• facebook
  • whatsapp
  • telegram

ఒకే పదవీ కాలంలో ఏకంగా ఎనిమిది అవిశ్వాసాలు!

ప్రధానులు - విశేషాలు

 

 

 

 

 

మన దేశంలో ప్రభుత్వాధినేతగా విస్తృత అధికారాలను చెలాయించే ప్రధానమంత్రి పదవి అత్యంత కీలకమైనది. అందుకే భారత ప్రధానిని మకుటం లేని మహారాజుగా పేర్కొంటారు. దేశ పాలన, ప్రగతి ప్రధాని పనితీరుపైనే ఆధారపడి ఉంటాయి. స్వాతంత్య్రానంతరం ఎనభయ్యో దశకం నుంచి దేశ రాజకీయాల్లో అస్థిరత చోటు చేసుకుంది. కేంద్రంలో ప్రభుత్వాల  మనుగడ కష్టంగా మారింది. ఆ దశలో రాజీవ్‌గాంధీ నుంచి వాజ్‌పేయీ పాలనా కాలం వరకు చోటుచేసుకున్న వివిధ రాజకీయ పరిణామాలు, ముఖ్యమైన సంఘటనలు, విధాన మార్పుల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


1. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో వెలుగుచూసిన కుంభకోణాలు గుర్తించండి.

1) ముంద్రా కుంభకోణం, రఫేల్‌ కుంభకోణం    

2) బోఫోర్స్‌ కుంభకోణం, ఫెయిర్‌పాక్స్‌ కుంభకోణం

3) బోఫోర్స్‌ కుంభకోణం, ముంద్రా కుంభకోణం  

4) బోఫోర్స్‌ కుంభకోణం, సెయింట్‌కిట్స్‌ ఫోర్జరీ కుంభకోణం


2. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో జరిగిన సంఘటనలకు సంబంధించి కిందివాటిలో సరైనవి-

ఎ) ఆఫ్రికా ఫండ్‌ను ఏర్పాటు చేశారు.

బి) శ్రీలంకకు భారత శాంతి సైనిక దళాలను పంపారు.

సి) అయిదేళ్ల పదవీ కాలలో 13 సార్లు కేంద్ర కేబినెట్‌ను పునర్‌ వ్యవస్థీకరించారు.

డి) పాకిస్థాన్‌తో ‘కరాచీ ఒప్పందం’ కుదుర్చుకున్నారు.

1) ఎ, బి, డి       2) ఎ, బి, సి 

3) ఎ, సి, డి       4) బి, సి, డి 


3. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో జరిగిన సంఘటనలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) 63వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

బి) 64వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

సి) 65వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

డి) 1991లో భారతరత్న పురస్కారాన్ని పొందారు.

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి 

3) ఎ, బి, సి, డి     4) బి, సి, డి 


4. రాజీవ్‌ గాంధీ ఎల్‌టీటీఈ ఉగ్రవాదుల చేతిలో ఎప్పుడు హత్యకు గురయ్యారు?

1) 1991, మే 21      2) 1991, జులై 18

3) 1991, అక్టోబరు 3   4) 1991, డిసెంబరు 21


5. విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్న కాలం?

1) 1989, ఆగస్టు 18 నుంచి 1990, జులై 26

2) 1989, నవంబరు 12 నుంచి 1990, డిసెంబరు 2

3) 1989, డిసెంబరు 2 నుంచి 1990, నవంబరు 12

4) 1989, జనవరి 19 నుంచి 1990, డిసెంబరు 6


6. విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) ఉత్తర్‌ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

బి) నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.

సి) ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం కోసం దినేష్‌ గోస్వామి కమిటీని ఏర్పాటు చేశారు.

డి) బాబ్రీ మసీదు దుర్ఘటన ఇతడి పాలనా కాలంలోనే జరిగింది.

1) ఎ, బి, సి          2) ఎ, సి, డి

3) ఎ, బి, డి          4) ఎ, బి, సి, డి


7. విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌కు రాజ్యాంగ భద్రతను కల్పించింది?

1) 69వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990     

2) 67వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990 

3) 66వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990     

4) 65వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990


8. వి.పి.సింగ్‌ ప్రభుత్వం ఏ కమిషన్‌ చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ వర్గాల వారికి 27% రిజర్వేషన్లు కల్పించింది?    

1) రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌      2) సి.కె.చటర్జీ కమిషన్‌

3) బి.పి.మండల్‌ కమిషన్‌    4) సూర్జిత్‌ బర్నాలా కమిషన్‌


9. వి.పి.సింగ్‌ ప్రభుత్వ కాలంలో జరిగిన సంఘటనలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) విశ్వాస తీర్మానంలో ఓడి అధికారం కోల్పోయిన తొలి ప్రధాని.

బి) అవిశ్వాస తీర్మానంలో ఓడి అధికారాన్ని కోల్పోయిన తొలి ప్రధాని.

సి) అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ‘జనమోర్చా’ అనే సంస్థను స్థాపించారు.

డి) పదవిలో ఉండగా మరణించిన మూడో ప్రధాని.

1) ఎ, బి, సి            2) ఎ, సి, డి 

3) బి, సి, డి            4) ఎ, బి, సి, డి


10. వి.పి.సింగ్‌ ప్రభుత్వ కాలానికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబు ఏది?

ఎ) 1990లో ‘అంతర్‌ రాష్ట్రమండలి’ని ఏర్పాటు చేశారు.

బి) పరిపాలనా ట్రైబ్యునల్స్‌ను ఏర్పాటు చేశారు.

సి) అయోధ్య వివాదంలో భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో అధికారాన్ని కోల్పోయారు.

డి) రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో వెలుగుచూసిన బోఫోర్స్‌ కుంభకోణానికి నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేశారు.

1) ఎ, బి, డి     2) ఎ, బి, సి 

3) ఎ, బి, సి, డి     4) ఎ, సి, డి 


11. ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేయకుండానే పదవి కోల్పోయిన ఏకైక ప్రధాని?

1) విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌  2) చంద్రశేఖర్‌

3) హెచ్‌.డి.దేవేగౌడ      4) ఇంద్రకుమార్‌ గుజ్రాల్‌


12. ప్రధానిగా చంద్రశేఖర్‌ పదవీ కాలాన్ని గుర్తించండి.

1) 1990, నవంబరు 10 నుంచి 1991, జూన్‌ 21

2) 1990, ఆగస్టు 21 నుంచి 1991, మే 26

3) 1990, డిసెంబరు 9 నుంచి 1991, నవంబరు 18

4) 1990, అక్టోబరు 3 నుంచి 1991, జులై 20


13. ప్రధానిగా చంద్రశేఖర్‌కు సంబంధించి కిందివాటిలో సరైంది-

ఎ) ‘భోండ్సీ’ బాబాగా పేరొందారు.

బి) భారత రాజకీయాల్లో ‘యంగ్‌టర్క్‌’గా పేరొందారు.

సి) భారత్‌లో తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి.

డి) దేశంలో రాజకీయ పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు.

1) ఎ, సి, డి          2) ఎ, బి, సి 

3) ఎ, బి, డి          4) ఎ, బి, సి, డి 


14. ప్రధాని చంద్రశేఖర్‌కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.    

ఎ) బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో మన దేశ బంగారాన్ని తాకట్టు పెట్టారు.

బి) 1991లో గల్ఫ్‌ యుద్ధకాలంలో అమెరికా యుద్ధ విమానాలకు చమురు సరఫరా చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.

సి) ఇతడి పాలనా కాలంలోనే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు.

డి) అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నారు.

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి 

3) ఎ, బి, సి, డి       4) ఎ, బి, డి


15. పి.వి.నరసింహారావు భారతదేశ ప్రధానిగా వ్యవహరించిన కాలం?

1) 1991, జులై 1 నుంచి 1996, మే 16     

2) 1991, ఆగస్టు 13 నుంచి 1995, ఫిబ్రవరి 26

3) 1991, జూన్‌ 21 నుంచి 1996, మే 16    

4) 1991, జూన్‌ 21 నుంచి 1996, జులై 1


16. పి.వి.నరసింహారావుకి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని పదవి చేపట్టిన తొలి వ్యక్తి.

బి) ఇతడి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు.

సి) ఒకే పదవీ కాలంలో అత్యధికంగా 8 సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు.

డి) ‘ద ఇన్‌సైడర్‌’ పేరిట ఆత్మకథ రాశారు.

