• facebook
  • whatsapp
  • telegram

జాతీయాదాయ వృద్ధిరేటు   

   ఒక దేశ అభివృద్ధి గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరిగినప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై ఉంటుంది. అదే ఆ దేశ జాతీయాదాయ వృద్ధిరేటు. దీని గురించి అవగాహన ఉంటే ఆర్థికాభివృద్ధిలోని ఎత్తుపల్లాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.
         ఒక దేశ ప్రగతిని ఆ దేశ స్థూల జాతీయాదాయం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తయిన అంతిమ వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తాన్ని స్థూల జాతీయాదాయం (Gross National Income) అంటారు. దేశ సరిహద్దు లోపల ఒక ఏడాదిలో ఉత్పత్తయ్యే వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తాన్ని స్థూల దేశీయ ఆదాయం (Gross Domestic Income) అంటారు. ఎక్కువ దేశాలు జీడీపీని దేశ అభివృద్ధికి కొలమానంగా ఉపయోగిస్తున్నాయి. 

GNP=GDP + విదేశీ ఆదాయం
    అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తయిన మొత్తం వస్తుసేవల విలువల నుంచి మాధ్యమిక వస్తువుల విలువను తీసివేయగా మిగిలిన అంతిమ వస్తుసేవల విలువలను కూడితే జాతీయాదాయం వస్తుంది. మాధ్యమిక వస్తువుల విలువ కూడా అంతిమ వస్తువు విలువలో కలిసి ఉంటుంది. కాబట్టి మాధ్యమిక వస్తువుల విలువ తీసివేయకపోతే జాతీయాదాయం అధికంగా, అవాస్తవంగా లెక్కించబడుతుంది. 
ఉదా: సెల్‌ఫోన్‌ తయారీలో దాని విడిభాగాలు మాధ్యమిక వస్తువులు అవుతాయి. వాటన్నింటి విలువలు కలిసి సెల్‌ఫోన్‌ విలువ అవుతుంది. కాబట్టి విడిభాగాల విలువలు విడిగా లెక్కించనవసరం లేదు.

లభించే మార్గాలు
ఒక దేశానికి జాతీయాదాయం ప్రధానంగా నాలుగు మార్గాల ద్వారా లభిస్తుంది.
ప్రజలు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో ప్రవేశించి కింది విధులు నిర్వర్తించడం ద్వారా జాతీయాదాయం లభిస్తుంది.  

ప్రజల వినియోగం(Consumpion): కుటుంబాలు తమ అవసరాలు తీర్చుకోవడానికి అనేక రకాల వస్తు సేవలపై వ్యయం చేస్తుంటారు. అలా ఖర్చు చేసే ప్రతి రూపాయి అమ్మకందారుడికి ఆదాయం అవుతుంది. ఆ ఆదాయం మరో కొత్త వస్తుసేవలకు డిమాండ్‌ను సృష్టిస్తుంది. అలా ఆర్థిక వ్యవస్థలో ఆదాయం చక్రంలా ఒకరి నుంచి మరొకరికి ప్రయాణించి జాతీయాదాయాన్ని పెంచుతుంది.

పెట్టుబడి వ్యయం(Investment): వ్యాపార సంస్థలు ప్రజల డిమాండ్‌ ఆధారంగా వస్తువులను తయారుచేసి సప్లయ్‌ చేయడానికి పెట్టుబడులు పెడతాయి. ఇది కొత్త ఉద్యోగాలను కల్పిస్తుంది. వారి జీతాలు పెరిగి, కొనుగోలు శక్తిని పెంచుతుంది. యజమానుల లాభాలు పెరిగితే మూలధన సంచయనం జరిగి కొత్త సంస్థలు, వస్తువులు, ఉద్యోగాల ద్వారా జాతీయాదాయం పెరుగుతుంది.

ప్రభుత్వ వ్యయం(Governament ependiture): ఇది మరో ప్రధాన సూత్రధారి. ప్రజల అవసరాలు, అవస్థాపన సౌకర్యాలు కల్పించడానికి, శాంతిభద్రతల కోసం ప్రభుత్వం ఏటా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ వ్యయం ప్రజల ఉపాధిని, ఆదాయాలను, కొనుగోలుశక్తిని, జీవన ప్రమాణాలను పెంచుతుంది. సంస్థలకు అనుకూల పెట్టుబడి వాతావరణాన్ని కల్పిస్తుంది.

విదేశీ ఆర్థిక వ్యవహారాలు(foreign economic transactions): ఒక దేశం వివిధ ప్రపంచ దేశాలతో వస్తుసేవల వ్యాపారం చేస్తుంది. దాంతో పెట్టుబడులు వివిధ దేశాల మధ్య ప్రవహిస్తాయి. దీనివల్ల ఇతర దేశాలకు చెల్లింపులు జరిగి వాటి నుంచి ఆదాయాలు వస్తాయి. చెల్లింపుల కంటే ఆదాయాలు ఎక్కువగా ఉంటే ఆ దేశ ఆదాయానికి కలుపుతాం. తక్కువగా ఉంటే దేశ ఆదాయం నుంచి తీసివేస్తాం. 
        ప్రస్తుతం ప్రపంచీకరణ కాలంలో మన దేశంతో పాటు అనేక దేశాలు అంతర్జాతీయ వ్యాపారంలో భాగమయ్యాయి. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల పనితీరు ప్రభావం మన ఆదాయవృద్ధిపై పడుతుంది.
GNP= C + I + G + (X - M) + (R - P)
C = వినియోగం,  I  = పెట్టుబడులు,
G = ప్రభుత్వ వ్యయం
X - M = విదేశీ వ్యాపార శేషం, 
R - P = విదేశీ చెల్లింపుల శేషం

