.మీ. కంటే తక్కువ వర్షం నమోదైతే దానిని తక్కువ  క్షామ  ప్రాంతంగా గుర్తించింది. ఇది ఏ సంవత్సరంలో జరిగింది?

1) 1952  2) 1962  3) 1972   4) 1982


20. భారతదేశంలో మొత్తం క్షామ ప్రాంతం ఎన్ని మిలియన్‌ చదరపు కిలోమీటర్లుగా ఉంది?

1) 1.5    2) 1.7   3) 1.9   4) పైవన్నీ


21. కరవు నివారణ చర్యల్లో భాగంగా ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకంలో ఎన్ని వాటర్‌షెడ్‌ ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు?

1) 1230   2) 1330  3) 1430  4) 1530


22. భూమిపై ఒక సెంటీమీటరు నేల పొర తయారు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?

1) 120 - 300        2) 150 - 600   

3) 140 - 400       4) 150 - 400 


23. కేంద్ర శుష్క ప్రాంత పరిశోధనా సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) గుడ్‌గావ్‌      2) జోధ్‌పుర్‌  

3) పట్నా      4) పాటియాలా


24. సారవంతమైన నేలలు కోతకు గురవకుండా ఏ విధంగా నివారించవచ్చు?

1) కాంటూర్‌ గట్ల నిర్మాణం  

2) పొలం గట్ల వెంట గుబురు వేర్లుండే మొక్కల్ని నాటడం

3) వాటర్‌ షెడ్లను నిర్మించడం   4) పైవన్నీ


25. హిమాలయ పర్వత చరియల మధ్య సాగే సన్నని జాలు నీటిని అక్కడి రైతులు ఏ విధంగా వాడుకుంటున్నారు?

1) 1 కి.మీ. నుంచి 50 కి.మీ వరకు కాలువల్ని నిర్మించి వ్యవసాయం చేస్తారు.

2) 1 కి.మీ. నుంచి 15 కి.మీ. వరకు కాలువలు నిర్మించి ఆ నీటితో వ్యవసాయం చేస్తారు.

3) 1 కి.మీ. నుంచి 8 కి.మీ. వరకు కాలువలను నిర్మించి ఆ నీటితో వ్యవసాయం చేస్తారు.

4) పైవన్నీ


26. ప్రస్తుతం మన దేశంలో ప్రాచుర్యంలో ఉన్న డ్రిప్‌ ఇరిగేషన్‌ దేని ఆధారంగా వచ్చింది?

1) మేఘాలయలోని వెదురుబొంగుల సేద్యం    2) త్రిపురలోని సేద్యపు పద్ధతి

3) మణిపుర్‌లోని వాటర్‌షెడ్‌ పద్ధతి   4) అస్సాంలోని సేద్యపు విధానం


27. కిందివాటిలో సంప్రదాయబద్ధమైన నీటిపారుదల పద్ధతి ఏది?

1) కుండ్స్‌  2) జాల్స్‌  3) సొరంగం  4) పైవన్నీ


28. ఆంధ్రప్రదేశ్‌లో 10,000 మంది ప్రాణాలను హరించిన తుపాను సంభవించిన రోజు?

1) 15-11-1977     2) 15-11-1978 

3) 15-11-1976     4) 15-11-1975


29. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన తీవ్రమైన తుపాను వల్ల 63,40,000 మంది నిరాశ్రయులయ్యారు. 26,00,000 మంది ప్రజలకు నష్టం వాటిల్లింది?

1) 1977  2) 1998  3) 1996  4) 1995


30. తుపాన్ల అవాంఛనీయ ప్రభావం?

1) అవస్థాపన నష్టం     2) దూరప్రసారాల నష్టం 

3) విద్యుత్తు ఆటంకం     4) పైవన్నీ 


31. ఆసియాలో నివసించే 4 బిలియన్ల జనాభాలో ఎంత శాతం తీరప్రాంతాల దగ్గర నివసిస్తున్నారు?    

1) 7%   2) 6%   3) 5%   4) 4% 


32. తుపాను అంటే ఏమిటి?

1) ఉత్తరార్ధ గోళంలో సవ్య (ప్రదక్షిణ) గాలులతో కూడిన అల్పపీడన వ్యవస్థ. 

2) ఉత్తరార్ధ గోళంలో అపసవ్య (అప్రదక్షిణ) గాలులతో కూడిన అధిక పీడన వ్యవస్థ.

3) ఉత్తరార్ధ గోళంలో అపసవ్య గాలులతో కూడిన అల్పపీడన వ్యవస్థ 

4) ఉత్తరార్ధ గోళంలో సవ్య గాలులతో కూడిన అల్పపీడన వ్యవస్థ


33. టోర్నడోలు ప్రధానంగా ఏ దేశంలో సంభవిస్తుంటాయి.

1) రష్యా 2) బ్రెజిల్‌ 3) ఇండియా 4) అమెరికా


34. భారతదేశంలో తుపాను తరంగాలు, తుపాన్లు, సునామీల వల్ల హాని కలిగే తీర ప్రాంతం ఎంత?

1) 5700 కి.మీ.     2) 4700 కి.మీ.

3) 3700 కి.మీ.     4) 2700 కి.మీ.


35. ‘సైక్లోన్‌’ అనే మాట ‘సైక్లోస్‌’ అనే గ్రీకు మాట నుంచి వచ్చింది. ‘సైక్లోస్‌’ అంటే..

1) తుపాను    2) పాము చుట్ట 

3) ప్రకటన     4) కింది భాగం


36. ‘సైక్లోన్‌’ అనే మాట ఏ భాషా పదం నుంచి వచ్చింది?

1) చైనీస్‌   2) లాటిన్‌  3) ఫ్రెంచ్‌  4) గ్రీకు


37. గాలివాన (హరికేన్‌) అనేది?

1) ప్రకృతి విపత్తు    2) మానవ ప్రేరిత విపత్తు

3) సునామీ        4) భూమి విరిగిపడటం


38. తుపాను హెచ్చరికలను ఎన్ని దశల్లో చేస్తారు?

1) రెండు   2) మూడు  

3) నాలుగు   4) అయిదు 



సమాధానాలు

1-4; 2-1; 3-4; 4-2; 5-1; 6-1; 7-4; 8-4; 9-4; 10-4; 11-2; 12-3; 13-2; 14-4; 15-2; 16-1; 17-3; 18-1; 19-2; 20-2; 21-3; 22-4; 23-2; 24-4; 25-2; 26-1; 27-4; 28-1; 29-3; 30-4;  31-1; 32-3; 33-4; 34-1; 35-2; 36-4; 37-1; 38-3.


రచయిత: ఇ.వేణుగోపాల్‌ 
 

 

 

Posted Date : 22-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వన్యప్రాణుల సంరక్షణ

అంతరించే దశలో నాలుగు కొమ్ముల జంతువు!

 


 

జీవావరణంలోని ప్రతి జంతువుకూ ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా వన్యప్రాణులు సహజ పర్యావరణ వ్యవస్థలో విడదీయలేని భాగం. విస్తృత ఆహార వలయం సక్రమంగా కొనసాగాలంటే వీటి మనుగడ తప్పనిసరి. అయితే అడవుల నిర్మూలన, సహజ ఆవరణ వ్యవస్థల విధ్వంసం లాంటి మానవ చర్యల ఫలితంగా ఎన్నో జీవులు నేడు అంతరించిపోయే స్థితికి చేరాయి. వాతావరణ మార్పులు, కాలుష్యం కూడా ఇందుకు తోడవుతున్నాయి. అలాంటి పరిణామాలను, ప్రమాదాలను ఎదుర్కొంటున్న జంతువుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వపరంగా వ్యవస్థాగతంగా తీసుకుంటున్న ప్రత్యక్ష, అనుబంధ చర్యలు, రెడ్‌ బుక్‌లో ఉన్న భారత్‌లోని అరుదైన, ప్రత్యేకతలున్న జీవాలు, వాటి ఆవాస ప్రాంతాల గురించి అవగాహనతో ఉండాలి.

 


ప్రపంచవ్యాప్తంగా అంతరించే స్థితిలో ఉన్న జీవజాతులు, ప్రకృతి వనరులను స్థానికంగా పరిరక్షించేందుకు, అందుకు తగిన సూచనలు అందించేందుకు 1948లో స్విట్జర్లాండ్‌లోని గ్లాండ్‌ నగరంలో ఐయూసీఎన్‌ (ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌)ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ మొదటిసారిగా ప్రపంచంలో మానవ చర్యల వల్ల ప్రమాద స్థితిలో ఉన్న జాతులను గుర్తించింది. అవి అంతరించేందుకు కారణాలు పేర్కొంటూ, వాటి సంరక్షణ చర్యలను సూచిస్తూ రెడ్‌ డేటా బుక్‌ను రూపొందించగా, 1963లో ఇంగ్లండ్‌కు చెందిన పీటర్‌ స్కాట్‌ అనే పక్షి శాస్త్రవేత్త మొదటిసారిగా దాన్ని ప్రచురించారు. ఇందులో వన్యప్రాణుల సంరక్షణకు రెండు రకాల వ్యూహాలు సూచించారు.


1. ఆవాసాంతర సంరక్షణ (ఇన్‌-సిటు కన్సర్వేషన్‌), జాతీయ పార్కులు, బయోస్ఫియర్‌ రిజర్వ్‌లు, అభయారణ్యాలు.

2. ఆవాసేతర సంరక్షణ (ఎక్స్‌-సిటు కన్సర్వేషన్‌), కణజాల వర్ధన కేంద్రాలు, విత్తన బ్యాంకులు, జన్యు బ్యాంకులు.



1.     కిందివాటిలో ఆవాసాంతర సంరక్షణ కానిదేది?

1) జాతీయ పార్కుల ఏర్పాటు      2) రిజర్వ్‌ ఫారెస్ట్‌ల ఏర్పాటు        

3) బయోస్ఫియర్‌ రిజర్వ్‌ల ఏర్పాటు      4) విత్తన బ్యాంకుల ఏర్పాటు


2.     కిందివాటిలో భారతదేశంలో మొదటి జాతీయ పార్కు?    

1) కన్హ       2) హేవి   

3) బంధిపుర్‌        4) జిమ్‌ కార్బెట్‌


3.     ఒక ప్రత్యేక వన్యప్రాణి సంరక్షణ కోసం చట్టపరంగా ఏర్పాటు చేసిన ప్రాంతాలను ...... అంటారు.

1) జాతీయ పార్కులు   2) అభయారణ్యాలు  

3) ఉద్యానవనాలు     4) జంతు ప్రదర్శనశాలలు


4.     కిందివాటిలో ఆవాసేతర సంరక్షణ కానిదేది?

1) జంతు ప్రదర్శనశాలల ఏర్పాటు       2) ఉద్యానవనాల ఏర్పాటు        

3) జాతీయ పార్కుల ఏర్పాటు       4) అక్వేరియాల ఏర్పాటు


5.     రెడ్‌ డేటా బుక్‌ని నిర్వహించే సంస్థ ఏది?

1) IUCN  2) CITES  3) WWF  4) IBWL


6.     మొక్కలు, జంతువులను సంరక్షించే రక్షిత ప్రాంతాలు ఏవి?

1) జాతీయ పార్కు    2) అభయారణ్యాలు 

3) ఉద్యానవనాలు     4) జంతు ప్రదర్శనశాలలు


7. బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఉన్న ప్రదేశం?

1) లఖ్‌నవూ         2) తిరువనంతపురం    

3) న్యూఢిల్లీ       4) కోల్‌కతా


8.     జాతీయ వన్యప్రాణులను కిందివాటిలో ఎందులో సంరక్షిస్తారు?

1) వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు       2) జాతీయ పార్కులు   

3) కన్సర్వేటివ్‌ రిజర్వ్‌లు      4) 1, 2


9.     ఒడిశాలోని నందన్‌కానూన్‌ సంరక్షణ కేంద్రం కిందివాటిలో దేనికి ప్రసిద్ధి?

1) సంకరజాతి పులులు       2) సంకరజాతి తెల్లపులులు 

3) సంకరజాతి ఏనుగులు       4) సంకరజాతి సింహాలు


10. నేలగాయి, బట్టమేక తల పిట్ట (గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌) జాతులకు ప్రసిద్ధి గాంచిన రక్షిత ప్రాంతమేది?

1) థార్‌లోని డెసెర్ట్‌ నేషనల్‌ పార్కు

2) రాణ్‌ ఆఫ్‌ కఛ్‌ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం

3) జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కు

4) గిర్‌ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం


11. జొన్నలు, శనగలు, వేరుశనగ, కందులు లాంటి పంటల జన్యువులను కిందివాటిలో ఏ పరిశోధనా కేంద్రంలో పరిరక్షిస్తారు?

1) IBPGR - ఇంటర్నేషనల్‌ బోర్డ్‌ ఫర్‌ ప్లాంట్‌  జెనెటిక్‌ రిసోర్సెస్‌

2) ICRISAT - ఇంటర్నేషనల్‌ క్రాప్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సెమి ఎరిడ్‌ ట్రాపిక్స్‌ 

3) TBGRI - ట్రాపికల్‌ బొటానికల్‌ గార్డెన్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 

4) NBPGR - నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ప్లాంట్‌   జెనెటిక్‌ రిసోర్సెస్‌


12. కింది వాటిలో ప్రమాద స్థితిని ఎదుర్కొంటున్న జాతులు ఏవి?

1) ఇండియన్‌ బస్టర్డ్‌       2) మచ్చల జింక   

3) రెడ్‌ పాండా      4) పైవన్నీ


13. మొక్కల విత్తనాలను భద్రపరచడానికి ఏర్పాటు చేసిన విత్తన బ్యాంకుల్లో అరుదైన మొక్కల విత్తనాలను ఏ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు?

1) -196 °C     2) -183 °

3) -163 °C     4) -146 °C


14. కిందివాటిలో నిజమైన వాటిని గుర్తించండి.

ఎ) జాతీయ పార్కులనేవి రక్షిత ప్రాంతాల పథకం కింద ఏర్పాటు చేసిన భూ, సముద్ర తీర ప్రాంతాలకు చెందిన వన్యజీవుల పరిరక్షణతోపాటు ఆ ప్రాంతంలోని మానవ జీవన చర్యలను పరిరక్షించే సంరక్షణా కార్యక్రమం.

బి) అభయారణ్యాలు శాసనపరంగా పరిధులు నిర్ణయించని ఒక ప్రత్యేక జాతి సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన రక్షిత కార్యక్రమం.

సి) బయోస్ఫియర్‌ రిజర్వ్‌లు అనేవి ఒక ప్రత్యేక వనజీవి ఆవాసాన్ని పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం

1) ఎ, బి, సి      2) బి మాత్రమే 

3) ఎ, బి        4) ఎ, సి 


15. వన్య, మృగ సంరక్షణా చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1962  2) 1970  3) 1972  4) 1980


16. కిందివాటిలో వన్య జాతులతోపాటు మానవ జీవన చర్యలను పరిరక్షించేందుకు చేపట్టిన ఇన్‌ - సిటు (IN-SITU) కార్యక్రమం ఏది?

1) బయోస్ఫియర్‌ రిజర్వ్‌       2) జన్యు బ్యాంకు 

3) జాతీయ పార్కు          4) ఏదీకాదు 


17. కిందివాటిలో భారతదేశంలో సహజంగా నివసించే జీవ జాతులను గుర్తించండి.

ఎ) నల్లటి మెడ కొంగలు      బి) చిరుతలు   

సి) ఎగిరే ఉడతలు        డి) మంచు చిరుతలు

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి 

3) బి, డి        4) పైవన్నీ


18. ఏ రాష్ట్రంలో జాతీయ పార్కులు, అభయారణ్యాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి?

1) ఉత్తర్‌ప్రదేశ్‌       2) రాజస్థాన్‌   

3) మధ్యప్రదేశ్‌        4) పశ్చిమ బెంగాల్‌


19. హోలాక్‌ గిబ్బన్‌ (India's only ape) అనే హొమినిడే వర్గానికి చెందిన కోతిని దేశంలోని ఏ జాతీయ పార్కులో సంరక్షిస్తున్నారు?

1) కజిరంగా పక్షి సంరక్షణా కేంద్రం       2) హజారీబాగ్‌ జాతీయ పార్కు  

3) జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కు        4) సైలెంట్‌ వ్యాలీ జాతీయ పార్కు


20. ప్రవచనం (ఎ): జాతీయ పార్కులు అనే రక్షిత ప్రాంతాల పరిధి శాసన పరంగా నిర్ధారించి ఉంటుంది.    

కారణం (ఆర్‌): జాతీయ పార్కులుగా ప్రకటించిన ప్రాంతాల నుంచి వంట చెరకు సేకరణ, పశువుల మేత, ఖనిజాల సంగ్రహణ లాంటి చర్యలను అనుమతిస్తారు.

1) ఎ, ఆర్‌ లు నిజమైనవి. ఎ కి ఆర్‌ సరైన    వివరణ.

2) ఎ, ఆర్‌ లు నిజమైనవి. ఎ కి ఆర్‌ సరైన    వివరణ కాదు.

3) ఎ నిజమైంది, ఆర్‌ నిజమైంది కాదు.

4) ఎ నిజమైంది కాదు, ఆర్‌ నిజమైంది.


21. కిందివాటిలో యునెస్కో తన వరల్డ్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ బయోస్ఫియర్‌ రిజర్వ్‌ (డబ్ల్యూఎన్‌బీఆర్‌)లో గుర్తించిన వాటిని పేర్కొనండి.

ఎ) సుందర్‌బన్‌  బి) అగస్త్యమలై   సి) నొక్రెక్‌   

డి) నీలగిరి     ఇ) గ్రేట్‌ నికోబార్‌   ఎఫ్‌) అమర్‌కంటక్‌ - అచానక్‌మర్‌

1) ఎ, బి, డి, ఎఫ్‌     2) ఎ, సి, ఇ, ఎఫ్‌ 

3) ఎ, బి, సి, డి     4) పైవన్నీ


22. ప్రవాళభిత్తికల సంరక్షణ, యాజమాన్య నిర్వహణకు సంబంధించి కిందివాటిలో ఎంపిక చేసిన ప్రాంతాలను గుర్తించండి.

ఎ) గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌    బి) గల్ఫ్‌ ఆఫ్‌ కచ్‌

సి) లక్షద్వీప్‌   డి) అండమాన్, నికోబార్‌ దీవులు

1) ఎ, బి, డి     2) ఎ, సి 

3) పైవన్నీ    4) సి, డి 


23. రామ్‌సర్‌ ఒప్పందానికి సంబంధించి కింద తెలిపిన వాటిలో సరైన వాటిని గుర్తించండి.

ఎ) చిత్తడి ప్రాంతాల సంరక్షణకు సంబంధించిన ఒక అంతర్జాతీయ సమావేశం.

బి) దీన్ని ఇరాన్‌లో కాస్పియన్‌ సముద్ర తీరాన ఉన్న రామ్‌సర్‌ అనే ప్రాంతంలో 1971, ఫిబ్రవరి 2న ఆమోదించారు.

సి) ఈ ఒప్పందం 1973, డిసెంబరు 21 నుంచి అమల్లోకి వచ్చింది.

1) ఎ, బి        2) ఎ, సి  

3) ఎ, బి, సి     4) సి మాత్రమే


24. కింది ప్రవచనాలను పరిశీలించి, వాటిలో నిజమైన వాటిని గుర్తించండి.

ఎ) హంగుల్‌ అనే జింక జాతి కేవలం జమ్ము-కశ్మీర్‌లోనే ఉంటుంది.

బి) సర్పిలాకారంలో ‘వి’ ఆకారపు కొమ్ములున్న కృష్ణజింక కేవలం భారతదేశంలోనే కనిపిస్తుంది.

సి) ప్రపంచంలోనే నాలుగు కొమ్ములున్న ఏకైక జంతువు చౌసింగా.

1) ఎ, బి      2) బి, సి   

3) ఎ, బి, సి      4) సి మాత్రమే


25. కిందివాటిలో ఆవాసేతర సంరక్షణలో భాగంగా చేపట్టే పథకాలను గుర్తించండి.

ఎ) జాతీయ పార్కులు      బి) ఉద్యానవనాలు  

సి) జంతు ప్రదర్శనశాలలు    డి) ఆక్వాకల్చర్‌  

ఇ) వన్యమృగ సంరక్షణ కేంద్రాలు

1) ఎ, బి, సి      2) బి, సి, డి   

3) ఎ, బి, డి, ఇ      4) ఎ, బి, సి, డి, ఇ     


26. కిందివాటిని జతపరచండి.

బయోస్ఫియర్‌ రిజర్వ్‌ జంతు జాతులు
1) పాంచ్‌మర్హి ఎ) నీలగిరి తార్‌
2) సిమ్లిపాల్‌ బి) గౌర్‌
3) అగస్త్యమలై సి) ఉప్పునీటి మొసళ్లు
4) గ్రేట్‌ నికోబార్‌ డి) ఉడతలు

 1) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి     2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి

3) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి      4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి


27. కిందివాటిని జతపరచండి.

జాబితా - 1 జాబితా - 2
1) సైలెంట్‌ వ్యాలీ జాతీయ పార్కు ఎ)మేఘాలయ
2) పెంచ్‌ జాతీయ పార్కు బి) రాజస్థాన్‌
3) బాల్‌ ఫాక్రం జాతీయ పార్కు  సి) మహారాష్ట్ర
4) రణతంబోర్‌ జాతీయ పార్కు డి) కేరళ

1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి         2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి

3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ          4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి



సమాధానాలు


1-4; 2-4; 3-1; 4-3; 5-1; 6-1; 7-4; 8-4; 9-2; 10-1; 11-2; 12-4; 13-1; 14-2; 15-3; 16-1; 17-2; 18-3; 19-2; 20-3; 21-4; 22-3; 23-3; 24-3; 25-2; 26-3; 27-1.


రచయిత: ఇ.వేణుగోపాల్‌ 
 

Posted Date : 05-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మాన‌వ ప్రేరిత వైప‌రీత్యాలు - ఉప‌శమ‌న చ‌ర్య‌లు

పేదవాడి ఆయుధాలు ప్రమాదకరం!

 

 

స్వార్థపూరిత చర్యలు, అశ్రద్ధ, నిర్లక్ష్యం వల్ల మానవ సంబంధిత వైపరీత్యాలు సంభవిస్తాయి. అవి సమాజం కష్టాలను పెంచడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీసి దేశ ఆర్థిక వ్యవస్థ, ఉత్పాదక సామర్థాన్ని, సుస్థిరాభివృద్ధిని దెబ్బతీస్తాయి. రోడ్డు ప్రమాదాల నుంచి అణుయుద్ధాల వరకు అన్నీ ఆ కోవలోకే వస్తాయి. జపాన్‌పై అణుదాడి నుంచి విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదం వరకు దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రధాన మానవకారక విపత్తులు, వాటికి కారణాలు, పరిణామాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. రకరకాల జీవాయుధాలు, విషవాయువులు, వాటి ప్రభావాలపై అవగాహన ఉండాలి. వైపరీత్యాల నివారణకు సంస్థాగతంగా చేస్తున్న ప్రయత్నాలు, అందుకోసం ఉన్న వ్యవస్థలపై పరిజ్ఞానం పెంచుకోవాలి.

 

మానవ ప్రేరిత వైపరీత్యానికి కారణాలను రెండు రకాలుగా విభజించవచ్చు. 1. సామాజిక కారణాలు 2. సాంకేతిక కారణాలు. తొక్కిసలాటలు, ఉగ్రవాద చర్యలు, సామాజిక అణచివేత, తిరుగుబాటు మనస్తత్వం ఉండటం, చట్టాలను గౌరవించకపోవడం, పౌర తిరుగుబాట్లు, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ లాంటి చర్యలు సామాజికపరమైనవి. అగ్నిప్రమాదాలు, రోడ్డు, రైల్వే ప్రమాదాలు, అణు దుర్ఘటనలు, పెద్దపెద్ద నిర్మాణాలు కూలిపోవడం, ప్రయోగ సమయాల్లో విష వాయువులు విడుదలవడం లాంటివి సాంకేతిక కారణాలు.

 



మాదిరి ప్రశ్నలు


1.  భోపాల్‌ పారిశ్రామిక దుర్ఘటన జరిగిన రోజు?

1) 1984, డిసెంబరు 2        2) 1984, డిసెంబరు 4    

3) 1984, డిసెంబరు 6         4) 1984, డిసెంబరు 8


2. కిందివాటిలో ‘పేదవాడి ఆయుధాలు’ అని వేటిని అంటారు?

