• facebook
  • whatsapp
  • telegram

ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌లు 

 ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఎన్నికలు సమర్థంగా పారదర్శకంగా జరగాలి. మన ఎన్నికల సంఘం దీని కోసం ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టింది. 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి 2019లో జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల వరకు నిర్వహణ ప్రక్రియ, అభ్యర్థుల ఎంపికలో అనేక మార్పులు చేసింది. 

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం)
    ఈవీఎంను మనదేశంలో 1980లో ఎం.బి.హనీఫ్‌ రూపొందించారు. వీటిని భారత్‌ ఎలక్ట్రానిక్‌ లిమిటెడ్‌ (బెల్‌), బెంగళూరు; ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌), హైదరాబాద్‌లో తయారుచేస్తున్నారు. ఈవీఎంలోని ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌లో ఎన్నికల్లో పోటీచేసే 16 మంది అభ్యర్థుల వివరాలను మాత్రమే నమోదు చేయవచ్చు. ప్రతి ఈవీఎంలో ఇలాంటి బ్యాలెట్‌ యూనిట్లను గరిష్ఠంగా నాలుగింటిని మాత్రమే అనుసంధానం చేసే వీలుండటం వల్ల 64 మంది అభ్యర్థుల వివరాలను మాత్రమే నమోదు చేయవచ్చు. ఒక నియోజకవర్గం నుంచి 64 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీ చేస్తే ఈవీఎంకు బదులు బ్యాలెట్‌ పేపరు పద్ధతిని ఉపయోగించాలి.      
   ఈవీఎంలను మన దేశంలో తొలిసారిగా 1981లో కేరళలోని నార్త్‌ పారవర్‌ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో 50 పోలింగ్‌ కేంద్రాల్లో వినియోగించారు. ఒక్కో ఈవీఎంలో గరిష్ఠంగా 3840 ఓట్లను నమోదు చేయవచ్చు. వీటిని ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించుకోవడానికి వీలుగా 1951 నాటి భారత ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని 1989లో సవరించగా ఆ ఏడాది మార్చి 15 నుంచి అమల్లోకి వచ్చింది. 1998 నవంబరులో మధ్యప్రదేశ్‌ (5), రాజస్థాన్‌ (5), దిల్లీ (6) శాసనసభలకు జరిగిన 16 పోలింగ్‌ కేంద్రాల్లో ఉపయోగించారు. 1999లో గోవా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను పూర్తిస్థాయిలో వినియోగించారు.

ఓటర్‌ వెరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌
    ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పారదర్శకత, ఈవీఎంలలో నిక్షిప్తమైన సాఫ్ట్‌వేర్‌పై అనేకమంది సందేహాలు వెల్లడించారు. దీంతో ఓటరు తాను అనుకున్న అభ్యర్థికి ఓటు వేశాడా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఓటువేసిన తర్వాత దాని ప్రింట్‌ను చూసుకోవడానికి వీలుగా వీవీప్యాట్‌ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా అక్రమ ఓటింగ్, ఈవీఎంల ట్యాంపరింగ్‌ను నివారించి ఓటర్ల ప్రయోజనాలను పరిరక్షించవచ్చు. వీటిని తొలిసారిగా 2013 సెప్టెంబరులో నాగాలాండ్‌లోని నోక్సస్‌ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో ఉపయోగించారు.  

ఓటర్ల ప్రాథమిక హక్కు
    అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రసీ రిఫార్మ్స్‌ సంస్థ కేసులో 2002, మే 2న సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నేరచరిత్ర, వారి ఆస్తులు, అప్పులు, విద్యార్హతల సమాచారం తెలుసుకోవడం ఓటర్ల ప్రాథమిక హక్కు అని పేర్కొంది. దీని ప్రకారం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రంతోపాటు వ్యక్తిగత వివరాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలి. 

ఎన్నికల వ్యయం
    ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. లేకపోతే 1951 నాటి భారత ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం మూడేళ్లు ఎన్నికల్లో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధిస్తుంది. 

ఎన్నికల నిబంధనలు
    1996 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకులను నియమిస్తుంది. 1997 నుంచి ఒక అభ్యర్థి రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీచేయరాదని నిర్దేశించింది. 1999లో చేర్చిన నిబంధన ప్రకారం ఎన్నికల విధుల్లో పాల్గొనే వ్యక్తులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా  ఓటువేసే వెసులుబాటు, 2003 నుంచి సైన్యంలో పనిచేసేవారికి ప్రాక్సీ ఓటింగ్‌ (వారి తరఫున ఇతరులు ఓటువేయడం) అవకాశాన్ని కల్పించింది. 
    1962 నుంచి ఏకసభ్య నియోజకవర్గాలను ఏర్పాటుచేశారు. అంతకుముందు ద్విసభ్య నియోజకవర్గాలుండేవి. 1997 నుంచి రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం క్రిమినల్‌ నేరంపై జైలు శిక్షకు గురైన వ్యక్తులను ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులుగా నిర్ణయించారు. అలాగే నామినేషన్లు ఉపసంహరించుకున్న తర్వాత ఎన్నికల ప్రచార సమయాన్ని 21 నుంచి 14 రోజులకు తగ్గించారు. 

నోటా
    పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (PUCL) VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఎ) ప్రకారం ప్రతి వ్యక్తికి మాట్లాడే హక్కు, విమర్శించే హక్కు, విభేదించే హక్కు ఉంది. ప్రజలు భిన్నాభిప్రాయాలు, విభిన్న సిద్ధాంతాలు కలిగి ఉండవచ్చు. ఓటు వేసేటప్పుడు ఓటర్లకు తిరస్కార హక్కును కల్పించకపోవడమంటే  భావప్రకటన స్వేచ్ఛను హరించినట్లేనని, ఈవీఎంలలో నోటా (None of the above -  పై ఎవరూ కాదు) అనే అంశాన్ని చేర్చాలని జస్టిస్‌ పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 2013, సెప్టెంబరు 27న తీర్పునిచ్చింది. 

*     ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నచ్చకపోయినా, సరైన అభ్యర్థి లేరని భావించినా ఓటర్లు ఈవీఎంలోని నోటా బటన్‌ను వినియోగించుకోవచ్చు. 

*     మన దేశంలో నోటాను తొలిసారిగా 2013లో దిల్లీ, మిజోరం, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. నోటాను ప్రవేశపెట్టిన 14వ దేశం భారత్‌.

*     2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల్లో పోలైన నోటా ఓట్లు 59,97,504. 

*     2014 లోక్‌సభ ఎన్నికల్లో తెలుపు రంగు, శాసనసభ ఎన్నికల్లో గులాబీ రంగులో నోటాను ఈవీఎంలపై ముద్రించారు. 

*     నోటా ఓట్లు ఎక్కువగా పోలైనప్పటికీ వాటితో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే విజేతలుగా ప్రకటిస్తారు.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌లు 

మాదిరి ప్రశ్నలు


1.  evm ను విస్తరించండి.

    1) Election voting machine  2) Electronic voting machine  


    3)  evaluation voting machine  4) Electronic verifying machine


2. మన దేశంలో ఈవీఎంలను తొలిసారిగా (1981) ఏ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఉపఎన్నికల్లో వినియోగించారు?

    1) గోవా    2) కర్ణాటక    3) సిక్కిం    4) కేరళ


3. మన దేశంలో 1980లో ఈవీఎంలను రూపొందించినవారు? 

    1) ఎం.బి.హనీఫ్‌          2) ఎం.ఎస్‌.ఖాన్‌      

    3) ఏపీజే అబ్దుల్‌ కలాం        4) ఎం.ఎస్‌.ఖురేషి


4. 1999లో ఏ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను పూర్తిస్థాయిలో వినియోగించారు?

   1) కేరళ    2) మిజోరం    3) గోవా     4) మహారాష్ట్ర

 

5. VVPAT అంటే?

    1) Voter verifiable paper audit trial    2) Voting very paper audit trial    
    3) Voting verticle pamper access target 4) Voter verticle paper audit trial    


6. వీవీప్యాట్‌లను దేశంలో తొలిసారిగా (2013) ఏ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఉపఎన్నికల్లో ప్రవేశపెట్టారు?

    1) కర్ణాటక     2) కేరళ     3) నాగాలాండ్‌     4) జమ్ముకశ్మీర్‌

 

7. NOTAను విస్తరించండి.

    1) None one the above 2) None of the above

    3) None one the access 4) None only the above 


8. నోటాను ప్రవేశపెట్టిన దేశాల్లో భారత్‌ ఎన్నోది? 

    1) 12     2) 13     3) 14    4) 15

 

9. మన దేశంలో నోటాను దిల్లీ, మిజోరం, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు?

   1) 2009       2) 2011       3) 2013      4) 2016


10. పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నేరచరిత్రతో సహా వారి మొత్తం సమాచారం తెలుసుకోవడం ఓటర్ల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది?

    1) 2001, మే 2      2) 2002, మే 2      3) 2003, మే 2      4) 2004, మే 2 

 

11. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని ఫలితాలు వెలువడిన తేదీ నుంచి ఎన్ని రోజుల్లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలి?

    1) 7    2) 15    3) 21    4) 30  


12.  మన దేశంలో 2003 నుంచి ఎవరికి ప్రాక్సీ ఓటింగ్‌ను కల్పించారు?

    1) సైన్యంలో పనిచేసేవారికి          2) ప్రవాస భారతీయులకు 

    3) ద్వంద్వ పౌరసత్వం లేనివారికి      4) విదేశీయులకు 

 

13. మన దేశంలో ద్విసభ్య నియోజకవర్గాలు ఎప్పటి వరకు కొనసాగాయి? 

    1) 1956    2) 1960      3) 1962       4) 1971


14. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎప్పటి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే వెసులుబాటును కల్పించారు? 

    1) 1995      2)1999        3) 2001     4) 2003

 

15. ప్రస్తుతం నామినేషన్ల ఉపసంహరణ తేదీ నుంచి ఎన్నికల ప్రచార సమయాన్ని ఎన్ని రోజులు కొనసాగిస్తున్నారు?

    1) 5     2) 9     3)14     4) 21


సమాధానాలు

12; 24; 31; 43; 51; 63; 72; 83; 93; 102; 114; 121; 133; 142; 153.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 కేంద్ర ఎన్నికల సంఘం

భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పరిగణించే ఎన్నికలను ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా నిర్వహించేందుకు రాజ్యాంగ నిర్మాతలు స్వయంప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఇది పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలను నిష్పక్షపాతంగా, విశ్వసనీయతతో నిర్వహిస్తుంది.
రాజ్యాంగ వివరణ: భారత రాజ్యాంగంలోని XVవ భాగంలో ఆర్టికల్‌ 324 నుంచి 329 మధ్య కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణం, అధికారాలు, విధులను వివరించారు. మనదేశంలో 1950, జనవరి 25 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అమల్లోకి వచ్చింది. న్యూదిల్లీలోని ‘నిర్వాచన్‌ సదన్‌’ దీని ప్రధాన కార్యాలయం.


 జాతీయ ఓటర్ల దినోత్సవం 
కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడి 2011, జనవరి 25 నాటికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓటర్ల దినోత్సవాన్ని ప్రారంభించారు. యువత ఓటర్ల జాబితాలో చేరడాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నారు. 'Proud to be Voter - Ready to Vote '  అనేది ఓటర్ల దినోత్సవ నినాదం.

ఓటర్ల ప్రతిజ్ఞ: ‘భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని... కుల, మత, జాతి, వర్గ, భాష లాంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని’ ప్రతిజ్ఞ చేస్తున్నాం.

 ఏకసభ్య - బహుళ సభ్య ఎన్నికల సంఘం
 1950, జనవరి 25 నుంచి 1989, అక్టోబరు 15 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో ఏకసభ్య ఎన్నికల సంఘంగా కొనసాగింది. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 1989, అక్టోబరు 16న కేంద్ర ఎన్నికల సంఘాన్ని ‘బహుళ సభ్య ఎన్నికల సంఘం’గా మార్చింది. దీనిలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు ఇద్దరు ఇతర ఎన్నికల కమిషనర్లు కూడా ఉంటారు. 1990 జనవరిలో విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని తిరిగి ఏకసభ్య ఎన్నికల సంఘంగా మార్చగా పి.వి.నరసింహారావు ప్రభుత్వం 1993, అక్టోబరు 1న బహుళ సభ్య ఎన్నికల సంఘంగా మార్చింది.
ఆర్టికల్‌ 325: ఎన్నికల నిర్వహణ విషయంలో ఓటర్ల జాబితాను తయారుచేసేటప్పుడు పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల్లో ఎలాంటి భేదాలు లేకుండా ఒకే జాబితాను రూపొందించాలి.
ఆర్టికల్‌ 326: లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికలన్నీ సార్వజనీన వయోజన ఓటుహక్కు ప్రాతిపదికపై జరుగుతాయి. 1950, జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు వయోజన ఓటుహక్కు వయోపరిమితి 21 సంవత్సరాలు. దీన్ని రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ చట్టం - 1988 ద్వారా 18 సంవత్సరాలకు తగ్గించింది. ఇది 1989, మార్చి 28 నుంచి అమల్లోకి వచ్చింది.
ఆర్టికల్‌ 327: రాజ్యాంగ నియమాలకు లోబడి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు సంబంధించిన ఎన్నికల నియమ నిబంధనలను పార్లమెంటు రూపొందిస్తుంది.
ఆర్టికల్‌ 328: శాసనసభలకు సంబంధించిన ఎన్నికల చట్టాలను పార్లమెంటు రూపొందించనప్పుడు రాష్ట్ర శాసనసభలు రూపొందించుకోవచ్చు.
ఆర్టికల్‌ 329: ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు. ప్రాదేశిక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన శాసనాల రాజ్యాంగ బద్ధత, వివిధ నియోజకవర్గాల సీట్ల కేటాయింపును న్యాయస్థానంలో సవాలు చేయకూడదు.