లెక్కింపు 
   జాతీయాదాయం లెక్కింపు పద్ధతి వీలైనంత సమగ్రంగా, శాస్త్రీయంగా ఉంటే ఒక దేశ అభివృద్ధి తాలూకు దశదిశలను సులభంగా అంచనా వేయవచ్చు.
    జాతీయాదాయం విలువ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 
   1) వస్తు సేవల పరిమాణంలో మార్పు
    2) వాటి ధరల్లో మార్పు
    ఈ రెండింటలో కలిసి లేదా ఏ ఒక్కదానిలోనైనా మార్పు వచ్చినప్పుడు జాతీయాదాయం విలువ మారుతుంది. వస్తుసేవల పరిమాణం పెరగడమే నిజమైన అభివృద్ధి. అయితే ఒక్కోసారి వస్తుసేవల సంఖ్య పెరగకుండానే కేవలం వాటి ధరలు పెరగడం వల్ల జాతీయాదాయం పెరిగినట్లుగా కనిపిస్తుంది. కానీ అది వాంఛనీయ అభివృద్ధి కాదు. 
    మన దేశంలో జీడీపీ డిఫ్లేటర్‌ను కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు శాఖ నిర్ణయిస్తుంది. జీడీపీని త్రైమాసికానికి ఒకసారి చొప్పున ప్రతి ఏడాది కేంద్ర గణాంక సంస్థ లెక్కిస్తుంది. మన దేశంలో గత 7 త్రైమాసికాలుగా జీడీపీ వృద్ధిరేటు క్షీణిస్తూ వస్తుంది. ఇటీవల సవరించిన అంచనాల ప్రకారం 2019-20 ఏప్రిల్‌ - డిసెంబరు మధ్య కాలంలో కేవలం 5.1%  వృద్ధి రేటు నమోదైంది. 
2012 - 13లో నమోదైన 4.3% తర్వాత ఇదే అతి తక్కువ వృద్ధిరేటు. మన దేశ వృద్ధిరేటు పడిపోయి ప్రపంచ అత్యధిక వృద్ధిరేటు కలిగిన దేశంగా చైనా నిలిచింది. పైన పేర్కొన్న ప్రజల వినియోగం, పెట్టుబడులు, విదేశీ ఎగుమతుల్లో (ప్రైవేటు రంగం) క్షీణత కనిపిస్తుంది. డిమాండ్‌ కొరత వల్ల వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.
    ప్రధానంగా కీలక పరిశ్రమల వృద్ధి బాగా తగ్గింది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం ప్రపంచ ప్రగతిపై పడి మన దేశ వృద్ధిరేటు తగ్గుదలకు కారణమైంది.
    2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్‌టీ అమలుచేయడం వల్ల స్వదేశీ మార్కెట్‌లో కొంత అనిశ్చితి ఏర్పడింది. దీనివల్ల ముఖ్యంగా గ్రామీణ ఆదాయాలు తగ్గి, డిమాండ్‌ తగ్గింది. వ్యాపారాల్లో మార్పు సంధి దశలో అనుమానాలు, భయాలు కూడా కొంతమేర అమ్మకాలు పడిపోవడానికి కారణమయ్యాయని నిపుణుల అంచనా.
    నమోదైన వృద్ధిరేటుకు ప్రధాన చోధకం ప్రభుత్వ వ్యయం. ఇప్పటికే ప్రభుత్వం విత్తలోటుకు సమానంగా నిధులు అప్పులుగా తెచ్చి వివిధ కార్యక్రమాలపై వెచ్చిస్తుంది. మన ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటురంగం సుమారు 87% కలిగి ఉన్నా, గత తొమ్మిది నెలల్లో కేవలం 4.01% వృద్ధి నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. అయితే ప్రభుత్వ వ్యయం అంచనాలకు మించి 15.64% పెరిగింది. ఆర్థిక మందగమన కాలంలో ప్రైవేటురంగం వెనకడుగు వేసినప్పుడు ప్రభుత్వ రంగం కీలకపాత్ర పోషించాల్సి వస్తుందని ఇది రుజువు చేస్తుంది.

మార్పులు - గణన
జాతీయాదాయంలో మార్పులను రెండు రకాల మార్కెట్‌ ధరల సహాయంతో గణిస్తారు.

ఆధార సంవత్సర ధరల్లో.. 
(GNP at base year or constant priece)

    ప్రజలకు అవసరమైన వస్తుసేవలు పెరగడమే నిజమైన అభివృద్ధి. కాబట్టి ధరలతో ప్రమేయం లేకుండా వస్తుసేవల పరిమాణంలో మార్పులు లెక్కించాలి. దీనికి గణాంక శాస్త్రవేత్తలు ఆధార సంవత్సరాన్ని సూచించారు. ఒడిదొడుకులు లేని  సాధారణ పరిస్థితులు కలిగిన సంవత్సరాన్ని ఎన్నుకుంటారు. ఒక నిర్దిష్ట కాల వ్యవధి తర్వాత ఈ ఆధార సంవత్సరాన్ని మారుస్తుంటారు. ఆధార సంవత్సర ధరల్లో తర్వాతి సంవత్సరాల వస్తుసేవల ఉత్పత్తి విలువను లెక్కిస్తారు. దీనివల్ల ధరలు మారకుండా కేవలం వస్తుసేవల పరిమాణం మార్పులను తెలుపుతుంది. ధరలు మారవు కాబట్టి దీన్ని స్థిర ధరల్లో జాతీయాదాయం లేదా వాస్తవిక ఆదాయం అని పిలుస్తారు. మన దేశంలో ఇప్పుడు  ఆధార సంవత్సరంగా 2011 - 12ను ఉపయోగిస్తున్నారు. త్వరలో 2017 - 18కి మారాలని గణాంక మంత్రిత్వ శాఖ ఆలోచిస్తుంది. పట్టికలోని చక్కెర, పాలు, టీ పొడి విలువలను 2011 - 12 నాటి ధరల్లో 2018, 2019 నాటి ఉత్పత్తులను లెక్కిస్తారు. అప్పుడు ధరల్లో మార్పు ఉండకుండా వాస్తవ ఆదాయంలో మార్పులను సులభంగా తెలుసుకోవచ్చు. 
    సాధారణంగా వాస్తవ ఆదాయం కంటే ద్రవ్యోల్బణం సమయంలో ధరలు పెరుగుతుండటం వల్ల నామమాత్ర ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక మాంద్యకాలంలో వాస్తవ ఆదాయం కంటే నామమాత్రపు ఆదాయం తక్కువగా ఉంటుంది. వాస్తవ ఆదాయ విలువను కింది సూత్రం ఆధారంగా లెక్కిస్తారు.
 
    డిఫ్లేటర్‌ అంటే ప్రస్తుత సంవత్సర ధరలకు, ఆధార సంవత్సర ధరలకు మధ్య ఉన్న నిష్పత్తి. ఇది వినియోగదారుల సూచిక మాదిరి (దిశిఖి) ధరల స్థాయిని తెలియజేస్తుంది.

ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం(GNP at current prices)
    ఏ సంవత్సరంలో ఉత్పత్తయిన వస్తుసేవల విలువలను అదే సంవత్సర ధరల్లో లెక్కిస్తే దాన్ని నామమాత్రపు జాతీయాదాయం అంటారు. 2018లో ఒక లక్ష కార్లు తయారైతే వాటి విలువను అదే సంవత్సర ధరల్లో లెక్కిస్తాం. ఇక్కడ ధరల మార్పు జాతీయాదాయ విలువపై పడుతుంది. వస్తువుల సంఖ్య పెరిగినా, తగ్గినా, స్థిరంగా ఉన్నా వాటి ధరల్లో పెరుగుదల ఉంటే జాతీయాదాయం పెరుగుతుంది. ధరలు తగ్గితే జాతీయాదాయం తగ్గుతుంది. ఇది ద్రవ్యోల్బణం వల్ల  పెరిగినట్లు కనిపిస్తుంది. అసలైన అభివృద్ధిని తెలుపదు.

    పట్టికలో చూపినట్లుగా ధరల్లో మార్పు వచ్చినప్పుడు వస్తువు విలువలో మార్పు కనిపిస్తుంది. కానీ, ప్రజలకు కావాల్సిన వస్తుసేవల పరిమాణంలో మార్పులను ఇది తెలపడం లేదు.