1) అణ్వాయుధాలు    2) రసాయన ఆయుధాలు

3) జీవాయుధాలు     4) అటామిక్‌ ఆయుధాలు


3. ఏ సంఘటన తరువాత సామూహిక జనహనన ఆయుధాలను సాంప్రదాయేతర ఆయుధాలుగా  పిలుస్తున్నారు?

1) 2003లో ఇరాక్‌పై అమెరికా దాడి తరువాత   2) 2005లో ఇరాక్‌పై అమెరికా దాడి తరువాత

3) 2004లో వియత్నాంపై అమెరికా దాడి తరువాత   4) పైవేవీకావు


4. ‘దాగిఉన్న మహమ్మారి’గా వేటిని పిలుస్తారు?

1) రోడ్డు ప్రమాదాలు     2) రైల్వే ప్రమాదాలు     

3) జీవాయుధాలు        4) అణ్వాయుధాలు


5. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన జరిగిన కంపెనీ పేరు?

1) నెరోలాక్‌ కెమికల్‌ కంపెనీ        2) యూనియన్‌ కార్బైడ్‌

3) ఎన్‌రాక్‌ సంస్థ        4) రాజోల్‌ కంపెనీ


6.  మానవ ప్రేరేపిత విపత్తులకు కారణాలు?

1) వనరుల దోపిడీ    2) సామ్రాజ్యవాదం

3) జాతీయాభిమానం     4) పైవన్నీ


7. భోపాల్‌ దుర్ఘటనలో 3 వేల మంది ప్రాణాలు బలిగొన్న వాయువు?

1) ఇథైల్‌ ఐసోసైనేట్‌       2) ఫాస్‌జీన్‌   

3) మిథైల్‌ ఐసోసైనేట్‌    4) సరీన్‌


8.  1945, ఆగస్టు 6న ‘ఎనలాగో’ అనే అమెరికన్‌ విమానం ‘లిటిల్‌ బాయ్‌’ అనే అణ్వాయుధాన్ని ఏ పట్టణంపై వేసింది?

1) నాగసాకి      2) హిరోషిమా 

3) జెరూసలెం        4) టోక్యో


9. ఉక్రెయిన్‌లో ‘చెర్నోబిల్‌’ న్యూక్లియర్‌ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది?

1) 1985   2) 1995  3) 1984 4) 1986


10. డర్టీబాంబ్స్, బ్యాక్‌ ప్యాక్‌ బాంబ్‌లు అని వేటిని పిలుస్తారు?

1) జీవాయుధాలు         2) రేడియోధార్మిక పేలుడు పదార్థాలు

3) పారిశ్రామిక దుర్ఘటనలు       4) పైవేవీకావు


11. సామూహిక జనహనన ఆయుధాల్లో కిందివాటిని గుర్తించండి.

1) అణు ఆయుధాలు     2) రసాయనిక, పారిశ్రామిక ఆయుధాలు

3) జీవాయుధాలు          4) పైవన్నీ


12. దేశంలో అగ్నిప్రమాదాల నివారణ, నియంత్రణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?

1) 2008, నవంబరు       2) 2006, డిసెంబరు  

3) 2009, డిసెంబరు       4) 2009, నవంబరు


13. కిందివాటిలో దేన్ని మానవ కారక విపత్తుగా పేర్కొంటారు?

1) వరద         2) భూకంపం     

3) కరవు         4) అగ్నిప్రమాదం


14. ఏ అడవులు అధికంగా అగ్నిప్రమాదాలకు గురవుతున్నాయి?

1) కోనిఫెరస్‌ అడవులు      2) మడ అడవులు   

3) చిట్టడవులు        4) ఆకురాల్చు అడవులు


15. కిందివాటిలో భూనిర్మితి వల్ల సంభవించే వైపరీత్యం?

1) అగ్నిపర్వత పేలుళ్లు     2) బాంబు విస్ఫోటం     

3) క్షామం          4) అగ్ని ప్రమాదం


16. విమానం అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ప్రయాణికుల్ని నేలకు ఆనుకుని పడుకోమని చెప్పడానికి కారణం?

1) తొక్కిసలాట జరగకుండా        2) పొగపైకి వెళుతుంది కాబట్టి

3) గాజు కిటికీలకు వెళుతుంది కాబట్టి      4) స్థలాభావం వల్ల


17. జాతీయ అగ్నిమాపక సేవల కళాశాల ఎక్కడ ఉంది?

1) నాగ్‌పుర్‌       2) చెన్నై     

3) హైదరాబాద్‌         4) బెంగళూరు


18. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

1) ఆంధ్రప్రదేశ్‌        2) మధ్యప్రదేశ్‌   

3) తమిళనాడు         4) కేరళ


19. 2004, జులై 16న జరిగిన పాఠశాల అగ్నిప్రమాదంలో 93 మంది విద్యార్థులు మరణించిన సంఘటన జరిగిన ప్రాంతం?    

1) తిరువనంతపురం - కేరళ    2) కుంభకోణం - తమిళనాడు

3) ఉడిపి - కర్ణాటక  4) నాంథేడ్‌  - మహారాష్ట్ర


20. 1996, నవంబరు 12న దిల్లీలో ఏ రెండు దేశాల విమానాలు ఢీకొని 349 మంది మరణించారు?

1) రష్యా - అరేబియా       2) ఇండియా - కజకిస్థాన్‌

3) అరేబియా - కజకిస్థాన్‌     4) శ్రీలంక - రష్యా


21. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్యలో మొదటి రాష్ట్రాలు వరుసగా...    

1) ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్‌   2) మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్‌

3) ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర   4) కేరళ, బిహార్, తమిళనాడు


22. అండమాన్‌ తీరంలో బంగాళాఖాతంలో మునిగి 21 మంది మరణానికి కారణమైన ఆక్వామెరైన్‌ పడవ ప్రమాదం ఎప్పుడు జరిగింది?

1) 2014, జనవరి 26     2) 2014, జులై 17    

3) 2013, జులై 17      4) 2013, ఫిబ్రవరి 9


23. 2014, జులై 17న ఉక్రెయిన్‌ - రష్యా సరిహద్దులో ఉగ్రవాదులు కూల్చివేసిన ఏ దేశ విమానంలో 295 మంది మరణించారు?

1) బోయింగ్‌ విమానం (మలేసియా)    2) ఇండియన్‌ ఎయిర్‌లెన్స్‌ (ఇండియా)  

3) అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌    4) ఎయిర్‌ కొరియా (ఉత్తర కొరియా)


24. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో రైల్లో ప్రయాణిస్తున్న మిత్రదేశాల ప్రయాణికులపై జపాన్‌ సైనికులు ప్రయోగించిన విషవాయువు?

1) మస్టర్డ్‌ గ్యాస్‌          2) సరీన్‌          

3) ఫాస్‌జీన్‌            4) లెవిసైడ్‌


25. కిందివాటిలో నాడీవ్యవస్థపై ప్రభావం చూపే విషవాయువు?

1) టబున్‌  2) సరీన్‌  3) సొమన్‌  4) పైవన్నీ


26. రోడ్డుప్రమాదాల నివారణ కోసం తగిన చర్యలు సూచించేందుకు 2014, ఏప్రిల్‌ 22న సుప్రీంకోర్టు ఎంతమందితో కమిటీ వేసింది?

1) ఐదుగురు         2) ఆరుగురు    

3) ముగ్గురు         4) ఏడుగురు


27. వైజాగ్‌ ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ గ్యాస్‌ లీకేజీకి కారణమైన వాయువు?

1) స్టైరీన్‌          2) ఫాస్‌జీన్‌      

3) మిథైల్‌ ఐసోసైనేట్‌     4) సొమన్‌


28. 2005, అక్టోబరు 29న రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైన ప్రదేశం?

1) పానగల్లు - నల్గొండ                2) బొత్తులపాలెం - నల్గొండ

3) నకిరేకల్‌ - నల్గొండ              4) రామన్నపేట - నల్గొండ


29. 2014, ఏప్రిల్‌ 16న జరిగిన దక్షిణ కొరియా పడవ ప్రమాదంలో ఎంతమంది గల్లంతయ్యారు?

1) 300   2) 75   3) 150   4) 200


30. మహబూబ్‌నగర్‌ జిల్లా, పాలెం గ్రామంలో 2013, అక్టోబరు 30న బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న వోల్వో బస్సు దగ్ధం కావడంతో ఎంతమంది మరణించారు?

1) 45    2) 35    3) 55    4) 15


31. జపాన్‌లో 1945, ఆగస్టు 9న నాగసాకి నగరంపై అమెరికా ప్రయోగించిన డర్టీబాంబ్‌ పేరు?    

1) లిటిల్‌ బాయ్‌  2) ఫ్యాట్‌ బాయ్‌     

3) లిటిల్‌ మ్యాన్‌  4) ఫ్యాట్‌ మ్యాన్‌


 

సమాధానాలు

1-1; 2-3; 3-1; 4-1; 5-2; 6-4; 7-3; 8-2; 9-4; 10-2; 11-4; 12-4; 13-4; 14-1; 15-1; 16-2; 17-1; 18-3; 19-2; 20-3; 21-3; 22-1; 23-1; 24-2; 25-4; 26-3; 27-1; 28-4; 29-1; 30-1; 31-4.


రచయిత: ఇ. వేణుగోపాల్‌ 
 

Posted Date : 19-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వాయు, జల కాలుష్యాలు

‘కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి!’

 

 


సమస్త జీవులకు గాలి, నీరు ప్రాణాధారం. అవి స్వచ్ఛంగా ఉంటేనే జీవరాశులన్నీ ప్రశాంతంగా, ఆరోగ్యంగా మనగలుగుతాయి. అభివృద్ధి పరిణామ క్రమంలో మానవుడి చర్యలతో పీల్చే గాలి, తాగే నీరు కలుషితమవుతున్నాయి. నదులు, సరస్సులు వంటి ప్రధాన నీటివనరుల్లో వ్యర్థాలు, విష లోహాలు పేరుకుపోతున్నాయి. పరిశ్రమలు, వాహనాల కాలుష్యంతో పట్టణ ప్రాంతాలు, పారిశ్రామికవాడల్లో గాలి విషతుల్యంగా మారింది. ఈ కాలుష్యాల్లో రకాలు, వాటి ప్రభావాలు, వచ్చే వ్యాధులు, నివారణ చర్యలపై పరీక్షార్థులకు తగిన పరిజ్ఞానం ఉండాలి. కాలుష్యాలకు కారణమయ్యే లోహాలు, వాయువులు, అవి వెలువడే ప్రక్రియలు, దేశంలో కాలుష్య స్థాయిని నిర్ధారించే ప్రమాణాలు, సంబంధిత అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

 

కాలుష్యం అనే పదాన్ని ఇంగ్లిష్‌లో పొల్యూషన్‌ అంటారు. ‘పొల్యుటోనియం’ అనే లాటిన్‌ పదం నుంచి ఇది వచ్చింది. లాటిన్‌లో దీని అర్థం ‘అపరిశుభ్రత’. ‘‘ఘన, ద్రవ, వాయు స్థితిలో ఉన్న కొన్ని అవాంఛనీయ పదార్థాలు గాలిలోకి పరిమితికి మించి చేరినప్పుడు అవి వాతావరణ సంఘటనంలో మార్పు తీసుకురావడం వల్ల జీవులు, వాటి పరిసరాలకు హాని కలిగించే స్థితే వాయు కాలుష్యం’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచించింది. ‘‘ఏవైనా అవాంఛనీయ     పదార్థాలు నీటితో కలిసి ఆ నీటిని భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన మార్పులకు గురిచేసి, తాగడానికి వీల్లేని స్థితికి చేర్చడమే జలకాలుష్యం’’గా పేర్కొంది.

భారతీయ ప్రమాణాల సంస్థ ప్రకారం తాగునీటికి కింది నాణ్యతా ప్రమాణాలు ఉండాలి.


1. రంగు, రుచి, వాసన లాంటి లక్షణాలు ఉండరాదు.

2. నీటి pH 6.0 - 9.0 మధ్య ఉండాలి.

3. కరిగి ఉన్న O2 కనీసం 3 ppm ఉండాలి.


1.    దిల్లీలో వాయు కాలుష్యానికి కిందివాటిలో ఏది ఎక్కువ కారణం?

1) రాజస్థాన్‌లో పంట కోశాక మోళ్లను (గడ్డి మోపులు) తగలబెట్టడం    2) పంజాబ్‌లో పంట కోశాక మోళ్లను తగలబెట్టడం

3) పంజాబ్‌లో వంట చెరకు వాడకం  4) రాజస్థాన్‌లో వంట చెరకు వాడకం


2.     కిందివాటిలో ‘హైపాక్సియా’ అంటే ఏది?

1) నీటిలో లేదా గాలిలో కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆమ్లజని పెరగడం.

2) మహాసముద్రాల్లో కరిగి ఉన్న ఆమ్లజనిలో     పెరుగుదల

3) వాతావరణం పైపొరల్లో ఓజోన్‌గా మారడం వల్ల ఆమ్లజనిలో తగ్గుదల

4) నీటిలో లేదా గాలిలో ఆమ్లజని బాగా తగ్గితే ప్రాణవాయువును పీల్చే జీవాల ఉనికికి ముప్పు     ఏర్పడటం


3.     ‘పట్టణ ఉష్ణ ద్వీపం’ అంటే ఏమిటి?

1) చలికాలంలో కృత్రిమ ఉష్ణం ద్వారా ఉంచిన ఒక పట్టణం

2) నిరాశ్రితుల కోసం పట్టణంలో ఏర్పాటు చేసిన  ఉష్ణీకరణ వ్యవస్థ ఉన్న కృత్రిమ ద్వీపం

3) పట్టణంలోని ఇతర ప్రాంతాల కంటే అధిక  ఉష్ణోగ్రత అనుభూతి చెందుతున్న ఒక ప్రాంతం

4) చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల కంటే అధిక  ఉష్ణోగ్రతను అనుభూతి చెందుతున్న ఒక ప్రాంతం


4.     వాయునాణ్యత కొలిచేందుకు జాతీయ వాయునాణ్యతా సూచీలో ఎన్ని కలుషిత పదార్థాలను పరిశీలిస్తారు?

1) 3      2) 5     3) 7      4) 8


5.     భారత్‌లోని ఒక ప్రదేశంలో వాయునాణ్యతా సూచీ 100 ఉంటే అక్కడ వాయునాణ్యత ఎలా ఉన్నట్లు?

1) బాగుంది     2) సంతృప్తికరం 

3) ఒక మోస్తరుగా ఉంది     4) బాగాలేదు


6.     కప్పడం వల్ల ఉపయోగం ఏమిటి?

1) పనివారు స్వేచ్ఛగా తిరగడానికి వీలుగా ఉంటుంది    2) శీతాకాలంలో వేడిని కాపాడుతుంది

3) నేలలో తడి ఆరిపోకుండా చూస్తుంది   4) దొంగలు పంటను పట్టుకుపోకుండా కాపాడుతుంది


7.    ఎక్కువ జీవ ఆమ్లజని డిమాండ్‌ దేన్ని సూచిస్తుంది?

1) ఎక్కువ స్థాయిలో సూక్ష్మజైవిక కాలుష్యం    2) తక్కువ స్థాయిలో సూక్ష్మజైవిక కాలుష్యం

3) సూక్ష్మజైవిక కాలుష్యం లేకపోవడం    4) నీరు పూర్తిగా పరిశుభ్రంగా ఉండటం


8. ‘కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి’ అనే సూత్రం ప్రకారం-

1) కాలుష్య కారకులకు జైలు శిక్ష వేస్తారు.

2) అన్ని పరిశ్రమల నుంచి కాలుష్య పన్ను వసూలు చేస్తారు.

3) ప్రభుత్వమే అతిపెద్ద కాలుష్య కారకం కాబట్టి, కాలుష్య పరిహార నిధిని ఏర్పాటు చేస్తుంది. 

4) వాతావరణానికి కారకులు చేసిన నష్టానికి పరిహారం, కాలుష్య నివారణ చర్యలకు అయ్యే మొత్తం వారి నుంచే వసూలు చేస్తారు.


9.     కిందివాటిలో నదులు, సరస్సుల్లో సేంద్రియ కాలుష్యాన్ని కొలిచే సూచికల్లో కీలకమైంది?

1) గుర్రపు డెక్క         2) జీవరసాయన ఆమ్లజని డిమాండ్‌

3) కరిగిన పదార్థాల మొత్తం      4) pH విలువ


10. కిందివాటిలో భారత్‌లో సెల్‌ టవర్ల వికిరణం వల్ల బాగా ప్రభావితమైన పక్షి ఏది?

1) చిలుక   2) పావురం   3) కాకి   4) పిచ్చుక


11. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా కార్బన్‌ డయాక్సైడ్‌ను వెలువరిస్తున్న దేశం ఏది?

1) అమెరికా   2) జపాన్‌   3) చైనా   4) ఇండియా


12. అడవులు నరకడాన్ని నిషేధించిన మొదటి దేశం ఏది? 

1) నార్వే  2) డెన్మార్క్‌  3) స్వీడన్‌  4) ఫిన్లాండ్‌


13. ప్రతిపాదన (ఎ): వ్యవసాయ నిపుణుల అంచనా ప్రకారం భారతదేశం ఏటా 5 బిలియన్‌ టన్నుల కంటే ఎక్కువ నేలను నేలకోతరూపంలో కోల్పోతోంది.

కారణం (ఆర్‌): నేలకోతను అరికట్టడానికి ఆదివాసీలు ‘పోడు’ వ్యవసాయం చేసే విధంగా అవగాహన కల్పించాలి.

1) ఎ, ఆర్‌ రెండూ ఒప్పు, ఎ కి ఆర్‌ సరైన వివరణ.

2) ఎ, ఆర్‌ రెండూ ఒప్పు కానీ, ఎకి ఆర్‌ సరైన వివరణ కాదు.

3) ఎ ఒప్పు, కానీ ఆర్‌ తప్పు.   4) ఎ తప్పు, కానీ ఆర్‌ ఒప్పు.


14. ‘కేటలైటిక్‌ కన్వర్టర్‌’ ఉపకరణాన్ని దేనిలో ఉపయోగిస్తారు?

1) పాలిమర్‌ తయారీ కేంద్రం     2) న్యూక్లియర్‌ రియాక్టర్‌ 

3) ఆటోమొబైల్‌ ఎగ్జాస్ట్‌ యూనిట్‌-1     4) నీటిశుద్ధి ప్లాంట్‌ 


15. అన్నిరకాల వాయు కాలుష్యానికి ప్రధాన కారణం?

1) ఆంత్రో పొజెనిక్‌ యాక్టివిటీ   2) లోపభూయిష్ట సాంకేతికత 

3) కంబశ్చన్‌     4) పారిశ్రామిక వృద్ధి


16. ‘బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌’ దీన్ని కొలవగలదు-

1) పారిశ్రామిక కాలుష్యం     2) వాయు కాలుష్యం 

3) అకర్బన కాలుష్యం

4) సేంద్రియ వ్యర్థ్యాలను డీకంపోజ్‌ చేసే సూక్ష్మజీవులకు కావాల్సిన కరిగి ఉన్న O2


17. కింద పేర్కొన్న వాటిలో ఏది మహా నగరాల్లో వాయు కాలుష్యానికి కారణమవుతోంది?

1) కాడ్మియం     2) క్రోమియం 

3) లెడ్‌     4) కాపర్‌


18. నీటిలో ఆల్గే వృద్ధి చెందడానికి కారణం?

1) నీటిలో పెద్ద మొత్తంలో క్లోరైడ్స్‌ ఉండటం.

2) నీటిలో పెద్ద మొత్తంలో COD ఉండటం.

3) నీటిలో పెద్ద మొత్తంలో పోషకాలు ఉండటం.

4) నీటిలో పెద్ద మొత్తంలో BOD ఉండటం.


19. మానవులకు ఆస్తమా దేనివల్ల వస్తుంది?

1) నీటి కాలుష్యం     2) అధిక ఆహారం

3) నేల కాలుష్యం     4) గాలి కాలుష్యం


20. ‘ఇటాయ్‌ ఇటాయ్‌’ అనే వ్యాధి  దేనివల్ల వస్తుంది?

1) కార్బన్‌     2) మాంగనీస్‌ 

3) కాడ్మియం     4) ఏదీకాదు


21. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

1) స్నో బ్లైండ్‌నెస్‌ - పరారుణ కిరణాలు     2) హరితగృహ ప్రభావం - మీథేన్‌

3) ఓజోన్‌ క్షీణత - క్లోరోఫ్లోరో కార్బన్‌లు    4) జీవ వృద్ధీకరణ - బెంజిన్‌ హెక్సాక్లోరైడ్‌


22. కిందివాటిలో ఏది మానవ శరీరాల నుంచి గంగానది నీటిలో చేరే ప్రధాన కాలుష్యం?

1) హైడ్రా 2) అమీబా 3) రోటా వైరస్‌ 4) కోలిఫార్మ్‌


23. పర్యావరణాన్ని రక్షించగలిగిన మూడు R లు (ఆంగ్లభాష పదాల్లో) ఏవి?

1) రివర్స్, రీసైకిల్, రెన్యూ     2) రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్‌

3) రీసైకిల్, రెన్యూ, రీయూజ్‌     4) రీజనరేట్, రీసైకిల్, రెస్టిట్యూట్‌


24. యూట్రోఫిక్‌ నీటికుంటల్లో విరివిగా పెరిగే ప్రపంచంలోని అత్యంత సమస్యాత్మక నీటి కలుపుమొక్క ఏది?

1) వాటర్‌ హైసింత్‌     2) వాటర్‌ లిల్లీ 

3) డక్‌వీడ్‌     4) వాటర్‌ లెట్యూస్‌ 


25. బొగ్గును పర్యావరణానికి అత్యంత హానికర కారకంగా పరిగణిస్తారు. దాన్ని దహనం చేయడం వల్ల ఎక్కువ మోతాదులో వెలువడే వాయువులు..

ఎ) బొగ్గుపులుసు వాయువు     బి) సల్ఫర్‌ డయాక్సైడ్‌ 

సి) నైట్రోజన్‌ ఆక్సైడ్‌        డి) మీథేన్‌ 

1) ఎ, డి     2) ఎ, బి, సి, డి          3) ఎ, బి, సి     4) ఎ, సి, డి 


26. కార్బన్‌ మోనాక్సైడ్‌కి సంబంధించి కింద పేర్కొన్న వాటిలో సరైంది ఏది?

ఎ) మానవ శరీరంలో ఉత్పత్తి అవుతుంది

బి) సికిల్‌సెల్‌ ఎనీమియాకు చికిత్స చేసేందుకు   సహాయపడుతుంది

సి) న్యూరోట్రాన్స్‌మీటర్‌లా పనిచేస్తుంది

1) ఎ, బి, సి   2) ఎ మాత్రమే

3) ఎ, సి     4) సి మాత్రమే


27. బయలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ దేనిని సూచిస్తుంది? 

1) ఎక్కువ స్థాయి సూక్ష్మజీవుల కాలుష్యాన్ని

2) తక్కువ స్థాయి సూక్ష్మజీవుల కాలుష్యాన్ని

3) ఎలాంటి కాలుష్యం లేకపోవడం

4) నీరు అతి స్వచ్ఛమైంది


28. కిందివాటిలో 3 ప్రధాన కాలుష్య రకాలు (రూపాలు) ఏవి? 

ఎ) వాయు కాలుష్యం     బి) నీటి కాలుష్యం 

సి) ధ్వని కాలుష్యం     డి) ధరిత్రి కాలుష్యం

1) ఎ, బి, సి      2) బి, సి, డి 

3) సి, డి, ఎ     4) డి, ఎ, బి


29. కిందివాటిలో ఏ కలుషితాలు ఉంటే మున్సిపల్‌ సీవేజ్‌ స్లడ్జ్‌ ఎరువుగా పనికిరాదని నిర్ణయించవచ్చు?

1) నైట్రేట్స్‌         2) ఫాస్ఫేట్స్‌ 

3) భారీ లోహాలు         4) అమ్మోనియా


30. శబ్దకాలుష్యం ప్రకారం, మానవుడి చెవిలో నొప్పి  కలిగించే స్పర్శకు ప్రేరణ హద్దు ఎంత?

1) 40 డీబి 2) 80 డీబి 3) 100 డీబి 4) 120 డీబి 


31. కిందివాటిని జతపరచండి.

జాబితా-1 జాబితా-2
ఎ) CO2 1) భవనాలు, చారిత్రక కట్టడాలు త్వరగా శిథిలమవడం.
బి) SO2 2) ఆకులపై కణజాల క్షయ మచ్చలు ఏర్పడటం
సి) NO 3) తలనొప్పి, మసకబారిన దృష్టి
డి) CO 4) హరితగృహ ప్రభావం

1) ఎ-2, బి-1, సి-4, డి-3      2) ఎ-2, బి-4, సి-3, డి-1 

3) ఎ-4, బి-2, సి-3, డి-1      4) ఎ-4, బి-1, సి-2, డి-3



32. కిందివాటిని జతపరచండి.

