• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర, రాష్ట్ర సంబంధాలు

1. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర శాసన సంబంధాల గురించి ఎక్కడ పేర్కొన్నారు?

1) 10వ భాగంలోని ఆర్టికల్‌ 245 నుంచి 255 వరకు 
2) 11వ భాగంలోని ఆర్టికల్‌ 245 నుంచి 255 వరకు 
3) 12వ భాగంలోని ఆర్టికల్‌ 245 నుంచి 255 వరకు 
4) 13వ భాగంలోని ఆర్టికల్‌ 246 నుంచి 256 వరకు


2. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర పరిపాలనా సంబంధాలను ఎక్కడ పేర్కొన్నారు?

1) 11వ భాగంలోని ఆర్టికల్‌ 256 నుంచి 263 వరకు 
2) 12వ భాగంలోని ఆర్టికల్‌ 264 నుంచి 300 వరకు
3) 13వ భాగంలోని ఆర్టికల్‌ 256 నుంచి 300 వరకు
4) 14వ భాగంలోని ఆర్టికల్‌ 256 నుంచి 262 వరకు


3. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలను ఎక్కడ పేర్కొన్నారు?

1) 11వ భాగంలోని ఆర్టికల్‌ 244 నుంచి 261 వరకు 
2) 12వ భాగంలోని ఆర్టికల్‌ 263 నుంచి 290 వరకు 
3) 12వ భాగంలోని ఆర్టికల్‌ 264 నుంచి 300 వరకు 
4) 13వ భాగంలోని ఆర్టికల్‌ 300 నుంచి 322 వరకు
 

4. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు అనే మూడు రకాల అధికారాల విభజనను రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్‌లో పేర్కొన్నారు?

1) 5          2) 6               3) 7              4) 8


5. భారత ప్రభుత్వం అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం, రివర్‌ బోర్డ్‌ ్బళిi్ర’౯ త్న్చీ౯్ట్శ చట్టాలను ఎప్పుడు రూపొందించింది?

1) 1956        2) 1958         3) 1959         4) 1963


6. ఇందిరా గాంధీ ప్రభుత్వం 1966లో ఎవరి అధ్యక్షతన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేసింది?

1) ఫజుల్‌ అలీ       2) కేదారనాథ్‌      3)  మొరార్జీ దేశాయ్‌       4) జయప్రకాష్‌ నారాయణ్‌


7. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం ఎవరి అధ్యక్షతన ఒక అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది?

1) ఎం.సి. సెతల్‌వాడ్‌        2) నరహరిరావు      3)  అశోక్‌బింద్రా        4) సందీప్‌ వాఘేలా


8. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ‘అంతర్‌ రాష్ట్ర మండలి’ని ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

1) ఆర్టికల్‌ 261        2) ఆర్టికల్‌ 262         3)  ఆర్టికల్‌ 263          4) ఆర్టికల్‌ 264


9. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం 1969లో తమిళనాడులోని కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది?

1) పి.వి. రాజమన్నార్‌       2) పి.కె.తుంగన్‌        3)  వి.కె.అన్నామలై         4) దత్తుమిశ్రా


10. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ లను రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిటీ? 

1) నానీపాల్కీవాలా కమిటీ            2)రంగరాజన్‌ కమిటీ 
3)  పి.వి. రాజమన్నార్‌ కమిటీ     4) చంద్రశేఖర్‌ కమిటీ


11. పంజాబ్‌లోని అకాలీదళ్‌ పార్టీ 1973లో రూపొందించిన ‘ఆనందపూర్‌ సాహెబ్‌’ తీర్మానంలో కేంద్రం యొక్క అధికార పరిధి దేనికి పరిమితం కావాలని సిఫారసు చేసింది?

1) రక్షణ, కరెన్సీ        2) అంతర్జాతీయ సంబంధాలు 
3)  కమ్యూనికేషన్ల వ్యవస్థ         4) అన్నీ


12. ఇందిరా గాంధీ ప్రభుత్వం 1983లో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం ఎవరి అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది? 

1) రంజిత్‌ సింగ్‌ సర్కారియా         2) రంగనాథ్‌ మిశ్రా 
3)  గోపాల ద్వివేది         4) నానీపాల్కీవాలా


13. గవర్నర్‌ వ్యవస్థపై సర్కారియా కమిషన్‌ చేసిన సిఫారసు? 

1) ఒక వ్యక్తిని సొంత రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించకూడదు. 
2) క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నవారిని గవర్నర్‌గా నియమించకూడదు.
3)  గవర్నర్‌ను నియమించే ముందు సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి.
4) పైవన్నీ


14. రంజిత్‌సింగ్‌ సర్కారియా కమిషన్‌ 247 సిఫారసులతో 1987లో తన నివేదికను ఎవరికి సమర్పించింది?

