సూచనలు (ప్ర.1 - 4): కింద ఒక ప్రకటన, రెండు తీర్మానాలు ఉన్నాయి. దత్తాంశ నిర్ధారణ ఆధారంగా సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
1) I, II అనుసరించవు
2) I, II అనుసరిస్తాయి
3) II మాత్రమే అనుసరిస్తుంది
4) I మాత్రమే అనుసరిస్తుంది
1. ప్రకటన: భారతదేశ ఆర్థిక వ్యవస్థ అడవులపైనే ఆధారపడి ఉంది.
తీర్మానాలు: I. భారతదేశ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు అడవులను పరిరక్షించుకుంటే చాలు.
II. భారతదేశ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు చెట్లను రక్షించాలి.
సాధన: భారతదేశ ఆర్థిక వ్యవస్థ అడవులపైనే ఆధారపడి ఉంది. కానీ, కేవలం అడవులపైనే ఆధారపడి ఉందని దాని అర్థం కాదు. కాబట్టి -II ప్రకటనను బలపరుస్తుంది. తీర్మానం- II సరైంది.
సమాధానం: 3
2. ప్రవచనం: ధైర్యవంతులను అదృష్టం వరిస్తుంది.
తీర్మానాలు: I. విజయ సాధనకు రిస్క్ తీసుకోవడం అవసరం.
II. పిరికివారు వారి చావుకి ముందు అనేకసార్లు మరణిస్తారు.
సాధన: విజయ సాధనలో కష్టపడటం (రిస్క్ తీసుకోవడం) తప్పనిసరి. అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది. కాబట్టి నిర్ధారణ I సరైంది. తీర్మానం II ప్రవచనంతో పొంతన లేనిది. ఇది సరైంది కాదు.
సమాధానం: 4
3. ప్రకటన: చెన్నై, ముంబయి నగరాల మధ్య రోడ్డుమార్గంలో 800 కి.మీ. దూరం ఉంటుంది. సముద్రమార్గం ద్వారా ఆ దూరం 200 కి.మీ. తగ్గింది. దీంతో ఇంధన ఖర్చులు రూ.8 కోట్లు తగ్గాయి.
తీర్మానాలు: I. రోడ్డు మార్గం ద్వారా అయ్యే ప్రయాణ ఖర్చు కంటే సముద్ర మార్గం ద్వారా అయ్యే ఖర్చు చాలా తక్కువ. II. ఇంధనం అధికమొత్తంలో పొదుపు అవుతుంది.
సాధన: ఇంధన ఖర్చు తగ్గినట్లు మాత్రమే ప్రకటన తెలియజేస్తోంది. ప్రయాణ ఖర్చుల ప్రస్తావన ప్రకటనలో లేదు. కాబట్టి తీర్మానం- II మాత్రమే సరైంది.
సమాధానం: 3
4. ప్రకటన: ఎడారుల్లో ఒంటె ద్వారా కాకుండా వేరేవిధంగా ఒక చోట నుంచి మరో ప్రదేశానికి వెళ్లడం అసాధ్యం.
తీర్మానాలు: I. ఎడారుల్లో ఒంటెలు సమృద్ధిగా ఉంటాయి.
II. ఎడారుల్లో ఒంటె ద్వారా రవాణా సులభతర పద్ధతి.
సాధన: ఎడారుల్లో కాలినడకన, మోటారు వాహనాల్లో ప్రయాణించలేం. ఒంటెపై ప్రయాణించడం సులువైన పద్ధతి. కాబట్టి తీర్మానం - II ప్రకటన ప్రకారం సరైంది. తీర్మానం -I తో ప్రకటనకు సంబంధం లేదు.
సమాధానం: 3
సూచనలు (ప్ర.7 - 9): కింద రెండు ప్రకటనలు, రెండు తీర్మానాలు ఇచ్చారు. దత్తాంశ నిర్ధారణ ఆధారంగా సరైన ఐచ్ఛికాన్ని నిర్ణయించండి.
7. ప్రకటన: ఉదయం పూట చేసే నడక హానికరం.
తీర్మానాలు: I. ఆరోగ్యవంతులైన ప్రజలు ఉదయం సమయంలో నడకకు వెళ్తారు.
II. సాయంత్రం చేసే నడక హానికరం.
1) I మాత్రమే అనుసరిస్తుంది.
2) I మాత్రమే అనుసరిస్తుంది.
3) I, II అనుసరిస్తాయి.
4) I, II అనుసరించవు.
సాధన: ఇచ్చిన ప్రకటన తప్పు. ఉదయం సమయంలో నడక ఎంతో ప్రయోజనకరం. కాబట్టి తీర్మానం-I సరైంది. సాయంత్రం పూట నడక హానికరమని మనం తీర్మానించలేం.
సమాధానం: 1
8. ప్రకటన: తల్లిదండ్రులు వారి పిల్లలకు ఉన్నతస్థాయి విద్యను అందించేందుకు ఎంత ఖర్చునైనా భరిస్తారు.