జాబితా - 1 జాబితా - 2
ఎ) మీథేన్‌ 1) నాక్‌-సీ-సిండ్రోమ్‌ 
బి) ఫాస్ఫేట్‌లు 2) గ్లోబల్‌ వార్మింగ్‌ 
సి) ప్రియాన్‌లు 3) సరస్సుల్లో మంజరి ఏర్పడటం
డి) ఫ్లోరైడ్‌లు 4) డౌన్‌ సిండ్రోమ్‌ 
  5) ఓజోన్‌ తగ్గుదల

1) ఎ-4, బి-3, సి-5, డి-2      2) ఎ-2, బి-3, సి-5, డి-1 

3) ఎ-2, బి-3, సి-5, డి-4     4) ఎ-5, బి-2, సి-4, డి-1



సమాధానాలు

1-2, 2-4, 3-4, 4-4, 5-2, 6-3, 7-1, 8-4, 9-2, 10-4, 11-3, 12-1, 13-3, 14-3, 15-3, 16-4, 17-3, 18-3, 19-4, 20-3, 21-1, 22-4, 23-2, 24-1, 25-3, 26-1, 27-1, 28-4, 29-3, 30-4, 31-4, 32-2.


రచయిత: ఇ.వేణుగోపాల్‌

Posted Date : 26-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కాలుష్య రకాలు - ఘన వ్యర్థాల నిర్వహణ

క్రిమి సంహారక మందుల సమస్యలపై ‘సైలెంట్‌ స్ప్రింగ్‌’

 


 



రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తుంటారు. పనికిరాని వస్తువులను పడేస్తుంటారు. అవి నేలలోకి చేరడం వల్ల సారం దెబ్బతింటుంది. పంట ఉత్పాదకత క్షీణిస్తుంది. భూగర్భజలాల నాణ్యత తగ్గిపోతుంది. తద్వారా అనేక విపరిణామాలు సంభవిస్తుంటాయి. అందుకే కాలుష్య నియంత్రణకు, పర్యావరణ ఆరోగ్యానికి ఘన వ్యర్థాల నిర్వహణ అత్యంత అవసరం. ఇందులో వ్యర్థాల సేకరణ, రవాణా, రీసైక్లింగ్‌ తదితర ఎన్నో అంశాలు ఉంటాయి. వాటితోపాటు ఈ నిర్వహణ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. బాధ్యతాయుతంగా వ్యర్థాలను పడేసే పద్ధతులను నేర్పిస్తారు. వీటన్నింటిపై పోటీ పరీక్షార్థులు కనీస అవగాహన పెంపొందించుకోవాలి. 

 

‣    ఏవైనా పదార్థాలు కొత్తగా నేలలోకి చేరడం వల్ల లేదా దానిలో ఉండే కొన్ని పదార్థాలను తొలగించడం వల్ల నేల ఉత్పాదక సామర్థ్యం, మొక్కల, భూగర్భజలాల నాణ్యతను తగ్గించే పరిస్థితులు ఏర్పడటాన్ని నేల కాలుష్యం అంటారు.

    కంపించే వస్తువుల ఉపరితలం నుంచి వెలువడే యాంత్రిక శక్తిని ‘ధ్వని’ అంటారు. వినసొంపుగా లేని, క్రమరాహిత్యమైన ధ్వనులను ‘శబ్దం’ అంటారు. శబ్దాన్ని ఇంగ్లిష్‌లో noise అంటారు. ఈ పదం nausea అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది.

    రేడియోధార్మిక పదార్థాల వల్ల గాలి, నీటితో పాటు ఇతర ప్రాంతాలు కలుషితమవడాన్ని రేడియోధార్మిక కాలుష్యం అంటారు.


  ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలు: అణువిద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు; యురేనియం, థోరియం లాంటి ఖనిజాల నిష్కర్షణ/వెలికితీత; అణువ్యర్థాల రవాణా; రేడియోధార్మిక రసాయనాలు వెదజల్లడం.

    సముద్ర ఆవరణ వ్యవస్థలో మైక్రోప్లాస్టిక్‌ కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 5 mm కంటే తక్కువ పరిమాణం ఉన్న ప్లాస్టిక్‌ ముక్కలను మైక్రోప్లాస్టిక్‌ అంటారు. వీటివల్ల కలిగే కాలుష్యాన్ని ‘మైక్రోప్లాస్టిక్‌ కాలుష్యం’ అంటారు. 

    థర్మల్, న్యూక్లియర్‌ రియాక్టర్స్‌ లాంటి విద్యుత్తు కేంద్రాల్లో యంత్రాలను చల్లబరచడానికి వాడిన నీరు దగ్గరిలోని జలాశయాలకు చేరడం వల్ల అక్కడి ఆవరణ వ్యవస్థపై కనపడే ప్రతికూల ప్రభావాన్ని ‘ఉష్ణ కాలుష్యం’ అంటారు.

    ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానం-2000 ప్రకారం సహజంగా లేదా మానవుడి ప్రమేయం వల్ల పర్యావరణంలో విడుదలయ్యే ఘన/పాక్షిక వ్యర్థమే సాలిడ్‌ వేస్ట్‌. 

  ఘన వ్యర్థాల ఉత్పత్తికి ప్రధాన కారణాలు: సునామీ, భూకంపాలు, వరదలు లాంటి సహజ విపత్తులు; మానవుడి విలాసవంతమైన జీవన విధానం; మతపరమైన కార్యక్రమాల నిర్వహణ; జనాభా పెరుగుదల, జనసాంద్రత; సేకరణ, పౌనఃపున్యం; రుతు సంబంధ కారకాలు.



మాదిరి ప్రశ్నలు



1.     51 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ల ఉత్పత్తి, వాడకాన్ని ఇటీవల నిషేధించిన ప్రాంతం ఏది?    

1) తమిళనాడు          2) ఒడిశా     

3) పుదుచ్చేరి         4) దిల్లీ


2.     ఘన వ్యర్థాల సమస్యను తగ్గించడానికి కిందివాటిలో మెరుగైన పద్ధతి?

1) చెత్త గుట్టల వద్ద తగలపెట్టడం          2) పునర్వినియోగం (పునఃచక్రీయం)

3) సముద్రంలో పారవేయడం          4) ఒత్తిడి ద్వారా కుదించడం


3.     రాబందులను కాపాడేందుకు పశువైద్యంలో నిషేధించిన మందు?

1) ఆస్పిరిన్‌        2) డైక్లోఫెనాక్‌   

3) టెట్రాసైక్లిన్‌       4) రాంటిడిన్‌


4.     ఏ రకమైన దున్నే పద్ధతి నీటి ప్రవాహం వల్ల జరిగే భూ క్షయాన్ని అరికడుతుంది?

1) పైకి, కిందికి దున్నే పద్ధతి       2) కాంటూర్‌ పద్ధతి  

3) రేఖీయ పద్ధతి      4) వంకర టింకర పద్ధతి 


5.     పంజాబ్‌లో నేల క్షయానికి ప్రధాన కారణం?

1) నీటి పారుదల ఎక్కువ కావడం        2) ధూళి తుపాన్లు     

3) మేత కోసం ఎక్కువ భూవినియోగం   4) అడవుల నిర్మూలన


6.     భారత్‌లో పట్టణాల్లోని ఇళ్లలో చెత్తను ఎక్కువగా ఎక్కడికి పంపిస్తారు?

1) కంపోస్ట్‌ తయారీకి    2) చెత్త గుట్టల వద్దకు (ల్యాండ్‌ఫిల్)     

3) పునర్వినియోగానికి      4) భస్మీకరణకు


7.     ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల సేకరణకు పూర్తిగా బాధ్యత వహించేది?

1) పంపిణీదారుడు     2) వినియోగదారుడు  

3) చిల్లర వర్తకుడు     4) ఉత్పత్తిదారుడు


8.     సముద్రాల్లో మైక్రో ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని బాగా తగ్గించే పద్ధతులు?

1) చేపలు పట్టడానికి కేవలం వస్త్రాన్ని మాత్రమే ఉపయోగించడం

2) ఇళ్లలో ప్లాస్టిక్‌ బకెట్లు వాడకుండా ఉండటం

3) ఇళ్లు, కార్యాలయాల్లో కలప ఫర్నిచర్‌ను ఉపయోగించడం

4) సహజ రబ్బరుతోనే టైర్లను తయారు చేయడం


9.     కాలుష్య నివారణకు అతి సమర్థవంతమైన సాధనం?

1) కాలుష్య పన్ను         2) కాలుష్య ప్రోత్సాహం     

3) నైతికంగా నచ్చచెప్పడం       4) సామాన్య న్యాయం


10. పారవేసే ప్లాస్టిక్‌ కప్పులు, ప్లేట్లు, ఇతర ప్లాస్టిక్‌ గిన్నెల వాడకాన్ని నిషేధించిన మొదటి దేశం?

1) ఫ్రాన్స్‌       2) యునైటెడ్‌ కింగ్‌డమ్‌    

3) స్విట్జర్లాండ్‌        4) ఆస్ట్రేలియా


11. మృత్తికా క్రమక్షయాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కింది ఏ పద్ధతులను ప్రోత్సహిస్తుంది?

ఎ) వ్యవసాయంపై ఒత్తిడి తగ్గించడం        బి) పంట మార్పిడి పద్ధతి     

సి) కాంటూర్‌ బండింగ్‌       డి) వనీకరణ

1) ఎ, బి   2) బి, సి   3) ఎ, డి   4) సి, డి


12. సాధారణంగా పురపాలక సాలిడ్‌ వేస్ట్‌ను దేనిని నివారించడానికి వాడతారు?

1) పరిశ్రమల్లోని చర్యల, నిర్మాణాలు; కూల్చిన ఇళ్ల చెత్త నుంచి వచ్చే వ్యర్థాలు

2) ఇళ్లు, వాణిజ్య సముదాయాలు; సంస్థల నుంచి వచ్చే వ్యర్థాలు

3) గనుల తవ్వకం నుంచి వచ్చే వ్యర్థాలు

4) వ్యవసాయ సంబంధ వ్యర్థాలు


13. జీవ సంబంధ వైద్య వ్యర్థాన్ని ‘బయోమెడికల్‌ వేస్ట్‌ నిర్వహణ నిబంధనలు - 2016’ ఎన్ని తరగతులుగా వర్గీకరించింది?

1) 5      2) 4      3) 3      4) 2


14. ఈ-వ్యర్థం అంటే?

1) పర్యావరణ అనుకూల వ్యర్థం       2) విష సంబంధ రసాయన పదార్థాలు     

3) 1, 2            4) వాడుకలో లేని ఎలక్ట్రానిక్‌ పరికరం


15. నిటారైన ఏటవాలులో నేల క్రమక్షయాన్ని నియంత్రించడానికి మేలైన పద్ధతి?

1) మల్చింగ్‌ (కప్పడం)   2) సరిహద్దుగా పెద్ద రాళ్లను ఉంచడం     

3) సోపాన వ్యవసాయం        4) ఏదీకాదు


16. కిందివాటిలో జీవ క్షయకర కర్బన రసాయనం/ఉత్పన్నం?

1) ప్లాస్టిక్‌       2) చమురు   

3) చెత్త         4) క్రిమిసంహారాలు


17. కిందివాటిలో అత్యధిక తేమగలది?

1) ఆసుపత్రి వ్యర్థాలు       2) చెత్త    

3) వ్యర్థ పదార్థాలు        4) వ్యవసాయ వ్యర్థాలు


18. ధ్వని కాలుష్యం ఎన్ని డెసిబెల్స్‌కి మించితే ప్రమాదకరం?

1) 80    2) 30     3) 100    4) 120


19. క్రిమి సంహారక మందుల వల్ల తలెత్తే సమస్యలను క్రోడీకరిస్తూ రాసిన మొదటి గ్రంథం ‘సైలెంట్ స్ప్రింగ్‌’. ఈ పుస్తక రచయిత ఎవరు?    

1) అల్డో లియోపోల్డ్‌    2) వందనా శివ

3) రేచల్‌ కార్సన్‌    4) జాక్యుస్‌ కౌస్ట్యూ


20. ‘ప్రస్తుత బీడు భూములు’ అంటే?

1) ఈ సంవత్సరంలో సాగు చేయని భూమి       2) రెండేళ్లుగా సాగు చేయని భూమి

3) ప్రస్తుత సంవత్సరం సాగులో ఉన్న భూమి       4) రెండేళ్లకు పైగా సాగులో లేని భూమి


21. నేల కాలుష్యానికి కారణమైన ప్రధాన పట్టణ ఘన వ్యర్థ పదార్థం ఏది?

1) బురద  2) మురుగు  3) చెత్త  4) హ్యూమస్‌


22. ఆసుపత్రుల వద్ద అనుమతించే శబ్ద స్థాయి ఏ    పరిధిలో ఉంటుంది?

1) 40-50 డిబి      2) 35-40 డిబి    

3) 50-60 డిబి        4) 60-65 డిబి


23. కిందివాటిలో రేడియో ధార్మిక కాలుష్యానికి కారకాలు ఏవి?

ఎ) అణుశక్తి ప్లాంట్లు  బి) బయో మెడికల్‌ వ్యర్థాలు

సి) యురేనియం ఖనిజాల వెలికితీత

డి) ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు  ఇ) అణువ్యర్థాల రవాణా

1) ఎ, బి, సి          2) ఎ, సి, ఇ            

3) ఎ, సి, డి           4) ఎ, బి, డి


24. కిందివాటిలో జీవక్షయం చెందని కాలుష్యకాలు ఏవి?

ఎ) క్లోరినేటెడ్‌ హైడ్రోకార్బన్‌ కీటకనాశకాలు

బి) పాలిఎథిలీన్‌ సంచులు

సి) మార్కెట్లో ఏర్పడే చెత్త, కుళ్లిన పండ్లు, కూరగాయలు

డి) మున్సిపల్‌ సీవేజ్‌

1) ఎ, బి   2) ఎ, సి   3) బి, సి  4) సి, డి


25. కిందివాటిలో జీవక్షయం చెందే కాలుష్యకాలు ఏవి?

ఎ) ప్లాస్టిక్‌ బాటిల్స్‌           బి) మురుగు

సి) పశువుల నుంచి వెలువడే వ్యర్థాలు    

డి) మార్కెట్‌ నుంచి విడుదలయ్యే చెత్త, కుళ్లిన పండ్లు, కూరగాయలు

1) ఎ, బి   2) ఎ, సి   3) బి, సి   4) సి, డి


26. మానవుడు వినగలిగిన, అభిలషణీయమైన ధ్వని తీవ్రత స్థాయి?

1) 90 డెసిబెల్స్‌         2) 60 డెసిబెల్స్‌         

3) 120 డెసిబెల్స్‌         4) 80 డెసిబెల్స్‌


27. కిందివాటిలో క్రమక్షయానికి ఎక్కువగా ప్రభావితం అయ్యే ప్రాంతం?

1) మాల్వా పీఠభూమి    2) ఉత్తర్‌ప్రదేశ్‌లోని టెరాయ్‌ ప్రాంతం

3) ఆంధ్రతీర ప్రాంతం   4) చంబల్‌ నదీలోయ ప్రాంతం


28. పారిశ్రామిక ప్రాంతాల్లో అనుమతించే ధ్వని తీవ్రత స్థాయి?

1) 40 డెసిబెల్స్‌       2) 75 డెసిబెల్స్‌    

3) 120 డెసిబెల్స్‌      4) 140 డెసిబెల్స్‌


29. నివాస ప్రాంతాల్లో అనుమతించే ధ్వని తీవ్రత స్థాయి?

1) 45 డెసిబెల్స్‌       2) 55 డెసిబెల్స్‌    

3) 75 డెసిబెల్స్‌        4) 80 డెసిబెల్స్‌


30. ‘సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు’ అందించిన వివరాల ప్రకారం దేశంలో ఘనవ్యర్థాలను అధికంగా ఉత్పత్తి చేస్తున్న నగరాల్లో దిల్లీ ప్రథమ స్థానంలో ఉండగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నో స్థానంలో ఉంది?

1) మొదటి       2) రెండో   

3) మూడో          4) నాలుగో 


31. కిందివాటిలో ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి పునశ్చక్రీకరణ, పునర్వినియోగ విధానంలో కార్యక్రమం కానిది?

1) కంపోస్టింగ్‌         2) వర్మీ కంపోస్టు    

3) ఇన్సినరేషన్‌          4) ల్యాండ్‌ ఫిల్లింగ్‌


32. ఈ - వేస్ట్‌కు సంబంధించి కిందివాటిలో గ్రే గూడ్స్‌ కానివి?

1) పాడైపోయిన కంప్యూటర్‌లు    2) పాడైపోయిన వాషింగ్‌ మిషన్లు, గ్రైండర్లు

3) పాడైపోయిన ఎలక్ట్రానిక్‌ స్కానర్లు, ప్రింటర్లు    4) పాడైపోయిన మొబైల్స్‌ 


33. ఈ - వేస్ట్‌కు సంబంధించి కిందివాటిలో వైట్‌ గూడ్స్‌ కానివి?

1) పాడైపోయిన కంప్యూటర్‌లు    2) పాడైపోయిన వాషింగ్‌ మిషన్లు, గ్రైండర్లు

3) పాడైపోయిన రిఫ్రిజిరేటర్లు    4) పాడైపోయిన కూలర్లు




సమాధానాలు

1-3; 2-2; 3-2; 4-2; 5-1; 6-2; 7-4; 8-4; 9-1; 10-1; 11-4; 12-2; 13-2; 14-4; 15-3; 16-4; 17-4; 18-1; 19-3; 20-1; 21-3; 22-1; 23-2; 24-1; 25-4; 26-2; 27-4; 28-2; 29-2; 30-4; 31-4; 32-2; 33-1. 
 

Posted Date : 04-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం

పరిసరాలతో జీవుల బంధం!


పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, ఉండే ఇల్లు, పెరిగే మొక్కలు, తిరిగే జంతువులు తదితరాలతో కలిపి చుట్టూ ఉన్న పరిసరాల వ్యవస్థే పర్యావరణం. సమస్త జీవుల మనుగడకు మూలాధారం. ఇందులో సహజ అనుఘటకాలతోపాటు మానవ నిర్మాణాలు ఉంటాయి. ఇవన్నీ నిర్మాణాత్మక జీవక్రియలను సక్రమంగా నిర్వర్తించుకోవడానికి సాయపడతాయి. ఈ జీవనిర్జీవ కారకాల సముదాయ లక్షణాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. దాంతోపాటు పర్యావరణంలోని రకాలు, వాతావరణ పొరల వివరాలపై అవగాహన పెంచుకోవాలి. 

 

మన చుట్టూ ఉన్న పరిసరాలను పర్యావరణం అంటారు. అందులో సజీవులు, నిర్జీవులు అనుఘటకాలుగా ఉంటాయి. పర్యావరణం అనే పదం ‘ఎన్విరాన్‌’ అనే ఫ్రెంచ్‌ పదం నుంచి పుట్టింది. ఫ్రెంచ్‌ భాషలో ‘ఎన్విరాన్‌’ అంటే ‘చుట్టూ ఆవరించి ఉన్న’ అని అర్థం. జీవుల సమూహం చుట్టూ పరివేష్ఠితమైన పరిస్థితులనే పర్యావరణం అంటారు. ఒక జీవిపై లేదా సమాజంపై ప్రభావాన్ని చూపే సంక్లిష్టమైన సామాజిక లేదా సాంస్కృతిక పరిస్థితులను పర్యావరణంగా పేర్కొనవచ్చు.


జీవరాశులు తమ నిర్మాణాత్మకమైన జీవక్రియలను సక్రమంగా నిర్వర్తించుకోవడానికి ఉపయోగించే మృత్తిక, నీరు, గాలి, కాంతి, ఉష్ణం లాంటి వాటిని స్థూలంగా పర్యావరణం అంటారు. గాలి, నీరు, భూమిలో ఉండే రసాయనాలు; జీవరాశులు, ఇతర నిర్జీవ పదార్థాలకు సంబంధించి వాటి మూలం, చర్య, విస్తరణ, ఉనికి, మానవుడి వల్ల వాటిపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పరిసరాల విజ్ఞానం’ అంటారు.


ముఖ్య లక్షణాలు:

* ఏదైనా భౌగోళిక ప్రాంతంలో నిర్దిష్ట కాల వ్యవధిలో ఉండే జీవ, నిర్జీవ కారకాల మొత్తం పర్యావరణం.

 ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించే జీవవైవిధ్యత, జీవుల ఆవాసాలు, ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న శక్తి వనరులన్నీంటిని కలిపి ఆవరణ వ్యవస్థ నిర్మాణంగా పేర్కొనవచ్చు. 

ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని అనుసరించి పర్యావరణం అనేక మార్పులకు లోనవుతుంది. అంటే పర్యావరణం అనేది ఒక గతిశీలమైన వ్యవస్థ. 

జీవ, నిర్జీవ అంశాల మధ్య జరిగే అంతఃచర్యలు; జీవుల మధ్య ఉండే విధి పూర్వక సంబంధాలపై పర్యావరణ మనుగడ ఆధారపడి ఉంటుంది. పర్యావరణ నిర్వహణ విధానం అనేది అందులోని శక్తి ప్రవాహాలపై ఆధారపడి ఉంటుంది. 

 పర్యావరణం తనకు కావాల్సిన సేంద్రియ పదార్థాలను తనే ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే ఈ ఉత్పాదన అనేది ప్రాంతం, శీతోష్ణస్థితిని బట్టి మారుతూ ఉంటుంది.

ఆవరణ వ్యవస్థల సమతౌల్యాన్ని కాపాడటం అనేది పర్యావరణ వ్యవస్థ ముఖ్య లక్షణం.


విధులు: 

 ఆర్థిక వస్తువుల ఉత్పత్తికి అవసరమైన సహజ వనరులను అందిస్తుంది.

 ఆర్థిక కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యే వ్యర్థాలను తనలో విలీనం చేసుకుంటుంది. 

జీవావరణ సమతౌల్యాన్ని కాపాడటానికి అవసరమైన ప్రాణాధార సేవలను అందిస్తుంది.


పర్యావరణ అనుఘటకాలు: పర్యావరణంలో రెండు రకాల అనుఘటకాలు ఉంటాయి.

1) జీవ అనుఘటకాలు: వృక్షాలు (ఉత్పత్తిదారులు), జంతువులు, సూక్ష్మజీవులు లాంటివి.


2) నిర్జీవ అనుఘటకాలు: ఇందులో మళ్లీ మూడు రకాలు ఉన్నాయి.


ఎ) శీతోష్ణస్థితి పరమైనవి: కాంతి, ఉష్ణం, వర్షపాతం లాంటివి.


బి) భౌతిక పరమైనవి: గాలి, నేల, నీరు.


సి) రసాయనిక పరమైనవి: సేంద్రియ పరమైన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, లిపిడ్లు, నిరేంద్రియ పరమైన సోడియం, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్‌. ఈ జీవ, నిర్జీవ వనరుల మధ్య జీవ-భూ-రసాయనాల ద్వారా జరిగే అంతఃచర్యల వల్ల ఆయా జాతి జీవులకు కావాల్సిన ఆహారం, ఆవాసం, నీరు లాంటి ప్రాథమిక అవసరాలు అందుతాయి. పర్యావరణాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.              


1) కృత్రిమ లేదా మానవ నిర్మిత పర్యావరణం:  మానవుడు తన మనుగడ కోసం, తనకు కావాల్సిన అవసరాలను పొందడం కోసం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసుకున్న సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయపరమైన వ్యవస్థలతో కూడిన పరిసరాలే కృత్రిమ పర్యావరణం. దీనిని నాలుగు విధాలుగా వర్గీకరించవచ్చు.


ఎ) సాంఘిక పర్యావరణం: సమాజం, కుటుంబం, వివాహ వ్యవస్థలు.


బి) సాంస్కృతిక పర్యావరణం: మానవ సమాజాల సంప్రదాయాలు; కట్టుబాట్లు, పండగలు, వినోదాత్మక నిర్మాణాలు.


సి) ఆర్థికపర వ్యవస్థలు: వాణిజ్య, పారిశ్రామిక, వ్యాపార సముదాయాలు.


డి) రాజకీయపర వ్యవస్థలు: అసెంబ్లీ, సచివాలయం..,


2) సహజసిద్ధ పర్యావరణం: ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా భూమిపై ఉండే అనుకూల శీతోష్ణస్థితి ప్రభావాల కారణంగా ఏర్పడిందే సహజసిద్ధ పర్యావరణం.దీనిని నాలుగు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. 