1) ఇందిరా గాంధీ        2) రాజీవ్‌ గాంధీ         3)  వి.పి.సింగ్‌         4) చంద్రశేఖర్‌


15. కిందివారిలో సర్కారియా కమిషన్‌లోని సభ్యులు? 

1) బి. శివరామన్‌      4) ఎస్‌.ఆర్‌. సేన్‌     3)  బి. శివరామన్, ఎస్‌.ఆర్‌. సేన్‌      4) ఎల్‌.ఎన్‌.సిన్హా


16. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం 2007లో డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది?

1) మదన్‌మోహన్‌ పూంచీ     2) రఘురాం రాజన్‌      3)  వినీత్‌ బ్రిజ్‌లాల్‌      4) రాజేంద్రసచార్‌


17. ఆంధ్రప్రదేశ్‌లో 1983 మే 28న ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం చొరవతో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై రాజకీయ తీర్మానాన్ని ఎక్కడ చేశారు? 

1) హైదరాబాద్‌         2) విశాఖపట్నం         3)  విజయవాడ          4) కర్నూలు


18. ఆంధ్రప్రదేశ్‌లో 1983 మే 28న జరిగిన సమావేశానికి ఎన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు హాజరయ్యాయి? 

1) 9            2) 14           3)  16              4) 18


19. విజయవాడలో 1983 మే 28న జరిగిన సమావేశంలో పాల్గొన్నవారు?

1) అటల్‌ బిహారి వాజ్‌పేయీ       2) చంద్రశేఖర్‌ 
3)  ఫరూక్‌ అబ్దుల్లా                4) పైవారందరూ


20. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను చర్చించడానికి 1983లో ప్రతిపక్షాల రెండో సమావేశం ఫరూక్‌ అబ్దుల్లా అధ్యక్షతన ఎక్కడ జరిగింది?

1) శ్రీనగర్‌        2) సిమ్లా          3)  గాంధీనగర్          ‌     4) అలహాబాద్‌


21. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై 19 ప్రతిపక్ష పార్టీల నాయకులు పాల్గొన్న సమావేశం 1984 జనవరి 13న ఎక్కడ జరిగింది?

1) మద్రాసు         2) మైసూరు              3)  కలకత్తా          4) హైదరాబాద్‌


22. రాష్ట్ర జాబితాలోని ఏ అంశాన్ని 1976లో 42వ సవరణ ద్వారా ఇందిరా గాంధీ ప్రభుత్వం ‘ఉమ్మడి జాబితా’లోకి మార్చింది?


1) విద్య            2) తూనికలు, కొలతలు         3)  కుటుంబ నియంత్రణ      4) అన్నీ


23. 1967లో జరిగిన ఎన్నో లోక్‌సభ సాధారణ ఎన్నికల అనంతరం మన దేశంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో ఘర్షణలు ప్రారంభమయ్యాయి?

1) 3వ       2) 4వ           3)  5వ           4) 6వ


24.  సమాఖ్య విధానంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల సక్రమ పంపిణీకి తగిన సిఫారసులు చేసేందుకు ఏర్పాటైన ఏ కమిటీ 1971లో తన నివేదికను  కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది?


1) డి.ఆర్‌.గాడ్గిల్‌        2) దంతెవాలా        3)  రిజువరై        4) భిమల్‌జలాన్‌


25.     గవర్నర్‌లకు కచ్చితమైన పదవీకాలం ఉండాలని, వారిని 5 ఏళ్లపాటు పదవిలో కొనసాగించాలని సిఫారసు చేసిన కమిటీ? 

1) మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం     2) రాజమన్నార్‌ కమిటీ 
3)  మదన్‌మోహన్‌ పూంచీ కమిషన్‌     4) లక్డావాలా కమిషన్‌


26. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356 ను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలని సిఫారసు చేసిన కమిషన్‌? 


1) సర్కారియా కమిషన్‌         2) మదన్‌మోహన్‌ పూంచీ కమిషన్‌ 
3)  రంగరాజన్‌ కమిషన్‌          4) రాగ్యానాయక్‌ కమిషన్‌


27. రెండో పరిపాలనా సంస్కరణల సంఘాన్ని 2005లో ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు?

1) జయప్రకాష్‌ నారాయణ్‌         2) వీరప్ప మొయిలీ     3)  చంద్రలాల్‌ మిశ్రా        4) ఉషా మెహ్రా


సమాధానాలు: 1-2; 2-1; 3-3; 4-3; 5-1; 6-3; 7-1; 8-3; 9-1; 10-3; 11-4; 12-1; 13-4; 14-2; 15-3; 16-1; 17-3; 18-2; 19-4; 20-1; 21-3; 22-4; 23-2; 24-1; 25-3; 26-1;  27-2. 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