Posted Date : 26-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిరాభివృద్ధి

    అభివృద్ధి అనేది అతి ప్రాచీనమైన మానవ వ్యక్తిగత, సామూహిక కార్యక్రమం. దీనిలో భాగంగా గుహలు విడిచి గృహాలను నిర్మించారు. ఇది కుమ్మరి చక్రంతో మొదలైన మొదటి ఉత్పత్తి. ద్రవ్యం సంపద, సంతోషానికి మారుపేరుగా మారి పర్యావరణాన్ని బాధిస్తున్న విధ్వంసక ప్రక్రియ. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో జరిగిన వాతావరణ కార్యాచరణ సదస్సులో 16 ఏళ్ల స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థెన్‌బర్గ్‌  ‘మా తరాన్ని ముంచేస్తారా’ అని పాలకులను ప్రశ్నించింది. నేటి తరం ఇలా ఎందుకు స్పందిస్తుందో అర్థం కావాలంటే మనిషి అభివృద్ధి భావనా ప్రస్థానాన్ని అవగాహన చేసుకోవాలి. ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు మొదట తక్కువ కాలంలో అభివృద్ధి చెందిన దేశాల్లో వాస్తవిక ఆదాయంలోని పెరుగుదలనే ఆర్థిక వృద్ధిగా పరిగణించారు. సాంకేతికతను అందిపుచ్చుకొని సంపదను వస్తువుల రూపంలో సేకరించి, మార్కెటింగ్‌ చేసుకోవడాన్నే ముఖ్యంగా భావించారు. ఈ క్రమంలో పర్యావరణ జాగ్రత్తలను విస్మరించారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం రాజకీయంగా స్వతంత్ర దేశంగా అవతరించిన భారత్‌ లాంటి దేశాలను పరిశీలిస్తే వెనుకబడిన దేశాలకు ఆర్థికవృద్ధితోపాటు ఆర్థికాభివృద్ధి కూడా అవసరమని తేల్చారు. దీర్ఘకాలంలో వాస్తవిక ఆదాయంతో పాటు సామాజిక, సంస్థాగత, సాంకేతిక మార్పులను తెలిపే విశాల ప్రక్రియను ఆర్థికాభివృద్ధి అని గుర్తించారు.


    ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థికవృద్ధిలా సంపద సృష్టికి ప్రాధాన్యం ఇస్తుంది. అంటే జాతీయాదాయ పెంపుదలే ముఖ్యం. ఇది తక్కువ కాలంలో అధిక వృద్ధిరేటు కోసం ప్రయత్నిస్తుంది. ఉత్పత్తి ఉపాధికి దారితీసి మరెన్నో పరోక్ష ప్రయోజనాలను కల్పిస్తుంది. దీని వల్ల అభివృద్ధి జరుగుతుందనేది సైద్ధాంతిక విశ్వాసం. దీన్నే ట్రికిల్‌ డౌన్‌ థియరీ అంటారు. ఈ సిద్ధాంతం ఆధారంగానే అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేక ఆదాయ అభివృద్ధి పనులను చేపట్టాయి. మన దేశంలో 1951-1970 మధ్య కాలంలో సామాజిక అభివృద్ధి, గ్రామాల్లో భూసంస్కరణలు, వ్యవసాయ విస్తరణ, భారీ ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణం, హరిత విప్లవాలతో ఆర్థికాభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి.


ఆర్థిక సంక్షేమం 

    ఆర్థికాభివృద్ధి ఫలాలు కొన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకే పరిమితమయ్యాయని ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. పేద ప్రజల స్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీన్ని అధిగమించడానికి ఆర్థిక సంక్షేమం ఏర్పడింది. అంటే పేద, బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. మన దేశంలో 1971 - 1990 కాలంలో అనేక పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ - పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఇవి దారిద్య్రరేఖ కింద జీవించేవారి ప్రాథమిక అవసరాలను కొంతమేర తీర్చాయి. కానీ ఆశించిన ఫలితాలు కనిపించలేదు. ఈ పథకాలు ప్రజాస్వామ్య దేశాల్లో క్రమంగా ఓట్ల కోసం పేదలను ఆకర్షించే నినాదాలుగా మారాయి. వీటిలో జరిగే అవినీతి వల్ల ఖజానాపై భారం పెరిగింది.

ఆర్థిక సంక్షేమం = ఆర్థికాభివృద్ధి + ప్రత్యక్ష సంక్షేమ పథకాలు


మానవాభివృద్ధి 
    1991 నుంచి ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ చాలా దేశాల్లో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక శాస్త్రవేత్తలు పునరాలోచనలో పడ్డారు. మానవుడి కేంద్రీకృతమైన అభివృద్ధి జరగాలని భావించారు. ముఖ్యంగా పేదలు స్వయంగా ఎదిగే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. సంక్షేమ పథకాల పేరుతో వారిని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుగా మాత్రమే కాకుండా వారికి స్వేచ్ఛను ఇచ్చి సామర్థ్యాల మేరకు అభివృద్ధిలో చురుకైన భాగస్వాములను చేయాలి. ఇది వారి ఆర్థిక, సామాజిక సాధికారతకు దోహదపడుతుంది. ఇదే నిజమైన మానవాభివృద్ధి. ఆదాయంతోపాటు ప్రజలకు విద్య, ఆరోగ్యాన్ని అందించాలి. ప్రపంచ దేశాలు శ్రామికులను మానవ వనరులుగా గుర్తించి పలు చర్యలు చేపట్టాయి.

మానవాభివృద్ధి = ఆర్థికాభివృద్ధి  +  విద్య + ఆరోగ్యం

    మానవాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో అభివృద్ధికి ప్రధాన అంశమైన పర్యావరణం గురించి చర్చించలేదు. ప్రకృతి మనిషి కంటే ప్రాచీనమైంది. సృష్టిలోని జీవ, నిర్జీవ పదార్థాలను ఉపయోగించుకుని మానవ నాగరికత రూపుదాల్చింది. ప్రస్తుతం మనుషుల సంఖ్య పెరిగింది. దాంతోపాటు పర్యావరణంలో అనేక మార్పులు వచ్చాయి. అభివృద్ధి పేరుతో సహజ వనరులను అతిగా ఉపయోగించడం వల్ల నేటి తరానికి సహజ సంపద తగ్గిపోయింది. ముఖ్యంగా 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత వనరుల దుర్వినియోగం వేగంగా జరిగి కాలుష్యం అధికమైంది. ఇది రేపటి తరాల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని ప్రపంచ మేధావులు, పర్యావణ వేత్తలు భావించారు. 1970 దశాబ్దంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని సమావేశాల్లో ఈ ఆలోచన ప్రారంభమైంది. 1980లో మొదటిసారిగా ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ యూనియన్‌ సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని ప్రయోగించింది. 1987లో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ కమిషన్‌ విడుదల చేసిన ‘అవర్‌ కామన్‌ ఫ్యూచర్‌’లో ఈ పదానికి శాస్త్రీయ నిర్వచనం ఇచ్చింది. దీన్నే సాధారణంగా బ్రంట్‌లాండ్‌ రిపోర్ట్‌ అని పిలుస్తారు. ‘భవిష్యత్తు తరాల అవసరాలు తీర్చుకునే సామర్థ్యాలను దెబ్బతీయకుండా ప్రస్తుత తరాలు తమ అవసరాలను తీర్చుకునే అభివృద్ధే సుస్థిరాభివృద్ధి’.