1) శిలావరణం: భూఉపరితలం నుంచి సగటున    40 కి.మీ. లోతు వరకు విస్తరించి ఉండే ఘనస్థితిలోని భూమి బాహ్య పొర. 

* భూఉపరితల స్వరూపం వివిధ భౌమ కాలాల్లో బహిర్జనిత, అంతర్జనిత బలాలకు లోనవుతుంది. దాంతో శైథిల్య, క్రమక్షయ, నిక్షేపణ చర్యలకు గురై పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, నదీలోయలు లాంటి భూస్వరూపాలు భౌమ పరిణామ క్రమంలో ఆవిర్భవిస్తాయి. పలు జీవ జాతుల మనుగడకు కావాల్సిన భౌతిక పర్యావరణం ఏర్పడుతుంది.నేలల ఆవిర్భావానికి, వృక్షజాతుల పెరుగుదలకు కావాల్సిన వివిధ రకాల పోషకాలను అందిస్తూ, సమస్త జీవజాతులకు కావాల్సిన ఆహార వనరులను, ఆవాసాలను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మానవ సాంఘిక, ఆర్థికాభివృద్ధికి కావాల్సిన పలు రకాల వనరులను సమకూరుస్తూ జీవజాతి మనుగడకు ఆధారంగా ఉంది.


2) జలావరణం: భూఉపరితలంపై 71 శాతం అంటే 2/3వ వంతు జలం ఆవరించింది. ఇందులో సముద్రాల్లోని ఉప్పు నీటి శాతం 97.3 శాతం, మంచినీటి శాతం 2.7 శాతం.  జీవులకు ఆధారమైన నీటిని సమకూర్చడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. భూగోళ ఉష్ణోగ్రతలను క్రమపరుస్తుంది. అనేక రకాల వనరులకు నిలయంగా ఉంది. ప్రధానంగా ‘కార్బన్‌  శోషకం’గా వ్యవహరిస్తుంది. 


3) వాతావరణం: భూ ఉపరితలం నుంచి దాదాపు  600 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్న భూమి బాహ్యపొరను వాతావరణం అంటారు. భూమిపై జీవజాతి ఆవిర్భావం, మనుగడకు కావాల్సిన, అనువైన శీతోష్ణస్థితిని ఏర్పరచడంలో వాతావరణం ప్రధాన పాత్ర పోషిస్తుంది. శ్వాస-నిశ్వాసాలకు ప్రాణధారమైంది వాతావరణం. ఈ ఆవరణంలోని అనుఘటకాల శాతాల్లో మార్పులు సంభవిస్తే జీవుల మనుగడకు ప్రమాదకరమవుతుంది. సూర్యుడి నుంచి వెలువడే అధిక శక్తిమంతమైన వికిరణ కిరణాలు వాతావరణంలోకి ప్రవేశించి అందులోని ఆక్సిజన్, నైట్రోజన్‌ వాయువులతో విభేదించే స్థాయి ఫలితంగా రసాయన చర్యలు జరిగి మిరుమిట్ల్లుగొలిపే కాంతి వెలువడుతుంది. ఈ కాంతినే ‘ఆరోరా’ అంటారు. వాతావరణం అనేది భూ ఉపరితలంపై దుప్పటి లాంటిది. అందులో వివిధ వాయువులు, తేమ, దుమ్ము, ధూళి, రేణువులు ఉంటాయి.


వాతావరణంలో ఉండే ముఖ్య వాయువులు:

1) నైట్రోజన్‌ 

2) ఆక్సిజన్‌ 

3) కార్బన్‌ డై ఆక్సైడ్‌.

గాలిలో వాయువుల శాతాలు: 

* నైట్రోజన్‌ 78.08 శాతం 

* ఆక్సిజన్‌ 20.94 శాతం

* ఆర్గాన్‌ 0.93 శాతం

* కార్బన్‌ డై ఆక్సైడ్‌ 0.03 శాతం

* నియాన్‌  0.0018 శాతం. భూ ఉపరితలంపై వాతావరణాన్ని నాలుగు పొరలుగా విభజించారు.


ఎ) ట్రోపో ఆవరణం:

 * ఇది భూమి ఉపరితలంపై ఉన్న వాతావరణ పొర. 

* ధ్రువాల వద్ద 8 కి.మీ. వరకు, భూమధ్యరేఖ వద్ద 18 కి.మీ. వరకూ విస్తరించి ఉంటుంది. 

* జీవులకు సంబంధించి ఈ పొర అత్యంత అనుకూలంగా ఉంటుంది. వాతావరణంలోని వాయువులు ఈ పొరలోనే ఉంటాయి.

 * ఈ పొర 3/4వ వంతు వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇది జీవావరణాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. 

* మేఘాలు, వర్షపాతం, ఉరుములు, మెరుపులు ఇందులోనే ఏర్పడతాయి. 


* ఈ పొరలో పైకి వెళ్లే కొద్దీ ప్రతి కిలోమీటరుకు 6 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. 


* ఈ పొరలో (-)50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుంచి (-)60 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదవుతుంది.


బి) స్ట్రాటో ఆవరణం: 

* ఇది భూవాతావరణంలో రెండో పొర. ధ్రువాల వద్ద 39 కి.మీ.వరకు, భూమధ్యరేఖ వద్ద 50 కి.మీ.వరకు విస్తరించి ఉంటుంది.

* ఇందులో అతిముఖ్యమైన ఓజోన్‌ పొర ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు భూమి పైకి చేరకుండా అడ్డుకుంటుంది.

 జెట్ విమానాలు, ఎయిర్‌క్రాప్ట్‌లు ఈ పొరలోనే ప్రయాణిస్తాయి.


సి) మీసోస్ఫియర్‌: ఇది భూ ఉపరితలానికి 85 కి.మీ. వరకు విస్తరించి ఉంటుంది.


డి) థర్మో ఆవరణం: 

* ఈ ఆవరణం భూ ఉపరితలానికి 80 కి.మీ. వరకు వ్యాపించి ఉంటుంది. 

* ఇందులో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ పొరలో సరాసరి ఉష్ణోగ్రత దాదాపు 2000 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉంటుంది. 

* ఈ ఆవరణంలో రేడియో తరంగాలు పరావర్తనం చెంది భూమి మీదకు ప్రయాణిస్తాయి. ఈ పొర ఉపగ్రహాలకు అనుకూలంగా ఉంటుంది.


ఎక్సో ఆవరణం:

* ఈ ఆవరణంలో హైడ్రోజన్, హీలియం వాయువులు ఉంటాయి.

ఇది భూఉపరితలానికి 800 కి.మీ. వరకు విస్తరించి ఉంటుంది.


4) జీవావరణం: భౌతిక పరిసరాల్లో నివసించే సమస్త జీవజాతినే జీవావరణం అంటారు. ఇది భూ ఉపరితలం మీద, భూ ఉపరితలం నుంచి దాదాపు 200 మీటర్ల లోతు వరకు, భూ ఉపరితల వాతావరణంలో దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఇందులో మానవుడు తన పరిసరాలతో అత్యధిక సంబంధాలను కలిగి, వనరులను ఉపయోగించుకుని, తద్వారా తన అవసరాలను తీర్చుకుంటాడు. జీవావరణానికి మిగిలిన భౌతిక ఆవరణాలైన జల, వాయు, శిల ఆవరణాలకు మధ్య పదార్థాలు భ్రమణం చెందుతూ ఉంటాయి. భౌతిక ఆవరణాల్లో ఉండే అనుఘటకాల శాతం ఉండాల్సిన దాని కంటే ఎక్కువ మానవీయ చర్యల ద్వారా లేదా ప్రకృతి కారణాల వల్ల, ఆ వలయాల్లో చేరితే అవి కాలుష్యాన్ని కలగజేస్తాయి. అందువల్ల ప్రతి భౌతిక ఆవరణాన్ని కాపాడుకుంటే జీవావరణ మనుగడ ఉంటుంది. లేకపోతే అన్ని ఆవరణాలు నాశనమై మనిషి జీవనానికి ముప్పు వాటిల్లుతుంది. 


​​​​​​​

రచయిత: ఇ.వేణుగోపాల్‌ 

Posted Date : 05-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మానవకారక విపత్తు - కొవిడ్‌ - 19

కొవిడ్‌ సంక్షోభంలో రోబోల సేవలు! 

 


చైనాలో పుట్టి ప్రపంచం అంతా వ్యాపించిన కరోనా పెను ప్రళయమే సృష్టించింది. రెండు సంవత్సరాలపాటు అన్ని దేశాల వైద్యారోగ్య వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. గతంలో ఎన్నడూ ఎదురుకాని అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయి. జనజీవనాన్ని, ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని ప్రబలంగా ప్రభావితం చేసిన ఈ జైవిక విపత్తు పరిణామాల గురించి అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. మానవ శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే కరోనా వైరస్‌ రూపాంతరాలు, దానిని ఎదుర్కొనే క్రమంలో జరిగిన ఆవిష్కరణలు, టీకాల తయారీలో భాగస్వాములైన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, బాధితులకు చికిత్స అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్‌ కాలంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, సంక్షేమ విధానాలపై అవగాహన పెంచుకోవాలి. 

 

 


కొవిడ్‌-19.విపత్తు 2020 సంవత్సరం నుంచి ప్రపంచం మొత్తాన్ని వణికించింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో క్రమక్రమంగా ఈ వ్యాధి విజృంభించి, ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. విద్యార్థుల చదువులు నిలిచిపోయాయి. అనేక పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడటంతో నిరుద్యోగం ప్రబలింది. 2021, డిసెంబరు 28 నాటికి ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల మందికి పైగా ఈ వ్యాధి బారినపడగా, 54 లక్షల మందికి పైగా మరణించారు. మరణాల్లో అమెరికాది మొదటి స్థానం కాగా, భారత్‌ రెండో స్థానంలో నిలిచింది.

దక్షిణ చైనాలోని వుహాన్‌ నగరంలో 2019, డిసెంబరు 31న బయటపడిన ఈ వ్యాధి ఏడాది వ్యవధిలోనే ప్రపంచం నలుమూలలకు శరవేగంగా విస్తరించింది. అనేక వేరియంట్లుగా రూపాన్ని మార్చుకుంటూ నేటికీ విస్తరిస్తూనే ఉంది.


మాదిరి ప్రశ్నలు



1.    జీ-20 ‘యాక్సెస్‌ టు కొవిడ్‌-19 టూల్స్‌ యాక్సలేటర్‌’ను ఏ దేశం అధ్యక్షతన ప్రారంభించింది?

1) సౌదీ అరేబియా     2) ఖతార్‌ 

3) యూఏఈ     4) ఫ్రాన్స్‌


2.     కొవిడ్‌-19కు సంబంధించి భారతదేశంలో ప్లాస్మా థెరపీని ప్రారంభించిన మొదటి ఆసుపత్రి ఏది?

1) అపోలో హాస్పిటల్స్, చెన్నై

2) ఎయిమ్స్, న్యూదిల్లీ

3) కింగ్‌ జార్జి మెడికల్‌ యూనివర్సిటీ, ఉత్తర్‌ప్రదేశ్‌

4) ఫోర్టిస్‌ హాస్పిటల్స్, కోల్‌కతా


3.     అతితక్కువ ధరలో ‘రుధార్‌’ అనే మెకానికల్‌ వెంటిలేటర్‌ను రూపొందించిన సంస్థ?

1) ఐఐటీ, బాంబే     2) ఐఐటీ, ఖరగ్‌పుర్‌ 

3) ఐఐటీ, కాన్పుర్‌     4) ఐఐటీ, హైదరాబాదు


4.     ప్రపంచ వ్యాప్తంగా ‘పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్య దినోత్సవం’ ఏ రోజున పాటిస్తారు?

1) జూన్‌ 25     2) జూన్‌ 28 

3) మే 28     4) ఏప్రిల్‌ 4


5.     ఔషధాలను నేరుగా ఇంటి వద్దకు అందించే ‘ధన్వంతరి’ అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?

1) కేరళ     2) అస్సాం 

3) కర్ణాటక     4) తమిళనాడు


6.     కొవిడ్‌-19 రోగులకు సేవలందించడానికి ‘కర్మి - బోట్‌’ అనే రోబోను అభివృద్ధి చేసిన రాష్ట్రం ఏది?

1) పంజాబ్‌ 2) రాజస్థాన్‌ 3) గుజరాత్‌ 4) కేరళ


7.     2020, ఏప్రిల్‌ 24 నుంచి 30 వరకు ‘ప్రపంచ రోగనిరోధకత వారం-2020’ను ఏ ఇతివృత్తంతో నిర్వహించారు?

1) అందరికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్లు    2) కరోనాకు వ్యాక్సిన్లు

3) అందరికీ వ్యాక్సిన్లు     4) ప్రపంచానికి వ్యాక్సిన్లు 


8.    భారతదేశంలో మొదటి కొవిడ్‌-19 శాంపిల్‌ కలెక్షన్‌ మొబైల్‌ ల్యాబ్‌ పేరేంటి?

1) కొవిడ్‌ మొబైల్‌ ల్యాబ్‌     2) మొబైల్‌ కొవిడ్‌ ల్యాబ్‌    

3) మొబైల్‌ కేర్‌ ల్యాబ్‌      4) మొబైల్‌ బీఎస్‌ఎల్‌-3 వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌


9.    ‘మోదీ కిచెన్‌’ను ఏర్పాటు చేసిన రాష్ట్రం?

1) తెలంగాణ     2) ఆంధ్రప్రదేశ్‌ 

3) కర్ణాటక     4) తమిళనాడు


10. లాక్‌డౌన్‌ కాలంలో పిల్లలను ఇంటి వద్దే ఉంచడం కోసం యునిసెఫ్‌తో కలిసి ‘మో ప్రతిభ’ అనే ఆన్‌లైన్‌ కల్చరల్‌ కాంపిటీషన్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?

1) గుజరాత్‌  2) కేరళ  3) అస్సాం  4) ఒడిశా


11.     కేంద్ర ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ ఐఐటీ బాంబేలోని ‘సొసైటీ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌’ వద్ద రూ.56 కోట్ల మొత్తం వ్యయంతో ఒక ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ సెంటర్‌ 'CAWACH' ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే CAWACH పూర్తి రూపం ఏమిటి?.

1) Centre for Augmenting War with Covid- 19 Health Crisis

2) Centre for Augmenting War with Covid- 19 Health Care

3) Control for Augmenting War with Covid-19 Health Crisis

4) Centre for Aiming War with Covid-19 Health Crisis


12. కొవిడ్‌-19పై పోరాడటానికి ప్రధానమంత్రి రూ.20 లక్షల కోట్లతో ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ పేరు ఏమిటి?

1) ఆత్మనిర్భర్‌ భారత్‌     2) వందేభారత్‌ 

3) రీబిల్డ్‌ ఇండియా     4) ఏదీకాదు


13. ‘ఆపరేషన్‌ సంజీవని’లో భాగంగా భారత వైమానిక దళం ఏ దేశానికి 6.2 టన్నుల ఆవశ్యక ఔషధాలు తీసుకెళ్లింది?

1) మాల్దీవులు     2) మయన్మార్‌ 

3) నేపాల్‌     4) శ్రీలంక 


14. కొవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకోవడానికి ‘ఆపరేషన్‌ షీల్డ్‌’ను ప్రారంభించిన రాష్ట్రం?

1) అస్సాం     2) దిల్లీ 

3) బిహార్‌     4) అరుణాచల్‌ ప్రదేశ్‌


15. కొవిడ్‌-19పై పోరాటం కోసం ‘కోరో-ఫ్లూ’ పేరిట వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్లూజెన్, యూనివర్సిటీ ఆఫ్‌ విస్కన్‌సిన్‌ మాడిసన్‌తో చేతులు కలిపిన భారతదేశ సంస్థ ఏది?

1) ప్రపంచ ఆరోగ్య సంస్థ        2) ఐసీఎంఆర్‌ 

3) భారత్‌ బయోటెక్‌        4) యూఎన్‌డీపీ


16. యూఎస్‌ఏలో కొవిడ్‌-19 సోకిన మొదటి జంతువు ఏది?

1) సింహం     2) ఎలుగుబంటి 

3) పులి     4) చింపాంజీ


17. ‘కరోనా’ అనే పదాన్ని ఏ భాషా పదం నుంచి తీసుకున్నారు? దాని అర్థం ఏమిటి?

1) గ్రీకు, ఖాళీ లేదా కిరీటం    2) చైనిస్, ఖాళీ లేదా కిరీటం

3) లాటిన్, ఖాళీ లేదా కిరీటం    4) ఇంగ్లిష్, ఖాళీ లేదా కిరీటం


18.    కరోనా వైరస్‌ కారణంగా మనుషుల్లో వచ్చే సాంక్రమిక వ్యాధి 'SARS' పూర్తి రూపం ఏమిటి?

1) Severe Active Respiratory Syndrome

2) Suspicious Activity Reporting System

3) Severe Acute Respiratory Syndrome

4) Severe Acute Respiratory Safety


19.    వైరల్‌ వ్యాధి 'MERS' పూర్తి నామం?

1) Mobile Emergency Response Support

2) Middle East Respiratory Syndrome

3) Middle East Respiratory System

4) Multiple Effect Respiratory Syndrome


20. సౌదీ అరేబియాలో ఏ సంవత్సరంలో MERS కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది?

1) 2010  2) 2011  3) 2012  4) 2013


21. కొవిడ్‌ - 19 వ్యాధికారక వైరస్‌ పేరు?

1) MERS - Cov2 2) SARS - Cov2

3) Covid - 19 4) SARS - Cov


22. కరోనా వైరస్‌ పరిస్థితుల్లో ఏ జోన్‌ను ‘హాట్‌స్పాట్‌’గా ప్రస్తావిస్తారు? 

1) ఎల్లో జోన్‌     2) రెడ్‌ జోన్‌ 

3) ఆరెంజ్‌ జోన్‌     4) గ్రీన్‌ జోన్‌


23. భారతదేశంలో ఆరోగ్య సేతు యాప్‌ను ఆవిష్కరించిన కేంద్రమంత్రిత్వ శాఖ ఏది? 

1) ఆరోగ్య, కుటుంబ సంక్షేమం  2) హోం అఫైర్స్‌ 

3) ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ  4) ఆయుష్‌ మంత్రిత్వ శాఖ


24. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కరోనా వైరస్‌ రోగికి, అప్పటికే కోలుకున్న కొవిడ్‌-19 రోగుల నుంచి రక్తాన్ని ఎక్కించే చికిత్సా విధానం పేరు ఏమిటి?

1) ర్యాపిడ్‌ టెస్టింగ్‌     2) ప్లాస్మా థెరపీ 

3) పీసీఆర్‌ టెస్టింగ్‌     4) రక్తమార్పిడి


25. కరోనా వైరస్‌ మొదటి కేసును ఎక్కడ గుర్తించారు? 

1) బీజింగ్, చైనా    2) షాంఘై, చైనా

3) వుహాన్, హుబే ప్రావిన్స్, చైనా  4) టియాంజిన్, చైనా


26. వుహాన్‌ నుంచి ఉద్భవించిన కరోనా వైరస్‌కు శాస్త్రవేత్తలు నిర్ధారించిన పేరు?

1) కొవిడ్‌-19     2) వుహాన్‌ చైనా వైరస్‌

3) వుహాన్‌ వైరస్‌     4) సార్స్‌-కోవ్‌-2


27. స్పానిష్‌ ఫ్లూ మహమ్మారి ప్రపంచంలోని మూడింట ఒక వంతు జనాభాకు సోకింది. 1-5 మిలియన్ల మంది ప్రాణాలు హరించిన ఈ వ్యాధి ఎప్పుడు వ్యాపించింది?

1) 1929   2) 1918   3) 1939  4) 1901


28. కొవిడ్‌-19ను కనిపెట్టడానికి నిర్వహించే పరీక్ష ఏది?

1) ప్యాచ్‌ టెస్ట్‌     2) యాంటీబాడీ టెస్ట్‌ 

3) ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌     4) 2, 3


29. కొవిడ్‌-19 కేసులు పెరుగుతుండటంతో భారతదేశంలో కర్ఫ్యూ విధించిన మొదటి రాష్ట్రం ఏది?

1) పంజాబ్‌     2) మహారాష్ట్ర 

3) ఒడిశా     4) ఉత్తర్‌ప్రదేశ్‌


30. దేశంలో పూర్తి లాక్‌డౌన్‌ను అమలుచేసిన మొదటి రాష్ట్రం ఏది?

1) హరియాణా     2) రాజస్థాన్‌ 

3) మహారాష్ట్ర     4) కేరళ


31. రిలయన్స్‌ సంస్థ కొవిడ్‌-19 రోగుల చికిత్స కోసం ఏ నగరంలో ఆసుపత్రిని ప్రారంభించింది?

1) ముంబయి     2) పఠాన్‌కోట్‌ 

3) దిల్లీ     4) కాన్పుర్‌


32. కొవిడ్‌ రోగుల చికిత్స కోసం 12 రోజుల్లో 1000 పడకలతో ‘సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కొవిడ్‌-19 హాస్పిటల్‌’ను నిర్మించిన సంస్థ?

1) మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా      2) డీఆర్‌డీఓ

3) ఐసీఎంఆర్‌       4) నేషనల్‌ సేఫ్టీ కౌన్సిల్‌


33. కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ‘ఆపరేషన్‌ నమస్తే’ను ఎవరు ప్రారంభించారు? 

1) భారత సైన్యం     2) భారత నావికాదళం 

3) భారత తీరప్రాంత భద్రతా దళం  4) భారత వైమానికాదళం


34. కొవిడ్‌-19పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తున్న క్యాంపెయిన్‌కు ఎవరిని ఎంచుకున్నారు? 

1) భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ 

2) భారత ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు సునీల్‌ ఛెత్రి 

3) భారత క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని

4) భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌


35. కొవిడ్‌-19 రోగులతో నర్సులు, వార్డు బాయ్‌లకు భౌతిక స్పర్శను తగ్గించడానికి అభివృద్ధి చేసిన రోబో పేరు?

1) కరోనా బోట్‌      2) కోరో బోట్‌

3) కొవిడ్‌-19 బోట్‌      4) కొవిడ్‌-బోట్‌



సమాధానాలు

1-1, 2-3, 3-1, 4-4, 5-2, 6-4, 7-3, 8-4, 9-4, 10-4, 11-1, 12-1, 13-1, 14-2, 15-3, 16-3, 17-3, 18-3, 19-2, 20-3, 21-2, 22-2, 23-3, 24-2, 25-3, 26-4, 27-2, 28-4, 29-1, 30-2, 31-1, 32-2, 33-1, 34-2, 35-2. 
 

Posted Date : 13-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తులు  ప్రాథమిక భావనలు

అంతా ధ్వంసం చేసే ఆపదలు!

ప్రజలకు తీవ్ర నష్టం కలిగించి, వనరులను ధ్వంసం చేసే ప్రకృతిపరమైన లేదా మానవ ప్రేరేపిత ఆకస్మిక సంఘటనలే విపత్తులు. సంవత్సరాలుగా సాధించిన సమాజ వికాసాన్ని, భౌతిక ప్రగతిని ఒక్కసారిగా తుడిచేయగలిగే, సుస్థిరాభివృద్ధికి ఆటంకాలు సృష్టించి, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే ఈ విపత్తుల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. విపత్తు నిర్వహణ భావనలు, సంబంధిత పదజాలంపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. విపత్తు లక్షణాలు, రకాలు, వర్గీకరణ, వాటి  కారణంగా తలెత్తే నష్టాలు, ఉదాహరణలపై తగిన పరిజ్ఞానం ఉండాలి.


ప్రజాజీవనానికి తీవ్రనష్టం కలిగించి, సమాజంలోని సహజ, సాంస్కృతిక వనరులను ధ్వంసం చేసి సమాజ సాధారణ కార్యకలాపాలకు అంతరాయాలను కలిగించే, ప్రజలను నిరాశ్రయులుగా చేసే ప్రకృతిపర లేదా మానవ ప్రేరేపిత ఆకస్మిక సంఘటనలు, దుర్ఘటనలే విపత్తులు. ‘విపత్తు’ను ఆంగ్లంలో డిజాస్టర్‌ అంటారు. గ్రీకు భాషలోని Dus (దుష్ట), aster (నక్షత్రం) అనే రెండు పదాల కలయికతో ఏర్పడిన ఫ్రెంచ్‌ పదం desastre నుంచి డిజాస్టర్‌ వచ్చింది. గ్రీకు, లాటిన్‌ భాషల్లో disaster అంటే దుష్టనక్షత్రం అని అర్థం. ప్రాచీన కాలంలో పూర్వీకులు ఏదైనా విధ్వంసం లేదా విపత్తును ఏదో ఒక నక్షత్రంతో ముడిపెట్టి, ఆ నక్షత్రాన్ని దుష్టనక్షత్రంగా భావించేవారు. భూకంపాలు, తుపాన్లు, వడగళ్ల వానలు, కుంభవృష్టి, భూపాతం, భూ క్రమక్షయం, హిమపాతం, వరదలు లాంటి సహజ లేదా ప్రకృతి విపత్తులు; అగ్నిప్రమాదాలు, మహమ్మారి వ్యాధులు, రోడ్లు, విమాన, రైలు ప్రమాదాలు, రసాయన, అణుప్రమాదాలు లాంటి మానవ కారక విపత్తులు నిత్యం సంభవిస్తూనే ఉంటాయి. విపత్తు సహజమైంది లేదా మానవ ప్రేరేపితం కావచ్చు. విపత్తు వల్ల పెద్దఎత్తున మనుషుల ప్రాణాలకు, జీవనోపాధికి, ఆస్తులకు, ప్రాంతాలకు నష్టాలు జరుగుతుంటాయి. 