 డిపాజిట్‌ కోల్పోవడం
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థులు రూ.15000ను డిపాజిట్‌గా జమచేయాలి. లోక్‌సభకు పోటీచేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.25000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12500; రాష్ట్ర శాసనసభకు పోటీచేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.10,000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5000ను డిపాజిట్‌గా జమచేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లుబాటైన ఓట్లలో కనీసం 1/6వ వంతు ఓట్లు పొందిన అభ్యర్థికి మాత్రమే డిపాజిట్‌ను చెల్లిస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి డిపాజిట్‌ తిరిగి ఇవ్వరు. దీన్నే ‘డిపాజిట్‌ కోల్పోవడం’ అంటారు.

వ్యయ పరిమితి: అభ్యర్థుల ఎన్నికల వ్యయపరిమితిని లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లో రూ.70 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.54 లక్షలుగా; రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లో రూ.28 లక్షలు, ఈశాన్య రాష్ట్రాల్లో రూ.20 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఎన్నికల వ్యయపరిమితికి 2014, ఫిబ్రవరి 28న కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

తొలగింపు: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానంలో అంటే పార్లమెంటు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా మాత్రమే తొలగిస్తారు. ఇతర ఎన్నికల కమిషనర్లను ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సిఫారసు మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు.

 అధికారాలు, విధులు
* ఆర్టికల్‌ 324 ప్రకారం ఏర్పడిన కేంద్ర ఎన్నికల సంఘం పరిపాలనా, సలహారూపకమైన, అర్ధన్యాయ సంబంధమైన అధికారాలు, విధులను కలిగి ఉంటుంది.
*  కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను రూపొందిస్తుంది, సవరణ చేస్తుంది.
* పార్లమెంటు రూపొందించిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ చట్టం ప్రకారం దేశంలోని లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం.
* వివిధ రాజకీయ పార్టీలను గుర్తించి, వాటికి ఎన్నికల గుర్తులను కేటాయించడం. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం, ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్‌ తేదీలను నిర్ణయించడం.
* ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన ఎన్నికల నియమావళిని రూపొందించి, అమలుచేయడం.
* పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ్యుల అనర్హతకు సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్లకు సూచనలు, సలహాలు ఇవ్వడం.
* వివిధ రాజకీయ పార్టీల మధ్య వచ్చే వివాదాలను విచారించి, పార్టీల వాదనలు విని పరిష్కరించడం.

 అభ్యర్థులను ఓటర్లు బలపరచడం
* రాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థిని ఎలక్టోరల్‌ కాలేజిలోని కనీసం 50 మంది సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరచాలి.
* ఉపరాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థిని ఎలక్టోరల్‌ కాలేజిలోని కనీసం 20 మంది సభ్యులు ప్రతిపాదించి, మరో 20 మంది బలపరచాలి.
* జాతీయ లేదా రాష్ట్ర పార్టీల తరఫున టికెట్‌ పొందిన వ్యక్తి లోక్‌సభ లేదా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్‌ దాఖలు చేయాలంటే కనీసం ఒక ఓటరు బలపరచాలి.
* స్వతంత్ర లేదా గుర్తింపు లేని పార్టీ తరఫున లోక్‌సభ లేదా శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ పత్రానికి సంబంధిత నియోజకవర్గంలోని కనీసం పది మంది ఓటర్ల మద్దతు ఉండాలి.
* లోక్‌సభకు పోటీ చేయాలంటే దేశంలోని ఏదో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో; రాష్ట్ర శాసనసభకు పోటీచేసే అభ్యర్థి రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.
* రాష్ట్ర శాసనసభకు గవర్నర్‌ నామినేట్‌ చేసే వ్యక్తి తప్పనిసరిగా అదే రాష్ట్రానికి చెంది ఉండాలి.

 సుప్రీంకోర్టు తీర్పులు
మక్కాల్‌ శక్తి కచ్చి Vs కేంద్ర ఎన్నికల సంఘం: ఈ కేసులో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీచేసిన తర్వాత ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు తేదీలను నిర్ణయించే అధికారం పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుందని వీటిని న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది.
మహేందర్‌సింగ్‌ గిల్‌ Vs భారత ప్రభుత్వం: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాలను పార్లమెంటు లేదా శాసనసభలు రూపొందించకపోతే ఎన్నికల నిర్వహణకు అవసరమైన నియమ నిబంధనలను రూపొందించుకునే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుందని తెలిపింది.

 ఎన్నికల యంత్రాంగం
కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్రపతి నిర్ణయించే సంఖ్యలో ఇతర ఎన్నికల కమిషనర్‌లు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. వీరి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు. జీతభత్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో స్వతంత్ర ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసుకుంటుంది. వర్గ స్థాయిలో ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా; పోలింగ్‌బూత్‌ స్థాయిలో ప్రభుత్వోద్యోగి ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 భారత రాజ్యాంగ పార్టీలు - జాతీయం, ప్రాంతీయం

జాతీయం, ప్రాంతీయం

రాజకీయ పార్టీ అంటే ఏమిటి?
     ''కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి రాజ్యాంగబద్ధమైన, శాంతియుత పద్ధతుల ద్వారా అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించే కొంతమంది వ్యక్తుల వ్యవస్థీకృత స్వరూపమే రాజకీయ పార్టీ".


రాజకీయ పార్టీలు - ఆవశ్యకత
* ప్రజాస్వామ్య వ్యవస్థను క్రియాశీలం చేసి బలోపేతం చేస్తాయి.
* ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తాయి.
* ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని ఫలపద్రం చేస్తాయి.
* ప్రజల క్షేత్రస్థాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాయి.
* అధికారాన్ని చేపట్టిన పార్టీలు ప్రభుత్వ విధానాలను రూపొందిస్తాయి.
* ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తాయి.
* ఎన్నికల ప్రక్రియలో పాల్గొని సామరస్య, శాంతియుత అధికార మార్పిడికి కృషి చేస్తాయి.
* తమ సిద్ధాంతాలను, చేపట్టే కార్యక్రమాలను ఎన్నికల మేనిఫెస్టోలలో పొందుపరచి, ప్రజాతీర్పును కోరతాయి.
* ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి.

తొలి రాజకీయ పార్టీలు

* భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (C)లో వివరించిన అసోసియేషన్‌ల ఏర్పాటు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలను స్థాపించుకోవచ్చు.

* రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10వ షెడ్యూల్‌ను రాజ్యాంగానికి చేర్చి అందులో రాజకీయ పార్టీలు అనే పదాన్ని పేర్కొంది.
* 1951 నాటి భారత ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వద్ద తమ పార్టీ పేరును నమోదు చేయించుకోవాలి.

రాజకీయ పార్టీలు - రకాలు

1. జాతీయ పార్టీ:
* ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కింద పేర్కొన్న షరతుల్లో ఒకదాన్ని నెరవేర్చాలి.
ఎ. లోక్‌సభకు లేదా 4, అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి అభ్యర్థులు పోటీచేసి పోలై చెల్లుబాటు అయిన ఓట్లలో కనీసం 6% ఓట్లు సాధించాలి. దాంతోపాటు కనీసం 4 లోక్‌సభ సీట్లు గెలుపొందాలి.
                                       లేదా
బి. కనీసం 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి.
                                       లేదా
సి. లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం 2% సీట్లు సాధించాలి. దాంతోపాటు ఈ అభ్యర్థులు కనీసం 3 రాష్ట్రాల నుంచి ఎన్నిక కావాలి.

2014 ఎన్నికల నాటికి భారత దేశంలోని జాతీయ పార్టీల సంఖ్య: 6
 1. భారత జాతీయ కాంగ్రెస్
2. భారతీయ జనతా పార్టీ
3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI)
4. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) CPI(M)
5. బహుజన సమాజ్ పార్టీ (BSP)
6. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)

 

2. రాష్ట్ర/ ప్రాంతీయ రాజకీయ పార్టీ:
* రాష్ట్ర లేదా ప్రాంతీయ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కింద పేర్కొన్న వాటిలో ఏదో ఒక షరతును నెరవేర్చాలి.
ఎ. లోక్‌సభ ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో ఒక పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు పోలై చెల్లుబాటు అయిన ఓట్లలో కనీసం 6% ఓట్లు సాధించాలి. దీనికి తోడు కనీసం ఒక అభ్యర్థి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక కావాలి.
                         లేదా
బి. రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థులు పోలై చెల్లుబాటు అయిన ఓట్లలో కనీసం 6% ఓట్లు సాధించాలి. దీనికి తోడు కనీసం ఇద్దరు సభ్యులు రాష్ట్ర శాసన సభ్యులుగా ఎన్నిక కావాలి.
                         లేదా
సి. రాష్ట్ర శాసన సభ మొత్తం సీట్లలో కనీసం 3% సీట్లు సాధించాలి.
* 2014 ఎన్నికల నాటికి మనదేశంలోని ప్రాంతీయ/ రాష్ట్ర పార్టీలు: 47.

3. రిజిస్టర్డ్ పార్టీలు
* జాతీయ పార్టీ లేదా రాష్ట్ర/ ప్రాంతీయ పార్టీ హోదాలేని పార్టీలను రిజిస్టర్డ్ పార్టీలు అంటారు.
* 2014 ఎన్నికల నాటికి భారత్‌లోని రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య 1634.
* కేంద్ర ఎన్నికల సంఘం రిజిస్టర్డ్ పార్టీలకు ఎన్నికల గుర్తింపు చిహ్నాలు కేటాయిస్తుంది. దీనికి సంబంధించిన వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదు.


మరికొన్ని ముఖ్యాంశాలు
* 1906లో ముస్లింలీగ్ పార్టీని ఢాకా నవాబు సలీముల్లాఖాన్ స్థాపించారు.
* 1913లో గదర్ పార్టీని అమెరికాలో లాలా హరదయాళ్ స్థాపించారు. భారత స్వాతంత్రోద్యమానికి మద్దతుగా ఈ పార్టీ పోరాడింది. ఈ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు: దర్శి చెంచయ్య.
* 1922లో స్వరాజ్య పార్టీని చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ ప్రారంభించారు. కేంద్ర శాసనసభలోకి ప్రవేశించి, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడటం ఈ పార్టీ లక్ష్యం.
* 2006లో లోక్‌సత్తా పార్టీని జయప్రకాష్ నారాయణ ప్రారంభించారు. సామాజిక, రాజకీయ అంశాలపై ప్రజలను చైతన్యపరచి సుపరిపాలన, అవినీతిరహిత పాలన అందించడం ఈ పార్టీ లక్ష్యం.
ఈ పార్టీ గుర్తు ఈల..
                                   
* ఇందిరాగాంధీ, రాయ్‌బరేలి లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఎన్నికైన ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడంతో 1975లో ఆమె జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.
* 1977లో కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా కేంద్రంలో అధికారం కోల్పోయి మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.
* 1952లో మొదటి లోక్‌సభ ఎన్నికలు జరుగగా 45% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 364 సీట్లు సాధించింది.
* మొదటి లోక్‌సభ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ 16 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది.
* ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య = 17.3 కోట్లు
* మొదటి లోక్‌సభకు ఎన్నికైన మహిళలు: 22
                               

1. సాధారణ ఎన్నికలు:
* సాధారణంగా 5 సంవత్సరాలకొకసారి జరిగే ఎన్నికలు.

2. మధ్యంతర ఎన్నికలు:
* రెండు సాధారణ ఎన్నికల మధ్యలో ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడం ద్వారా జరిగే ఎన్నికలు.

3. ఉప ఎన్నికలు:
* రెండు సాధారణ ఎన్నికల మధ్యలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్థానాలకు జరిగే ఎన్నికలు.

16వ లోక్‌సభ ఎన్నికలు
* 16వ లోక్‌సభ ఎన్నికలు 2014, ఏప్రిల్ 7 నుంచి 2014, మే 12 వరకు మొత్తం 10 విడతల్లో జరిగాయి. మనదేశ ఎన్నికల చరిత్రలోనే ఇవి సుదీర్ఘమైనవి.
* ఈ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 81.57 కోట్లు.
* ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 66.38% పోలింగ్ నమోదైంది. ఇప్పటివరకు లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధిక రికార్డు.