*  ప్రజలందరి అవసరాలు ముఖ్యంగా పేదలకు ప్రాధాన్యత. 
*  పర్యావరణంపై సాంకేతికత విధించే పరిమితులు
*  ప్రస్తుత, భవిష్యత్తు తరాల మధ్య సమన్యాయం 
*  అభివృద్ధిని ముందు తరాలకు కొనసాగించడం. అందుకే దీన్ని కొనసాగించగల అభివృద్ధి అని కూడా అంటారు.


    ఈ నివేదిక తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధిపై చర్చలు, అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. 1992లో బ్రెజిల్‌లోని రియో-డి-జెనీరోలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ధరిత్రీ సదస్సులో అజెండా - 21 పేరుతో 21వ శతాబ్దంలో సుస్థిరాభివృద్ధి సాధనకు సాధ్యాసాధ్యాలు, పరిమితులను చర్చించారు. తర్వాత 20 ఏళ్లకు రియో నగరంలోనే రియో + 20 పేరుతో 2012లో సుస్థిరాబివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సు జరిగింది. ఈ సదస్సులో గత అనుభవాలను సమీక్షించారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు - ప్రభావంపై అవగాహన ఏర్పడింది. దీని ఆధారంగానే పారిస్‌ ఒప్పందం (2016) అమల్లోకి వచ్చింది.


భారత్‌ పనితీరు 

    ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి సూచిక - 2019 ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో డెన్మార్క్‌ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అమెరికా 35, చైనా 39, భారత్‌ 115వ స్థానంలో ఉన్నాయి. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక - బేస్‌ లైన్‌ రిపోర్ట్, 2018 తొలి నివేదిక ప్రకారం 100 పాయింట్లకు మన దేశం 58 పాయింట్లు సాధించింది. ఈ లక్ష్యాల సాధనలో హిమాచల్‌ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
లక్ష్యాలు

    ఐక్యరాజ్య సమితి 2015 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన పర్యావరణ సదస్సులో 2015 - 30 మధ్యకాలంలో అన్ని దేశాలు సాధించాల్సిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఆమోదించింది. 

    1) పేదరిక నిర్మూలన  
    2) ఆకలి చావులను పూర్తిగా తగ్గించడం 
    3) మంచి ఆరోగ్యం  
    4) నాణ్యమైన విద్య  
    5) లింగ సమానత్వం 
    6) పరిశుభ్రమైన నీరు, పరిసరాలు 
    7) పునరుజ్జీవన ఇంధన వాడకం 
    8) ఉపాధి, ఆర్థికవృద్ధి  
    9) పరిశ్రమలు, నూతన ఆవిష్కరణలు, అవస్థాపనా సౌకర్యాల కల్పన
    10) అసమానతల తగ్గింపు  
    11) సుస్థిర నగరాలు, సమాజాలు
    12) బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి 
    13) వాతావరణ మార్పులపై చర్యలు 
    14) నీటిలోని ప్రాణుల సంరక్షణ 
    15) నేలపై జీవుల రక్షణ 
    16) శాంతి, న్యాయం 
    17) ఉమ్మడి లక్ష్యాల కోసం భాగస్వామ్యం. 

    సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థూలంగా 17గా విభజించినప్పటికీ అవి ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి సామాజిక, ఆర్థిక, పర్యావరణపరంగా సుస్థిరంగా ఉండాలి. మొదటిసారి ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో వాతావరణ కార్యాచరణ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు పలువురు నేతలు, పర్యావణ శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఇప్పటివరకు సుస్థిరాభివృద్ధి కోసం చేపట్టిన చర్యలను సమీక్షించారు. సుస్థిరాభివృద్ధి అంటే అసలైన అర్థం నాలుగు కాలాల పాటు కాదు నాలుగు తరాల పాటు అందరినీ సంతోషపెట్టేది. 

P - People;  P - Planet;  P - Prosperity;  P - Partnership;  P - Peace  అనే 5 P'sను సాధించడానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉపయోగపడతాయి. 2000-2015 మధ్య ఎనిమిది సహస్రాబ్ది లక్ష్యాలు ఉన్నాయి.
ఒక చేపను ఒకరికి ఇస్తే ఒక రోజు మాత్రమే ఆకలి తీరుతుంది. అదే అతడికి చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం ఆకలి తీర్చుకుంటాడు. -  ప్రముఖ తత్వవేత్త - కన్ఫ్యూసియస్‌

 

సుస్థిరాభివృద్ధి - ప్రపంచ దేశాల కృషి
* ‘మానవ పర్యావరణం’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) 1972 జూన్‌ 5న స్టాక్‌ హోంలో ఓ సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం పెరిగింది. 
* 1980లో ప్రపంచ సంరక్షణ వ్యూహం అనే పరిశోధనా పత్రంలో మొదటిసారి ‘కొనసాగించాల్సిన అభివృద్ధి’ అనే పదాన్ని వాడారు.
* 1987లో సుస్థిరాభివృద్ధి సాధన కోసం ఐక్యరాజ్యసమితి అప్పటి నార్వే ప్రధాని హార్లెం బ్రంట్‌లాండ్‌ నేతృత్వంలో World Commission on Environment and Development ను ఏర్పాటు చేసింది.
* సుస్థిరతపై అంతర్జాతీయంగా సహకారాన్ని పెంపొందించడానికి 1992లో ప్రపంచ దేశాధినేతలు బ్రెజిల్‌లోని రియోలో సమావేశమయ్యారు. దీన్నే UN Conference on Environment and Development, ధరిత్రీ సదస్సు, రియో సమ్మిట్‌గా పిలుస్తారు.
* రియో సదస్సు జరిగి 2012కి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రపంచ దేశాధినేతలు రియోలో సమావేశమై సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి చర్చించారు. ఇందులో చర్చకు వచ్చిన అంశాలకు 2015లో ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో ఆమోదం తెలిపారు. వీటినే అజెండా 2030 అని పిలుస్తారు. ఇందులో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉపలక్ష్యాలు ఉన్నాయి. 2016 జనవరి నుంచి ప్రారంభించి 2030 డిసెంబరు నాటికి వీటిని సాధించాలని తీర్మానించారు.


లక్ష్యాలు  
1. పేదరికాన్ని నిర్మూలించడం: 2030 నాటికి పేదరికాన్ని సగానికి తగ్గించాలి. దీనికోసం సాంఘిక భద్రతా పథకాలు అమలుచేయాలి. ఆర్థిక వనరులపై అందరికీ సమాన హక్కులు ఉండేలా చూడాలి.