  విపత్తు ప్రభావం:  విపత్తు ప్రభావానికి గురయ్యే ప్రాంతాల్లో ఉమ్మడి లక్షణాలు కనిపిస్తాయి.

* సమాజ సాధారణ జీవనానికి అంతరాయం కలుగుతుంది. దీని ప్రభావం పెద్దసంఖ్యలో ప్రజలపై పడుతుంది. 

 పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. విపత్తు ప్రభావానికి గురైన కమ్యూనిటీకి ఆ నష్టాల నుంచి కోలుకోవడానికి బయటి నుంచి సహాయం అవసరమవుతుంది. 

దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలుగుతుంది.


ముఖ్య లక్షణాలు: 

* ఆకస్మికంగా సంభవిస్తాయి.

అతివేగంగా ఏర్పడతాయి. 

 మానవ సమాజాల సామాజిక, సాంస్కృతిక, ఆర్థికపరమైన వనరులను ధ్వంసం చేస్తాయి. 

 పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తాయి.

 పర్యావరణ వనరులను ధ్వంసం చేసి ఒక ప్రాంత సుస్థిరాభివృద్ధిని అడ్డుకుంటాయి. 

 సమాజ సాధారణ జీవనానికి అంతరాయాన్ని కలిగిస్తాయి. 


  ఐక్యరాజ్య సమితి నిర్వచనం:   ‘సమాజ సాధారణ కార్యకలాపాలకు అకస్మాత్తుగా లేదా తీవ్రంగా సంభవించే ఆపదే విపత్తు’.


 విపత్తుల వర్గీకరణ:  విపత్తుల ఆవిర్భావం, అవి సంభవించే వేగం, వాటికి దారితీసే కారణాల ఆధారంగా పలు రకాలుగా వర్గీకరించవచ్చు. 

ఎ) నిదానమైన లేదా వేగవంతమైన విపత్తులు:

1) నిదానంగా ప్రారంభమయ్యే విపత్తు: రోజులు, నెలలు లేదా కరవు మాదిరిగా సంవత్సరాల తరబడి కొనసాగే విపత్తును నిదానంగా ప్రారంభమయ్యే విపత్తు అంటారు. ఉదా: పర్యావరణ క్షీణత, తెగుళ్ల దాడి, దుర్భిక్షం లాంటివి.


2) వేగంగా వచ్చే విపత్తు: తక్షణ విఘాతం వల్ల సంభవించే విపత్తును వేగంగా వచ్చే విపత్తు అంటారు. దీని ప్రభావం స్వల్పకాలం ఉండవచ్చు లేదా దీర్ఘకాలం   కొనసాగవచ్చు. ఉదా: భూకంపం, చక్రవాతం, ఆకస్మిక వరదలు, అగ్నిపర్వత విస్ఫోటం.


బి) సహజ లేదా మానవకారక విపత్తులు:

1) సహజ విపత్తులు: ప్రకృతి వైపరీత్యం కారణంగా సంభవించి, ప్రభావిత ప్రజలు ఎదుర్కోలేని విధంగా మానవ, ఆర్థిక నష్టాలకు దారితీసేఘటనను సహజ విపత్తు అంటారు.

 వరదలు, కరవులు, సముద్ర వేలా తరంగాలు, భూప్రకంపనల కారణంగా సంభవించే విపత్తులు సహజ విపత్తుల కిందకి వస్తాయి. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ, 2008 చైనాలో వచ్చిన భూకంపం, 2007లో బంగ్లాదేశ్‌లో వచ్చిన సిదర్‌ తుపాను, రాజస్థాన్‌లో తరచూ వచ్చే కరవు; ఉత్తర, పశ్చిమ భారతదేశంలో ఏటా సంభవించే వరదలు సహజ విపత్తులకు ఉదాహరణలు.

  ప్రకృతి సంబంధ విపత్తుల నివారణ సాధ్యం కాదు. కానీ ఆధునిక శాస్త్ర, సాంకేతిక, సమాచార రంగాలను ఉపయోగించుకుని, వాటి తీవ్రతను కొంతవరకు తగ్గించవచ్చు.


2) మానవకారక విపత్తులు: ప్రభావిత ప్రజలు ఎదుర్కోలేని విధంగా మానవ, ఆర్థిక, పర్యావరణ నష్టాలకు దారితీసే మానవ ప్రేరేపిత వైపరీత్యం సాధారణ జీవితానికి కలగజేసే తీవ్ర అంతరాయాన్ని మానవ కారక విపత్తు అంటారు. 

అగ్నిప్రమాదాలు, రసాయన లేదా పారిశ్రామిక ప్రమాదాలు, పర్యావరణ కాలుష్యం, రోడ్డు, రైలు, విమాన, జల ప్రమాదాలు, రాజకీయ అశాంతి మొదలైనవాటితో తలెత్తే విపత్తులను మానవకారక విపత్తులు లేదా మానవ ప్రేరేపిత విపత్తులు అంటారు.

ఉదా: 1984 భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన, 1997లో దిల్లీలోని ఉపహార్‌ సినిమాహాలులో జరిగిన ప్రమాదం, 2002లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడం, 2003లో కుంభకోణం పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదం, 2008లో జైపుర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు, 2013, ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిన జంట పేలుళ్లు: విశాఖపట్టణం సమీపంలో ఆర్‌ఆర్‌ వేంకటాపురంలో 2020, మే 7న ఎల్జీ పాలిమర్స్‌ రసాయన పరిశ్రమలో జరిగిన గ్యాస్‌ లీక్‌ ప్రమాదం మొదలైనవి.


 అయిదు విభాగాలు: ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించిన ‘డెస్‌ఇన్వెంటర్‌’ విపత్తు సమాచార నిర్వహణ వ్యవస్థ వర్గీకరణ ప్రకారం సహజ విపత్తులను అయిదు ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు.


1) భూభౌతిక విపత్తులు: మానవ జీవనానికి, సామాజిక, ఆర్థిక అంతరాయానికి లేదా పర్యావరణ నష్టానికి కారణమయ్యే భౌగోళిక ప్రక్రియ లేదా ధర్మాన్ని భూభౌతిక విపత్తు అంటారు. దీంతో ప్రాణ, ఆస్తి నష్టాలతో పాటు గాయపడటం, ఆరోగ్య సమస్యలు తలెత్తడం, జీవనోపాధికి, సేవలకు నష్టం జరుగుతుంది. ఉదా: భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు, సునామీ.


2) హైడ్రోలాజికల్‌ ఘటనలు: సాధారణ జలచక్రంలో వచ్చే మార్పుల కారణంగా లేదా వాయువ్యవస్థలో మార్పు వల్ల జలాశయాలు పొంగిపొర్లడంతో సంభవించే ఘటనలు.

ఉదా: వరదలు, భూపాతాలు, తరంగ చర్యలు.


3) వాతావరణ సంబంధిత ఘటనలు: స్వల్ప వ్యవధి నుంచి దీర్ఘకాలిక వాతావరణ పరిస్థితుల కారణంగా సంభవించే విపత్తులు. ఉదా: తుపాను, టోర్నడో తుపాన్లు, ఉష్ణమండల తుపాన్లు, శీతలగాలులు, అసాధారణ ఉష్ణోగ్రతలు, పొగమంచు, మంచు గడ్డకట్టుకుపోవడం, వడగాలులు, పిడుగులు, భారీ వర్షాలు, ఇసుక తుపాన్లు, ధూళి తుపాన్లు, మంచు తుపాన్లు.


4) శీతోష్ణస్థితికి సంబంధించిన ఘటనలు: స్వల్పకాలం నుంచి దశాబ్దాల తరబడి శీతోష్ణస్థితి పరిస్థితుల్లో వచ్చే మార్పుల కారణంగా సంభవించే విపత్తు ఘటనలు. ఉదా: కరవు, అసాధారణ ఉష్ణ పరిస్థితులు, కార్చిచ్చులు, హిమానీనదాలు ఉప్పొంగడం, కుంగిపోవడం.


5) జైవిక ఘటనలు: వ్యాధికారక సూక్ష్మజీవులు, విష కీటకాలు, జైవిక చర్యను జరిపే పదార్థాల వల్ల ఆస్తి నష్టం, ప్రాణనష్టం, వ్యాధుల సంక్రమణ జరిగితే దాన్ని జైవిక విపత్తు అంటారు. దీని ప్రభావంతో జీవనోపాధి, సేవలు, సామాజిక, ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయంతో పాటు పర్యావరణ నష్టం జరుగుతుంది. ఉదా: వైరస్, బ్యాక్టీరియా, పరాన్నజీవులు, శిలీంధ్రాలు, ప్రియాన్‌ లాంటి వాటి ద్వారా వచ్చే ప్రాణాంతక వ్యాధులు, కీటకాల దాడులు, జంతువుల తొక్కిసలాటలు. 


 విపత్తు నిర్వహణ భావనలు ::విపత్తు ప్రభావం తక్షణంగా, స్థానికంగా ఉంటుంది. తరచూ విస్తారంగా, దీర్ఘకాలం కూడా ఉండొచ్చు. ఒక కమ్యూనిటీ సొంత వనరులతో ఎదుర్కోగలిగిన సామర్థ్యానికి మించి ఉండొచ్చు. అందువల్ల వెలుపలి నుంచి జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి వనరుల సాయం అవసరం కావచ్చు. 


అత్యవసరం: కొన్నిసార్లు విపత్తుకు బదులుగా ఈ భావనను వాడుతుంటారు. సమాజం మనుగడకు తీవ్ర అంతరాయం కలిగించే జైవిక లేదా సాంకేతిక వైపరీత్యాలు లేదా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు.


విపత్తు నష్టం: ఇది విపత్తు సమయంలో లేదా విపత్తు ఏర్పడిన క్షణమే సంభవిస్తుంది. దీనిని సాధారణంగా భౌతిక యూనిట్ల (ఇళ్లకు సంబంధించి చదరపు మీటర్లు, రోడ్లయితే కి.మీ.లు)లో లెక్కిస్తారు. ప్రభావిత ప్రాంతంలో భౌతిక ఆస్తుల మొత్తం లేదా పాక్షిక విధ్వంసాన్ని, ప్రాథమిక సేవలకు కలిగే అంతరాయాన్ని, జీవనోపాధి వనరులకు కలిగే ఇబ్బందులను వివరిస్తుంది.


విపత్తు తాకిడి: ఇదొక వైపరీత్య ఘటన లేదా విపత్తు ప్రతికూల, సానుకూలం సహా మొత్తం ప్రభావాన్ని   తెలియజేస్తుంది. ఇందులో ఆర్థిక, మానవ, పర్యావరణ తాకిడులు కూడా ఇమిడి ఉంటాయి. 


 విపత్తు రకాలు:   విపత్తు ముప్పు తగ్గింపునకు సెడాయ్‌ ఫ్రేమ్‌వర్క్‌ 2015-2030 పరిధి ప్రయోజనం ఆధారంగా విపత్తును వివిధ రకాలుగా పేర్కొంటారు. 


చిన్నతరహా విపత్తు: స్థానిక కమ్యూనిటీలపై మాత్రమే ప్రభావం చూపి, ఆ కమ్యూనిటీకి వెలుపల నుంచి సహకారం అవసరమయ్యే విపత్తు, చిన్నతరహా విపత్తు.


భారీతరహా విపత్తు: జాతీయ లేదా అంతర్జాతీయ  సహకారం అవసరమయ్యే విధంగా ఒక సమాజాన్ని ప్రభావితం చేసే విపత్తు.తరచూ, అరుదుగా వచ్చే విపత్తులు: విపత్తులు సంభవించే సంభావ్యత, ఒక నిర్దిష్ట వైపరీత్యం తిరిగి వచ్చే వ్యవధి, దాని తాకిడి ఆధారంగా విపత్తులను తరచుగా వచ్చే లేదా అరుదైన విపత్తులుగా వర్గీకరిస్తారు. 


నెమ్మదిగా విస్తరించే విపత్తు: కాలక్రమేణా క్రమంగా విస్తరించే విపత్తును నెమ్మదిగా విస్తరించే విపత్తు అంటారు. ఉదా: కరవు, ఎడారీకరణ, సముద్ర మట్టాల పెరుగుదల, కొవిడ్‌-19 లాంటి  మహమ్మారుల వ్యాప్తి.


అకస్మాత్తుగా దాడి చేసే విపత్తు: ఇది సత్వరం లేదా ఆకస్మికంగా సంభవించే వైపరీత్య ఘటన. ఉదా: భూకంపం, అగ్నిపర్వత విస్ఫోటం, ఆకస్మిక వరదలు, రసాయన విస్ఫోటం.


 


రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌ 

Posted Date : 15-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణంపై మానవ ప్రభావం

విచక్షణరహిత చర్యలతో విధ్వంసాలు!


అనుకోని వర్షాలు, ఆకస్మిక వరదలు, అంతుపట్టని అంటువ్యాధులు, భరించలేని భూతాపాలు, దుర్భర దుర్భిక్షం.. అంచనాలకు అందని ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఆధునిక కాలంలో తలెత్తుతున్నాయి. దాంతో ఎడారీకరణ, తుపానులు, సునామీలు సంభవిస్తున్నాయి. ప్రగతి పేరుతో మనిషి విచక్షణరహితంగా చేసే పనులు విధ్వంసాలను సృష్టిస్తున్నాయి.  క్రమంగా జీవజాతులు అంతరిస్తున్నాయి. జీవులకు, పరిసరాలకు మధ్య సంబంధాల్లో సమస్యల వల్లే వాతావరణంలో ఆ విధమైన విపరిణామాలు ఏర్పడుతున్నాయి.  భవిష్యత్తు తరాల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ పర్యావరణ మార్పుల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. మానవ చర్యలు విపత్తులకు కారణమవుతున్న తీరును, ప్రకృతి అనుకూల జీవన విధానాన్ని అలవరచుకోవాల్సిన అవసరాన్ని అర్థం చేసుకోవాలి.


జీవరాశులన్నింటిలో ఒక్క మానవుడికి మాత్రమే తన పరిసరాల్లోని, పరిసరాలకు దూరంగా ఉన్న సహజ వనరులను వివిధ రూపాల్లో వినియోగించుకునే సామర్థ్యం ఉంది. మనిషికి ఉన్న ఈ శక్తితో ప్రకృతి సృష్టించే ప్రతిబంధకాలను అధిగమించి తాను అభివృద్ధిపరిచిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం సహాయంతో పెద్ద పెద్ద నాగరికతలను రూపొందించాడు. ప్రాచీన మానవుడు తన కనీస అవసరాల కోసమే సహజ వనరులను వినియోగించేవాడు. ఇందులో భాగంగా ఏర్పడే వ్యర్థాలను పర్యావరణం సులభంగా తనలో ఇముడ్చుకునేది. నిప్పును కనిపెట్టడంతో పర్యావరణంపై మానవ ప్రభావం ప్రారంభమైంది. దీంతో క్రూరమృగాలను దెబ్బతీయడం, అడవులు తగలబెట్టి వ్యవసాయ భూములుగా మార్చడం, స్థిర వ్యవసాయాన్ని ప్రారంభించడంతో ఆవరణ వ్యవస్థలపై మానవుడి ప్రభావం వేగవంతమైంది. పారిశ్రామిక విప్లవ ప్రారంభంతో మరింత తీవ్రమైంది. పారిశ్రామిక విప్లవం తర్వాత పర్యావరణంపై మానవ ప్రభావం పెరగడానికి, పర్యావరణ వనరులు క్షీణించడానికి పలు కారణాలున్నాయి. అవి 

1) జనాభా పెరుగుదల 

2) వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామీకరణ, పట్టణీకరణ 

3) ఆధునిక ప్రపంచ ఆర్థిక పోకడలైన సరళీకరణ, ప్రపంచీకరణ, బహుళజాతి కంపెనీల లాంటి మార్కెట్‌ శక్తులు 

4) అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం 5) నూతన వినిమయ సంస్కృతి కారణంగా ఘన వ్యర్థ పరిమాణం పెరగడం.


మూడు రకాలు: పర్యావరణంపై మానవుడి ప్రభావం మూడు రకాలుగా ఉంటుంది. 

1) ఉపాధి, విద్య, వైద్యం, విలాసవంతమైన జీవనాన్ని వెతుక్కుంటూ ప్రపంచం అంతటా గ్రామాల నుంచి నగరాలకు దారితీసే వలసలు నగర ఆవరణ వ్యవస్థలను కలుషితం చేస్తున్నాయి. దీనివల్ల నగరాల్లో మురికివాడల సంఖ్య పెరగడం, తాగునీరు, ఆరోగ్యపరమైన సమస్యలు తీవ్రమవుతున్నాయి. 

2) మానవుడు సాంకేతిక నైపుణ్య వ్యవస్థల ద్వారా చుట్టూ ఉన్న పర్యావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో సహజ ఆవరణ వ్యవస్థల స్వభావాన్ని మార్చడంతో సహజ వనరుల నాణ్యత తగ్గిపోతోంది. జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఉదా: పశ్చిమ రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాలకు సాగు  నీటిని అందిస్తూ ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి నిర్మించిన ఇందిరాగాంధీ కాలువ నిర్మాణం వల్ల జొన్న, సజ్జ లాంటి ఆహార పంటల సాగు తగ్గి చెరకు, పత్తి లాంటి వాణిజ్య పంటల సాగు విస్తరించింది. సాంద్ర వ్యవసాయ విధానాల వల్ల భూ వనరులు క్షారనేలలుగా మారిపోతున్నాయి. అంతేకాకుండా పర్షియా సింధు శాఖ ప్రాంతంలో చమురు నిక్షేపాల వెలికితీతతో పరిశ్రమల సంఖ్య పెరిగి ఆ ప్రాంత భూవనరులపై ఒత్తిడి పెరుగుతోంది. 

3) పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి అధికం చేసే ప్రయత్నంలో హరిత విప్లవ సాంకేతిక పద్ధతులైన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని అధికం చేయడం వల్ల భూ, జలవనరులు కాడ్మియం, ఫ్లోరిన్, లెడ్‌ లాంటి భార లోహాలతో కలుషితమయ్యాయి. ఉదా: ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్న ఫ్లోరోసిస్, ఇటాయి - ఇటాయి, మినిమాటా లాంటి వ్యాధులకు కారణం తాగే నీటిలో ఈ కాలుష్యాల పరిమితి మించడమే.


మొత్తం మీద మానవుడు అభివృద్ధి కార్యకలాపాల పేరుతో వనరులను దుర్వినియోగపరుస్తూ పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాడు. దీని ఫలితమే గ్లోబల్‌ వార్మింగ్, ఆమ్లవర్షాలు, ఓజోన్‌ పొర క్షీణత, జనవనరుల పరిమాణం తగ్గిపోవడం, బంజరు విస్తృతి, ఎడారీకరణ, వరదలు, దుర్భిక్షం, భూకంపం, సునామీల తీవ్రత పెరగడం, జాతుల అంతర్థానం, అంటు వ్యాధులు ప్రబలడం మొదలైనవి. 


శీతోష్ణస్థితి మార్పు


సముద్ర మట్టం పెరగడం: భూమిపై శీతోష్ణస్థితి మార్పు ద్వారా ధ్రువ హిమ శిఖరాలన్నీ కరిగి సముద్ర మట్టం పెరుగుతోంది. ఐపీసీసీ ప్రకారం 2100 నాటికి 80 సెం.మీ. పైగా సముద్రమట్టం పెరిగి, పసిఫిక్, హిందూ మహాసముద్రంలో అనేక దీవులు శాశ్వతంగా మునిగిపోయే ప్రమాదం ఉంది. తువాలు, మార్షల్‌ దీవులు, మాల్దీవులు ఈ జాబితాలో ఉన్నాయి.


వ్యవసాయం: రబీ కాలంలో గత దశాబ్ద   కాలంగా ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం గోధుమ దిగుబడిపై తీవ్రంగా ఉంటోంది. ఐఎన్‌సీసీఏ ప్రకారం దేశ సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు రబీ కాలంలో ఒక డిగ్రీ చొప్పున పెరిగితే గోధుమ దిగుబడి 6 మిలియన్‌ టన్నుల మేరకు తగ్గే ప్రమాదం ఉంది. నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాల రాకపైనా ప్రభావం పడుతుంది. వర్షాలు ఆలస్యంగా కురవడం, రెండు రుతుపవనాల మధ్య అంతరం పెరగడం, కుండపోత వర్షాలతో పంటలు నాశనం కావడం లాంటి ప్రభావాలు ఇప్పటికే ఉష్ణమండల దేశాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంపై శీతోష్ణస్థితి మార్పు ప్రభావాల ద్వారా దిగుబడి తగ్గడమే కాకుండా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మహిళలు, ఆడపిల్లల్లో పోషకాహార లోపం పెరుగుతుంది. ఆసియాలో వరి దిగుబడిపై శీతోష్ణస్థితి మార్పు తీవ్ర ప్రభావాన్ని ప్రదర్శించనున్నట్లు ఐపీసీసీ ఇప్పటికే హెచ్చరించింది. ఈ ప్రాంతంలో వరి దిగుబడిలో 30 శాతం తగ్గుదల నమోదు కానుంది. అయితే ఉత్తరార్ధ గోళంలో శీతోష్ణస్థితి మార్పుతో వెచ్చదనం పెరిగి పంటల సాగు, దిగుబడి పెరిగే అవకాశం ఉంది.


అధిక వరదల తీవ్రత: ప్రపంచవ్యాప్తంగా వరదల తీవ్రత పెరగడానికి శీతోష్ణస్థితి మార్పే కారణం. కుండపోత వర్షాలతో నగరాలు ముంపునకు గురవుతున్నాయి. 2021లో జర్మనీ, బెల్జియం, ఇతర యూరప్‌ దేశాలు భారీ స్థాయి వరదలను చవిచూశాయి. వెయ్యేళ్లలో ఎప్పుడూ చూడని వరదలు చైనాను ముంచెత్తాయి.


ఓషన్‌ అసిడిఫికేషన్‌: వాతావరణంలో  కార్బన్‌డైఆక్సైడ్‌ పెరిగేకొద్దీ సముద్ర నీటిలో కరిగే ఆ వాయువు మోతాదు కూడా పెరుగుతుంది. సముద్ర నీటిలో కార్బొనిక్‌ ఆమ్లం అధికమై నీరు ఆమ్లయుతంగా మారుతుంది. సాధారణంగా సముద్ర నీటి pH 8-8.5 గా ఉంటుంది.. సముద్ర నీటిలోకి కార్బన్‌డైఆక్సైడ్‌ అధిక మొత్తంలో కరిగే కొద్దీ సముద్ర pH విలువ కొద్దిగా తగ్గుతుంది.సముద్రనీటి మార్పుతో ఆహారంగా ఉపయోగపడే సముద్రజీవుల సాంద్రత తగ్గి జాలర్ల ఆదాయం కూడా తగ్గుతుంది.


జంతువులపై ప్రభావం: ఆర్కిటిక్‌ ప్రాంతంలో ధ్రువ ఎలుగుబంట్లు, అంటార్కిటిక్‌లో పెంగ్విన్‌లపై శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. శీతాకాలంలో ఆర్కిటిక్‌ ప్రాంతంలోని సముద్రంపై నడిచే ధ్రువ ఎలుగుబంట్లు హిమక్షీణత ద్వారా ఆహారం లభించక క్షీణిస్తున్నాయి. ఇదే కొనసాగితే భవిష్యత్తులో ఇవి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. 


తుపాను తీవ్రత: తుపాను తీవ్రత పెరగడానికి శీతోష్ణస్థితి మార్పే ప్రధాన కారణమని ఇప్పటికే గుర్తించారు. ఫైలాన్, హుద్‌హుద్, అంఫన్, నిసర్గ, తౌతే లాంటి తుపానులు మరింత తీవ్రతతో సంభవించే ప్రమాదం ఉంది. సమగ్ర తుపాను నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేసుకోకపోతే ఆర్థిక నష్టాలు తీవ్రస్థాయిలో సంభవిస్తాయి.


