మాదిరి ప్రశ్నలు
1. భారతీయ పౌరులందరికీ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తోంది?
1) ఆర్టికల్ 43 2) ఆర్టికల్ 44
3) ఆర్టికల్ 45 4) ఆర్టికల్ 46
2. మన దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం?
1) గోవా 2) కేరళ
3) హిమాచల్ప్రదేశ్ 4) మణిపూర్
3. 1985లో ఏ కేసు సందర్భంగా ముస్లిం మహిళకు విడాకుల అనంతరం భర్త మనోవర్తిని చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది?
1) సరళా ముద్గల్ 2) మహర్షి అవధేష్
3) షాబానో 4) షకీలా భాను
4. కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేసి, న్యాయ వ్యవస్థకు స్వయంప్రతిపత్తి కల్పించాలని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తోంది?
1) ఆర్టికల్ 45 2) ఆర్టికల్ 48
3) ఆర్టికల్ 49 4) ఆర్టికల్ 50
5. హిందీని జాతీయ భాషగా అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాజ్యాంగంలోని శ్రీజుఖిఖివ భాగంలో ఏ ఆర్టికల్ పేర్కొంటుంది?
1) ఆర్టికల్ 350 2) ఆర్టికల్ 351
3) ఆర్టికల్ 349 4) ఆర్టికల్ 350(A)
6. ఆదేశిక సూత్రాల అమలుకు భారత ప్రభుత్వం రూపొందించిన చట్టాలకు సంబంధించి సరికానిది?
1) 1956 - ఎల్ఐసీ జాతీయీకరణ
2) 1957 - సంపదపై పన్ను చట్టం
3) 1958 - బహుమతిపై పన్ను చట్టం
4) 1963 - ఆదాయ పన్ను చట్టం
7. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు లీగల్ సర్వీసెస్ అథారిటీని ఎప్పుడు నెలకొల్పారు?
1) 1985 2) 1986 3) 1987 4) 1989
8. ‘‘ప్రజల ఓటుపై ఆధారపడే ఏ ప్రభుత్వమైనా తన విధాన రూపకల్పనలో ఆదేశిక సూత్రాలను విస్మరించలేదు. ఒకవేళ ఏ ప్రభుత్వమైనా వాటిని విస్మరిస్తే ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు తప్పనిసరిగా సమాధానం చెప్సాలి ఉంటుంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?
1) కె.టి.షా 2) డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
3) కె.ఎం.మున్షీ 4) జవహర్లాల్ నెహ్రూ
9. ఏ సంవత్సరంలో నేర విచారణ స్మృతి చట్టాల్లో మార్పులు చేసి, జిల్లా కలెక్టర్ న్యాయాధికారాలను న్యాయశాఖకు బదిలీ చేయడం ద్వారా కార్యనిర్వాహకశాఖ నుంచి న్యాయశాఖకు స్వయం ప్రతిపత్తి కల్పించారు?
1) 1973 2) 1976 3) 1978 4) 1981
10. 1954లో ఏ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన గోవధ నిషేధ చట్టాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది?
1) యూపీ 2) మహారాష్ట్ర 3) బిహార్ 4) కేరళ
సమాధానాలు
1-2 2-1 3-3 4-4 5-2 6-4 7-3 8-2 9-1 10-3