1. ‘ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1861’కి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ. భారతీయులకు తొలిసారిగా శాసన నిర్మాణంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు.
బి. ఈ చట్టం రూపకల్పన సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్, వైస్రాయ్గా లార్డ్ కారన్ వాలీస్ వ్యవహరించారు.
సి. గవర్నర్ జనరల్కు ‘ఆర్డినెన్స్’ను జారీచేసే అధికారాన్ని కల్పించారు.
డి. ‘పోర్ట్ఫోలియో’ విధానానికి చట్టబద్ధత కల్పించారు.
జ: ఎ, సి, డి
2. రెగ్యులేటింగ్ చట్టం, 1773 ద్వారా రద్దుచేసిన ఏ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1861 ద్వారా పునరుద్ధరించారు?
జ: బాంబే, మద్రాస్
3. ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1861 ప్రకారం 1862లో మనదేశంలో మొదటి హైకోర్టును ఎక్కడ నెలకొల్పారు?
జ: కలకత్తా
4. కిందివాటిలో సరైనవి ఏవి?
1) 1859లో ‘సివిల్ ప్రొసీజర్ కోడ్’ను రూపొందించారు.
2) 1860లో ‘ఇండియన్ పీనల్ కోడ్’ను రూపొందించారు.
3) 1861లో ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్’ను రూపొందించారు.
జ: పైవన్నీ
5. ‘ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1892’ ప్రకారం కేంద్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించిన భారతీయ సభ్యులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి.
జ: లాలాలజపతిరాయ్, మోతీలాల్ నెహ్రూ
6. ‘ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1892’కు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ. బడ్జెట్పై చర్చించే అవకాశాన్ని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు అడిగే అధికారాన్ని కౌన్సిల్ సభ్యులకు కల్పించారు.
బి. కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్య 10 మందికి తగ్గకుండా, 16 మందికి మించకుండా ఉండాలని నిర్దేశించారు.
సి. రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్య 8 మందికి తగ్గకుండా, 20 మందికి మించకుండా ఉండాలని పేర్కొన్నారు.
జ: ఎ, బి, సి
7. మింటో- మార్లే సంస్కరణల చట్టానికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ. భారత రాజ్య కార్యదర్శిగా లార్డ్ మార్లే వ్యవహరించారు.
బి. గవర్నర్ జనరల్, వైస్రాయ్గా లార్డ్ మింటో వ్యవహరించారు.
సి. వైస్రాయ్ కార్యనిర్వాహక కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 15కు పెంచారు.
డి. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొదటి భారతీయుడిగా సత్యేంద్రప్రసాద్ సిన్హాకు ప్రాతినిధ్యం లభించింది.
జ: ఎ, బి, డి
8. ఏ చట్టం ద్వారా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ పేరును ‘ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్’గా మార్చారు?
జ: ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1909
9. భారత్లో ‘ప్రత్యేక మత నియోజకవర్గాలను’ ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు?
జ: ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1909
10. భారత్లో ‘మతనియోజకవర్గాల పితామహుడి’గా ఎవరిని పేర్కొంటారు?
జ: లార్డ్ మింటో
11. ‘గదర్’ పార్టీని స్థాపించింది ఎవరు?
జ: లాలా హరదయాళ్
12. 1911లో ఏ గవర్నర్ జనరల్ కాలంలో భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మార్చారు?
జ: లార్డ్ హార్డింజ్-II
13. కేంద్ర శాసన వ్యవస్థలోకి ప్రవేశించిన స్వరాజ్య పార్టీ ఆంగ్లేయుల ముందు కింది ఏ డిమాండ్లను ఉంచింది?
ఎ. రాజకీయ ఖైదీలను విడుదల చేయడం.
బి. ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశ పెట్టడం.
సి. సివిల్, డిఫెన్స్ సర్వీసుల్లో భారతీయులకే అవకాశం కల్పించడం.
డి. భారతీయులకు స్వపరిపాలనను అందించడం.
జ: ఎ, సి, డి
14. 1924లో ఏర్పాటు చేసిన ఏ కమిటీ భారత్లో ద్వంద్వపాలనను సమర్థించింది?
జ: అలెగ్జాండర్ మడ్డీమాన్ కమిటీ
15. 1927లో సైమన్ కమిషన్ను ఏర్పాటు చేసిన అప్పటి బ్రిటన్ ప్రధాని ఎవరు?
జ: బాల్డ్విన్
16. సైమన్ కమిషన్ భారత్లో మొదటిసారి ఎప్పుడు పర్యటించింది?
జ: 1928, ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 మధ్య
17. బ్రిటిష్ ఇండియా, భారత రాజ్యాల (సంస్థానాల) మధ్య సంతృప్తికరమైన ఆర్థిక సంబంధాలను సూచించడానికి 1927లో ఏర్పాటు చేసిన కమిటీ?
జ: బట్లర్ కమిటీ
18. ‘భారత ప్రభుత్వ చట్టం, 1935’ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
జ: 1937, ఏప్రిల్ 1
19. ‘భారత ప్రభుత్వ చట్టం, 1935’ ప్రకారం అధికారాల విభజనకు సంబంధించి సరికానిది ఏది?
1) ఫెడరల్ జాబితాలో 59 అంశాలు ఉన్నాయి.
2) రాష్ట్ర జాబితాలో 54 అంశాలు ఉన్నాయి.
3) అవశిష్ట జాబితాలో 29 అంశాలు ఉన్నాయి.
4) ఉమ్మడి జాబితాలో 36 అంశాలు ఉన్నాయి.
జ: అవశిష్ట జాబితాలో 29 అంశాలు ఉన్నాయి.
20. ‘భారత ప్రభుత్వ చట్టం, 1935’లోని సరైన అంశాన్ని గుర్తించండి.
ఎ) రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు.
బి) రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనా విధానాన్ని కొనసాగించారు.
సి) కేంద్రంలో ద్విసభా విధానాన్ని కొనసాగించారు.
డి) కేంద్రంలో ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు.
జ: ఎ, సి, డి
21. దిల్లీలో ఏర్పాటు చేసిన ‘ఫెడరల్ న్యాయ స్థానానికి’ మొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు వ్యవహరించారు?
జ: సర్ మారిస్ గ్వేయర్
22. ‘భారత ప్రభుత్వ చట్టం, 1935’లోని అంశానికి సంబంధించి సరికానిది?
1) కొత్తగా ఒడిశా, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.
2) భారతదేశం నుంచి బర్మాను వేరు చేశారు.
3) భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మార్చారు.
4) రాష్ట్ర స్థాయిలో ‘అడ్వకేట్ జనరల్’ పదవిని ఏర్పాటు చేశారు.
జ: భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మార్చారు.
23. ‘‘మంచి వాహనానికి చక్కటి బ్రేకులు అమర్చి, ముఖ్యమైన ఇంజిన్ను బిగించడం మరచిపోయారు’’ అని భారత ప్రభుత్వ చట్టం, 1935పై వ్యాఖ్యానించింది ఎవరు?
జ: జవహర్లాల్ నెహ్రూ