జలవలయం: ఉష్ణమండల ప్రాంతాల్లోని జలవలయంపై శీతోష్ణస్థితి మార్పు ప్రభావాన్ని కూడా గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా వర్షం కురిసి వరదలు సంభవిస్తే, ఇంకొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక క్షామం ఏర్పడుతోంది. ఆసియాలో 50 కోట్లకుపైగా జనాభా తీవ్రస్థాయి నీటి కొరత ఎదుర్కోనున్నట్లు ఐపీసీసీ గుర్తించింది.


హిమానీనదాల అదృశ్యం: హిమానీనదాలపైనా శీతోష్ణస్థితి మార్పు ప్రభావం    పడుతోంది. ఏటా గంగోత్రి హిమానీనదం 1.8 మి.మీ. చొప్పున క్షీణిస్తోంది. ఫలితంగా 2030-50 మధ్యకాలంలో హిమానీనదాలు అదృశ్యమై తూర్పు, ఉత్తర భారతదేశంలో తీవ్ర నీటికొరత ఏర్పడుతుంది.


జీవవైవిధ్య నష్టం: భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు ప్రతి 2 - 3 డిగ్రీలు పెరిగే కొద్దీ   20 - 30 శాతం జీవవైవిధ్యం నష్టపోతున్నట్లు ఐపీసీసీ గుర్తించింది. అత్యధిక జీవజాతులు, అధిక స్థానీయ జీవవైవిధ్యం దీవులు తీర ప్రాంతాల్లోనే కనిపిస్తాయి.  శీతోష్ణస్థితి మార్పు ప్రభావంతో సముద్ర మట్టం పెరిగితే తొలుత ఇలాంటి ప్రాంతాలే మునిగిపోతాయి. అక్కడున్న స్థానీయవైవిధ్యం అదృశ్యమవుతుంది.


వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం: ఏటా వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్నాయి. 2017ను అత్యధిక వేడి సంవత్సరంగా గుర్తించారు. ఉష్ణమండల ప్రాంతాల్లో వడదెబ్బతో చనిపోయేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఆశ్చర్యకరంగా ఉత్తరార్ధ గోళంలోనూ వేసవి తాపం పెరుగుతోంది. కెనడాలోని లిట్టన్‌ ప్రాంతంలో 2021లో 49.5 0C ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. భారత్‌లో వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత ఏటా పెరుగుతోంది.


ఈ ధోరణులను పరిశీలిస్తే మానవుడు తన జీవనశైలిని పర్యావరణ సామర్థ్యానికి అనుకూలంగా మార్చుకోవాలి. పర్యావరణానికి, మానవుడికి మధ్య సంబంధాలు సకారాత్మకంగా ఉండాలి లేకపోతే     పర్యావరణ  ఆధిపత్యం శీతోష్ణస్థితిలో మార్పుల రూపంలో మానవుడిపై  అధికమై జీవజాతి మనుగడే ప్రమాదంలో పడుతుంది.


రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌ 

Posted Date : 21-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

శీతోష్ణస్థితి మార్పు  

భూతాపాన్ని పెంచేస్తున్న వరి సాగు!


ప్రస్తుత ప్రపంచం ప్రాంతాలకు అతీతంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య శీతోష్ణస్థితి మార్పు. మానవ అభివృద్ధి పరిణామక్రమంలో చోటుచేసుకున్న పరిస్థితులు, జరిగిన ఆవిష్కరణలు, సరికొత్త జీవనశైలి, పెరిగిన వ్యవసాయం, సాంకేతిక వినియోగం లాంటివన్నీ సహజ వాతావరణాన్ని దెబ్బతీసి, భూతాపాన్ని పెంచేశాయి. ప్రకృతి సమతౌల్యత గతి తప్పి అనేక అనర్థాలు తలెత్తున్నాయి. ప్రధాన కాలుష్యకారక వాయువులు, వాటి ఉత్పత్తి కారకాలు, కర్బన ఉద్గారాలతో ఆవరణ వ్యవస్థల్లో ఎదురవుతున్న నష్టంపై అభ్యర్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. కాలుష్యం కారణంగా వస్తున్న వ్యాధులతో పాటు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా తెలుసుకోవాలి. 


 ఒక భౌగోళిక ప్రాంతంలోని సగటు వాతావరణ స్థితిని దీర్ఘకాలికంగా లెక్కించగా వచ్చేదే ఆ ప్రాంత శీతోష్ణస్థితి. భూగోళ సగటు ఉష్ణోగ్రత 15.40 సెంటీగ్రేడ్‌. అయితే మానవుడు అభివృద్ధి పేరిట చేపట్టే కార్యక్రమాల కారణంగా గ్రీన్‌హౌస్‌ వాయువులు వాతావరణంలోకి ఎక్కువగా విడుదలవుతున్నాయి. దీంతో గత 225 ఏళ్ల నుంచి స్థిర స్వభావం ఉన్న భూగోళ సగటు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీన్నే శీతోష్ణస్థితిలో మార్పు అని పిలుస్తారు.


శిలాజ ఇంధనాలు ఎక్కువగా మండించడం, వ్యవసాయంలో ఎరువుల వాడకం లాంటి చర్యలతో విడుదలయ్యే ఏరోసాల్స్, క్లోరోఫ్లోరో కార్బన్లు గ్రీన్‌హౌజ్‌ రూపంలో భూమిపైకి వచ్చే ఉష్ణశక్తిని గ్రహించి బంధించడం వల్ల భూగోళ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

శీతోష్ణస్థితి మార్పుల్లో ప్రధానమైనవి 

1) ఆమ్ల వర్షాలు 

2) ఓజోన్‌ క్షీణత 

3) గ్లోబల్‌ వార్మింగ్‌ (భూతాపం)   


మాదిరి ప్రశ్నలు


1. భూగోళ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కారణమేంటి?

1) కార్బన్‌ డై ఆక్సైడ్‌ నీటిఆవిరిలోని ఉష్ణాన్ని గ్రహించడం.

2) కార్బన్‌ డై ఆక్సైడ్‌ అతినీలలోహిత కిరణాలను గ్రహించడం.

3) భౌమ వికిరణ రూపంలోని పరారుణ కాంతిని గ్రహించడం.     

4) పైవన్నీ


2.  కిందివాటిలో గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమైన  గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో లేనిది ఏది?

1) CO  2) CO    3) CH   4) N2O


3.  కింది గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో ట్రోపోస్ఫియర్‌ ప్రాంతంలో ఓజోన్‌ కాలుష్యకానికి కారణం కాని వాయువు?

 1) మీథేన్‌        2) కార్బన్‌ మోనాక్సైడ్‌    

3)  నైట్రోజన్‌ ఆక్సైడ్‌    4)  నీటిఆవిరి


4.  కిందివాటిని పరిశీలించి సరైనవాటిని గుర్తించండి.

ఎ) ఓజోన్‌ అధికంగా స్ట్రాటోస్ఫియర్‌ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటుంది.

బి) ఓజోన్‌ పొర భూ ఉపరితలం నుంచి 55 - 75 కిలోమీటర్ల పైన కేంద్రీకృతమై ఉంటుంది.

సి)   ఓజోన్‌ వాయువు సూర్యుడి నుంచి భూఉపరితలం వైపు ప్రసరించే అతినీలలోహిత కిరణాలను  గ్రహిస్తుంది.

డి) భూమి మీద ఉండే జీవజాతి మనుగడ పరంగా ఓజోన్‌ వాయువు పాత్ర లేదు.

 1) ఎ, బి   3)  ఎ, సి   3)  బి, సి   4)  సి, డి)


5. అంటార్కిటికా ప్రాంతంలో స్ట్రాటో ఆవరణంలో ఓజోన్‌ రంధ్రాన్ని ఎప్పుడు గుర్తించారు?

 1) 1975  2) 1985   3)  1978    4)  1987


6. కిందివాటిని పరిశీలించండి.

ప్రతిపాదన (A): క్లోరోఫ్లోరో కార్బన్‌లు (CFCs) ఓజోన్‌ పొరను విచ్ఛిన్నం చేస్తాయి.

కారణం(R): క్లోరోఫ్లోరో కార్బన్‌లు (CFCs) క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్‌ వాయవులతో నిర్మితమై ఉంటాయి.

1)  A, R లు సరైనవి. A కి R సరైన వివరణ.

2) A, R లు సరైనవి. A కి R  సరైనవివరణ కాదు.

3)  A సరైంది, R సరైంది కాదు.

4) A సరైంది కాదు, R సరైంది.


7.  కిందివాటిలో సరైన జతను గుర్తించండి.

 1) బాసల్‌ సదస్సు - జీవవైవిధ్య సంరక్షణ

2) మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ - గ్లోబల్‌ వార్మింగ్‌

3)  క్యోటో ప్రొటోకాల్‌ - శీతోష్ణస్థితిలో మార్పులు

4)  రామ్‌సర్‌ సదస్సు - భూగర్భజల కాలుష్యం


8.  కిందివాటిలో ఏ జంట వాయువులు గ్లోబల్‌  వార్మింగ్‌కు అత్యధికంగా కారణమవుతున్నాయి?

 1) కార్బన్‌ డయాక్సైడ్, నైట్రస్‌ ఆక్సైడ్‌

2) కార్బన్‌ డయాక్సైడ్, మీథేన్‌

3)  మీథేన్, నైట్రస్‌ ఆక్సైడ్‌

4)  కార్బన్‌ డయాక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్‌


9.  ఓజోన్‌ రంధ్రం ఏర్పడటానికి కారణమైన అతి ప్రధాన దేశం?

 1) రష్యా  2) జపాన్‌  3)  అమెరికా  4)  జర్మనీ


10. గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమైన గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో పూర్తిగా మానవ చర్యల వల్ల వాతావరణంలో చేరే గ్రీన్‌హౌస్‌ వాయువు ఏది?

 1) క్లోరోఫ్లోరో కార్బన్స్‌     2) మీథేన్‌ 

3)  నైట్రస్‌ ఆక్సైడ్‌     4) సల్ఫర్‌ హెక్సాఫ్లోరైడ్‌


11. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో వరి సాగు ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టడం వల్ల గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావానికి కారణమవుతుంది. కింది ఏ కారణాన్ని దీనికి ఆపాదించవచ్చు?

ఎ) వరి సాగు భూముల్లో అవాయు శ్వాసక్రియ  జరగడం వల్ల మీథేన్‌ వాయువు వాతావరణంలోకి విడుదలవుతుంది.

బి) పంటల పెరుగుదలకు నైట్రోజన్‌ సంబంధిత ఎరువులను పంట భూముల్లో ఎక్కువగా పిచికారీ చేయడం వల్ల వాతావరణంలోకి నైట్రస్‌ ఆక్సైడ్‌ విడుదలవుతుంది.

 1) ఎ మాత్రమే     

2) బి మాత్రమే   

3)  ఎ, బి లు రెండూ సరైనవే    

4)  ఎ, బి లు రెండూ సరికాదు


12. కిందివాటిలో ఆమ్ల వర్షాలకు కారణమైన  కాలుష్యకాలు ఏవి?

 1) నైట్రోజన్, సల్ఫర్‌ ఆక్సైడ్‌లు

2) కార్బన్‌ డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్‌

3)  ఓజోన్, కార్బన్‌ మోనాక్సైడ్‌

3)  కార్బన్‌ మోనాక్సైడ్, నైట్రోజన్‌


13. Bad Ozone అంటే...

 1) ట్రోపో ఆవరణ ప్రాంతంలో ఓజోన్‌ పరిమాణం తక్కువగా ఉండే స్థితి.

2) స్ట్రాటో ఆవరణ ప్రాంతంలో ఓజోన్‌ పరిమాణం తక్కువగా ఉండే స్థితి.

3)  ట్రోపో ఆవరణ ప్రాంతంలో ఓజోన్‌ పరిమాణం పరిమితి కంటే ఎక్కువగా ఉండే స్థితి.

4)  మీసో ఆవరణ ప్రాంతంలో ఓజోన్‌ పరిమాణం తక్కువగా ఉండే స్థితి.


14. Good Ozone అంటే...

 1) ట్రోపో ఆవరణ ప్రాంతంలో ఓజోన్‌ పరిమాణం తక్కువగా ఉండే స్థితి.

2)స్ట్రాటో ఆవరణ ప్రాంతంలో ఓజోన్‌ పరిమాణం ఎక్కువ స్థాయిలో ఉండే స్థితి.

3) ట్రోపో ఆవరణ ప్రాంతంలో ఓజోన్‌ పరిమాణం పరిమితి కంటే ఎక్కువగా ఉండే స్థితి.

4)  మీసో ఆవరణ ప్రాంతంలో ఓజోన్‌ పరిమాణం తక్కువగా ఉండే స్థితి.


15. కిందివాటిలో ఓజోన్‌ పొర క్షీణతకు కారణమైన వాయువులు?

 1) క్లోరోఫ్లోరోకార్బన్లు, నైట్రిక్‌ ఆక్సైడ్‌

2) టెట్రా క్లోరోమీథేన్, మీథేన్‌ బ్రోమైడ్‌

3)  పోలార్‌ స్ట్రాటోస్ఫియర్‌ క్లౌడ్స్‌    

4)  పైవన్నీ


16. కిందివాటిలో ఓజోన్‌ క్షీణత వల్ల కలిగే  దుష్ప్రభావం ఏది?

1) అతినీలలోహిత కిరణాలు ఎక్కువ పరిమాణంలో భూమిపైకి చేరి మానవుడిలో కార్సినోమా, మెలనోమా అనే చర్మక్యాన్సర్‌ వ్యాధులు రావడం, స్త్రీలలో రొమ్ము క్యాన్సర్, బ్లడ్‌ క్యాన్సర్, కాటరాక్ట్‌ అనే కంటి సంబంధ వ్యాధులు వస్తాయి.

2) మానవుల్లో కళ్లు మంటలెక్కుతాయి.

3)  మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గి ఆహారోత్పత్తి, దిగుబడులు తగ్గిపోతాయి.

4)  పైవన్నీ


17. కిందివాటిలో ప్రవాళభిత్తికల విక్షాళనానికి కారణం?

 1) ప్రవాళభిత్తికల తవ్వకాలు

2) ప్రవాళాలపై వ్యాధులు విస్తరించడం

3)  సముద్రపు నీటిలో పూడికలు ఎక్కువగా చేరడం

4)  గ్లోబల్‌ వార్మింగ్‌


18. ఓజోన్‌ పొర క్షీణతను అరికట్టేందుకు UNO ఆధ్వర్యంలో చేపట్టిన ఒప్పందాలకు సంబంధించి కింది పట్టికను జతపరచండి.

ఒప్పందం        సంవత్సరం

1) వియన్నా కన్వెన్షన్‌    ఎ) 1985

2) మాంట్రియల్‌ కన్వెన్షన్‌   బి) 1987

3) లండన్‌ సదస్సు        సి)   1992

4)  వియన్నా ఒప్పందం     సి)    1991

1) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి          

2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి

3)  1-డి, 2-బి, 3-ఎ, 4-సి         

4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి


19. కిందివాటిలో IPCC (Inter Governmental Pannel on Climate Change) ఏర్పాటులో ముఖ్యపాత్ర వహించిన అంతర్జాతీయ సంస్థలను గుర్తించండి.

ఎ) United Nations Environmental Programme (UNEP)

బి) World Trade Organisation (WTO)

సి)  World Meterological Organisation (WMO)

1) ఎ, బి   2) ఎ, సి  3)  బి, సి  4) ఎ, బి, సి


20. కిందివాటిలో గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం ఉందనేందుకు నిదర్శనాలు?

ఎ) వాతావరణపు గాలిలో ఉష్ణోగ్రతలు పెరగడం

బి) ఖండాంతర్గత, పర్వత హిమానీనదాలు కరగడం

సి)  సమశీతోష్ణ, ధ్రువ ప్రాంతాలవైపు ఉష్ణమండల అంటువ్యాధులు విస్తరించడం

1) ఎ, బి   2) ఎ, సి  3)  బి, సి   4)  ఎ, బి, సి


21. కిందివాటిలో సరైనవాటిని గుర్తించండి.

ఎ)  ఓజోన్‌ పొర ట్రోపోస్ఫియర్‌ పై సరిహద్దులో కేంద్రీకృతమై ఉంటుంది.

బి) భూగ్రహాన్ని ఓజోన్‌ పొర ఒక గొడుగులా, రక్షణా కవచం మాదిరి పరిరక్షిస్తుంది.

1) ఎ మాత్రమే     2) బి మ్రాతమే   

3)  రెండూ సరైనవి    4)  రెండూ సరికాదు


22. కిందివాటిని పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి.

ఎ) క్యోటో ప్రొటోకాల్‌లోని ఆర్టికల్‌-6 ప్రకారం ‘పరిశుభ్రమైన అభివృద్ధి విధానం’ కింద  అనుబంధం-1లోని ఒక దేశం, అనుబంధం-1లోని మరొక దేశంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కాలుష్య ఉద్గారాల యూనిట్‌లను పొందొచ్చు.

బి) ‘పరిశుభ్రమైన అభివృద్ధి విధానం’ కింద పొందిన కార్బన్‌ క్రెడిట్స్‌ను ‘కాలుష్య అనుమతి ఉద్గారాల తగ్గింపు యూనిట్స్‌ (CERUs) అని పిలుస్తారు.

సి)  ఒక CERUs ఒక టన్ను కార్బన్‌ డయాక్సైడ్‌కు సమానం.

1) ఎ, సి  2) బి మాత్రమే   3)  ఎ, బి  4) ఏదీకాదు


23. డైమిథైల్‌ మెర్క్యురీ కాలుష్యకం కిందివాటిలో ఏ వ్యాధికి కారణమవుతుంది?

 1) ఇటాయి - ఇటాయి      

2) బ్లూబేబీ సిండ్రోమ్‌

3) ఫ్లోరోసిస్‌    

4) మినమాటా


సమాధానాలు


1-3; 2-2; 3-4; 4-2; 5-2; 6-3; 7-3; 8-2; 9-3; 10-1; 11-3; 12-1; 13-2; 14-2; 15-4; 16-4; 17-4; 18-4; 19-2; 20-4; 21-2; 22-4; 23-4.


రచయిత: ఇ.వేణుగోపాల్‌


 

Posted Date : 23-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విపత్తు నిర్వహణ వ్యవస్థ, నిర్మాణం

ఆపదల్లో ఆదుకునే అత్యున్నత సంస్థలు!

సహజ, మానవకారక విపత్తులకు అవకాశం ఉన్న దేశం మనది. విశాలమైన భూభాగం, అధిక జనాభా, భౌగోళికంగా, నైసర్గికంగా విభిన్న పరిస్థితులు, వాతావరణ వ్యత్యాసాలు, అస్థిర రుతుపవనాలు ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఏడాది పొడవునా దేశంలో ఏదో ఒక చోట విపత్తులు సంభవిస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి రాష్ట్రాల     వారీగా విపత్తు నిర్వహణ యంత్రాంగాలు ఉన్నప్పటికీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సేవలు సరిపోవు. అందుకే దేశవ్యాప్తంగా ఈ పరిస్థితులపై సత్వరం స్పందించి ఉపశమనం కల్పించే ఏర్పాట్లు సంస్థాగతంగా ఉన్నాయి. ప్రణాళికల నుంచి పునరావాసం వరకు బాధ్యత తీసుకునే ఈ వ్యవస్థ నిర్మాణంపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి. కేంద్ర స్థాయిలో విపత్తు నిర్వహణలో కీలకమైన సంస్థలు, కమిటీలు, విభాగాలు, వాటి విధుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.


భారతదేశంలో విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయం చేస్తుంది. 2019 విపత్తు నిర్వహణ ప్రణాళిక ఈ మేరకు నిర్దేశించింది. విపత్తు నిర్వహణకు సంబంధించిన అత్యున్నత స్థాయి నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర భద్రతా కేబినెట్‌ కమిటీ, జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీలు కీలకంగా ఉంటాయి. ఏ విపత్తునైనా జాతీయ విపత్తుగా గుర్తించడానికి విపత్తు నిర్వహణ చట్టం-2005లో తగిన నిబంధనలు లేవు.


విపత్తు నిర్వహణలో జాతీయ స్థాయి నిర్ణాయక సంస్థలు:


1) కేంద్ర భద్రతా కేబినెట్‌ కమిటీ: ఈ కమిటీలో ప్రధాని, కేంద్ర రక్షణ మంత్రి, ఆర్థికమంత్రి, దేశీయవ్యవహారాల మంత్రి, విదేశీవ్యవహారాల మంత్రి ఉంటారు. ఏదైనా సంఘటనలో భద్రతకు సంబంధించిన అంశాలుంటే, ఈ కమిటీ దాన్ని జాతీయ భద్రతా దృక్కోణంలో అంచనా వేస్తుంది. రసాయన, జైవిక, రేడియోధార్మిక, అణుఅత్యవసర పరిస్థితులు, భద్రతాపరమైన అంశాలున్న విపత్తులకు సంబంధించి సంసిద్ధత, ఉపశమనం, నిర్వహణల అన్ని దృక్కోణాలను పరిశీలిస్తుంది. కెమికల్‌ బయోలాజికల్‌ రేడియోలాజికల్‌ న్యూక్లియర్‌ (సీబీఆర్‌ఎన్‌) ముప్పు, అత్యవసర పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. విపత్తు నివారణ, ఉపశమనం, సంసిద్ధత, సమర్థ ప్రతిస్పందనకు చేపట్టాల్సిన చర్యలపై మార్గనిర్దేశకం చేస్తుంది.


2) జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ: ఈ కమిటీకి కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ ఛైర్‌పర్సన్‌. నిర్దిష్ట విపత్తు నిర్వహణ బాధ్యతలున్న మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీల కార్యదర్శులు సభ్యులు. ఈ కమిటీ విపత్తు ప్రతిస్పందన ఆదేశాలు, నియంత్రణ, సమన్వయాన్ని పర్యవేక్షిస్తుంది. అవసరమైన పక్షంలో సంక్షోభ నిర్వహణ బృందానికి సూచనలిస్తుంది. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనే విధంగా నిర్దిష్ట కార్యాచరణలకు సంబంధించి మార్గనిర్దేశం చేస్తుంది.


3) జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎమ్‌ఏ): దీనికి ప్రధానమంత్రి ఛైర్‌పర్సన్‌. ప్రధాని నామినేట్‌ చేసినవారు సభ్యులుగా ఉంటారు. వీరి సంఖ్య 9 మందికి మించదు. ఈ విభాగం విపత్తు నిర్వహణకు సంబంధించిన విధానాలు, ప్రణాళికలతోపాటు వేర్వేరు కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన విపత్తు నిర్వహణ మార్గదర్శకాలు రూపొందిస్తుంది. దేశవ్యాప్తంగా వాటి అమలును సమన్వయం చేస్తుంది. 


4) జాతీయ కార్యనిర్వాహక కమిటీ: ఈ కమిటీకి కేంద్ర హోం సెక్రటరీ ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. వ్యవసాయం, అణుశక్తి, రక్షణ, తాగునీరు, పారిశుద్ధ్యం, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పిడి, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్షం, టెలీకమ్యూనికేషన్, పట్టణాభివృద్ధి, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులు, సమీకృత రక్షణ దళాల అధిపతి, సైనిక దళాల అధిపతులు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉంటారు.


విపత్తు నిర్వహణలో పాత్ర:

* భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు లేదా విభాగాలు సిద్ధం చేసిన జాతీయ ప్రణాళిక, ప్రణాళికల అమలును పర్యవేక్షిస్తుంది.

* అత్యవసర ప్రతిస్పందన, రెస్క్యూ సహాయక చర్యల కోసం తమ వద్ద ఉన్న మానవ వనరులు, సామగ్రి లేదా ఇతర వనరులను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ లేదా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీకి అందుబాటులో ఉంచాల్సిందిగా ప్రభుత్వ విభాగాలు లేదా ఏజెన్సీలకు సూచిస్తుంది.

* కేంద్ర ప్రభుత్వం జారీచేసే మార్గదర్శకాలు అమలయ్యే విధంగా చూస్తుంది.

* విపత్తు పరిస్థితి లేదా విపత్తు సంఘటన సమయంలో ప్రతిస్పందన చర్యలను సమన్వయం చేస్తుంది.

* ముందస్తు హెచ్చరికల పర్యవేక్షణకు బాధ్యత వహించే సంబంధిత వైజ్ఞానిక సంస్థలు, ఏజెన్సీలతో సమన్వయం చేస్తుంది.