2. ఆకలిని నిర్మూలించడం: సురక్షితమైన పౌష్ఠికాహారాన్ని అందరికీ తగినంతగా అందుబాటులో ఉంచి, 2030 నాటికి ఆకలిని నిర్మూలించాలి.
* అయిదేళ్లలోపు పిల్లల్లో వయసుకు తగిన ఎత్తు (Stunting), ఎత్తుకు తగిన బరువు (Wasting) లేకపోవడం లాంటి అంశాల్లో అంతర్జాతీయ అంగీకార లక్ష్యాలను చేరుకోవాలి. 2025 నాటికి ఎత్తు తక్కువతో బాధ పడుతున్న పిల్లల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని, శారీరక బరువు సరిగాలేని వారి సంఖ్యను 5 శాతంలోపునకు తీసుకురావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
* 2030 నాటికి వ్యవసాయ ఉత్పాదకతను, చిన్న-కౌలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి.
* 2001 నవంబరులో ఖతార్‌లోని దోహాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ్బజూగివ్శీ ఓ సమావేశాన్ని నిర్వహించింది. దీన్నే దోహా రౌండ్‌గా పేర్కొంటారు. ఇందులో వ్యవసాయ ఎగుమతుల సబ్సిడీలను తొలగించాలని; ప్రపంచ వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న వాణిజ్యపరమైన షరతులు, ఆటంకాలను ఎత్తివేయాలని తీర్మానించారు.

 

3. అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలి
* 2030 నాటికి  ప్రతి లక్ష జననాలకు మాతృత్వ మరణాల రేటును 70కి తగ్గించాలి.
* 2030 నాటికి  ప్రతి 1000 సజీవ జననాలకు Neonatal Mortality Rate (0 - 28 రోజులు)ను 12కి తగ్గించాలి.
* అయిదేళ్లలోపు వయసున్న పిల్లల మరణ రేటును ్బగీ5లీళ్శి ప్రతీ 1000 సజీవ జననాలకు 25కి తగ్గించాలి.
* 2030 కల్లా ఎయిడ్స్, టీబీ, మలేరియా లాంటి వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలి. 
* 2030 నాటికి అంటువ్యాధులు కాని రోగాలను 1/3వ వంతు తగ్గించాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ జబ్బుల్లో గుండె సంబంధ వ్యాధులు ప్రథమస్థానంలో ఉండగా, క్యాన్సర్‌ రెండో స్థానంలో ఉంది.
* ఆల్కహాల్, డ్రగ్స్‌ వినియోగం, రోడ్డు ప్రమాదాలు, పర్యావరణ కాలుష్యం, పొగాకు మొదలైన వాటి వల్ల సంభవించే మరణాలను 2030 నాటికి   పెద్ద మొత్తంలో తగ్గించాలి.
* ప్రజారోగ్యానికి సంబంధించి దోహా డిక్లరేషన్‌లోని TRIPS (Trade Related Aspects Of Intellectual Property Agreements)  ఒప్పందం ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరలకే నాణ్యమైన-సురక్షితమైన మందులు, టీకాలను అందించాలి.


4. నాణ్యమైన విద్య
* 2030 నాటికి బాలబాలికలందరికీ నాణ్యమైన పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, సెకండరీ విద్యను ఉచితంగా అందించాలి. ప్రమాణాలతో కూడిన సాంకేతిక, వృత్తి, టెరిటరీ విద్యలను అందుబాటు ధరల్లో ఉంచాలి. టెరిటరీ విద్య సెకండరీ విద్య పూర్తయ్యాక 3వ స్థాయిలో ఉంటుంది. ఇది సాధారణంగా కళాశాల విద్య.
* లింగ సంబంధ వ్యత్యాసాలను అన్ని స్థాయుల్లో నిర్మూలించాలి. 2030 నాటికి అర్హత కలిగిన ఉపాధ్యాయుల సంఖ్యను గణనీయంగా పెంచాలి.


5. లింగసమానత్వం, మహిళా సాధికారిత సాధించడం:
మహిళల పట్ల ఉన్న అన్ని రకాల వివక్షను రూపుమాపాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో వీరిపై జరిగే హింసను అరికట్టాలి. మహిళల అక్రమ రవాణా, లైంగిక దాడులు మొదలైన వాటిని నిర్మూలించాలి. బాల్య వివాహాలు, బలవంతపు పెళ్లిళ్లను నిరోధించాలి.
* ఆర్థిక, రాజకీయ, ప్రజా జీవితంలోని అన్ని స్థాయుల్లో మహిళా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. నిర్ణయాలు తీసుకునే చోట పురుషులతో సమానంగా వారికీ అవకాశాలు కల్పించాలి.
* ఆర్థిక వనరులు, భూయాజమాన్యం, సహజ వనరులు మొదలైన వాటిపై మహిళలకు సమాన హక్కులు కల్పించేలా సంస్కరణలు తేవాలి.

 

6. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం: 2030 నాటికి ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందుబాటు ధరకే పంపిణీచేయాలి. బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాలి.
 

7. అందుబాటు ధరల్లో శుద్ధ ఇంధనాలు అందించడం: 2030 నాటికి నమ్మకమైన శక్తి సేవలను అందరికీ అందుబాటు ధరల్లో అందించాలి. ప్రపంచ శక్తి వనరుల్లో పునర్వినియోగ శక్తి వనరుల వాటాను గణనీయంగా పెంచాలి.

8. ఆర్థికవృద్ధి, నాణ్యమైన ఉపాధిని సాధించడం: అల్పాభివృద్ధి దేశాల్లో కనీసం 7% జీడీపీ వృద్ధిని సుస్థిరంగా సాధించాలి.
* 2030 నాటికి ఉపాధి, విద్య లేదా శిక్షణలో లేని యువత వాటాను గణనీయంగా తగ్గించాలి. 
* 2025 నాటికి నిర్బంధ శ్రామికత్వం, బాలకార్మిక వ్యవస్థ, బానిసత్వం, మానవ అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించాలి.
* 2030 నాటికి అందరికీ ఉత్పాదక ఉపాధిని అందించాలి. సమాన విలువ ఉన్న పనికి సమాన వేతనాన్ని అందించాలి.
* కార్మికుల హక్కులను రక్షించాలి. పనివాళ్లకు ముఖ్యంగా వలస కార్మికులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలి.
* యువత ఉపాధి కోసం 2020 నాటికి  ప్రపంచ వ్యూహాన్ని అభివృద్ధిచేసి అమల్లోకి తేవాలి.


9. పరిశ్రమలు, మౌలిక వసతులు, ఆవిష్కరణలు: మానవ సంక్షేమం, ఆర్థికాభివృద్ధి పెంపొందించేందుకు నాణ్యమైన, నమ్మకమైన, సుస్థిర మౌలికవసతులను అభివృద్ధి చేయాలి.
* 2030 నాటికి  ఆదాయం, ఉపాధిలో పరిశ్రమల వాటాను గణనీయంగా పెంచాలి. దీనికోసం సుస్థిర, సమ్మిళిత పారిశ్రామికీకరణను ప్రోత్సహించాలి. అల్పాభివృద్ధి దేశాల్లో పరిశ్రమల వాటాను రెట్టింపు చేయాలి.
* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలి.
* శాస్త్రీయ పరిశోధనలు ప్రోత్సహించాలి. 2030 నాటికి ప్రతి మిలియన్‌ జనాభాలో పరిశోధన రంగంలో పనిచేస్తున్నవారి సంఖ్యను గణనీయంగా పెంచాలి.