* ఈ ఎన్నికల్లో పోటీచేసిన మొత్తం పార్టీల సంఖ్య: 1687
* కనీసం ఒక్కస్థానం కూడా సాధించని పార్టీల సంఖ్య: 1452
* 35 పార్టీల నుంచి గెలుపొందిన మొత్తం సభ్యుల సంఖ్య: 540
* ఈ ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య: 3
* 16వ లోక్‌సభకు ఎన్నికైన మహిళల సంఖ్య: 62

* ఈ ఎన్నికల్లో NOTA (None of the Above) ను EVMలలో పొందుపరిచారు.
* దేశంలో అత్యధికంగా 22,268 NOTA ఓట్లు పుదుచ్చేరిలో నమోదయ్యాయి. (కేంద్రపాలిత ప్రాంతం విభాగంలో)
* అత్యధికంగా NOTA ఓట్లు పోలైన లోక్‌సభ నియోజకవర్గం: నీలగిరీస్ (తమిళనాడు). (46,559)

దేశంలో ఎక్కువ లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రాలు
1. ఉత్తర్ ప్రదేశ్          80
2. మహారాష్ట్ర            48
3. పశ్చిమ్ బంగా      42


ఓటర్ల సంఖ్య ఆధారంగా అతిపెద్ద లోక్‌సభ నియోజక వర్గాలు
1. మల్కాజ్‌గిరి (తెలంగాణ):          29,53,915 ఓటర్లు.
2. ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్):       22,63,961 ఓటర్లు.
3. బెంగళూర్ నార్త్ (కర్ణాటక):          22,29,063 ఓటర్లు.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఏకపార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ వ్యవస్థలు


ఏకపార్టీ వ్యవస్థ:
* ఏదైనా దేశంలో ఒక పార్టీ మాత్రమే ఉండే పరిస్థితిని ఏకపార్టీ వ్యవస్థగా పేర్కొనవచ్చు. ఇలాంటి వ్యవస్థ కమ్యూనిస్టు, నియంతృత్వ దేశాల్లో అమల్లో ఉంటుంది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఉండవు.
* ఏకపార్టీ వ్యవస్థ అమల్లో ఉన్న దేశాల్లో ప్రజాభిప్రాయం కంటే రాజ్యాధికారానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి వ్యవస్థల్లో ప్రజలకు హక్కులు పరిమితంగా, విధులు అపరిమితంగా ఉంటాయి.
* ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది.
* గతంలో సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్ట్‌పార్టీ, జర్మనీలో నాజీపార్టీ, ఇటలీలో ఫాసిస్ట్ పార్టీలను ఏకపార్టీ వ్యవస్థలుగా పేర్కొనవచ్చు.
* ఇలాంటి వ్యవస్థల్లో ప్రజాసంక్షేమం కంటే, రాజ్యం విధానాలకు ప్రాధాన్యం ఉంటుంది.
* అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న వ్యవస్థలను నిర్ధాక్షిణ్యంగా అణిచివేస్తారు. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేస్తారు.
* నిర్బంధ సైనిక సేవ, నిర్బంధ పన్నుల వ్యవస్థ అమల్లో ఉంటుంది.
* ప్రభుత్వ పాలనా వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం ఉండదు. ఏకపార్టీ వ్యవస్థ రూపొందించిన నియంతృత్వ విధానాలను ప్రజలందరూ పాటించాల్సిందే.

ద్విపార్టీ వ్యవస్థ:
* ఏదైనా దేశ రాజకీయాల్లో రెండు పార్టీలు మాత్రమే వర్ధిల్లుతుంటే దాన్ని ద్విపార్టీ వ్యవస్థ అంటారు. ఇలాంటి చోట ఇతర రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ వాటి ఉనికి చెప్పుకోదగిందిగా ఉండదు.
* ఒకవేళ మూడో రాజకీయ పార్టీ ప్రాముఖ్యం సంతరించుకుంటే అది అంతకు ముందున్న రెండు పార్టీల స్థానాన్ని ఆక్రమిస్తుంది.
* అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు; ఇంగ్లండ్‌లో కన్జర్వేటివ్, లేబర్ పార్టీలు ప్రాబల్యంలో ఉన్నాయి.
* రెండు పార్టీలున్న దేశాల్లో అధికార బదిలీ ఆయా పార్టీల విధానాలు, ప్రజాభిప్రాయం ఆధారంగా ఏదో ఒకపార్టీ ప్రభుత్వాధికారాన్ని చేపడుతుంది.
* ద్విపార్టీ వ్యవస్థలో రాజకీయ సుస్థిరత ఉంటుంది. అనిశ్చిత ప్రజాభిప్రాయానికి అవకాశాలు ఉండవు. ప్రజలకు అధికార పక్షాన్ని మినహాయిస్తే కేవలం ప్రతిపక్ష పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయ పార్టీగా ఉంటుంది.
* ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కూడా అధికార పక్షానికి స్పష్టమైన వైఖరి ఉంటుంది.

 

బహుళ పార్టీ వ్యవస్థ: 
* ఏదైనా దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉంటే దాన్ని బహుళ పార్టీ వ్యవస్థగా పేర్కొంటారు. ఈ విధానంలో ఏ పార్టీ అధికారానికి వస్తుందో కచ్చితంగా చెప్పలేం.
* ఫ్రాన్స్, ఇటలీ, భారత దేశాల్లో బహుళ పార్టీ వ్యవస్థ ఉంది.

బహుళ పార్టీ వ్యవస్థ - లక్షణాలు 
* పార్టీల మధ్య సిద్ధాంతపరమైన వ్యత్యాసాలు స్పష్టంగా లేకపోవడం.
* అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ముఠాలుగా ఏర్పడటం.
* నాయకుల వ్యక్తిత్వం, ఆకర్షణలపై రాజకీయ పార్టీలు ఏర్పడటం.
* నిరంతరం చీలికలు, కలయికలతో వర్ధిల్లి ఉండటం.
* ప్రజాభిప్రాయం స్పష్టతను కలిగి ఉండకపోవడం.
* తరచూ ప్రభుత్వాలు మార్పులకు గురికావడం.
* రాజకీయ అనిశ్చిత నెలకొనడం.
* ప్రజలకు అనేక ప్రత్యామ్నాయాలు ఉండటం.
* బలమైన ప్రతిపక్షం ఏర్పడకపోవడం.
* సంకీర్ణ ప్రభుత్వాలు నెలకొని ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారడం.
* సుస్థిరమైన రాజకీయ నిర్ణయాలు లేకపోవడం.

భారత రాజకీయ పార్టీ వ్యవస్థ - పరిశీలన 
* సాధారణంగా ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లో ద్విపార్టీ వ్యవస్థ లేదా బహుళపార్టీ వ్యవస్థ ఉంటుంది.
* భారతదేశంలో పార్టీ వ్యవస్థ ద్విపార్టీ వ్యవస్థ కాదు. ఇది బహుళ పార్టీ వ్యవస్థ అయినప్పటికీ సంపూర్ణంగా బహుళ పార్టీ వ్యవస్థ అని కూడా చెప్పలేం.
* మనదేశ రాజకీయ వ్యవస్థను కొందరు ఏకపార్టీ ఆధిక్యత కలిగిన బహుళపార్టీ వ్యవస్థ అంటారు. ఈ పోకడ దాదాపు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉంది.
* భారత రాజకీయ వ్యవస్థ మరో ముఖ్య లక్షణం - నిరంతరం చీలికలు, కలయికలు.
* 1969లో కాంగ్రెస్‌పార్టీ కొత్త కాంగ్రెస్, వ్యవస్థ కాంగ్రెస్‌గా చీలిపోయింది.
* 1978లో మళ్లీ కాంగ్రెస్‌లో చీలిక వచ్చి ఇందిరా కాంగ్రెస్, KBR కాంగ్రెస్‌గా ఏర్పడ్డాయి.
* సోనియాగాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులైన శరద్‌పవార్, పి.ఎ. సంగ్మా, తారిఖ్ అన్వర్‌లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు.
* 1964లో భారత కమ్యూనిస్ట్ పార్టీ చీలికకు గురై CPI, CPMగా అవతరించాయి. 1969లో CPM నుంచి CPI ఏర్పడింది.
* ప్రాంతీయ పార్టీలైన DK (ద్రవిడ కజగం) నుంచి DMK (ద్రవిడ మున్నేట్ర కజగం) ఏర్పడింది.
* DMK నుంచి AIADMK ఏర్పడింది.
* తెలుగుదేశం పార్టీ నుంచి 1984లో నాదెండ్ల భాస్కరరావు నాయకత్వంలో ప్రజాస్వామ్య తెలుగుదేశం ఏర్పడింది. 1995 ఆగస్టులో చంద్రబాబు నాయకత్వంలో TDP మరొకసారి చీలిపోయింది.
* 1977లో వ్యవస్థా కాంగ్రెస్, సోషలిస్ట్‌పార్టీ జనసంఘ్, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ, భారతీయ లోక్‌దళ్ కలిసి జనతా పార్టీగా అవతరించాయి.
* 1979-80 మధ్యకాలంలో ఈ పార్టీలు మళ్లీ విడిపోయాయి.
* 1989లో జనతాపార్టీ లోక్‌దళ్ కలిసి, జనతాదళ్‌గా అవతరించాయి.
* 1989లో లోక్‌సభ ఎన్నికల కంటే ముందు నేషనల్ ఫ్రంట్ పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి.
* 1996లో లోక్‌సభ ఎన్నికల కంటే ముందు యునైటెడ్ ఫ్రంట్ పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.
* 1998లో BJP నాయకత్వంలో కొన్ని రాజకీయ పార్టీలు NDA (నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్) కూటమిగా ఏర్పడ్డాయి.
* 2004లో కాంగ్రెస్ నాయకత్వంలో కొన్ని రాజకీయ పార్టీలు UPA (యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్) కూటమిగా ఏర్పడ్డాయి.
* ప్రస్తుతం నరేంద్రమోదీ నాయకత్వంలోని 16వ లోక్‌సభలో BJP నాయకత్వంలోని NDA కూటమి అధికారంలో ఉంది.

ఏకాధిపత్య పార్టీ వ్యవస్థ 
* భారతదేశంలో ఫ్రెంచ్, ఇటలీ దేశాల్లో మాదిరి బహుళపార్టీ విధానం అమల్లో ఉన్నప్పటికీ ఆ దేశాల్లో మాదిరిగా కాకుండా మనదేశంలో ఏకపార్టీ ఆధిపత్యం కొనసాగుతుందని రాజనీతి శాస్త్రవేత్తలైన మైరన్ వీనర్, రజినీ కొఠారీ పేర్కొన్నారు.
* మనదేశంలో స్వాతంత్య్రం లభించిన తర్వాత దాదాపు 20 సంవత్సరాలపాటు కేంద్రంలో, రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఆధిపత్యం కలిగి ఉంది.
* 1967 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఆధిపత్యం అంతరించి పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
* 1970 నుంచి 1977 వరకు తిరిగి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. 1980లో కాంగ్రెస్ పార్టీ తిరిగి కేంద్రలో అధికారానికి వచ్చి, 1989 వరకు కొనసాగింది.
* 1991 నుంచి 1996 వరకు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారాన్ని చెలాయించింది.

ప్రాంతీయతత్వం 
* మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్‌పార్టీ తన విధానాలను మార్చుకోకపోవడం వల్ల వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలన్న ధ్యేయంతో 1967 తర్వాత అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు తమ ఆకాంక్షాలకు అనుగుణంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.
* 1980 తర్వాత ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం పెరిగి జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగాయి.
* లోక్‌సభ ఎన్నికల్లో ఏ ఒక్క జాతీయ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో ప్రాంతీయ పార్టీల మద్ధతుతో జాతీయ స్థాయిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారు.
* మనదేశంలో వివిధ ప్రాంతీయ పార్టీల ఏర్పాటు 1989 నుంచి సంకీర్ణ రాజకీయాలకు దారితీసింది.

ఇంతవరకు మన దేశంలో కేంద్రంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు

లోక్‌సభ - వివిధ రాజకీయ పార్టీల బలాబలాలు
1వ లోక్‌సభ ఎన్నికలు (1951)
1. కాంగ్రెస్ పార్టీ                    -               364
2. సీపీఐ                             -               16
3. సోషలిస్ట్ పార్టీ                    -               12
4. కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ      -                9
5. భారతీయ జనసంఘ్          -                3
6. ఇతర పార్టీలు                    -              48
7. స్వతంత్రులు                     -              37
                                                    
                      మొత్తం స్థానాలు:           489
                                                       

2వ లోక్‌సభ ఎన్నికలు (1957)
1. కాంగ్రెస్ పార్టీ                          -        371
2. సీపీఐ                                  -        27
3. భారతీయ జనసంఘ్               -        4
4. పీఎస్పీ                                 -        5
5. ఇండిపెండెంట్స్                       -       42
6. ఇతరులు                              -       45
                                                 
                            మొత్తం స్థానాలు:  494
                                                 

 

3వ లోక్‌సభ ఎన్నికలు (1962)
1. కాంగ్రెస్ పార్టీ                     -        361
2. సీపీఐ                             -         29
3. జనసంఘ్                        -        14
4. పీఎస్పీ                            -        12
5. ఎస్‌డబ్ల్యూఏ                     -        18
6. ఇండిపెండెంట్స్                 -         20
7. రిపబ్లికన్ పార్టీ                  -          3
8. సోషలిస్ట్ పార్టీ                   -          6
9. హిందూ మహాసభ            -           1
10. స్వతంత్ర పార్టీ                -           18
11. ఇతరులు                      -           12
                                                
            మొత్తం స్థానాలు:-               494
                                                       

4వ లోక్‌సభ ఎన్నికలు (1967)
1. కాంగ్రెస్ పార్టీ                     -        283
2. జనసంఘ్                        -        35
3. సీపీఐ                              -        23
4. సీపీఎం                            -         19
5. పీఎస్పీ                             -        13
6. ఎస్ఎస్‌పీ                          -        23
7. స్వతంత్ర పార్టీ                    -         44
8. డిఎంకే                             -         25
9. ఇండిపెండెంట్స్                  -         35
10. ఇతరులు                       -         20
                                            
                      మొత్తం స్థానాలు:      520 
                                             

5వ లోక్‌సభ ఎన్నికలు (1971)
1. కాంగ్రెస్                           -           352
2. భారతీయ జనసంఘ్         -             22
3. సీపీఐ                            -             23
4. సీపీఎం                          -              25
5. కాంగ్రెస్ (సంస్థ)               -              16
6. డీఎంకే                         -               22
7. స్వతంత్ర పార్టీ                -                 8
8. ఇతరులు                      -              50
                                                