* రాష్ట్ర ప్రభుత్వాల సంబంధిత పాలనా విభాగాల ద్వారా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, పౌర రక్షణ వాలంటీర్లు, హోంగార్డులు, అగ్నిమాపక సేవలను సమన్వయం చేస్తుంది.


5) జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం: వెంటనే రంగంలోకి దిగే విధంగా పారామిలటరీ తరహాలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన దళం. దీనికి డైరెక్టర్‌ జనరల్‌ నేతృత్వం వహిస్తారు. ఈ దళం వైపరీత్య సంఘటన సమయంలో లేదా సంభవించిన తర్వాత సంబంధిత రాష్ట్రం, జిల్లా పాలనా యంత్రాంగానికి సహకరిస్తుంది.


6) జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ: కేంద్ర హోంమంత్రి అధ్యక్షుడిగా, ఎన్‌డీఎమ్‌ఏ వైస్‌ ఛైర్మన్‌ ఉపాధ్యక్షుడిగా ఉంటారు. ప్రముఖ నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రాక్టీషనర్లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోడల్‌ మంత్రిత్వశాఖలు, విభాగాలకార్యదర్శులు, జాతీయస్థాయి శాస్త్రవిజ్ఞాన, పరిశోధన సాంకేతికసంస్థల అధిపతులు సభ్యులుగా ఉంటారు.


విపత్తు నిర్వహణలో పాత్ర:

 * ఎన్‌డీఎమ్‌ఏ రూపొందించిన   విధానాలు, మార్గదర్శకాల పరిధిలో విపత్తు నిర్వహణ కోసం మానవ వనరుల అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం.

* శిక్షణా కార్యక్రమాల రూపకల్పన, అభివృద్ధి, అమలు.

* పరిశోధనలు చేపట్టడం

*  సమగ్ర మానవ వనరుల అభివృద్ధి ప్రణాళికను రూపొందించి, అభివృద్ధి చేయడం.

* జాతీయవిధాన రూపకల్పనకు సహకారం అందించడం, తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడానికి ఇతర పరిశోధన శిక్షణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలకు సహకరించడం.

* పంపిణీ చేయడానికి అవసరమైన విద్యాసామగ్రిని అభివృద్ధి చేయడం.

* విపత్తులు, వాటిని ఎదుర్కొనే విధానాలపై  అవగాహన పెంపొందించడం.


నమూనా ప్రశ్నలు


1.  ‘యాక్షన్‌ ఎయిడ్‌ ఇంటర్నేషనల్‌ సంస’్థ ఎక్కడ ఉంది?

1) కైరో   2) జోహెన్నస్‌ బర్గ్‌   

3) లాగోస్‌   4) కిన్షాస


2.  కిందివాటిలో అలర్ట్‌నెట్‌ అనే సంస్థ ఎక్కడ ఉంది?

1) మాంచెస్టర్‌    2) బర్మింగ్‌హామ్‌   

3) బ్రాడ్‌ ఫోర్డ్‌    4) లండన్‌


3. ‘ఆసియన్‌ డిజాస్టర్‌ రిడక్షÛన్‌ సెంటర్‌ సంస్థ’ ఎక్కడ ఉంది?

1) కోబ్‌   2) టోక్యో    3) క్యోటో    4) ఒసాకా


4. ‘ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడ్‌ క్రాస్‌ అండ్‌ రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీస్‌’ అనే సంస్థను ఎక్కడ నెలకొల్పారు? 

1) జెనీవా    2) జ్యూరిచ్‌    3) బెర్న్‌    4) బాసెల్‌


5.  ‘ఇంటర్నేషనల్‌ స్ట్రాటజీ ఫర్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌ (ఐఎస్‌డీఆర్‌)’ అనే సంస్థ ఏ ప్రాంతంలో ఉంది? 

1) బెర్న్‌    2) జ్యూరిచ్‌    3) బాసెల్‌    4) జెనీవా 


6. ‘అంతర్జాతీయ వాతావరణ సంస్థ’ ఎక్కడ ఉంది?

1) ఇంటర్‌ లాకెన్   2) జెనీవా   

3) లాసాన్‌   4) బెర్న్‌


7. ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌   క్లైమేట్‌ ఛేంజ్‌’ సంస్థ ఎక్కడ ఉంది?

1) జెనీవా   2) ఇంటర్‌ లాకెన్‌  

3) బెర్న్‌   4) లాసాన్‌


8. సౌత్‌ ఆసియన్‌ డిజాస్టర్‌ నాలెడ్జ్‌ నెట్‌వర్క్‌ అనే సంస్థను ఎక్కడ నెలకొల్పారు? 

1) లఖ్‌నవూ     2) దిల్లీ 

3) ముంబయి     4) హైదరాబాద్‌


సమాధానాలు

1-2; 2-4; 3-1; 4-1; 5-4; 6-2; 7-1; 8-2.


 రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌

 

Posted Date : 05-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణ సంస్థలు, ఒప్పందాలు, ఉద్యమాలు

ఆహారభద్రతకు నవధాన్య ఆందోళన!

మానవ వికాసం, ఆధునిక అభివృద్ధి పరిణామ క్రమంలో వనరుల వినియోగం అధికమవడం, జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, సాంకేతికతల వినియోగం వల్ల సహజ పర్యావరణం క్షీణిస్తోంది. భూగోళాన్ని కాలుష్య కారకాల నుంచి కాపాడి, భవిష్యత్తు తరాలకు సహజ పర్యా వరణాన్ని అందించే లక్ష్యంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పలు ఒప్పందాలు, చట్టాలు రూపొంది అమలవుతున్నాయి. కాలుష్య నివారణ, అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలు, ప్రభుత్వాలను చైతన్యపరిచేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. ప్రకృతిని కాపాడి, సుస్థిరాభివృద్ధిని సాధించేందుకు జరుగుతున్న ఈ సానుకూల పరిణామాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. దేశ, విదేశాల్లో జరిగిన ప్రఖ్యాత పర్యావరణ ఉద్యమాల గురించి తెలుసుకోవాలి.

 

పర్యావరణ కాలుష్యం ఫలితాలైన భూతాపం, ఓజోన్‌ క్షీణత, ఆమ్లవర్షాలు, నేల క్రమక్షయం, జన్యుఆధారిత   కాలుష్యకాలు లాంటి వైపరీత్యాలు మానవాళి మనుగడకే సవాళ్లు విసురుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో పర్యావరణ అంశాలపై ప్రజల్లో అవగాహన  పెరుగుతోంది. 1962లో అమెరికాలోని సిల్వర్‌ స్ప్రింగ్‌ ప్రాంతంలో పంటల చీడపీడల్ని నివారించేందుకు డీడీటీ పురుగుమందులు ఎక్కువగా వినియోగించారు. అందులోని మలినాలు పంట మొక్కల్లో జీవసాంద్రీకృతమవడం  పర్యావరణాన్ని ఎలా దెబ్బతీసిందో ‘సైలెంట్‌ స్ప్రింగ్‌’ అనే పుస్తకంలో ‘రేచల్‌ కార్సన్‌’ అనే ప్రపంచ పర్యావరణవేత్త వెల్లడించారు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తి అలవడింది. ఈ క్రమంలో భారతదేశంలోనూ పలు పర్యావరణ ఉద్యమాలు    పుట్టుకొచ్చాయి.


1.    కింది ప్రవచనాలు పరిశీలించి, సరైనవి     గుర్తించండి.

ఎ) క్యోటో ప్రోటోకాల్‌ అనేది ఒక చట్టబద్ధ ఒప్పందం. ఈ ఒప్పందంలో 37 పారిశ్రామిక దేశాలకు, యూరోపియన్‌ దేశాలకు గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాల తగ్గింపునకు సంబంధించి లక్ష్యాలు నిర్దేశించారు.

బి) ఈ ప్రోటోకాల్‌పై అమెరికా, ఆస్ట్రేలియా    సంతకాలు చేయలేదు.

సి) ఈ సమావేశంలో పారిశ్రామిక దేశాలు తాము విడుదల చేసే ఉద్గారాలను 1990లో ఉన్న ఉద్గారాల స్థాయిలో 2008 - 2012 నాటికి  5.3 శాతానికి తగ్గించాలని సూచించారు.

1) ఎ, బి      2) ఎ, సి    3) బి, సి    4) ఎ, బి, సి 



2.   కింది ప్రవచనాలు పరిశీలించి, సరైనవి      గుర్తించండి.

ఎ) క్యోటో ప్రోటోకాల్‌లో జరిగిన వాతావరణ  సదస్సులో కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదలను  తగ్గించడానికి సంబంధించి అన్ని దేశాలకు ‘ఒకే నిబంధనలు అయితే భిన్నమైన బాధ్యతలు’ అనే సూత్రాన్ని అనుసరించి అభివృద్ధి చెందిన    దేశాలపై అధిక బాధ్యత మోపారు.

బి) క్యోటో ప్రోటోకాల్‌ను 1997, డిసెంబరు 11న ఆమోదించగా 2005, ఫిబ్రవరి 16 నుంచి  అమల్లోకి వచ్చింది.

1) ఎ మాత్రమే    2) బి మాత్రమే    3) ఎ, బి     4) రెండూ కాదు

 


3.  cop-15 (కోపెన్‌ హెగెన్‌ సమావేశం)కు  సంబంధించి కింది ప్రవచనాల్లో సరైనవి ఏవి?

ఎ)  గ్లోబల్‌వార్మింగ్‌ ప్రభావాన్ని 2ా కంటే తక్కువకు పరిమితం చేయాలి.

బి) ఇదొక చట్టబద్ధ ఆమోద ఒప్పందం.

సి) ఈ సమావేశం డెన్మార్క్‌లోని కోపెన్‌ హెగెన్‌లో 2009లో జరిగింది.

1) ఎ, బి    2) బి, సి    3) ఎ, సి    4) ఎ, బి, సి

 



4.  ఐరాస ఆధ్వరంలో 2012లో జీవవైవిధ్య సదస్సు ఎక్కడ జరిగింది?

1) ఖతార్‌      2) దోహా    3) బెంగళూరు     4) హైదరాబాద్‌




5.   ఐరాస ఆధ్వరంలో 2014లో జీవవైవిధ్య సదస్సు జరిగిన ప్రదేశం?

1)  ఖతార్‌    2) దోహా    3) కాన్‌కూన్‌    4) ప్యాంగ్‌యాంగ్‌




6. ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం  ‘వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌’ అనే సంస్థను ఐయూసీఎన్‌ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది?

1)  1960     2) 1961     3) 1962     4) 1963
 


7.   గ్రీన్‌పీస్‌ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థను ఏ దేశంలో స్థాపించారు?

1) యూఎస్‌ఏ      2) కెనడా     3) మెక్సికో   4) జర్మనీ

 

 


8.  బి.సి.పంత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌  ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్ర  కార్యాలయం ఎక్కడ ఉంది?

1) నైనిటాల్‌     2) సిమ్లా    3) ఆల్మోరా     cదెహ్రాదూన్‌

 


9.   ‘ఇందిరాగాంధీ నేషనల్‌ ఫారెస్ట్‌ అకాడమీ’ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?

1) నైనిటాల్‌     2) సిమ్లా     3) ఆల్మోరా    4)  దెహ్రాదూన్‌

 


10. ‘వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా’ అనే వన్యప్రాణి సంరక్షణ సంస్థను ఎవరు ఏర్పాటు చేశారు?

1) సునీతా నారాయణ్‌     2) మేధాపాట్కర్‌     3) బిలిందా వైట్‌     4) చాందీ ప్రసాద్‌ బిట్టా



11. ‘వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’కు   సంబంధించి కిందివాటిలో సరైనవి గుర్తించండి.

ఎ) 1982లో దెహ్రాదూన్‌లో స్థాపించారు.

బి) వన్యప్రాణుల సంరక్షణకు పరిశోధనలు చేస్తుంది.

సి) వన్యప్రాణుల సంరక్షణకు నియమితులయ్యే   అధికారులకు శిక్షణాకార్యక్రమాలు నిర్వహిస్తుంది.

1) ఎ, సి     2) బి, సి    3) సి మాత్రమే    4) పైవన్నీ

 

 


12. ‘గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఫెసిలిటీ’కు     సంబంధించి కిందివాటిలో ఏవి సరైనవి?

ఎ) దీన్ని 1991లో స్థాపించారు.

బి) ప్రధాన కేంద్రకార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.

సి) శీతోష్ణస్థితిలో మార్పు, జీవవైవిధ్యం, నేల - నీటి కాలుష్యం మొదలైన వాటికి సంబంధించిన  ప్రాజెక్టులకు గ్రాంట్లు మంజూరు చేస్తుంది.

1) ఎ, బి     2) బి, సి     3) సి మాత్రమే     4) బి మాత్రమే
 

 


13. ‘పెటా ఇండియా’కి సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.

ఎ) దీన్ని 2000లో ముంబయిలో స్థాపించారు.

బి) జంతువులను రక్షించడానికి శాకాహారాన్ని   ప్రోత్సహిస్తుంది.

సి) ‘‘జంతువులున్నది తినడానికి కాదు, ప్రయోగాలు చేయడానికి కాదు, తిట్టడానికి కాదు, అన్ని ప్రాణులూ సమానమే.’’ అనే వినాదంతో  ప్రజలను, పాలకులను జంతుసంరక్షణ దిశగా చైతన్యవంతులను చేస్తుంది.

1) ఎ, బి     2) బి, సి    3) సి మాత్రమే    4) పైవన్నీ

 

 


14. యూఎన్‌ఈపీకి సంబంధించి కిందివాటిలో ఏవి సరైనవి?

ఎ) దీన్ని 1972 లో స్థాపించారు.

బి) ఐరాస ఆధ్వరంలో చేపట్టే పర్యావరణ కార్యక్రమాలను సమన్వయం చేయడం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల అమలుకు సహాయ సహకారాలు అందించడం.

సి) వివిధ దేశాలతో కలిసి పాలసీలు అమలు     చేయడం.

డి) పలు దేశాలకు చెందిన ఎన్జీఓలతో కలిసి   పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొనడం.

1) ఎ, బి, సి    2) బి, సి, డి    3) ఎ, సి    4) ఎ, బి, సి, డి



 

15. ‘పెటా’కు సంబంధించి సరైన వాక్యాలు     గుర్తించండి.

ఎ) 1980 లో స్థాపించిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ.

బి) యూఎస్‌ఏలోని వర్జీనియా కేంద్ర కార్యాలయంగా ఇంగ్రిడ్‌ న్యూకిర్క్, అలెక్స్‌ పాచెరో అనే  వాలంటీర్లు ఈ సంస్థను స్థాపించారు.

సి) ప్రపంచవ్యాప్తంగా జంతువులను పరిరక్షిస్తూ, పర్యావరణ జీవవైవిధ్య పరిరక్షణ కోసం శాకాహారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.

1) ఎ, బి, సి     2) బి, సి    3) సి మాత్రమే     4) పైవేవీకావు




16. ‘సైలెంట్‌ స్ప్రింగ్‌’ పుస్తక రచయిత?

1) ఎడ్వర్డ్‌ ఆర్నాల్డ్‌      2) ఆల్‌ తుమిమి    3) రేచల్‌ కార్సన్‌      4) సలీం అలీ




17. అడవుల నరికివేతకు వ్యతిరేకంగా ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో 1964లో ఏర్పాటైన చిప్కో ఉద్యమానికి పునాది వేసిన సంస్థ?

1)  జంగిల్‌ బచావో ఆందోళన్‌    2) దసోలి గ్రామస్వరాజ్‌ మండల్‌

3) నవధాన్య ఉద్యమం    4) అవతార్‌ ఉద్యమం
 


18. చిప్కో ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?

1) 1970      2) 1971       3) 1972     4) 1973 


 


19. రోములస్‌ విట్టేకర్‌ అనే పర్యావరణవేత్త  ఆధ్వరంలో ప్రారంభమైన ఉద్యమం ఏది?

1) నవధాన్య ఉద్యమం     2) సైలెంట్‌ వ్యాలీ ఉద్యమం

3) అప్పికో చలు వ్యాలీ      4) అవతార్‌ ఉద్యమం



 

20. 1978లో కేరళలో ప్రారంభమైన సైలెంట్‌ వ్యాలీ ఉద్యమానికి కారణం?

1) కుంతిపూజ నదిపై హైడ్రోఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం.

2) కొంకణ్‌ రైల్వే నిర్మాణాన్ని సైలెంట్‌ వ్యాలీ మీదుగా నిర్మించడం.

3) మోనోజైట్‌ నిక్షేపాల వెలికితీత.

4) సింహపు తోక కోతుల నిర్మూలనకు వ్యతిరేకంగా

 


21. ఉత్తర కర్ణాటక జిల్లాల్లో అటవీ నిర్మూలనకు  వ్యతిరేకంగా ఆ ప్రాంత ప్రజలు 1983లో  ప్రారంభించిన ఉద్యమం ఏది?

1) నవధ్యాన ఉద్యమం    2) సైలెంట్‌ వ్యాలీ ఉద్యమం 

3) అప్పికో చలువ్యాలీ     4) అవతార్‌ ఉద్యమం




22. జన్యుసాంకేతిక పరిజ్ఞానానికి వ్యతిరేకంగా, సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆహారభద్రతలో ప్రముఖపాత్ర వహించే నవధాన్యాలను కాపాడుకోవడానికి, తద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టడానికి ‘నవధాన్య ఆందోళన’ ఉద్యమాన్ని ప్రారంభించిన పర్యావరణవేత్త?

1) జె.డి.అగర్వాల్‌     2) రాజేంద్ర సింగ్‌ 

3) వందనా శివ       4) మాధవ్‌ గాడ్గిల్‌

 

 


23. ఒడిశాలో వేదాంత్‌ కంపెనీకి వ్యతిరేకంగా   'అవతార్‌ ఉద్యమం’ నడిపిన గిరిజన తెగ?

1) ఇరుళ     2) బైగాళు    3) గోండులు    4) ఒరాన్స్‌

 

 


24. కిందివాటిలో పుణె కేంద్రంగా 1992లో పర్యావరణ పరిరక్షణ, సుస్థిర సమగ్ర గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా ప్రారంభమైన ఉద్యమం ఏది?

1) వన్‌ రాయ్‌     2) సృష్టి   

3) బీస్‌-నౌ-ఉద్యమం      4) ఝార్ఖండ్‌ జంగిల్‌ బచావో ఆందోళన్‌
 

 


25. బీస్‌-నౌ ఉద్యమాన్ని స్థాపించిన మతగురువు?

1) అమృతాదేవి      2) బిర్సా ముండా 

3) జంబేశ్వర్‌          4) ఎవరూకాదు


 


26. 2006లో అటవీ ఉత్పత్తులపై గిరిజనులకు హక్కులు కల్పిస్తూ భారత ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని రూపొందించడానికి ప్రేరణ ఇచ్చిన ఆదివాసీల పర్యావరణ ఉద్యమం ఏది?

1) వన్‌ రాయ్‌     2) సృష్టి  

3) బీస్‌-నౌ ఉద్యమం     4) ఝార్ఖండ్‌ జంగిల్‌ బచావో ఆందోళన్‌

 


27. కిందివాటిలో రాజస్థాన్‌లోని ఖేజ్రీ అనే వృక్షాలను పరిరక్షించడం కోసం అమృతాదేవి నాయకత్వంలో ప్రారంభమైన పర్యావరణ ఉద్యమం?

1) బలియాపాల్‌ ఉద్యమం     2) వన్‌రాయ్‌ ఉద్యమం

3) బిష్ణోయి ఉద్యమం    4) అవతార్‌ ఉద్యమం

 

 


28. దేశంలో పురాతనమైన వన్యప్రాణి సంరక్షణ, పరిశోధన కోసం ముంబయిలో ‘బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ’ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1881     2) 1882      3) 1883        4) 1884


 


29. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలోని రూపుదాల్చిన  బలియాపాల్‌ ఉద్యమం కిందివాటిలో దేనికి   వ్యతిరేకంగా ప్రారంభమైంది?

1) బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా

2) పోస్కో స్టీల్‌ కంపెనీకి వ్యతిరేకంగా

3) మాంగ్రూవ్‌ అరణ్యాల నిర్మూలనకు వ్యతిరేకంగా

4) చాందీపుర్‌లో క్షిపణుల పరీక్షా కేంద్రం నిర్మాణానికి వ్యతిరేకంగా

 


30. న్యూదిల్లీలో ఏర్పాటైన పర్యావరణ పరిశోధన స్వచ్ఛంద సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌ ఎవరు?

1) అనిల్‌ అగర్వాల్‌     2) సునీతా నారాయణ్‌     

3)  వందనా శివ          4) మాధవ్‌ గాడ్గిల్‌

 

సమాధానాలు

1-4;  2-3;   3-3;   4-4;    5-4;   6-2;   7-2;   8-3;   9-4;    10-3;  11-4;   12-4;   13-4;   14-4;   15-4;   16-3;   17-2;   18-4;    19-2;     20-1;    21-3;     22-3;   23-3;    24-1;    25-3;    26-4;   27-3;    28-3;   29-4;   30-2. 

Posted Date : 07-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిరాభివృద్ధి

వివేకవంతమైన వనరుల వినియోగం!
 


ప్రకృతిలోని సహజ వనరులను పొదుపుగా వినియోగించుకుని అభివృద్ధి చెందుతూ, ఆ వనరులను తర్వాతి తరాలకు అందించడమే సుస్థిరాభివృద్ధి. ఈ విధానంలో పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ఆర్థిక ప్రగతిని సాధించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు, ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థల కృషితో రూపుదిద్దుకున్న ఈ భావనపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. వనరుల వృథా జరగకుండానే పర్యావరణాన్ని, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని సాధించేందుకు నిపుణులు చేసిన సూచనలు, లక్ష్యాలు, సంబంధిత నివేదికల ముఖ్యాంశాలను తెలుసుకోవాలి. ఈ విషయంలో దేశం పరిస్థితి, రాష్ట్రాల భాగస్వామ్యం గురించి అర్థం చేసుకోవాలి. 



పర్యావరణ సమస్యలను ఎదుర్కొనే ఉద్దేశంతో అభివృద్ధి స్థానంలో తీసుకొచ్చిన విధానమే సుస్థిరాభివృద్ధి. దీనినే నిలకడతో కూడిన అభివృద్ధి అని కూడా అంటారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1983లో నార్వే ప్రధాని బ్రంట్‌ల్యాండ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘పర్యావరణం - అభివృద్ధి’ సదస్సులో పర్యావరణవేత్తలు సుస్థిరాభివృద్ధి అనే నూతన భావనను ప్రవేశపెట్టారు. ఈ నివేదికను ‘మన ఉమ్మడి భవిష్యత్తు’ పేరుతో 1987లో ఆమోదించగా, 1988 నుంచి అమల్లోకి వచ్చింది.


బ్రంట్‌ల్యాండ్‌ నిర్వచనం ప్రకారం ‘‘ప్రస్తుత ప్రజల కనీస అవసరాలు తీరుస్తూ, భవిష్యత్తు తరాలకు వనరులు మిగిల్చే విధంగా వాటిని వివేకవంతంగా వినియోగించుకుంటూ సాధించే అభివృద్ధే సుస్థిరాభివృద్ధి’’. భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ఉండాలని సుస్థిరాభివృద్ధి సూచిస్తుంది. మానవ సంక్షేమాన్ని పెంపొందించుకోవడానికి ఆర్థికవృద్ధి ఒక్కటే సరిపోదు. వనరుల వినియోగం, పునఃకల్పనల మధ్య సమతౌల్యత ఏర్పరిచి అభివృద్ధి ప్రక్రియను కొనసాగిస్తే సుస్థిరాభివృద్ధి సాధ్యపడుతుంది. ప్రస్తుత కాలంలో అభివృద్ధి ప్యూహాలు, సమాజం, ఆర్థికవ్యవస్థ, పర్యావరణాలు సామూహిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.


మానవ జనాభా పెరిగేకొద్దీ అధికమవుతున్న అవసరాల కోసం అభివృద్ధి పేరుతో సహజ వనరులను పరిమితికి మించి వినియోగించడం వల్ల భూ, జలవనరులు, వాతావరణం కలుషితమై అనేక పర్యావరణ సమస్యలకు దారితీస్తుంది. దీని కారణంగా భూమి మీద పేదరికం, తాగునీటి సమస్య, అంటువ్యాధులు ప్రబలడం లాంటి సామాజిక, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. దీంతో భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. 


సుస్థిరాభివృద్ధిలోని ప్రధానాంశాలు:  

1) వనరులను వాటి పునరుత్పాదక శక్తికి మించి వినియోగించకూడదు.