 

10. దేశం లోపల, వివిధ దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను తగ్గించాలి: 2030 నాటికి జనాభాలో అట్టడుగున ఉన్న 40% మంది ప్రజల ఆదాయ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ ఉండేలా చర్యలు చేపట్టాలి.
* వయసు, లింగ, అంగవైకల్యం, జాతి, పుట్టుక, మతం మొదలైనవాటితో సంబంధం లేకుండా అందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పించాలి.
* అసమానతలను ప్రోత్సహించే విధానాలు, చట్టాలను పూర్తిగా తొలగించాలి.
* అంతర్జాతీయ విత్త, ఆర్థిక వ్యవస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచాలి.
* అల్పాభివృద్ధి దేశాలకు అభివృద్ధి సాయం, విత్త వనరుల ప్రవాహాన్ని ప్రోత్సహించాలి. ఇందులో భాగంగానే ఎఫ్‌డీఐలను రాబట్టాలి.

 

11. నగరాలను నివాసయోగ్యంగా, సురక్షితంగా, సమ్మిళితంగా తయారుచేయడం: 2030 నాటికి అందరికీ సురక్షితమైన ఇళ్లను తక్కువ ధరలకు అందించాలి.
* ప్రజారవాణాను పెంచాలి.
* విపత్తుల వల్ల సంభవించే ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించాలి.
* 2015, మార్చి 8న జపాన్‌లోని సెంధాయ్‌లో ఐక్యరాజ్యసమితి మూడో డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ సమావేశం జరిగింది. దీనికి ‘సెంథాయ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ 2015-30’ అని పేరుపెట్టారు. ఇందులో కొన్ని నిబంధనలను పేర్కొన్నారు. వీటిప్రకారం విపత్తులను తట్టుకునేలా సమగ్ర విధానాలను అమలుచేసే నగరాల సంఖ్యను పెంచాని తీర్మానించారు.
* పట్టణాల్లో వాయుకాలుష్యం, ఘనవ్యర్థాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.

 

12. సుస్థిర వినియోగం, ఉత్పత్తి విధానాల రూపకల్పన: ఉత్పత్తి, సరఫరా స్థాయిలో ఆహార వృథాను అరికట్టాలి. వినియోగదారు స్థాయిలో తలసరి ఆహార వృథాను సగానికి తగ్గించాలి.
* 2030 నాటికి  నివారణ, RRR (Reduce, Reuse and Recycle) ద్వారా వ్యర్థాల సృష్టిని తగ్గించాలి.
* అభివృద్ధి చెందుతున్న దేశాలకు వినియోగం, ఉత్పత్తిలో సుస్థిర పద్ధతులను అవలంబించేందుకు తగిన సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా మద్దతు ఇవ్వాలి.
* వృథా వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న ఇంధన సబ్సిడీలను హేతుబద్ధీకరించాలి.

 

13. పర్యావరణ మార్పు, దాని ప్రభావంపై సత్వర చర్యలు: సహజ విపత్తులు, శీతోష్ణస్థితి సంబంధ విపత్తులను తట్టుకోగలిగే సామర్థ్యాన్ని అందరిలో బలోపేతం చేయాలి.
* దేశ ప్రణాళిక, విధానాలు, వ్యూహాల్లో శీతోష్ణస్థితి మార్పులను సమీకృతం చేయాలి.
* వీటికి సంబంధించిన (ముందస్తు హెచ్చరిక, మార్పులు తగ్గించగలగడం, వాటిని తట్టుకోగలగడం) విద్య, చైతన్య కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి.
* శీతోష్ణస్థితి మార్పుల ప్రభావాలను తట్టుకునేలా UNFCCC (United Nations Framework Convention on Climate Change) కింద అభివృద్ధి చెందిన దేశాలు సంవత్సరానికి 100 బిలియన్‌ డాలర్లను అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చేందుకు అంగీకరించాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా అమలుచేయాలి.

 

14. సముద్రాలు, జలవనరుల సంరక్షణ: అన్నిరకాల సముద్ర కాలుష్యాలను తగ్గించాలి. ముఖ్యంగా భూసంబంధ కార్యకలాపాల ద్వారా జరిగే కాలుష్యాన్ని నివారించాలి.
* సముద్రాల ఆమ్లీకరణను తగ్గించాలి. దాని ప్రభావాలను దీటుగా ఎదుర్కోవాలి.
* అధికంగా చేపలు పట్టడానికి కారణమైన మత్స్యరంగ సబ్సిడీలను పూర్తిగా నిషేధించాలి.

 

15. అడవులు, ఇతర ఆవరణ వ్యవస్థలను పరిరక్షించడం, భూక్షీణతను, జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టడం
అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం అడవులు, పర్వతాలు, చిత్తడి నేలలను సంరక్షించాలి.
* అన్నిరకాల అడవుల్లో సుస్థిర యాజమాన్య పద్ధతులను అవలంబించాలి. అడవులు నరకడాన్ని అరికట్టాలి. క్షీణతకు గురైన అడవులను పునరుద్ధరించాలి. అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలి.
* కరవులు, వరదల వల్ల క్షీణతకు గురయ్యే మృత్తికను పునరుద్ధరించాలి.
* పర్వత ఆవరణ వ్యవస్థను సంరక్షిస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడాలి. వీటి ఉత్పత్తులు సుస్థిరాభివృద్ధికి దోహదపడతాయి. రక్షిత జీవజాతుల అక్రమరవాణా, వేటను అడ్డుకోవాలి.

 

16. అందరికీ శాంతి, న్యాయాన్ని అందించాలి, దీనికోసం బలమైన వ్యవస్థలను ఏర్పాటుచేయాలి
అన్నిరకాల హింసలను, వాటివల్ల జరిగే మరణాలను గణనీయంగా తగ్గించాలి.
* జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరికీ సమాన న్యాయాన్ని అందించాలి.
* అవినీతి, లంచగొండితనాన్ని అరికట్టాలి.
* గ్లోబల్‌ గవర్నెన్స్‌కు సంబంధించిన సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలి.
* 2030 నాటికి అందరికీ చట్టబద్ధమైన గుర్తింపు లభించాలి. 
* తీవ్రవాదం, నేరాలు, హింసలు మొదలైనవాటిని అడ్డుకునే జాతీయస్థాయి సంస్థలను బలోపేతం చేయాలి.

 

17. సార్వత్రిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం: దేశీయ వనరుల సేకరణను బలోపేతం చేయాలి. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు పర్యావరణ అనుకూల సాంకేతికతను తక్కువ ధరలకే అందించాలి.