                మొత్తం స్థానాలు:             518
                                                

6వ లోక్‌సభ ఎన్నికలు (1977)
1. జనతా పార్టీ                      -          295
2. సీపీఐ                              -          7
3. సీపీఎం                             -         22
4. కాంగ్రెస్                            -         154
5. ఇండిపెండెంట్స్                  -          9
6. డీఎంకే                             -          1
7. ఏఐఏడీఎంకే                      -         18
8. అకాళీదళ్                         -          8
9. ఇతరులు                          -        28
                                                 
                     మొత్తం స్థానాలు:         542
                                                 

 

7వ లోక్‌సభ ఎన్నికలు (1980)
1. సీపీఐ                             -        10
2. సీపీఎం                           -         37
3. కాంగ్రెస్ (ఐ)                     -        353
4. కాంగ్రెస్ (యు)                  -         13
5. జనతాపార్టీ                      -          31
6. జనతా పార్టీ (ఎన్)            -           41
7. డీఎంకే                           -          16
8. ఆర్ఎస్పీ                        -            4
9. ఇండిపెండెంట్స్                -            9
10. ఇతరులు                     -          28
                                              
                   మొత్తం స్థానాలు:         542
                                               

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 కేంద్ర ఎన్నికల సంఘం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కేంద్ర ఎన్నికల సంఘం గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో వివరించారు?
జ: XVవ భాగం, ఆర్టికల్‌ 324 - 329

2. మన దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
జ: 1950, జనవరి 25

3. ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ నినాదంతో నిర్వహిస్తున్నారు?
జ: Proud to be voter - Ready to vote

4. రాష్ట్రపతి నియమించే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన, ఇతర కమిషనర్‌ల పదవీ కాలం?
జ: 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు

5. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఎవరిని తొలగించే పద్ధతిలో తొలగిస్తారు?
జ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి

6. 1989, అక్టోబరు 16న కేంద్ర ఎన్నికల సంఘాన్ని బహుళ సభ్య ఎన్నికల సంఘంగా మార్చిన ప్రధాని ఎవరు?
జ: రాజీవ్‌గాంధీ

7. బహుళ సభ్య ఎన్నికల సంఘాన్ని అప్పటి ప్రధాని విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ ఎప్పుడు ఏకసభ్య ఎన్నికల సంఘంగా మార్చారు?
జ: 1990 జనవరి

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశ ఎన్నికల వ్యవస్థ

ప్రజాస్వామ్య పరిరక్షణలో సర్వస్వతంత్రం!

పాలనలో ప్రజలకు సమగ్ర ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాత, నిర్బంధరహిత ఎన్నికల నిర్వహణ వ్యవస్థ అత్యంత కీలకం. అందుకోసం భారతదేశంలో రాజ్యాంగబద్ధ ఎలక్షన్‌ కమిషన్‌ ఉంది. ఇది రాష్ట్రాల శాసనసభల నుంచి పార్లమెంటు వరకు అన్ని రకాల ఎన్నికలను జరుపుతుంది. తద్వారా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంతోపాటు, పాలనలో అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తుంది. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ ప్రక్రియలో అనుసరిస్తున్న విధానాలు, రాజకీయ పార్టీల పాత్ర మొదలైన అంశాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. సర్వ స్వతంత్రంగా ఉంటూ శక్తిమంతంగా వ్యవహరించే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన విధులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి గురించి వివరంగా తెలుసుకోవాలి.


భారతదేశం ప్రాతినిధ్య ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరిస్తోంది. పాలనా నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రజాసంక్షేమ విధానాలను రూపొందించడంలో ప్రజల తరఫున ప్రజాప్రతినిధులు పాల్గొనే వ్యవస్థనే ‘ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం’ అంటారు. ఆధునిక ప్రజాస్వామ్యాలన్నీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాలే.


* మన దేశంలో పరిపాలనా నిర్వహణ కోసం ప్రజలు తమ ప్రతినిధులను ఎంపిక చేసుకోవడానికి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల నిర్వహణకు భారత రాజ్యాంగం ఏర్పాటు చేసిన వ్యవస్థే ఎన్నికల సంఘం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఏర్పాటైన భారత ఎన్నికల సంఘం స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్ణీత కాలవ్యవధుల్లో, సమర్థంగా ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తోంది.


ఓటు హక్కు:  ప్రజలు తమ రాజకీయ ప్రతినిధులను ఎన్నుకోవడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326 అవకాశం కల్పిస్తోంది. దాని ప్రకారం అర్హత ఉన్న వారందరికీ ఓటు హక్కు లభించింది. దీనినే సార్వజనీన వయోజన ఓటుహక్కు అంటారు. కుల, మత, జాతి, లింగ, విద్య, ఆర్థిక స్థితి, ప్రాంతం, వర్గం తదితర అంశాలతో సంబంధం లేకుండా, వివక్ష రహితంగా, నిర్ణీత వయసు నిండిన వయోజనులంతా ఓటుహక్కు పొందవచ్చు. ఈ విధంగా ఓటుహక్కు ఉన్న ఓటర్ల సముదాయాన్ని ‘ఎలక్టోరేట్‌’ అంటారు. నీ రాజ్యాంగం ప్రకారం 1988కి ముందు ఓటుహక్కు పొందడానికి కనీస వయసు 21 సంవత్సరాలుగా ఉండేది. 1988లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో పార్లమెంటు 61వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం 18 ఏళ్లు నిండిన భారత పౌరులంతా ఓటుహక్కు పొందేందుకు అర్హులు.


జాతీయ ఓటర్ల దినోత్సవం: భారత ఎన్నికల సంఘం 1950, జనవరి 25న ఏర్పడింది. 2010, జనవరి 25 నాటికి 60 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏటా జనవరి, 25న ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. కొత్తగా ఓటు పొందే వయసు వచ్చిన యువతలో చైతన్యం నింపడం దీని ఆశయం. ఏటా జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి, వారి పేర్లు ఓటరు జాబితాలో చేర్చి, జనవరి 25న ఓటరు గుర్తింపు కార్డులు అందజేస్తున్నారు. ఓటర్లు తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎన్నికల సంఘం లోక్‌సభకు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహిస్తుంది.


ఎన్నికల సంఘం: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324(2) ప్రకారం భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల అధికారిని, ఇతర ఎన్నికల అధికారులను నియమిస్తారు. ఎన్నికల సంఘం ఏర్పాటైన ప్రారంభంలో ఏకసభ్య సంఘంగా ఉండేది. అందులో ఒకే ఒక్క ప్రధాన ఎన్నికల అధికారి ఉండేవారు. 1989లో చేసిన ఎన్నికల సంఘం సవరణ చట్టం ప్రకారం బహుళసభ్య సంస్థగా మారింది. దీని ప్రకారం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు అదనపు ఎన్నికల అధికారులు ఉండే ‘త్రిసభ్య సంఘం’గా కొనసాగుతోంది. ఈ సభ్యులు సాధారణంగా ఐఏఎస్‌ అధికారులై ఉంటారు. వీరి పదవీకాలం పదవి చేపట్టిన తేదీ నుంచి 6 ఏళ్లు లేదా 65 సంవత్సరాలు వయసు నిండే వరకు ఉంటుంది.


* భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. దీనినే ‘నిర్వాచన్‌ సదన్‌’ అంటారు. సర్వోన్నత, స్వతంత్ర అధికారాలు ఉండే ఎన్నికల సంఘం కమిషనర్‌ను అభిశంసన తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించాలంటే పార్లమెంటు ఉభయసభల్లో 2/3 వంతు సభ్యుల అంగీకారం అవసరం.


కేంద్ర ఎన్నికల సంఘం విధులు: 

*  నియోజకవర్గాల భౌగోళిక పరిధులు నిర్ణయించడం 

*  ఓటర్ల జాబితాలు రూపొందించడం

* సాధారణ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేయడం 

* నిర్ణీత కాలవ్యవధిని అనుసరించి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం 

* ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన నియమావళి రూపొందించడం నీ వివిధ రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇవ్వడం, గుర్తులు కేటాయించడం 

* ఎన్నికల షెడ్యూల్‌ను, పోలింగ్‌ తేదీలను ప్రకటించడం 

* ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన 

* దేశవ్యాప్తంగా ఎన్నికల యంత్రాంగాన్ని నడిపించడం 

* ఎన్నికల్లో జరిగే అక్రమాల నియంత్రణకు విచారణ అధికారులను నియమించడం.


ఎన్నికల సిబ్బంది: కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది ఉండరు. ఆర్టికల్‌ 324(6) ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ల అనుమతితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటుంది. ఆ సమయంలో సిబ్బందిపై కేంద్ర ఎన్నికల సంఘానికే సర్వాధికారం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా వారిని బదిలీ చేయడం లేదా పదోన్నతులు కల్పించడం చేయకూడదు. నీ 1990-1996 కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం పదో ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన టి.ఎన్‌.శేషన్‌ ఎన్నికల చట్టాలను, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అత్యంత కఠినంగా అమలుచేసిన అధికారిగా ప్రసిద్ధులయ్యారు. అర్హులైన ఓటర్లందరికీ ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయడం, ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చుపై పరిమితులు విధించడం మొదలైన వాటిపై దృష్టి సారించారు.


రాజకీయ పార్టీలు-ఎన్నికల మేనిఫెస్టో:  ఉమ్మడి రాజకీయ విశ్వాసాలు, ఆసక్తులు ఉండి రాజకీయ అధికారాన్ని పొందడానికి సంఘంగా ఏర్పడిన వ్యక్తుల సముదాయాన్ని ‘రాజకీయ పార్టీ’ అంటారు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల తరఫున పోటీ చేసేవారిని ఆయా పార్టీల అభ్యర్థులు అంటారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేసేవారిని ‘స్వతంత్ర అభ్యర్థులు’ అంటారు. ఎన్నికల సంఘం వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తుంది. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం వారి స్వేచ్ఛా సంకేతాల జాబితాలో నుంచి అందుబాటులో ఉన్న గుర్తులు ఎంచుకునే అవకాశం కల్పిస్తుంది.

* రాజకీయ పార్టీలు తమ విధివిధానాలను, ప్రాధాన్యాలను ఒక విధానపత్రం ద్వారా ఎన్నికల కంటే ముందే ప్రజలకు తెలియజేస్తాయి. దీనినే ‘ఎలక్షన్‌ మేనిఫెస్టో’ అంటారు. ఇందులో వివిధ అంశాలపై పార్టీ దృక్పథాలను, ఆశయాలను, అధికారంలోకి వస్తే చేయబోయే పనులను, సేవలను, అభివృద్ధి ప్రణాళికలను పొందుపరుస్తాయి. ఓటర్లు ఏ రాజకీయ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలో నిర్ణయించుకోవడానికి ఎలక్షన్‌ మేనిఫెస్టో తోడ్పడుతుంది.


సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు: 

*  లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు సాధారణంగా 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలను సాధారణ ఎన్నికలు అంటారు. 1952లో లోక్‌సభకు తొలి సాధారణ ఎన్నికలు జరిగాయి.

*  చట్టసభలకు ఎన్నికైన సభ్యులు పదవీకాలం ముగియక ముందే తమ పదవికి రాజీనామా చేసినా, మరణించినా, ఇతర కారణాల వల్ల ఆ నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడుతుంది. ఆ విధంగా ఏర్పడిన ఖాళీలకు ఎన్నికల సంఘం నిర్ణీత వ్యవధిలోపు ఎన్నికలు నిర్వహించి భర్తీ చేస్తుంది. వీటినే ఉపఎన్నికలు అంటారు.

* లోక్‌సభ, శాసనసభల పదవీకాలం పూర్తి కాకుండానే ఎన్నికలు నిర్వహిస్తే వాటిని ‘మధ్యంతర ఎన్నికలు’ అంటారు. లోక్‌సభకు తొలి మధ్యంతర ఎన్నికలు 1971లో జరిగాయి.

ఎన్నికల నిర్వహణ: ఎన్నికల నిర్వహణకు రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఉంటారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. నియోజకవర్గ స్థాయిలో ఒక ప్రభుత్వ అధికారి ‘రిటర్నింగ్‌ ఆఫీసర్‌’గా వ్యవహరిస్తారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పిస్తారు. ఆ అధికారి నామినేషన్‌ పత్రాలను పరిశీలించి, సరిగ్గా ఉన్న నామినేషన్‌ల జాబితాను ప్రకటిస్తారు. నిర్ణీత గడువులో నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం అభ్యర్థులకు ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక తుది అభ్యర్థుల జాబితాను ప్రతి నియోజకవర్గంలోను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)లను సిద్ధం చేస్తారు. ఈవీఎంలను తొలిసారిగా 1989-1990 లలో దేశంలోని 16 శాసనసభా నియోజకవర్గాలలో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. 

*  సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి భారత ఎన్నికల సంఘం ఈవీఎంలకు వీవీపాట్‌ (ఓటర్‌ వెరిఫైయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌)ను అనుసంధానం చేసింది.

* పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వర్తించేందుకు ‘ప్రిసైడింగ్‌ అధికారి’ని, పోలింగ్‌ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి నియమిస్తారు. ప్రిసైడింగ్‌ అధికారి ఓటరు గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాత ఓటరు ఎడమచేతి చూపుడువేలిపై ‘ఇండెలిబుల్‌ సిరా’తో గుర్తు పెట్టించి, ఓటు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తారు.


రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 08-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర ఎన్నికల సంఘం

ఓట్ల పండుగలో అన్నీ తానై!


అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలకపాత్ర పోషిస్తోంది. ఇది చట్టాలను, రాజ్యాంగ సూత్రాలను నిక్కచ్చిగా అమలు చేస్తూ, న్యాయాధికారాలను చెలాయించే స్వయంప్రతిపత్తి ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థ. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత అన్నీ తానై నడిపిస్తుంది. దేశంలో అత్యంత ప్రధానమైన ఈ స్వతంత్ర సంఘం గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. రాజ్యాంగంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఉన్న నిబంధనలతో పాటు దాని కూర్పులో జరిగిన మార్పుచేర్పులు, సభ్యుల విధులు- అధికారాలు, నియామకాలు- తొలగింపులు తదితర ప్రక్రియలపై అవగాహన పెంచుకోవాలి. నోటిఫికేషన్‌ నుంచి ఫలితాల వెల్లడి వరకు అంతా ఎన్నికల సంఘం కనుసన్నల్లోనే జరిగే తీరును అర్థం చేసుకోవాలి.


రాజ్యాంగంలోని 15వ భాగంలో ఆర్టికల్‌ 324 నుంచి 329 వరకు కేంద్ర ఎన్నికల సంఘం గురించి ఉంది. 


ఆర్టికల్‌ 324: భారతదేశంలో ఎన్నికల నిర్వహణకు ‘కేంద్ర ఎన్నికల సంఘం’ ఏర్పాటవుతుంది.


ఆర్టికల్‌ 324(1): ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ అధికారాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్నాయి. సాధారణ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు, ఉపఎన్నికలను నిర్వహిస్తుంది. అత్యున్నత రాజ్యాంగ పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుంది. లోక్‌సభ, రాజ్యసభ, విధానసభ, విధాన పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహిస్తుంది. భారత ప్రజాప్రాతినిధ్య చట్టాల అమలుకు కృషి చేస్తుంది. రాజకీయ పార్టీల చిహ్నాల (గుర్తులు) వివాదాలు పరిష్కరించడంలో ‘అర్థ న్యాయవ్యవస్థ’గా పనిచేస్తుంది.


ఆర్టికల్‌ 324(2): కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణం గురించి వివరిస్తుంది. పార్లమెంటు రూపొందించిన చట్టానికి అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన కమిషనర్, ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.


బహుళ సభ్య ఎన్నికల సంఘంగా మార్పు: 1950, జనవరి 25 నుంచి 1989, అక్టోబరు 15 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏకసభ్య సంఘంగా కొనసాగింది. అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఒక్కరే ఉండేవారు. రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో 1989, అక్టోబరు 16న కేంద్ర ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య సంఘంగా మార్పు చేశారు. అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఇతర కమిషనర్లు. 1990, జనవరి 15 వరకు త్రిసభ్య సంఘం కొనసాగింది.


* వి.పి.సింగ్‌ ప్రభుత్వ కాలంలో 1990, జనవరి 16న తిరిగి ఏక సభ్య సంఘంగా మార్పు చేశారు. 1993, జూన్‌ 15 వరకు ఏక సభ్య సంఘంగా ఉంది.


 పీవీ నరసింహారావు ప్రభుత్వకాలంలో 1993, అక్టోబరు 1న కేంద్ర ఎన్నికల సంఘాన్ని మరోసారి త్రిసభ్య సంఘంగా మార్చారు. దీనిప్రకారం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఇతర కమిషనర్లు ఉంటారు. ఎన్నికల సంఘంలో ఏదైనా అంశంపై భేదాభిప్రాయాలు తలెత్తితే మెజార్టీ ఓటింగ్‌ ద్వారా నిర్ణయం తీసుకుంటారు. అంటే ముగ్గురికి ఓటు విలువ సమానంగా ఉంటుంది.


టీఎన్‌ శేషన్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: పార్లమెంటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య ఎన్నికల సంఘంగా మార్పు చేయడాన్ని సవాల్‌ చేస్తూ అప్పటి ఎన్నికల ప్రధాన కమిషనర్‌ టి.ఎన్‌.శేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. త్రిసభ్య ఎన్నికల సంఘం ఏర్పాటు సమర్థనీయమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.


నియామకం - తొలగింపు:

ప్రధాన, ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. వీరి పదవీ కాలం పదవి చేపట్టిన తేదీ నుంచి ఆరు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వయసు నిండే వరకు ఉంటుంది. పదవీకాలం కంటే ముందే వీరు తమ పదవులకు రాజీనామా చేయవచ్చు. రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.


*  ప్రధాన ఎన్నికలకమిషనర్‌ను అసమర్థత, అధికార దుర్వి నియోగం వంటి కారణాలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతిలో అభిశంసన తీర్మానం ద్వారా తొలగించవచ్చు. ఈ తీర్మానాన్ని లోక్‌సభలో లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు. తీర్మానం ప్రవేశపెట్టిన సభాధిపతి ఆరోపణలపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. లోక్‌సభ, రాజ్యసభ విడివిడిగా 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో అభిశంసన తీర్మానాన్ని ఆమోదిస్తే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను రాష్ట్రపతి తొలగిస్తారు. అభిశంసన తీర్మానంపై ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే తీర్మానం వీగిపోతుంది. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.


ఎన్నికల సంఘంలోని మిగిలిన ఇద్దరు కమిషనర్లు రాజ్యాంగబద్ధంగా నియమించిన అధికారులు కారు. 1993లో పార్లమెంటు రూపొందించిన చట్టాన్ని అనుసరించి వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. వీరిని అసమర్థత, అధికార దుర్వినియోగం వంటి కారణాలతో కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను సంప్రదించి రాష్ట్రపతి తొలగిస్తారు.


జీతభత్యాలు: ప్రధాన, ఇతర ఎన్నికల కమిషనర్ల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.


అర్థ న్యాయాధికారాలు: కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటుకు జరిగే ఎన్నికలకు రాష్ట్రపతి పేరుతో, శాసనసభకు జరిగే ఎన్నికలకు గవర్నర్‌ పేరుతో నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది.


*   ఎన్నికలు ముగిసిన తరువాత 15 రోజుల్లోగా ఎన్నికల వ్యయానికి సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించని అభ్యర్థుల అభ్యర్థిత్వాలను రద్దు చేస్తుంది.


*   పార్లమెంటు సభ్యుల అనర్హతలపై రాష్ట్రపతికి, శాసనసభ్యుల అనర్హతలపై గవర్నర్‌కు సలహానిస్తుంది.


*   ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను అంగీకరించడం లేదా తిరస్కరించడం.


*   టెలివిజన్, రేడియోలలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం కోసం సమయం కేటాయిస్తుంది.


*   ఎన్నికల నేరాలు, అభ్యర్థుల మరణం వంటి కారణాల ఆధారంగా ఎన్నికలు వాయిదా వేస్తుంది.


ఎన్నికల షెడ్యూల్‌ను వెలువరించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం, పోలింగ్‌ తేదీకి 48 గంటలకు ముందే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసేలా చర్యలు చేపట్టడం.


ఆర్టికల్‌ 325: ఎన్నికల సంఘం ఓటు హక్కును అందించడంలో కుల, మత, జాతి, స్త్రీ, పురుష, వర్గ, వర్ణ విచక్షణలు పాటించకూడదు. ఎన్నికల నిర్వహణ విషయంలో, ఓటర్ల జాబితా రూపకల్పనలో పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల్లో ఒకే జాబితాను రూపొందించాలి.


ఆర్టికల్‌ 326: భారత రాజ్యాంగం దేశంలోని నిర్ణీత వయసు నిండిన ప్రజలందరికీ సార్వజనీన వయోజన ఓటు హక్కును ప్రసాదించింది. 18 ఏళ్లు నిండిన భారత పౌరులందరూ ఓటు హక్కు పొందేందుకు అర్హులు.


*  ఆర్టికల్‌ 326 ప్రకారం ఓటు హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు.


*  1950 నాటి భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓటు హక్కు చట్టబద్ధమైన హక్కు.


*  
2002లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఓటు హక్కును ప్రజల ప్రాథమిక హక్కుగా పేర్కొంది.


ఆర్టికల్‌ 327: ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాలను పార్లమెంటు రూపొందిస్తుంది. లోక్‌సభ, రాజ్యసభ, విధానసభ, విధాన పరిషత్‌ల ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలు, అర్హతలు, అనర్హతలు మొదలైన అంశాలకు సంబంధించిన చట్టాలను, ఓటర్ల జాబితాలకు సంబంధించిన చట్టాలను పార్లమెంటు రూపొందిస్తుంది. ఉదాహరణకు భారత ప్రజాప్రాతినిధ్య చట్టాలు.


శివన్‌ పిళ్ళై Vs ఎ.సి.జోస్‌ కేసు: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎన్నికల నిర్వహణ కోసం పార్లమెంటు రూపొం దించిన ప్రజాప్రాతినిధ్య చట్టాల్లోని నియమ నిబంధనలను ఎన్నికల కమిషన్‌ తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.


ఆర్టికల్‌ 329: ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దానిలో న్యాయస్థానాల జోక్యాన్ని అనుమతించరు. ఎన్నికల సంఘం పూర్తిగా స్వయంప్రతిపత్తితో ఎన్నికలు నిర్వహించవచ్చు.


సుప్రీంకోర్టు తీర్పు- మక్కల్‌శక్తికట్చి Vs కేంద్ర ఎన్నికల సంఘం కేసు:  ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఎన్నికలు నిర్వహించే తేదీలను, ఓట్ల లెక్కింపు తేదీలను నిర్ణయించే సంపూర్ణ అధికార పరిధి పూర్తిగా ఎన్నికల సంఘం నియంత్రణలో ఉంటుందని, ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని పేర్కొంది.



రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 28-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు 

 (వివిధ కమిటీల సిఫార్సులు)

పటిష్ఠ ప్రజాస్వామ్యానికి విశిష్ట సూచనలు!

ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో ఎన్నికలు అతిముఖ్యమైన ప్రక్రియ. భారత కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు విజయవంతంగా సాగుతున్నప్పటికీ, తరచూ అనేక రకాల అవరోధాలు తలెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే పరిణామాలు సంభవిస్తున్నాయి. వాటిని పరిహరించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కొన్ని కమిటీలను ఏర్పాటు చేశారు. అవి చేసిన పలు సూచనలు ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేసేందుకు దోహదపడ్డాయి. దేశంలో ఇప్పటివరకు ఎన్నికల సంస్కరణల కోసం ఏర్పాటైన అధికారిక కమిటీలు, వాటి సిఫార్సులపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. అమలవుతున్న తీరునూ అర్థం చేసుకోవాలి. 


భారతదేశంలో ప్రజాస్వామ్యం విజయవంతం కావడంలో ఎన్నికలు కీలక భూమిక పోషిస్తున్నాయి. 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలు మొదలు 2024లో జరగబోయే 18వ సార్వత్రిక ఎన్నికల  వరకు దేశ ఎన్నికల వ్యవస్థ సందర్భానుసారం సంస్కరణలకు గురైంది. సమర్థంగా కొనసాగుతోంది. 


సంయుక్త పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు (1972): దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం, శాసనసభలకు ఎన్నికలు జరపడం తదితర అంశాలన్నింటినీ ఒకే వ్యక్తి పర్యవేక్షించడం, నియంత్రించడం శ్రమతో కూడిన పని. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324(2) ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ‘బహుళసభ్య ఎన్నికల సంఘంగా’ మార్పు చేయాలి.


తార్కుండే కమిటీ సిఫార్సులు (1982): ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయాలి. ఓటుహక్కు పొందేందుకు కనీస వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించాలి.

* కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు సభ్యులతో కూడిన బహుళసభ్య ఎన్నికల సంఘంగా, పూర్తి స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థగా కొనసాగాలి. పదవీవిరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులను సభ్యులుగా నియమించకూడదు.


దినేష్‌ గోస్వామి కమిటీ (1990): నాటి వి.పి.సింగ్‌ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న దినేష్‌ గోస్వామి అధ్యక్షతన ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పలు సిఫార్సులు చేసింది.

* రాజకీయ పార్టీలకు ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వం నగదు రూపంలో కాకుండా వస్తురూపంలో ఇవ్వాలి. గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలి. మిగిలిన పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందించాలి.

* ఒక అభ్యర్థి ఎన్నికల్లో ఒకేసారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే విధానాన్ని రద్దు చేయాలి. ఎన్నికల పరిశీలనకు ఒక పర్యవేక్షణాధికారిని నియమించే అధికారం ఎన్నికల సంఘానికి ఇవ్వాలి.

* పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్‌ వంటి నేరాలు జరిగినప్పుడు ఓట్ల లెక్కింపును నిలిపేసి, ఫలితాలు వెల్లడించవద్దని ఎన్నికల సంఘం రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించాలి.

రిజర్వ్‌ చేసిన నియోజకవర్గాలను నియమిత కాలాల్లో మారుస్తూ, రిజర్వేషన్‌ లేని అభ్యర్థులకు అవకాశం కల్పించాలి.

* ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)లను ఉపయోగించాలి.


ఇంద్రజిత్‌ గుప్తా కమిటీ (1998):

* రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలను చెక్కుల రూపంలో మాత్రమే స్వీకరించాలి.

* ఎన్నికల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలి.


టి.ఎస్‌.కృష్ణమూర్తి కమిటీ: ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన టి.ఎస్‌.కృష్ణమూర్తి అధ్యక్షతన ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అది వివిధ సిఫార్సులు చేసింది.

* రాజకీయ పార్టీలు సంస్థాగత ఎన్నికలు (అంతర్గత ఎన్నికలు) నిర్వహించాలి.

* 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించదగిన నేరాలకు పాల్పడినట్లుగా ఆరోపణలున్న వ్యక్తులను నిర్దోషులుగా రుజువయ్యేంత వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలి.

*  ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేయడానికి అనుమతించాలి. టెలివిజన్‌లో ప్రకటనలకు సంబంధించిన విషయాలపై నియమావళిని రూపొందించాలి. 