తీర్మానాలు: I. తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు మంచి స్కూలు ద్వారా ఉన్నత విద్య అందించి, వారు సంపూర్ణ అభివృద్ధిని పొందాలనే స్థిర అభిరుచిని కలిగి ఉంటారు.
II. ఈ రోజుల్లో తల్లిదండ్రులందరూ బాగా డబ్బున్నవారే.
1) I మాత్రమే అనుసరిస్తుంది.
2) II మాత్రమే అనుసరిస్తుంది.
3) I, II అనుసరిస్తాయి. 4) I, II అనుసరించవు.
సాధన: ప్రకటన ప్రకారం, తీర్మానం-I సరైంది. ప్రకటనలో ఎక్కడా డబ్బున్నవారు, డబ్బులేని వారు అని వివరించలేదు. తీర్మానం-II సరైంది కాదు.
సమాధానం: 1
9. ప్రకటన: పరీక్షల్లో ఫెయిల్ అవ్వడానికి కారణం స్కూల్కి రెగ్యులర్గా హాజరవ్వకపోవడమే. కొంతమంది రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయ్యారు.
తీర్మానాలు:
I. రెగ్యులర్గా స్కూల్కి హాజరైన వారంతా పాస్ అవుతారు.
II. ఫెయిలైన వారంతా రెగ్యులర్గా స్కూల్కి హాజరైనవారే.
1) I మాత్రమే అనుసరిస్తుంది.
2) II మాత్రమే అనుసరిస్తుంది.
3) I, II అనుసరిస్తాయి.
4) I, II అనుసరించవు.
సాధన:
ప్రకటన ప్రకారం తీర్మానాలు-I, II
తప్పు. రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయినట్లు ప్రకటనలో ఇచ్చారు.ఫెయిల్ అవ్వడానికి కారణం రెగ్యులర్గా హాజరుకాకపోవడమే అని కూడా చెప్పారు.
సమాధానం: 4
రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రకటనలు, తీర్మానాలు ఇచ్చినప్పుడు..
సూచనలు (ప్ర.5 - 6): కింది ప్రకటనలు, తీర్మానాల ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
5. ప్రకటన:
1. ప్రవీణ్ కుటుంబంలోని సభ్యులందరూ నిజాయితీపరులే.
2. ప్రవీణ్ కుటుంబంలోని కొందరు నిరుద్యోగులు.
3. కొంతమంది ఉద్యోగస్తులు నిజాయితీపరులు కాదు.
4. కొంతమంది నిజాయితీపరులు నిరుద్యోగులు.
తీర్మానాలు:
I. ప్రవీణ్ కుటుంబంలోని సభ్యులందరూ ఉద్యోగస్తులే.
II. ప్రవీణ్ కుటుంబంలోని ఉద్యోగస్తులందరూ నిజాయితీపరులే.
III. ప్రవీణ్ కుటుంబంలోని నిజాయితీపరులందరూ నిరుద్యోగులే.
IV. ప్రవీణ్ కుటుంబంలోని ఉద్యోగస్తులందరూ నిజాయితీ లేనివారే.
1 ) I, II, III మాత్రమే సరైనవి. 2 ) I మాత్రమే సరైంది.
3 ) III మాత్రమే సరైంది. 4) II మాత్రమే సరైంది.
5 ) అన్నీ సరైనవే.
సాధన: ప్రవీణ్ కుటుంబంలోని సభ్యులంతా నిజాయితీపరులే. కాబట్టి, ప్రవీణ్ కుటుంబంలోని ఉద్యోగస్తులందరూ నిజాయితీపరులే. తీర్మానం-II సరైంది, తీర్మానం-I తప్పు.
ప్రవీణ్ కుటుంబంలోని కొందరు నిరుద్యోగులు. తీర్మానాలు - III, IV ప్రకటన ప్రకారం సరైనవి కావు.
సమాధానం: 4
6. ప్రకటన:
1. కొంతమంది గణితశాస్త్త్ర్రంలో సబ్జెక్టుపరంగా బలహీనులు.
2. గణితశాస్త్త్ర్రంలో బలహీనులంతా సంగీత విద్వాంసులు.
తీర్మానాలు:
I. కొంతమంది సంగీత విద్వాంసులు గణితశాస్త్త్ర్రంలో బలహీనులు.
II. సంగీత విద్వాంసులంతా గణితశాస్త్త్ర్రంలో బలహీనులే.
III. గణితశాస్త్త్ర్రంలో అందరూ బలహీనులే.
1) I, III మాత్రమే సరైనవి. 2) I, II మాత్రమే సరైనవి.
3) I మాత్రమే సరైంది 4) అన్నీ సరైనవే.
5) ఏదీకాదు.
సాధన: గణితశాస్త్త్ర్రంలో బలహీనులంతా సంగీత విద్వాంసులే. కానీ సంగీత విద్వాంసులంతా గణితశాస్త్త్ర్రంలో బలహీనులు కారు. కొంతమంది సంగీత విద్వాంసులు మాత్రమే గణితశాస్త్రంలో బలహీనులు. కాబట్టి, తీర్మానం-I సరైంది. తీర్మానం-II,
తీర్మానం-III తప్పు.
సమాధానం: 3
రచయిత
బూసర గణేష్,