1) ఎ, సి, డి         2) ఎ, బి, సి

3) ఎ, బి, డి        4) ఎ, బి, సి, డి 


17. పి.వి.నరసింహారావుకి సంబంధించి కిందివాటిలో సరైన జవాబు ఏది?

ఎ) మైనార్టీ ప్రభుత్వాన్ని అయిదేళ్ల పాటు పూర్తిగా నిర్వహించారు.

బి) మన దేశంలో 1991లో నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

సి) ‘యునైటెడ్‌ ఫ్రంట్‌’ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. 

డి) 14 భాషల్లో ప్రావీణ్యులు.

1) ఎ, బి, సి       2) ఎ, బి, డి

3) ఎ, సి, డి        4) ఎ, బి, సి, డి 


18. పి.వి.నరసింహారావుకి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) భారత విదేశాంగ విధానంలో ‘లుక్‌ ఈస్ట్‌’ పాలసీని ప్రవేశపెట్టారు.

బి) ‘దేశ్‌ బచావో, దేశ్‌ బనావో’ అనే నినాదం ఇచ్చారు.

సి) ‘సెయింట్‌ కిట్స్‌ ఫోర్జరీ’ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు.

డి) ముఖ్యమంత్రి పదవి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) నిర్వహించారు.

1) ఎ, బి, డి    2) ఎ, సి, డి   

3) ఎ, బి, సి, డి     4) ఎ, బి, సి


19. పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనూ సభ్యత్వం లేకుండానే ప్రధాని పదవి నిర్వహించిన తొలి వ్యక్తి ఎవరు?

1) చంద్రశేఖర్‌       2) పి.వి.నరసింహారావు 

3) అటల్‌ బిహారి వాజ్‌పేయీ 4) హెచ్‌.డి.దేవేగౌడ


20. వాజ్‌పేయీ ప్రధానిగా వ్యవహరించిన కాలానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) 1996, మే 16 నుంచి 1996, జూన్‌ 1

బి) 1998, మార్చి 19 నుంచి 1999, అక్టోబరు 13

సి) 1999, అక్టోబరు 13 నుంచి 2004, మే 22

డి) 1999, డిసెంబరు 6 నుంచి 2003, నవంబరు 21

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి

3) ఎ, బి, డి       4) ఎ, బి, సి, డి


21. వాజ్‌పేయీ పాలనా కాలానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) 11వ లోక్‌సభ కాలంలో 13 రోజులు ప్రధానిగా వ్యవహరించారు.

బి) పాకిస్థాన్‌తో కార్గిల్‌ యుద్ధాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారు.

సి) యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.

డి) ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్‌’ అనే నినాదం ఇచ్చారు.

1) ఎ, బి, డి     2) ఎ, బి, సి

3) ఎ, సి, డి       4) ఎ, బి, సి, డి


22. వాజ్‌పేయీ ఏ లోక్‌సభకాలంలో 13 నెలలు ప్రధానిగా పనిచేసి తదుపరి అధికారాన్ని కోల్పోయారు?

1) 12వ   2) 13వ   3) 11వ  4) 10వ 


23. వాజ్‌పేయీ పాలనా కాలానికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) 1998లో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించారు.

బి) 1999లో పాకిస్థాన్‌తో స్నేహం కోసం ‘లాహోర్‌ బస్సు యాత్ర’ నిర్వహించారు.

సి) 2001లో దిల్లీలో జరిగిన 9వ అలీన దేశాల శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించారు.

డి) ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించారు.

1) ఎ, సి, డి     2) ఎ, బి, సి

3) ఎ, బి, సి, డి       4) ఎ, బి, డి


24. వాజ్‌పేయీ ప్రభుత్వ కాలంలో పాకిస్థాన్‌ ఉగ్రవాదులు భారత పార్లమెంట్‌పై ఎప్పుడు దాడి చేశారు?

1) 2001, అక్టోబరు 19  2) 2001, డిసెంబరు 13

3) 2002, మే 16     4) 2003, జనవరి 24

 


సమాధానాలు

1-2; 2-2; 3-4; 4-1; 5-3; 6-1; 7-4; 8-3; 9-1; 10-4; 11-2; 12-1; 13-3; 14-1; 15-3; 16-4; 17-2; 18-3; 19-2; 20-1; 21-1; 22-1; 23-4; 24-2. 
 

ర‌చ‌యిత‌: బంగారు స‌త్య‌నారాయ‌ణ‌


 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

Posted Date : 24-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