* ఓటరుకి ఏ ఒక్కరికీ ఓటు వేయడం ఇష్టం లేకపోతే అభ్యర్థులందరినీ తిరస్కరించే అవకాశం కల్పించాలి. దానికోసం బ్యాలెట్‌ పేపర్‌లో ఒక కాలమ్‌ను ఏర్పాటు చేయాలి.

* ఎగ్జిట్‌పోల్స్‌ను నియంత్రించాలి.

సంతానం కమిటీ (1963): రాజకీయ అవినీతిని అంతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ‘విజిలెన్స్‌ కమిషన్ల’ను ఏర్పాటు చేయాలి.

వోహ్రా కమిటీ (1993):  నేరమయ రాజకీయాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఈ కమిటీ పేర్కొంది.

15వ లా కమిషన్‌ సిఫార్సులు (2000):  జస్టిస్‌ జీవన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైంది.

* ఎన్నికల్లో  స్వతంత్ర అభ్యర్థులు మరణించినప్పుడు ఎన్నిక వాయిదా వేయాల్సిన అవసరం లేదు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి మరణిస్తే కొత్త అభ్యర్థి పేరును సూచించడానికి వారం రోజులు సమయం ఇవ్వాలి.

* పార్టీ ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి ఉండాలి.

* అభ్యర్థి నేరచరిత్ర  తెలిసి కూడా ఏదైనా రాజకీయ పార్టీ టికెట్‌ ఇస్తే ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి.

* ప్రతి పార్టీ తమ సంస్థాగత ఎన్నికల్లో 30 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్‌ చేయాలి.

* ఒక అభ్యర్థి ఎన్నికల్లో ఒకటికంటే ఎక్కువ నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు అనుమతించకూడదు.

* ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఫిరాయింపుదారులు వేసే ఓట్లు చెల్లవని ప్రకటించాలి.

* రెండంచెల బ్యాలెట్‌ పద్ధతిని ప్రవేశపెట్టాలి.

* పార్టీ విరాళాల కోసం ప్రత్యేక ట్రస్టు ఏర్పాటుకు కార్పొరేట్‌ సంస్థలను ప్రోత్సహించాలి.

* అభ్యర్థులు చెల్లించే డిపాజిట్‌ను పెంచి, లక్ష్యరహితంగా పోటీచేసే వారిని నిరోధించాలి.


రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ సిఫార్సులు: వాజ్‌పేయీ ప్రభుత్వకాలంలో జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య అధ్యక్షతన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ ఏర్పాటు చేశారు. 

సిఫార్సులు:

* ఓటర్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పంచాయతీ స్థాయి నుంచి సేకరించాలి. అన్ని నియోజకవర్గాల్లో వీలైనంత త్వరగా ఈవీఎంలను ప్రవేశపెట్టాలి.

* ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 50 శాతం +1 ఓట్లు సాధించిన అభ్యర్థులనే గెలుపొందినట్లుగా ప్రకటించాలి. ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదా ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమికిగాని స్పష్టమైన మెజార్టీ రాకపోతే స్పీకర్‌ను ఎన్నుకునే పద్ధతిలోనే సభానాయకుడిని కూడా చట్టసభల సభ్యులే ఎన్నుకోవాలి.

* సభానాయకుడైన ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే సమయంలోనే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని కూడా ప్రతిపాదించాలి.

* ఎస్సీ, ఎస్టీ వర్గాలవారికి రిజర్వ్‌ చేసిన నియోజకవర్గాలను రొటేషన్‌ పద్ధతిలో మార్పు చేస్తూ ఉండాలి.


రెండో పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సులు: మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పడింది. 

సిఫార్సులు:

* ఎన్నికల వివాదాలను 6 నెలల్లోపు పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలి.

* ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చులో కొంతభాగాన్ని ప్రభుత్వమే భరించాలి.

* అధికార కూటమి నుంచి ఏదైనా రాజకీయ పార్టీ అర్థంతరంగా వెళ్లిపోతే, ఆ పార్టీ విధిగా తిరిగి ప్రజల తీర్పు కోరే విధంగా చట్టంలో మార్పులు చేయాలి. 

* ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం పారదర్శకంగా జరగాలి. ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలి.

* పార్టీలు ఎన్నికల కూటమిగా ఏర్పడినప్పుడు ఎన్నికల కంటే ముందుగానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత గానీ, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రకటించాలి.

* పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పార్లమెంటు సభ్యులను, రాష్ట్రాల శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి, గవర్నర్లకు ఇవ్వాలి.

* ఎంపీ ల్యాడ్స్, ఎమ్మెల్యే ల్యాడ్స్‌ నిలిపివేయాలి. 

* హత్య, అత్యాచారం, దొంగతనం, అపహరణ మొదలైన నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నవారికి ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీలు టికెట్లు ఇవ్వకూడదు.


టి.ఎన్‌.శేషన్‌ సిఫార్సులు: భారత ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడం ద్వారా టి.ఎన్‌.శేషన్‌ సిఫార్సుల్లో కొన్నింటిని ఎన్నికల సంస్కరణల్లో భాగంగా అమలుచేశారు.

* ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మరణిస్తే ఎన్నికను వాయిదా వేయాలి, రద్దు చేయకూడదు. పోలింగ్‌ బూత్‌ సమీపంలోకి ఆయుధాలను తీసుకెళ్లడం నేరంగా పరిగణించాలి. 

* ఒక అభ్యర్థి రెండు నియోజకవర్గాలకు మించి పోటీ చేయకూడదు. స్వతంత్ర అభ్యర్థి పోటీ చేయాలంటే ఆ నియోజకవర్గంలోని ఓటర్లలో కనీసం 10 మంది అతడి అభ్యర్థిత్వాన్ని బలపరచాలి.

* నేరం నిరూపణ జరిగి, కనీసం 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తే, ఆ వ్యక్తి 6 సంవత్సరాలపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు.

* నామినేషన్ల  ఉపసంహరణ తేదీ నుంచి ప్రచార సమయాన్ని 14 రోజులుగా నిర్ణయించాలి (1997 నుంచి అమల్లోకి వచ్చింది).

* ఎన్నికల ప్రచార సమయం పూర్తయిన తర్వాత 48 గంటల వరకు మద్యపానం, మత్తుపానీయాల అమ్మకాలు, పంపిణీ చేయడం నేరంగా పరిగణించాలి.
 

  దినేష్‌ గోస్వామి     
   ఇంద్రజిత్‌ గుప్తా    
  జస్టిస్‌ జీవన్‌రెడ్డి      
   జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య 

    

   సంతానం    
   టి.ఎన్‌.శేషన్‌     
   టి.ఎస్‌.కృష్ణమూర్తి      
  వోహ్రా      

  వీరప్ప మొయిలీ 

   

 


 

రచయిత: బంగారు సత్యనారాయణ

 

 

 

 

 

 

 


 

Posted Date : 03-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

  ఎన్నికల సంస్కరణలు  

(సుప్రీంకోర్టు తీర్పులు)

పారదర్శకతకు మార్గదర్శకాలు!


స్వేచ్ఛాయుత ఎన్నికలు, పారదర్శకత ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రామాణిక కొలమానాలు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు తీర్పులు అనేక సందర్భాల్లో ధ్రువీకరించాయి. దాంతోపాటు కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల అధికారాల మధ్య సమతూకాన్ని నిర్ధారించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో కీలకపాత్ర పోషించాయి. ఓటింగ్‌ ప్రక్రియలో స్పష్టతను పెంచి, ఓటరు స్వతంత్రతకు పెద్దపీట వేసి, ప్రజాస్వామ్య విలువలకు భద్రత కల్పించిన  అలాంటి తీర్పులు, అవి తెచ్చిన సంస్కరణలను పోటీ పరీక్షార్థులు కేసుల వారీగా తెలుసుకోవాలి. ఈవీఎం, వీవీప్యాట్‌ల ఉద్దేశం తదితర మౌలిక అంశాలతో పాటు ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల వెలువడిన తీర్పులోని ముఖ్యాంశాలను సమగ్రంగా గుర్తుంచుకోవాలి.

లిల్లీ థామస్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా: రెండు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కఠిన కారాగార శిక్ష పడిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని భారత ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేసి ప్రకటించారు. అయితే ఈ సవరణ చట్టం సిటింగ్‌ చట్టసభల సభ్యులకు (అప్పటికే కొనసాగుతున్నవారు) వర్తించదని నిర్దేశించారు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు సిటింగ్‌ చట్ట సభల సభ్యులకు ఇస్తున్న మినహాయింపు చెల్లుబాటు కాదని తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోయిన మొదటి వ్యక్తి రషీద్‌ మసూద్‌. ఆ తర్వాత లాలూప్రసాద్‌ యాదవ్, జయలలిత కూడా తమ పదవులు కోల్పోయారు.


కులదీప్‌ నాయర్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా: రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులు ఏ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారో ఆ రాష్ట్రంలో స్థిర నివాసం ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదని భారత ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేశారు. ఈ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.


సుబ్రమణ్యస్వామి Vs ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా: ఓటరు తాను వేసిన ఓటు సరిగ్గా తాను అనుకున్న అభ్యర్థికి పోలైనదా ? లేదా? అనే అంశాన్ని తెలుసుకోడానికి ముద్రిత పేపర్‌స్లిప్‌ను పొందడానికి వీలుగా EVM లలో  VVPAT (Voter Verified Paper Audit Trial) ను ఏర్పాటు చేయాలని ఈ కేసు సందర్భంగా తీర్పు వెలువడింది.


* వీవీ ప్యాట్‌ల ఏర్పాటుతో ఓటు మీట నొక్కిన తర్వాత, ఆ ఓటు ఎవరికి నమోదైందనే విషయం 7 సెకన్లపాటు పారదర్శక తెరపై కనిపిస్తుంది. దీనివల్ల అక్రమ ఓటింగ్, ఈవీఎంల ట్యాంపరింగ్‌ను నివారించి ఓటర్ల ప్రయోజనాలను పరిరక్షించవచ్చు. వీవీ ప్యాట్‌లను తొలిసారిగా నాగాలాండ్‌ రాష్ట్రంలో ‘నోక్సన్‌’ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో 2013, సెప్టెంబరులో వినియోగించారు.


ఈవీఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌): ఎన్నికల ప్రక్రియలో సాంకేతికతను వినియోగించి సమర్థ ఎన్నికల నిర్వహణ, సత్వర ఫలితాల వెల్లడి కోసం ఈవీఎంలను వినియోగించాలని సంకల్పించారు. దీనికోసం 1951 నాటి భారత ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని 1989లో సవరించారు. ఇది 1989, మార్చి 15 నుంచి అమల్లోకి వచ్చింది. మనదేశంలో ఈవీఎంలకు 1980లో ఎం.బి.హనీఫ్‌ రూపకల్పన చేశారు. ఈ యంత్రాలు బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌), హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌)లలో తయారవుతున్నాయి.


* దేశంలో ఈవీఎంలను తొలిసారిగా 1981లో కేరళలోని ‘నార్త్‌పారవుర్‌’ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో 50 కేంద్రాల్లో ప్రయోగించారు 1998, నవంబరులో మధ్యప్రదేశ్‌లోని 5, రాజస్థాన్‌లోని 5, ఢిల్లీలోని 6 శాసనసభ నియోజకవర్గాల్లో జరిగిన 16 పోలింగ్‌ కేంద్రాల్లో ఉపయోగించారు. 1999లో గోవా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను పూర్తిస్థాయిలో వాడారు. 2004లో 14వ లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో అన్ని నియోజకవర్గాల్లో వినియోగించారు. ఈ యంత్రాల్లో బ్రెయిలీ సంకేతాల సదుపాయాన్ని మొదటిసారిగా 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆసిఫ్‌నగర్‌ నియోజకవర్గంలో అమలుచేశారు.


* ఈవీఎంలోని ఒక్కో బ్యాలట్‌ యూనిట్‌లో ఎన్నికల్లో పోటీ చేసే 16 మంది అభ్యర్థుల వివరాలు మాత్రమే నమోదు చేసే వీలుంది. ఒక్కో ఈవీఎంలో ఇలాంటి బ్యాలట్‌ యూనిట్లను గరిష్ఠంగా నాలుగింటిని అనుసంధానం చేయవచ్చు. ఈ లెక్కన గరిష్ఠంగా 64 మంది అభ్యర్థుల వివరాలే నమోదయ్యే అవకాశం ఉంది. 64 కంటే ఎక్కువ అభ్యర్థులు ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఈవీఎంకు బదులుగా ‘బ్యాలట్‌ పేపర్‌’ పద్ధతి ఉపయోగించాల్సి ఉంటుంది. ఈవీఎంలో గరిష్ఠంగా 3,840 ఓట్లు నమోదవుతాయి.


  పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా:  ఈ కేసులో సు ప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1) (a) ప్రకారం ప్రతి వ్యక్తికి మాట్లాడే హక్కు, విమర్శించే హక్కు, విభేదించే హక్కు ఉందని, ప్రజలు భిన్నాభిప్రాయాలు, విభిన్న సిద్ధాంతాలు కలిగి ఉండవచ్చునని, ఓటును వినియోగించుకునే సందర్భంలో ఓటర్లకు తిరస్కార హక్కును కల్పించకపోవడమంటే భావప్రకటనాస్వేచ్ఛను హరించినట్లేనని పేర్కొంది. అందుకే ఈవీఎంలో NOTA (None of the Above) (పై ఎవరూ కాదు) అనే అంశాన్ని చేర్చాలని జస్టిస్‌ పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 2013, సెప్టెంబరు 27న తీర్పు ఇచ్చింది.