2) పునరుత్పత్తి చెందని ఇంధనవనరుల స్థానంలో పునరుత్పత్తి చెందే, కాలుష్యరహిత ఇంధన వనరులను వినియోగించాలి.

3) పర్యావరణం విలీనం చేసుకోగలిన సామర్థ్యం కంటే ఎక్కువ పరిమాణంలో కాలుష్య పదార్థాలను పర్యావరణంలోకి వదలకూడదు.

4) అభివృద్ధి అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లో, అన్నివర్గాల ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా ఉండాలి.


సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు:  

1) అన్నివర్గాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, విద్య, ఆరోగ్యం, నాణ్యమైన పర్యావరణం, సమన్యాయాన్ని పెంపొందించడం, వనరుల సమాన పంపిణీ, భవిష్యత్తు తరాల కనీస అవసరాలు తీర్చడానికి వనరులు అందుబాటులో ఉండే ప్రస్తుత అభివృద్ధి విధానాలను తీర్చిదిద్దడం మొదలైన అంశాలు సుస్థిరాభివృద్ధిలో సమ్మిళితం అయ్యాయి.

2) సహజ వనరులను ప్రస్తుత అవసరాలకు ఏ రేటులో వినియోగిస్తామో, అదే రేటులో వాటిని పునరుత్పత్తి చెందించే విధంగా చర్యలు చేపట్టాలి.

3) అభివృద్ధి అనేది పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ఉండాలి. అంటే ఆర్థికాభివృద్ధి భావితరాల జీవన ప్రమాణాలను దెబ్బతీయకూడదు.

4) కాలుష్యరహిత, పునరుత్పాదిత, చౌకగా లభ్యమైన శక్తి వనరుల వినియోగాన్ని పెంపొందించి, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి.

6) గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సమగ్ర పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి.

7) సుస్థిరాభివృద్ధికి దోహదపడే విధంగా సముద్ర ఉత్పత్తులు, సముద్ర వనరుల పరిరక్షణ జరగాలి.

8) అడవుల పరిరక్షణతో పాటు ఎడారీకరణ, భూసార క్షీణతను అరికట్టాలి.

9) సుస్థిరాభివృద్ధి దిశలో ప్రపంచ భాగస్వాములను ప్రోత్సహించడంతో పాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సమర్థంగా అమలుచేయాలి.


సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యం: 2002 జొహెన్నస్‌బర్గ్‌ సదస్సులో ఐక్యరాజ్యసమితి 2005 - 2015 దశాబ్దాన్ని ‘సుస్థిరాభివృద్ధి కోసం విద్య’గా ప్రకటిస్తూ ప్రపంచ స్థాయిలో సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యాలను పేర్కొంది. అవి -

1) పర్యావరణం పట్ల ప్రజల దృక్పథంలో మార్పులు తీసుకురావాలి. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అయ్యే విధంగా కనీస అవసరాలకు మాత్రమే వనరులను వినియోగించుకునేట్లు ఆలోచనల్లో మార్పులు తేవాలి.

2) ఆర్థికాభివృద్ధికి, పర్యావరణానికి అనుకూలంగా ఉండే పద్ధతులను, నవకల్పనలను ప్రోత్సహించాలి.

3) ప్రతి వయోవర్గం వారికి ఆరోగ్యకర జీవనాన్ని అందించాలి.

4) సమ్మిళిత, సమానత్వ, నాణ్యతతో కూడిన విద్యను అందించి అందరికీ జీవితకాల అభ్యసన అవకాశాలు కల్పించాలి.

5) లింగ సమానత్వాన్ని సాధించి బాలికలు, మహిళలకు సాధికారత కల్పించాలి.

6) అందరికీ మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణ సుస్థిరంగా లభ్యమయ్యే విధంగా చూడాలి.

7) చౌకగా ఉండే, విశ్వసించదగిన సుస్థిర ఆధునిక శక్తి వనరులను అందించాలి.

8) నివాసయోగ్యంగా, సురక్షితంగా, సమ్మిళితంగా ఉండే విధంగా ప్రజల భాగస్వామ్యంతో నగరాల అభివృద్ధి జరగాలి.

9) మౌలిక సదుపాయాల కల్పన, సమ్మిళిత, సుస్థిర పారిశ్రామికీకరణ నవకల్పనను అందించాలి.

10) దేశంలో లోపల, వెలుపల అంతరాలను తగ్గించాలి.

11) సుస్థిర నగరాలు, పల్లెలు సమ్మిళిత ఆర్థికవృద్ధిని పెంపొందించాలి. ఉత్పాదకతతో కూడిన ఉపాధి, సంపూర్ణ ఉద్యోగిత కల్పించాలి.

12) సుస్థిరాభివృద్ధికి వీలుగా మహాసముద్ర, సముద్ర జలవనరులను సంరక్షించాలి.

13) సుస్థిర వినియోగం,  ఉత్పత్తి విధానాలను పెంపొందించాలి.

14) పర్యావరణ మార్పు ప్రభావాలకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలి.

15) భౌగోళిక జీవావరణాన్ని సంరక్షించడం, పునరుద్ధరించడం, మెరుగుపరచడం, అడవుల నిర్వహణ, ఎడారీకరణను నిరోధించడం, భూ క్షీణతను, జీవవైవిధ్య నష్టాన్ని నిలిపివేయడం లాంటివి చేయాలి.

16) సుస్థిర అభివృద్ధికి శాంతియుత సమ్మిళిత సమాజాన్ని ప్రోత్సహించాలి. అందరికీ న్యాయం అందేలా చూడటంతోపాటు అన్నిస్థాయుల్లో జవాబుదారీతనం ఉండే విధంగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.

17) సుస్థిర అభివృద్ధిలో సార్వత్రిక భాగస్వామ్యాన్ని పెంపొందించాలి.


సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఆధార నివేదిక (2020-21):  


దేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలు, పర్యవేక్షణ బాధ్యతలను నీతిఆయోగ్‌ చూస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల భారత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక 2020-21 మూడో ఎడిషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభివృద్ధి స్థాయి ఆధారంగా ఈ నివేదిక వాటిని 4 విభాగాలుగా విభజించింది.అవి -

1) 0-49 మార్కులు: ఆకాంక్షిత రాష్ట్రాలు

2) 50-64 మార్కులు: ప్రతిభావంత రాష్ట్రాలు

3) 65-99 మార్కులు: పురోగామి రాష్ట్రాలు

4) 100 మార్కులు: లక్ష్యసాధక రాష్ట్రాలు


జాతీయ విశ్లేషణ: దేశం మొత్తంగా సుస్థిరాభివృద్ధి స్కోరు 2018-2019తో పోలిస్తే 6 పాయింట్లు మెరుగుపడింది. 2019లో 60 నుంచి 2020-21లలో 66కి చేరింది. 15 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతిభావంత విభాగంలో, 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పురోగామి విభాగంలో ఉన్నాయి. 2020లో క్లీన్‌ ఎనర్జీ, పట్టణ ప్రగతికి సంబంధించిన సుస్థిరాభివృద్ధి సూచీలో భారతదేశం గణనీయమైన ప్రగతి సాధించింది. అయితే పరిశ్రమలు, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, మెరుగైన ఉపాధి, ఆర్థిక వృద్ధి రంగాల్లో బాగా వెనుకబడి ఉంది.


రాష్ట్రాలవారీగా పనితీరు: సుస్థిరాభివృద్ధి నివేదిక మూడో ఎడిషన్‌లో కేరళ, చండీగఢ్‌ 75 స్కోరుతో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాయి. తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌ 72 స్కోరుతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ 72 పాయింట్లు, తెలంగాణ 69 పాయింట్లతో పురోగామి విభాగంలో ఉన్నాయి. తీరప్రాంత రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ 79 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. బిహార్, ఝార్ఖండ్, అస్సాం తక్కువ పనితీరు కనబరిచిన రాష్ట్రాలుగా నిలిచాయి.

* ప్రతిభావంతమైన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉత్తరాఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, మిజోరం, పంజాబ్, హరియాణా, త్రిపుర, అండమాన్‌ - నికోబార్‌ దీవులు, దిల్లీ, జమ్ము-కశ్మీర్, లద్దాఖ్, లక్షద్వీప్‌ నిలిచాయి.

* ప్రపంచంలో అటవీ విస్తీర్ణ పరంగా భారతదేశం 10వ స్థానంలో ఉంది. 2011-20 దశాబ్ద కాలంలో అటవీ పెరుగుదల రేటులో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. అత్యధిక సాంద్రత ఉన్న అడవులు పెరగడమే దీనికి కారణం. 

* నీతిఆయోగ్‌ నివేదిక ప్రకారం దేశంలో 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019-20 పురోగామి విభాగంలో 10 ఉండగా, 2020-21లో 22 ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ ప్రతిభావంత (50-64) విభాగంలో ఉన్నాయి.


రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌  

Posted Date : 16-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిరాభివృద్ధి

మానవాళి ఆరోగ్యాన్ని హరించే ‘డర్టీడజన్స్‌’! 

 

 

ప్రగతి పేరుతో విచక్షణారహితంగా, విచ్చలవిడిగా సహజ వనరులను వినియోగించడం ప్రమాదకరం. భవిష్యత్తు  అవసరాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. పునరుత్పాదక పద్ధతులను అవలంబిస్తూ తర్వాతి తరాలకు వనరులను అందించేందుకు జాగ్రత్త వహించాలి. ఆ విధంగా ప్రజలందరి కనీస అవసరాలను తీర్చగలిగే తీరులో పురోగతిÄ విధానాలను రూపొందించుకోవడమే సుస్థిరాభివృద్ధి ప్రధాన లక్ష్యం. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఇదొక నినాదంగా మారింది. దీనికి సంబంధించిన భావనలను, నిర్వచనాలను, జరిగిన సదస్సులు, తీర్మానాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. పర్యావరణ పరిరక్షణలో సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాలి. 

 

1983లో యూఎన్‌ఓ ఆధ్వరంలో నార్వే ప్రధాని బ్రంట్‌ ల్యాండ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘పర్యావరణం అభివృద్ధి’ అనే సదస్సులో పర్యావరణ వేత్తలు తరచూ వాడే ‘సుస్థిరాభివృద్ధి’ అనే భావనను పర్యావరణ సమస్యలను ఎదుర్కొనే ఉద్దేశంతో అభివృద్ది స్థానంలో ‘సుస్థిరాభివృద్ధి అనే నూతన భావనను ప్రవేశపెట్టారు. ఈ నివేదికను ‘మన ఉమ్మడి భవిష్యత్తు’ అనే పేరుతో 1987లో ఆమోదించగా, 1988 నుంచి అమల్లోకి వచ్చింది. 


బ్రంట్‌ ల్యాండ్‌ నిర్వచనం ప్రకారం.. ప్రస్తుత ప్రజల కనీస అవసరాలను తీరుస్తూ, భవిష్యత్తు తరాలకు వనరులను మిగిల్చేలా, వాటిని వివేకవంతంగా వినియోగించుకోవడం ద్వారా సాధించే అభివృద్ధిని ‘సుస్థిరాభివృద్ధి’ అంటారు.  


1. సుస్థిరాభివృద్ధి అనే భావనను మొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1983   2) 1987   3) 1988   4) 1999


2.  యూఎన్‌ఓ ఆధ్వర్యంలో మొదటిసారిగా ‘వరల్డ్‌  కమిషన్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ సదస్సు ఎప్పుడు నిర్వహించారు?

1) 1983   2) 1987   3) 1988   4) 1999


3. బ్రంట్‌ ల్యాండ్‌ కమిషన్‌ కిందివాటిలో దేనికి సంబంధించింది?

1) నిరంతర అభివృద్ధి     2) అభివృద్ధి 

3) సుస్థిరాభివృద్ధి     4) అస్థిరాభివృద్ధి


4. ‘సుస్థిరాభివృద్ధి’ అనే భావనను ఎప్పుడు ఆమోదించారు?

1) 1983   2) 1987   3) 1988   4) 1999


5.  ‘సుస్థిరాభివృద్ధి’ అనే భావన అమల్లోకి వచ్చిన సంవత్సరం?

1) 1983   2) 1987   3) 1988   4) 1999


6.    సుస్థిరాభివృద్ధికి సంబంధించి ఇచ్చిన ప్రవచనాలను పరిశీలించి, సరైన వాటిని గుర్తించండి. 

ఎ) ప్రస్తుత అవసరాలను తీర్చుకునే విధంగా వనరులను వినియోగించుకోవడం ద్వారా సాధించే అభివృద్ధి.

బి) భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చే విధంగా వనరులను వినియోగించుకోవడం ద్వారా సాధించే అభివృద్ధి.

సి) ప్రస్తుత తరాల అవసరాలను, వనరులను ఏ రేటులో వినియోగించుకుంటామో అదే రేటులో వాటిని పునరుత్పత్తి చెందించడం ద్వారా భవిష్యత్తు తరాలకు కూడా వనరులు అందుబాటులో ఉండే విధంగా సాధించే అభివృద్ధి.

1) ఎ, సి  2) బి, సి 3) సి మాత్రమే 4) ఏదీకాదు


7. సుస్థిరాభివృద్ధికి సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించి, సరైనవి గుర్తించండి. 

ఎ) వనరులను వాటి పునరుత్పాదక శక్తికి మించి  వినియోగించరాదు.

బి) పునరుత్పత్తి చెందని ఇంధన వనరుల స్థానంలో పునరుత్పత్తి చెందే, కాలుష్య రహితమైన వనరులను వినియోగించాలి.

సి) పర్యావరణం విలీనం చేసుకోగలిగిన సామర్థ్యం కంటే ఎక్కువ పరిమాణంలో కాలుష్యక పదార్థాలను పర్యావరణంలోకి విడుదల చేయకూడదు.

డి) అభివృద్ధి అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లో, అన్ని వర్గాల ప్రజలకు కనీస అవసరాలను తీర్చేలా ఉండాలి.

1) ఎ, బి, సి        2) బి, సి, డి 

3) ఎ, సి, డి        4) ఎ, బి, సి, డి 


8. సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యతను యూఎన్‌ఓ ఆధ్వర్యంలో జరిగిన ఏ సమావేశంలో సూచించారు?

1) 2007 - బాలి సమావేశం 

2) 1997 - క్యోటో ప్రొటోకాల్‌ సమావేశం

3) 2002 - జోహెన్నస్‌ బర్గ్‌ సమావేశం 

4) 2009 - కోపెన్‌హెగెన్‌ సమావేశం


9.     కిందివాటిలో ఎజెండా - 2030 గా దేన్ని పిలుస్తారు?

1) సహస్రాభివృద్ధి లక్ష్యాలు 2) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు

3) కాప్‌  16 సమావేశం     4) కాప్‌  17 సమావేశం


10. కిందివాటిలో సుస్థిరాభివృద్ధిని పెంపొందించని అభివృద్ధి కార్యక్రమం?

1) సేంద్రియ వ్యవసాయం 

2) వాటర్‌షెడ్‌ నిర్వహణ

3) పునరుత్పత్తి చెందే ఇంధన వనరుల వాడకం 

4) రసాయన ఎరువుల వాడకం


11. భారతదేశంలో వ్యవసాయ విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం?

1) అస్సాం         2) సిక్కిం        

3) మణిపుర్‌       4) నాగాలాండ్‌


12. సేంద్రీయ వ్యవసాయ విధాన పితామహుడు-

1) నార్మన్‌ బోర్లాగ్‌        2) మైఖేల్‌ స్టీఫెన్స్‌

3) సర్‌ అల్బర్ట్‌ హూవార్డ్‌     4) విలియం గాండే


13. దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ (ఎన్‌సీవోఎఫ్‌) పరిశోధనాకార్యాలయం ఎక్కడుంది? 

1) ఘజియాబాద్‌     2) గోరఖ్‌పుర్‌   

3) గుడ్‌గావ్‌     4) హిస్సార్‌


14. కిందివాటిలో నత్రజని ఎరువుల శాతాన్ని నేలలో పెంపొందించే బ్యాక్టీరియాలు?

1) రైజోబియం     2) అజటో బాక్టర్‌   

3) క్లాస్ట్రీడియం     4) పైవన్నీ


15. జీవ క్రిమిసంహారకాలకు సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించి, సరైనవి గుర్తించండి.

ఎ) పర్యావరణ కాలుష్యాన్ని కలిగించవు.

బి) బయోమాగ్నిఫికేషన్‌ సమస్యలు ఉండవు.

సి) మృత్తికలోని ఉపయోగకరమైన వానపాములు, ఇతర సూక్ష్మజీవులు చనిపోతాయి

డి) ఇవి త్వరితంగా జీవవిచ్ఛిన్నం చెంది పంట మొక్కల పరిరక్షణకు అందుబాటులోకి వస్తాయి.

ఇ) రైతుకు వీటి వాడకం తక్కువ ఖర్చుతో కూడుకున్నది.

1) ఎ, బి, సి, ఇ      2) ఎ, బి, డి, ఇ 

3) ఎ, సి, డి, ఇ     4) ఎ, బి, సి, డి, ఇ


16. జీవ ఎరువులకు సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించి, సరైనవి గుర్తించండి. 

ఎ) నేల, నీటి కాలుష్యాలు నియంత్రణలో ఉంటాయి. 

బి) యూట్రిఫికేషన్, బయో మాగ్నిఫికేషన్‌ సమస్యలు ఉండవు.

సి) ఇవి రైతుకు లాభాన్ని చేకూర్చే ఎరువులు.

డి) నేల సారవంతతను పెంపొందించి, సూక్ష్మజీవుల పరిరక్షణకు దోహదపడతాయి. 

ఇ) దీర్ఘకాలికంగా జీవ ఎరువులను ఉపయోగించడం వల్ల సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుంది.

1) ఎ, బి, సి, ఇ        2) ఎ, బి, డి, ఇ

3) ఎ, సి, డి, ఇ        4) ఎ, బి, సి, డి, ఇ


17. ఆహార పదార్థాల నిల్వకు వాడే క్యాన్లకు జింక్‌తో కాకుండా టిన్‌తో ఎందుకు పూత పూస్తారు?

1) జింక్, టిన్‌ కంటే ఖరీదైంది. 

2) టిన్‌ కంటే జింక్‌ ద్రవీభవన స్థానం ఎక్కువ.

3) టిన్‌ కంటే జింక్‌ ఎక్కువగా ప్రతిచర్యను   చూపుతుంది.

4) జింక్‌ కంటే టిన్‌ ఎక్కువగా ప్రతిచర్యను   చూపుతుంది.


18. ‘కాంటూర్‌ బండింగ్‌ విధానం’ దేని సంరక్షణ ప్రక్రియ?

1) వేగంగా వీచే పవనాల ప్రభావానికి లోనయ్యే ఎడారి సరిహద్దు ప్రాంతాలు.

2) ప్రవాహాలకు దగ్గరలో, వరద ప్రభావానికి లోనయ్యే సమతల మైదాన ప్రాంతాలు.

3) గడ్డి మొక్కలు పెరిగే చిట్టడవి ప్రాంతాలు. 

4) ఏదీకాదు


19. జీవ ఎరువులకు సంబంధించి సరైనవి గుర్తించండి.

ఎ) అగారికస్‌  బి) నాస్టాక్‌  సి) స్పైరోగైరా

1) ఎ, సి       2) బి మాత్రమే   

3) బి, సి        4) సి మాత్రమే


20. యూఎన్‌ఓ ఆధ్వర్యంలో జరిగిన ఏ సుస్థిరాభివృద్ధి సదస్సులో మానవాళి ఆరోగ్యాన్ని హరించివేసే విష రసాయనాలను, పర్యావరణ నాణ్యతను దెబ్బతీస్తూ తల్లి పాలలో సైతం చేరుతున్న ‘డర్టీ డజన్స్‌’గా పిలిచే 12 రకాల క్రిమిసంహారక మందులను నిషేధించాలని సదస్సు తీర్మానించింది?

1) 1983 - వియన్నా సదస్సు      2) 1987 - స్టాక్‌హోం సదస్సు 

3) 1993 - క్యోటో సదస్సు       4) 2002 - జోహెన్నస్‌ బర్గ్‌ సదస్సు


21. ఇటీవల ఆయిల్‌ జాఫర్‌ వార్తల్లో ప్రసిద్ధికెక్కింది. కారణం ఏమిటి?

1) చమురు తెట్టు, నురగను విక్షాళనం చెందించే పర్యావరణహిత సాంకేతిక పరిరక్షణా విధానం.

2) సముద్రాల్లో చమురు నిల్వలను గుర్తించే నవీన సాంకేతిక పరిజ్ఞానం.

3) ఇది జన్యుసాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొక్కజొన్న నుంచి తయారు చేసిన జీవ ఇంధనం.

4) చమురు బావుల్లో ఆకస్మికంగా చెలరేగే మంటలను ఆర్పడానికి అభివృద్ధిపరచిన నూతన సాంకేతిక విధానం.


22. కింది ప్రవచనాల్లో సరైనవాటిని గుర్తించండి. 

ఎ) ప్రకృతి వైపరీత్యాలు, శీతోష్ణస్థితిలో కలిగే మార్పులు సుస్థిరాభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటివి.

బి) శీతోష్ణస్థితిలో మార్పులు... వ్యవసాయోత్పత్తి దిగుబడుల్లో, వ్యవసాయరంగంపై ఆధారపడి జీవనాధారాన్ని గడిపే సమాజంపై, ఆహార భద్రతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

1) ఎ   2) బి    3) ఎ, బి   4) ఏదీకాదు


23. బయో ఇథనాల్‌కు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.

ఎ) దీన్ని చెరకు లేదా మొక్కజొన్న మొలాసిస్‌ నుంచి తయారు చేస్తారు.

బి) దీని నుంచి తయారు చేసే ఇథనాల్‌ను పెట్రోల్‌తో కలిపి ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తున్నారు.

సి) దీన్నే గ్యాసోహాల్‌ అని కూడా పిలుస్తారు.

1) ఎ, బి   2) బి, సి  3) ఎ, సి  4) ఎ, బి, సి 


24. బయోగ్యాస్‌కు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.

ఎ) దీన్ని పశువుల పేడ, ఇతర వృక్ష సంబంధిత వ్యర్థ పదార్థాలతో తయారు చేస్తారు.

బి) బయోగ్యాస్‌లో 60% మీథేన్, 40% కార్బన్‌ డై ఆక్సైడ్‌లు ఉంటాయి.

సి) ఇది చవకైంది, కాలుష్య రహితమెంiది, వంటగ్యాస్‌గా ఉపయోగిస్తారు.

1) ఎ, బి 2) బి, సి 3) సి మాత్రమే 4) ఎ, బి, సి 


25. ‘వర్మికంపోస్టు’ అనేది ఒక....

1) నిరేంద్రియ ఎరువు     2) విష పదార్థం

3) సేంద్రియ జీవ ఎరువు     4) కృత్రిమ ఎరువు


26. బయో డీజిల్‌కు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. 

ఎ) జంతువుల కొవ్వు, వెజిటబుల్‌ ఆయిల్, మొక్కల భాగాల నుంచి తీసిన ముడి నూనెలను ‘ట్రాన్స్‌-ఎస్టరిఫికేషన్‌’ చర్య ద్వారా బయోడీజిల్‌ను తయారు చేస్తారు.

బి) బయోడీజిల్‌ను పెట్రోల్‌ లేదా డీజిల్‌తో కలిపి ఇంధనంగా ఉపయోగిస్తారు.

సి) భారతదేశంలో గానుగ, జట్రోపా చెట్ల నుంచి దీన్ని తయారుచేస్తారు.

డి) భారత్‌ లాంటి ఇంధన కొరత దేశాల్లో ఇదొక కాలుష్య రహిత ఇంధన ఆదా విధానం.

1) ఎ, బి, డి  2) బి, సి, డి    3) సి, డి 4) ఎ, బి, సి, డి 


27. ‘ప్రస్తుత ప్రజల కనీస అవసరాలను తీరుస్తూ,  భవిష్యత్తు తరాలకు వనరులను మిగిల్చేలా, వాటిని వివేకవంతంగా వినియోగించుకోవడం ద్వారా సాధించే అభివృద్ధి - సుస్థిరాభివృద్ధి’ అని నిర్వచించింది?

1) ప్రపంచ బ్యాంకు  2) ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు 

3) బ్రంట్‌ ల్యాండ్‌ కమిషన్‌         4) యూఎన్‌ఓ 


సమాధానాలు

1-1; 2-1; 3-3; 4-2; 5-3; 6-3; 7-4; 8-3; 9-2; 10-4; 11-3; 12-3; 13-1; 14-4; 15-2; 16-4; 17-3; 18-2; 19-3; 20-4; 21-1; 22-3; 23-4; 24-4; 25-3; 26-4; 27-3. 
 

Posted Date : 20-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