Posted Date : 09-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిరాభివృద్ధి 

మాదిరి ప్రశ్నలు
1. అభివృద్ధి రకాల్లో అతి ప్రాచీనమైంది?
    1) ఆర్థికవృద్ధి     2) ఆర్థికాభివృద్ధి    3) ఆర్థిక సంక్షేమం    4) మానవాభివృద్ధి

2. ఆర్థికాభివృద్ధి అంటే?
    1) స్వల్పకాలంలో ఉత్పత్తిలో మార్పు    
    2) దీర్ఘకాలంలో ఉత్పత్తిలో మార్పు
    3) స్వల్పకాలంలో ఉత్పత్తితోపాటు సామాజిక మార్పు
    4) దీర్ఘకాలంలో ఉత్పత్తిలో మార్పుతో పాటు సామాజిక మార్పు

3. ట్రికిల్‌ డౌన్‌ (Trickle Down) సిద్ధాంతం దేనికి సంబంధించింది?
    1) ధరల తగ్గింపు        2) ఆర్థిక మాంద్యం మదింపు
    3) పేదలకు అభివృద్ధి ఫలాలు చేరడం    4) అన్నీ

4. ప్రపంచీకరణలో భాగంగా అమలు చేసిన అభివృద్ధి?
    1) ఆర్థిక సంక్షేమం    2) మానవాభివృద్ధి     3)  సుస్థిరాభివృద్ధి    4) ఆర్థిక వృద్ధి 

5. సుస్థిరాభివృద్ధి లక్ష్యం?
    1) ప్రాంతాల మధ్య సమానాభివృద్ధి    2) ప్రజల మధ్య సమానాభివృద్ధి
    3) దేశాల మధ్య సమానాభివృద్ధి    4) తరాల మధ్య సమానాభివృద్ధి


సమాధానాలు: 11; 24; 33;  42; 54. 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జాతీయాదాయ వృద్ధి రేటు

జాతీయాదాయ వృద్ధి రేటు
    ఒక దేశ అభివృద్ధి గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరిగినప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై ఉంటుంది. అదే ఆ దేశ జాతీయాదాయ వృద్ధిరేటు. దీని గురించి అవగాహన ఉంటే ఆర్థికాభివృద్ధిలోని ఎత్తుపల్లాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.

    ఒక దేశ ప్రగతిని ఆ దేశ స్థూల జాతీయాదాయం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తయిన అంతిమ వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తాన్ని స్థూల జాతీయాదాయం ( Gross National Income) అంటారు. దేశ సరిహద్దు లోపల ఒక ఏడాదిలో ఉత్పత్తయ్యే వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తాన్ని స్థూల దేశీయ ఆదాయం (Gross Domestic Income)అంటారు. ఎక్కువ దేశాలు జీడీపీని దేశ అభివృద్ధికి కొలమానంగా ఉపయోగిస్తున్నాయి. 

GNP = GDP + విదేశీ ఆదాయం
    అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తయిన మొత్తం వస్తుసేవల విలువల నుంచి మాధ్యమిక వస్తువుల విలువను తీసివేయగా మిగిలిన అంతిమ వస్తుసేవల విలువలను కూడితే జాతీయాదాయం వస్తుంది. మాధ్యమిక వస్తువుల విలువ కూడా అంతిమ వస్తువు విలువలో కలిసి ఉంటుంది. కాబట్టి మాధ్యమిక వస్తువుల విలువ తీసివేయకపోతే జాతీయాదాయం అధికంగా, అవాస్తవంగా లెక్కించబడుతుంది. 

ఉదా: సెల్‌ఫోన్‌ తయారీలో దాని విడిభాగాలు మాధ్యమిక వస్తువులు అవుతాయి. వాటన్నింటి విలువలు కలిసి సెల్‌ఫోన్‌ విలువ అవుతుంది. కాబట్టి విడిభాగాల విలువలు విడిగా లెక్కించనవసరం లేదు. 

లభించే మార్గాలు
ఒక దేశానికి జాతీయాదాయం ప్రధానంగా నాలుగు మార్గాల ద్వారా లభిస్తుంది.
ప్రజలు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో ప్రవేశించి కింది విధులు నిర్వర్తించడం ద్వారా జాతీయాదాయం లభిస్తుంది.

ప్రజల వినియోగం (Consumption): కుటుంబాలు తమ అవసరాలు తీర్చుకోవడానికి అనేక రకాల వస్తు సేవలపై వ్యయం చేస్తుంటారు. అలా ఖర్చు చేసే ప్రతి రూపాయి అమ్మకందారుడికి ఆదాయం అవుతుంది. ఆ ఆదాయం మరో కొత్త వస్తుసేవలకు డిమాండ్‌ను సృష్టిస్తుంది. అలా ఆర్థిక వ్యవస్థలో ఆదాయం చక్రంలా ఒకరి నుంచి మరొకరికి ప్రయాణించి జాతీయాదాయాన్ని పెంచుతుంది.

పెట్టుబడి వ్యయం (Investment): వ్యాపార సంస్థలు ప్రజల డిమాండ్‌ ఆధారంగా వస్తువులను తయారుచేసి సప్లయ్‌ చేయడానికి పెట్టుబడులు పెడతాయి. ఇది కొత్త ఉద్యోగాలను కల్పిస్తుంది. వారి జీతాలు పెరిగి, కొనుగోలు శక్తిని పెంచుతుంది. యజమానుల లాభాలు పెరిగితే మూలధన సంచయనం జరిగి కొత్త సంస్థలు, వస్తువులు, ఉద్యోగాల ద్వారా జాతీయాదాయం పెరుగుతుంది.

ప్రభుత్వ వ్యయం (Government Income): ఇది మరో ప్రధాన సూత్రధారి. ప్రజల అవసరాలు, అవస్థాపన సౌకర్యాలు కల్పించడానికి, శాంతిభద్రతల కోసం ప్రభుత్వం ఏటా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ వ్యయం ప్రజల ఉపాధిని, ఆదాయాలను, కొనుగోలుశక్తిని, జీవన ప్రమాణాలను పెంచుతుంది. సంస్థలకు అనుకూల పెట్టుబడి వాతావరణాన్ని కల్పిస్తుంది.

విదేశీ ఆర్థిక వ్యవహారాలు (Forein economic transactions): ఒక దేశం వివిధ ప్రపంచ దేశాలతో వస్తుసేవల వ్యాపారం చేస్తుంది. దాంతో పెట్టుబడులు వివిధ దేశాల మధ్య ప్రవహిస్తాయి. దీనివల్ల ఇతర దేశాలకు చెల్లింపులు జరిగి వాటి నుంచి ఆదాయాలు వస్తాయి. చెల్లింపుల కంటే ఆదాయాలు ఎక్కువగా ఉంటే ఆ దేశ ఆదాయానికి కలుపుతాం. తక్కువగా ఉంటే దేశ ఆదాయం నుంచి తీసివేస్తాం. 

    ప్రస్తుతం ప్రపంచీకరణ కాలంలో మన దేశంతో పాటు అనేక దేశాలు అంతర్జాతీయ వ్యాపారంలో భాగమయ్యాయి. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల పనితీరు ప్రభావం మన ఆదాయవృద్ధిపై పడుతుంది.