* ఈవీఎంలో ‘నోటా’ దీర్ఘచతురస్రాకారంలో ‘కొట్టివేసిన బ్యాలట్‌ పత్రం’ గుర్తుతో చివరి ఐచ్ఛికంగా కనిపిస్తుంది. నోటాను మొదటిసారిగా 2013లో ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వినియోగించారు.

* 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల్లో నోటాను పూర్తిస్థాయిలో అమలుచేశారు. నోటా ప్రవేశపెట్టిన దేశాల్లో భారతదేశం 14వది.

* 2014 ఎన్నికల నుంచి నోటాను లోక్‌సభ ఎన్నికల్లో తెలుపు రంగులో, శాసనసభ ఎన్నికల్లో గులాబీ రంగులోను ఈవీఎంలపై ముద్రిస్తున్నారు.

* నోటా ఓట్లు ఎక్కువగా పోలైనప్పటికీ వాటితో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే విజేతలుగా ప్రకటిస్తారు.

* రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో నోటా నిబంధన చెల్లదని, నోటాను ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే ఉపయోగించాలని 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.


  ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం  


రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలకు సంబంధించి కేంద్రం 2018లో ఎన్నికల బాండ్ల (ఎలక్టోరల్‌ బాండ్స్‌) పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని ‘ఆర్థిక చట్టం 2017’కి సవరణ చేశారు. దీంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందంటూ సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది.

* ఎన్నికల బాండ్ల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ఉందంటూ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా- మార్క్సిస్ట్‌ (సీపీఎం) సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌  జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం 2024, ఫిబ్రవరి 15న ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది.


తీర్పులోని ముఖ్యాంశాలు: ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగవిరుద్ధం. ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 19 (1) (a) ప్రకారం విరాళం ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచడమనేది ప్రాథమిక హక్కు, సమాచార హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది.

* ఎన్నికల బాండ్ల జారీని ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ వెంటనే నిలిపివేయాలి.

* రాజకీయ పార్టీలకు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయో తెలియజేయాలి. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎన్నికల బాండ్ల పథకం ఒక్కటే మార్గం కాదు. బాండ్లను కొనుగోలు చేసి విరాళంగా ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లఘించడమే అవుతుంది.

* ఎన్నికల బాండ్ల జారీ విధానంలో పారదర్శకత లోపించింది. వివిధ కంపెనీలు రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు ‘క్విడ్‌ ప్రోకో’కు దారితీసే ప్రమాదం ఉంది. సంస్థల నుంచి అపరిమిత విరాళాలను అనుమతించే విధంగా కంపెనీల చట్టంలో సవరణలు చేయడం ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది.

* 2019, ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను (కొనుగోలుచేసినవారు, కొనుగోలు తేదీ, ఎంత మొత్తం కొనుగోలు చేశారు) మార్చి 6 లోగా స్టేట్‌బ్యాంకు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలి. మార్చి 13లోగా సంబంధిత వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.

* ఇప్పటికే స్వీకరించి, ఇంకా ఎన్‌క్యాష్‌ చేసుకోని బాండ్లను రాజకీయ పార్టీలు ఆయా దాతలకు వెంటనే వెనక్కి ఇవ్వాలి.

 


రచయిత: బంగారు సత్యనారాయణ


 

Posted Date : 10-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజకీయ పార్టీలు

ప్రజా ప్రయోజన సంరక్షణ సమూహాలు!


భారత ప్రజాస్వామ్య వ్యవస్థను తీర్చిదిద్దడంలో రాజకీయ పార్టీలదే కీలకపాత్ర. విభిన్న భావజాలాలు, ఆసక్తులు, ప్రాంతీయ ఆకాంక్షలకు అవి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఓటర్లను సమీకరించడం, విధానాలను రూపొందించడం, ప్రభుత్వాలను జవాబుదారీతనంతో పని చేసే విధంగా చూడటంలో ప్రధానంగా వ్యవహరిస్తాయి. భారత జాతీయ కాంగ్రెస్‌ చారిత్రక రాజకీయ వారసత్వం, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక పటుత్వం, స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రాంతీయ పార్టీల చొరవ శక్తిమంతమైన దేశ ప్రజాస్యామ్యంలోని వైవిధ్యాన్ని, బహుముఖత్వాన్ని చాటుతున్నాయి. ప్రజలను సంఘటిత పరిచి, ఎన్నికల ప్రక్రియను సులభతరం చేసే రాజకీయ పార్టీ అర్థం, రకాలు, లక్షణాలను, ప్రభావాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. జాతి ప్రయోజనాల సంరక్షణలో పార్టీల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాలి.


ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజకీయ పార్టీలు అత్యంత కీలకమైనవి. ఇవి ప్రజలను ప్రజాస్వామ్యంలో భాగస్వాములను చేస్తాయి. రాజకీయ చైతన్యాన్ని కలిగించి ఎన్నికల ప్రక్రియను సులభతరం చేస్తాయి. ప్రజాస్వామ్యం విజయవంతం కావడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తాయి.


రాజకీయ పార్టీ - అర్థ వివరణ: జాతి ప్రయోజనాలను పెంపొందించే లక్ష్యంతో ఒకే రకమైన రాజకీయ దృక్పథాలను కలిగి ఉండి, రాజ్యాంగబద్ధంగా రాజకీయ అధికారాన్ని సాధించడానికి కృషిచేసే కొంతమంది వ్యక్తుల సముదాయాన్ని ‘రాజకీయ పార్టీ’గా పేర్కొనవచ్చు. ప్రపంచంలో 3 రకాల పార్టీ వ్యవస్థలు ఉన్నాయి.


ఏక పార్టీ వ్యవస్థ: ఒకే రాజకీయ పార్టీ అధికారాన్ని చేపట్టడానికి అవకాశం కల్పిస్తూ ఇతర రాజకీయ పార్టీలను నియంత్రించడమో లేదా పరిమితులు విధించడమో చేసే విధానాన్ని ఏకపార్టీ వ్యవస్థగా పేర్కొంటారు. ఈ విధానంలో ప్రతిపక్ష పార్టీలకు, ప్రత్యామ్నాయ పార్టీలకు అవకాశం ఉండదు. రాజకీయ స్వేచ్ఛ కొరవడుతుంది.

* ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైంది. ఇందులో ప్రత్యామ్నాయ ప్రభుత్వ విధానాలకు  అవకాశం ఉండదు.

* ప్రస్తుతం ఏక పార్టీ విధానాన్ని అనుసరిస్తున్న దేశాల్లో చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియా, ఎరిత్రియా, లావోస్‌ ఉన్నాయి.


ద్విపార్టీ వ్యవస్థ: ద్విపార్టీ వ్యవస్థలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలన నిర్వహిస్తుంది. మిగిలిన రాజకీయ పార్టీ ప్రతిపక్షంగా వ్యవహరించి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన విధానాలకు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తూ ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది.

* ద్విపార్టీ వ్యవస్థలో ప్రభుత్వ విధానాలకు సుస్థిరత ఉంటుంది. ప్రజలకు కచ్చితమైన ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ వైఫల్యాలకు ఒక రాజకీయ పార్టీ బాధ్యత వహిస్తుంది.

* ద్విపార్టీ విధానం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో అమలులో ఉంది.


బహుళ పార్టీ వ్యవస్థ: ప్రభుత్వాల ఏర్పాటు, పరిపాలనలో పోటీపడేందుకు రెండు కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తలపడే వ్యవస్థను బహుళపార్టీ వ్యవస్థగా పేర్కొంటారు. ఈ విధానంలో అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి. విభిన్న సిద్ధాంతాలు, రాజకీయ దృక్కోణాలను కలిగి ఉంటాయి.

* ఇక్కడ ప్రత్యామ్నాయాల ఎంపికలో ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది. పరిపాలనలో నియంతృత్వానికి అవకాశం ఉండదు. భిన్నమైన ప్రజాభిప్రాయం వ్యక్తీకరణకు వీలు కలుగుతుంది.

* దేశంలోని అన్ని వర్గాలు, ప్రాంతాలవారికి రాజకీయ ప్రక్రియలో పాల్గొనే స్వేచ్ఛ ఉంటుంది.

* ఈ వ్యవస్థలో రాజకీయ పార్టీల్లో నిరంతర చీలికలు, కలయికలు; సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు సర్వసాధారణం.

* ఈ విధానం భారత్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాల్లో అమలులో ఉంది.


రాజకీయ పార్టీల లక్షణాలు: రాజకీయ పార్టీలు వివిధ అంశాలపై తమ విధానాలను స్పష్టంగా రూపొందించుకుంటాయి. విదేశాంగ, సంక్షేమ, ఆంతరంగిక, ఆర్థిక, పారిశ్రామిక తదితర విధానాలను ప్రతి రాజకీయ పార్టీ ప్రత్యేకంగా తమ ప్రాధాన్య క్రమంలో ప్రజలకు వివరిస్తాయి.

* ప్రభుత్వ పరిపాలనా విధానాలపై అవగాహన కల్పించేందుకు రాజకీయ పార్టీలు కృషిచేస్తాయి. అధికారంలో ఉన్న పార్టీ తమ పరిపాలనా విధానాల ఫలితంగా ప్రజలు ఎంత మేరకు లబ్ధిపొందారు, సంక్షేమ ఫథకాల అమలు వల్ల కలిగిన ప్రయోజనాలను వివరిస్తుంది. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ప్రభుత్వ విధానాల్లోని లోపాలను, తద్వారా సంభవించే అనర్థాలను వివరిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తాయి.

* జాతి ప్రయోజనాలను పరిరక్షించడం రాజకీయపార్టీల లక్ష్యంగా ఉంటుంది. వాటిని విస్మరించిన రాజకీయ పార్టీలను ప్రజలు తిరస్కరిస్తారు.

* రాజ్యాధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు కృషి చేస్తాయి. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తమ అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అధికారంలో లేని ప్రతిపక్ష పార్టీ అధికారాన్ని   చేపట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తుంది.


సాధారణ ఎన్నికలు - రాజకీయ పార్టీల ప్రభావం


స్వాతంత్య్రానంతరం లోక్‌సభకు తొలి సాధారణ ఎన్నికలు 1951-52లో జరిగాయి. ఈ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) ఘన విజయం సాధించి కేంద్రంలో తిరుగులేని శక్తిగా అవతరించడంతో పాటు, అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేసింది. జవహర్‌లాల్‌ నెహ్రూ లోక్‌సభ పక్ష నాయకుడిగా, ప్రధాన మంత్రిగా దేశ రాజకీయాలను శాసించారు. బలమైన ప్రతిపక్ష పార్టీలు లేకపోవడంతో 1957లో జరిగిన రెండో సాధారణ ఎన్నికలు, 1962లో జరిగిన మూడో సాధారణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగింది. 1967లో జరిగిన నాలుగో సాధారణ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్యానికి గండిపడింది. కాంగ్రెస్‌ పార్టీ స్వల్ప మెజారిటీతో కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ 8 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు/ కాంగ్రెసేతర పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.

*  1971లో ‘గరీబీ హఠావో నినాదం’తో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభకు జరిగిన తొలి మధ్యంతర ఎన్నికల బరిలో నిలిచింది. 351 స్థానాలు గెలుపొంది కేంద్రంలో తిరుగులేని శక్తిగా అవతరించింది. 1971 నుంచి 1977 వరకు ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ కొనసాగింది.

* 1977లో లోక్‌సభకు జరిగిన ఆరో సాధారణ ఎన్నికల అనంతరం దేశ రాజకీయల్లో గణనీయమైన మార్పులు సంభవించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తొలిసారిగా కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. జనతాపార్టీ 298 స్థానాలను గెలుపొంది మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

* 1979లో జనతాపార్టీలో సంభవించిన అంతర్గత విభేదాల కారణంగా మొరార్జీ దేశాయ్‌ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం చరణ్‌ సింగ్‌ ప్రధానమంత్రి పదివిని చేపట్టి లోక్‌సభలో మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలమై 23 రోజులకే పదవిని కోల్పోయారు.

* 1980లో లోక్‌సభకు జరిగిన ఏడో సాధారణ ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ 352 స్థానాలను గెలుపొంది కేంద్రంలో తిరుగులేని శక్తిగా నిలిచింది. 1984, అక్టోబరు 31న ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు.

ఇందిరాగాంధీ హత్యానంతరం లోక్‌సభకు జరిగిన ఎనిమిదో సాధారణ ఎన్నికల్లో రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ 414 స్థానాలు గెలుపొంది దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. బీజేపీ 2 స్థానాలను గెలుపొందింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రాంతీయ పార్టీ ‘తెలుగుదేశం’ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆవతరించింది.

*  1989లో లోక్‌సభకు జరిగిన తొమ్మిదో సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంపూర్ణ మెజారిటీ పొందలేకపోయింది. దీంతో ‘హంగ్‌ పార్లమెంటు’ ఏర్పడింది. జనతాదళ్‌ పార్టీ నేషనల్‌ ఫ్రంట్‌ కూటమి ద్వారా వి.పి.సింగ్‌ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయోధ్య వివాదం వ్యవహారంలో వి.పి.సింగ్‌ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును బీజేపీ ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పతనమైంది. 1989 నుంచి దేశంలో సంకీర్ణ శకాల యుగం ప్రారంభమైంది.

*  1991లో లోక్‌సభకు జరిగిన పదో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించనప్పటికీ పి.వి.నరసింహారావు నేతృత్వంలో కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ మైనారిటీ ప్రభుత్వాన్ని పీవీ తన రాజకీయ చాతుర్యంతో అయిదేళ్లు పూర్తిగా నిర్వహించారు.

* 1996లో లోక్‌సభకు జరిగిన పదకొండో సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంపూర్ణ మెజార్టీ రాలేదు. ఈ సభా కాలంలో బీజేపీ తొలిసారిగా అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ 13 రోజులకే ప్రభుత్వం పతనమైంది. తర్వాత హెచ్‌.డి. దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్‌ ప్రధాని పదవులు చేపట్టినప్పటికీ పూర్తికాలం కొనసాగలేకపోయారు.

* 1998లో బీజేపీకి చెందిన అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పన్నెండో లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఏఐఏడీఎంకే తన మద్దతును ఉపసంహరించడంతో ప్రభుత్వం పతనమైంది.

*  1999లో పదమూడో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ‘నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌’ (ఎన్డీయే) పేరుతో కూటమిని ఏర్పాటు చేసి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

* 2004లో జరిగిన పద్నాలుగో సాధారణ ఎన్నికలు, 2009లో జరిగిన పదిహేనో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ (యూపీఏ)గా ఏర్పడి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని నడిపింది.

*  2014లో లోక్‌సభకు జరిగిన పదహారో సాధారణ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 282 స్థానాలు గెలుపొందింది. అయినప్పటికీ ఎన్డీయే కూటమిగా ఏర్పడి నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

*  2019లో లోక్‌సభకు జరిగిన పదిహేడో సాధారణ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 స్థానాలు గెలుపొందినప్పటికీ ఎన్డీయే కూటమిని ఏర్పాటుచేసి నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 52 స్థానాలు మాత్రమే సాధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను కూడా పొందలేకపోయింది. 


రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 19-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో రాజకీయ పార్టీలు  

ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలు!

దేశ పౌరుల ఆకాంక్షలకు, ఆశయాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభుత్వాలను బాధ్యతాయుతంగా సాగనిచ్చే ప్రజాస్వామ్య సాధనాలు రాజకీయ పార్టీలు. అవి భిన్న   సిద్ధాంతాలను, ఆసక్తులను ప్రతిబింబిస్తాయి. వివిధ సామాజిక సమూహాలను రాజకీయ ప్రక్రియలో భాగస్వాములను చేస్తాయి. విధానాలను రూపొందించి, ఎన్నికల్లో పోటీ చేసి పాలనను ప్రభావితం చేస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూలస్తంభాలుగా వ్యవహరించే ఆ  పార్టీల గుర్తింపు, వర్గీకరణ, జాతీయహోదా తదితర అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దాంతోపాటు దేశంలోని జాతీయ పార్టీలు, వాటి విభాగాలు  మొదలైన వివరాలపైనా అవగాహన పెంచుకోవాలి. 


అలలు లేని సముద్రాన్ని, రాజకీయ పార్టీలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించడం కష్టం.. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడంలో అవి కీలకంగా వ్యవహరిస్తాయి. 


రాజకీయ పార్టీలకు గుర్తింపు: భారత ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 29(1) ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు గుర్తింపునిస్తుంది. ఎన్నికల గుర్తులను కేటాయిస్తుంది. రాజకీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం 100 మంది ఓటర్ల సంతకాల మద్దతు ఉండాలి. దాంతో పాటు రూ.10,000 డిపాజిట్‌గా చెల్లించి కేంద్ర  ఎన్నికల సంఘం వద్ద ‘రాజకీయ పార్టీ’గా నమోదు చేసుకోవాలి.

* మనదేశంలో రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధమైనవి కావు. రాజ్యాంగంలోని 3వ భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 19(1)(C) ప్రకారం ‘సంఘాలు లేదా అసోసియేషన్లు’ అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని పౌరులు ‘రాజకీయ పార్టీలను’ స్థాపించుకోవచ్చు.

* రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985 ద్వారా రాజ్యాంగానికి 10వ షెడ్యూల్‌ను చేర్చి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించారు. ఆ చట్టంలో ‘రాజకీయ పార్టీలు’ అనే అంశాన్ని పేర్కొన్నారు.

వర్గీకరణ:  భారతదేశంలో రాజకీయ పార్టీలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:    

1) జాతీయ పార్టీ

2) రాష్ట్ర-ప్రాంతీయ పార్టీ


జాతీయ పార్టీ - గుర్తింపునకు షరతులు:  ఒక రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలంటే కింద పేర్కొన్న షరతుల్లో ఏదైనా ఒకదాన్ని నెరవేర్చాలి.

ఎ) గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభ స్థానాలకుగాని, రాష్ట్ర శాసనసభ  స్థానాలకుగాని 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో  జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ చేసి ఉండాలి. పోలై చెల్లుబాటు అయిన ఓట్లలో 6% కంటే తక్కువ కాకుండా ఓట్లను సాధించాలి. దీంతోపాటు ఏ రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి అయినా కనీసం నలుగురు అభ్యర్థులు లోక్‌సభకు ఎన్నిక కావాలి. లేదా

బి) గత సాధారణ ఎన్నికల్లో  లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం (11) సీట్లు గెలుచుకోవాలి. ఈ అభ్యర్థులు కనీసం 3 వేర్వేరు రాష్ట్రాల నుంచి ఎన్నిక కావాలి. లేదా

సి) కనీసం 4 రాష్ట్రాల్లో రాష్ట్రపార్టీగా గుర్తింపు పొందాలి.


జాతీయ పార్టీ హోదా - కొత్త నియమాలు: 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (సీపీఐ), బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)ల జాతీయ పార్టీ హోదా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త నియమాలను రూపొందించింది. దీని ప్రకారం వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో నిర్దేశించిన ఓట్లు, సీట్లు సాధించకపోతే ‘జాతీయ పార్టీ హోదా’ రద్దవుతుంది.


జాతీయ రాజకీయ పార్టీ హోదా వల్ల కలిగే ప్రయోజనాలు:

* నామినేషన్ల సమయంలో అభ్యర్థికి ప్రతిపాదకులు ఒక్కరు ఉంటే సరిపోతుంది.

* జాతీయ పార్టీ ఎన్నికల గుర్తును ఇతర పార్టీలకు కేటాయించరు.

* దూరదర్శన్, ఆలిండియా రేడియోలో ఉచితంగా ప్రసార సమయం కేటాయిస్తారు. 

* రెండుసెట్ల ఓటర్ల జాబితా కాపీలను అభ్యర్థులకు ఉచితంగా అందిస్తారు.

* 40 మంది ప్రధాన ప్రచారకర్తల ప్రచార ఖర్చును అభ్యర్థి ప్రచార ఖర్చులో కలపరు.

* అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కొత్తగా జాతీయ పార్టీ హోదాను పొందింది.


జాతీయ పార్టీ హోదా పొందిన రాజకీయ పార్టీలు: ప్రస్తుతం జాతీయ పార్టీ హోదా పొందిన పార్టీలు ఆరు. అవి

1) భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ)  

2) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)

3) బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)

4) నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీసీ)  

5) కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) (సీపీఐ-ఎం)

6) ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)


ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ): ఐఎన్‌సీని 1885, డిసెంబరు 28న ఎ.ఒ.హ్యూమ్‌ స్థాపించారు. ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం దేశంలో సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించే ఉద్దేశంతో రాజకీయ సంస్థగా ‘భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ)’ అవతరించింది. 1955లో మద్రాస్‌ సమీపంలోని ఆవడి వద్ద జరిగిన ఐఎన్‌సీ  సమావేశంలో సామ్యవాద తరహా ప్రజాస్వామ్యమే తమ ప్రభుత్వ లక్ష్యమని జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొన్నారు.

* అధికార పత్రిక - కాంగ్రెస్‌ అన్వేష్‌

* శ్రామిక విభాగం - ఆలిండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ 

* యూత్‌ విభాగం - ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ 

* ఎన్నికల గుర్తు - హస్తం (మువ్వన్నెల జెండా మధ్యలో హస్తం)

* కూటమి - యూపీఏ


భారతీయ జనతా పార్టీ (బీజేపీ):  1980, ఏప్రిల్‌ 6న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, ఎల్‌కే అడ్వాణీ స్థాపించారు. సామాజిక సంప్రదాయవాదం, హిందూత్వం, జాతీయవాదం, గాంధేయవాద సామ్యవాదం మొదలైనవి ఈ పార్టీ సిద్ధాంతాలు.

* అధికార పత్రిక - కమల్‌ సందేశ్‌

* యూత్‌ విభాగం - భారతీయ జనతా యువ మోర్చా

* రైతు విభాగం - బీజేపీ కిసాన్‌ మోర్చా

* మహిళా విభాగం - బీజేపీ మహిళా మోర్చా

* ఎన్నికల గుర్తు - కమలం (ఆకుపచ్చ, కాషాయ రంగులతో కూడిన జెండా మధ్యలో కమలం పువ్వు) 

* కూటమి - ఎన్‌డీఏ. 


బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ):  1984, ఏప్రిల్‌ 14న కాన్షీరాం స్థాపించారు. సామాజిక న్యాయం, స్వగౌరవం, సామ్యవాద సమానత్వం, లౌకికవాదం, మానవ హక్కులు మొదలైనవి ఈ పార్టీ సిద్ధాంతాలు. బహుజనులు అంటే అధిక సంఖ్యాకులు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) అని అర్థం. వీరు దేశంలోని మొత్తం జనాభాలో 85% ఉన్నారు.

* ఎన్నికల గుర్తు - ఏనుగు

* ప్రస్తుతం ఈ పార్టీ మాయావతి ఆధ్వర్యంలో నడుస్తోంది.


నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ):  2012, జులైలో పి.ఎ.సంగ్మా స్థాపించారు. 2019, జూన్‌ 7న జాతీయ పార్టీ హోదా పొందింది. ఈశాన్య భారతదేశం నుంచి జాతీయ పార్టీ హోదాను పొందిన తొలి రాజకీయ పార్టీ.  

* ఎన్నికల గుర్తు - పుస్తకం. 

కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) (సీపీఐ-ఎం):  1964, నవంబరు 7న జ్యోతిబసు, ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ స్థాపించారు. కమ్యూనిజం, మార్క్సిజం, లెనినిజం మొదలైన సిద్ధాంతాల ఆధారంగా ఈ పార్టీ ఏర్పడింది.

* అధికార పత్రిక - పీపుల్స్‌ డెమొక్రసీ

* యూత్‌ విభాగం - డెమొక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా

* శ్రామిక విభాగం - సెంటర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్‌ 

* విద్యార్థి విభాగం - స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా

* రైతు విభాగం - ఆలిండియా కిసాన్‌ సభ 

* మహిళా విభాగం - ఆలిండియా డెమొక్రటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ నీ ఎన్నికల గుర్తు - సుత్తి, కొడవలి, నక్షత్రం.


ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌):  2012, నవంబరు 26న అరవింద్‌ కేజ్రీవాల్‌ స్థాపించారు. ఈ పార్టీ ఎన్నికల గుర్తు చీపురు. 2023, ఏప్రిల్‌ 10న కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పించింది. ప్రస్తుతం ఈ పార్టీ దిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో కొనసాగుతోంది. గోవా, గుజరాత్‌ రాష్ట్రాల శాసనసభల్లోనూ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది.


జాతీయ పార్టీ హోదా రద్దు అయిన పార్టీలు:  2023, ఏప్రిల్‌ 10న కేంద్ర ఎన్నికల సంఘం మూడు రాజకీయ పార్టీల జాతీయ పార్టీ హోదా రద్దు చేసింది. అవి 

1)  ఏఐటీసీ

2) ఎన్‌సీపీ

3) సీపీఐ


ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ (ఏఐటీసీ): 1998, జనవరి 1న మమతా బెనర్జీ స్థాపించారు. ఈమె ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రి. 

* రాజకీయ నినాదం - మా, మాటి, మనుష్‌ (Mother, Land, People)

* పత్రిక - జాగోబంగ్లా

* విద్యార్థి విభాగం - తృణమూల్‌ ఛాత్ర పరిషత్‌

* రైతు విభాగం - ఆలిండియా తృణమూల్‌ కిసాన్‌ కాంగ్రెస్‌ 

* శ్రామిక విభాగం - ఇండియన్‌ నేషనల్‌ తృణమూల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ 

* ఈ పార్టీ 2016, సెప్టెంబరు 2న జాతీయ పార్టీ హోదా పొందింది. 2023లో కోల్పోయింది.

* ఎన్నికల గుర్తు - గడ్డిపూలు


నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ): 1999, మే 25న శరద్‌ పవార్‌ ఈ పార్టీని స్థాపించారు.

* విద్యార్థి విభాగం - నేషనలిస్ట్‌ స్టూడెంట్‌ కాంగ్రెస్‌

* యూత్‌ విభాగం - నేషనలిస్ట్‌ యూత్‌ కాంగ్రెస్‌

* మహిళా విభాగం  - నేషనలిస్ట్‌ మహిళా కాంగ్రెస్‌

* ఎన్నికల గుర్తు - గోడ గడియారం


కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ):  1925, డిసెంబరు 25న ఎస్‌.ఎ.డాంగే, ఎం.ఎన్‌. రాయ్‌ కమ్యూనిజం, మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాల ఆధారంగా పార్టీని స్థాపించారు.

* అధికార పత్రికలు - న్యూ ఏజ్‌ (ఆంగ్లం), ముల్కీ సంఘర్ష్‌ (హిందీ)

* విద్యార్థి విభాగం - ఆలిండియా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్‌ఎఫ్‌) 

* శ్రామిక విభాగం - ఆలిండియా ట్రేడ్‌ యూనియన్‌ కాన్ఫరెన్స్‌ (ఏఐటీయూసీ)

* మహిళా విభాగం - నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఉమెన్‌

* యూత్‌ విభాగం - ఆలిండియా యూత్‌ ఫెడరేషన్‌

* ఎన్నికల గుర్తు - వరి కంకి, కొడవలి.


రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 26-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