   GNP = C + I + G + (X - M) + (R - P)

    C  = వినియోగం,  I  = పెట్టుబడులు,  
    G  = ప్రభుత్వ వ్యయం
    X - M = విదేశీ వ్యాపార శేషం, 
    R - P = విదేశీ చెల్లింపుల శేషం

లెక్కింపు 
జాతీయాదాయం లెక్కింపు పద్ధతి వీలైనంత సమగ్రంగా, శాస్త్రీయంగా ఉంటే ఒక దేశ అభివృద్ధి తాలూకు దశదిశలను సులభంగా అంచనా వేయవచ్చు.
జాతీయాదాయం విలువ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 
1) వస్తు సేవల పరిమాణంలో మార్పు
2) వాటి ధరల్లో మార్పు

 ఈ రెండింటలో కలిసి లేదా ఏ ఒక్కదానిలోనైనా మార్పు వచ్చినప్పుడు జాతీయాదాయం విలువ మారుతుంది. వస్తుసేవల పరిమాణం పెరగడమే నిజమైన అభివృద్ధి. అయితే ఒక్కోసారి వస్తుసేవల సంఖ్య పెరగకుండానే కేవలం వాటి ధరలు పెరగడం వల్ల జాతీయాదాయం పెరిగినట్లుగా కనిపిస్తుంది. కానీ అది వాంఛనీయ అభివృద్ధి కాదు. 
 మన దేశంలో జీడీపీ డిఫ్లేటర్‌ను కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు శాఖ నిర్ణయిస్తుంది. జీడీపీని త్రైమాసికానికి ఒకసారి చొప్పున ప్రతి ఏడాది కేంద్ర గణాంక సంస్థ లెక్కిస్తుంది. మన దేశంలో గత 7 త్రైమాసికాలుగా జీడీపీ వృద్ధిరేటు క్షీణిస్తూ వస్తుంది. ఇటీవల సవరించిన అంచనాల ప్రకారం 201920 ఏప్రిల్‌ - డిసెంబరు మధ్య కాలంలో కేవలం 5.1%  వృద్ధి రేటు నమోదైంది. 
2012 - 13లో నమోదైన 4.3% తర్వాత ఇదే అతి తక్కువ వృద్ధిరేటు. మన దేశ వృద్ధిరేటు పడిపోయి ప్రపంచ అత్యధిక వృద్ధిరేటు కలిగిన దేశంగా చైనా నిలిచింది. పైన పేర్కొన్న ప్రజల వినియోగం, పెట్టుబడులు, విదేశీ ఎగుమతుల్లో (ప్రైవేటు రంగం) క్షీణత కనిపిస్తుంది. డిమాండ్‌ కొరత వల్ల వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.
ప్రధానంగా కీలక పరిశ్రమల వృద్ధి బాగా తగ్గింది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం ప్రపంచ ప్రగతిపై పడి మన దేశ వృద్ధిరేటు తగ్గుదలకు కారణమైంది. 
2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్‌టీ అమలుచేయడం వల్ల స్వదేశీ మార్కెట్‌లో కొంత అనిశ్చితి ఏర్పడింది. దీనివల్ల ముఖ్యంగా గ్రామీణ ఆదాయాలు తగ్గి, డిమాండ్‌ తగ్గింది. వ్యాపారాల్లో మార్పు సంధి దశలో అనుమానాలు, భయాలు కూడా కొంతమేర అమ్మకాలు పడిపోవడానికి కారణమయ్యాయని నిపుణుల అంచనా.

    నమోదైన వృద్ధిరేటుకు ప్రధాన చోధకం ప్రభుత్వ వ్యయం. ఇప్పటికే ప్రభుత్వం విత్తలోటుకు సమానంగా నిధులు అప్పులుగా తెచ్చి వివిధ కార్యక్రమాలపై వెచ్చిస్తుంది. మన ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటురంగం సుమారు 87% కలిగి ఉన్నా, గత తొమ్మిది నెలల్లో కేవలం 4.01% వృద్ధి నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. అయితే ప్రభుత్వ వ్యయం అంచనాలకు మించి 15.64% పెరిగింది. ఆర్థిక మందగమన కాలంలో ప్రైవేటురంగం వెనకడుగు వేసినప్పుడు ప్రభుత్వ రంగం కీలకపాత్ర పోషించాల్సి వస్తుందని ఇది రుజువు చేస్తుంది.

మార్పులు - గణన
జాతీయాదాయంలో మార్పులను రెండు రకాల మార్కెట్‌ ధరల సహాయంతో గణిస్తారు.

ఆధార సంవత్సర ధరల్లో ( GNP at Base Year or Constant Price)}
    ప్రజలకు అవసరమైన వస్తుసేవలు పెరగడమే నిజమైన అభివృద్ధి. కాబట్టి ధరలతో ప్రమేయం లేకుండా వస్తుసేవల పరిమాణంలో మార్పులు లెక్కించాలి. దీనికి గణాంక శాస్త్రవేత్తలు ఆధార సంవత్సరాన్ని సూచించారు. ఒడిదొడుకులు లేని  సాధారణ పరిస్థితులు కలిగిన సంవత్సరాన్ని ఎన్నుకుంటారు. ఒక నిర్దిష్ట కాల వ్యవధి తర్వాత ఈ ఆధార సంవత్సరాన్ని మారుస్తుంటారు. ఆధార సంవత్సర ధరల్లో తర్వాతి సంవత్సరాల వస్తుసేవల ఉత్పత్తి విలువను లెక్కిస్తారు. దీనివల్ల ధరలు మారకుండా కేవలం వస్తుసేవల పరిమాణం మార్పులను తెలుపుతుంది. ధరలు మారవు కాబట్టి దీన్ని స్థిర ధరల్లో జాతీయాదాయం లేదా వాస్తవిక ఆదాయం అని పిలుస్తారు. మన దేశంలో ఇప్పుడు  ఆధార సంవత్సరంగా 2011 - 12ను ఉపయోగిస్తున్నారు. త్వరలో 2017 - 18కి మారాలని గణాంక మంత్రిత్వ శాఖ ఆలోచిస్తుంది. పట్టికలోని చక్కెర, పాలు, టీ పొడి విలువలను 2011 - 12 నాటి ధరల్లో 2018, 2019 నాటి ఉత్పత్తులను లెక్కిస్తారు. అప్పుడు ధరల్లో మార్పు ఉండకుండా వాస్తవ ఆదాయంలో మార్పులను సులభంగా తెలుసుకోవచ్చు. సాధారణంగా వాస్తవ ఆదాయం కంటే ద్రవ్యోల్బణం సమయంలో ధరలు పెరుగుతుండటం వల్ల నామమాత్ర ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక మాంద్యకాలంలో వాస్తవ ఆదాయం కంటే నామమాత్రపు ఆదాయం తక్కువగా ఉంటుంది. వాస్తవ ఆదాయ విలువను కింది సూత్రం ఆధారంగా లెక్కిస్తారు.


డిఫ్లేటర్‌ అంటే ప్రస్తుత సంవత్సర ధరలకు, ఆధార సంవత్సర ధరలకు మధ్య ఉన్న నిష్పత్తి. ఇది వినియోగదారుల సూచిక మాదిరి (దిశిఖి) ధరల స్థాయిని తెలియజేస్తుంది.

ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం ( GNP at Current Price)
    ఏ సంవత్సరంలో ఉత్పత్తయిన వస్తుసేవల విలువలను అదే సంవత్సర ధరల్లో లెక్కిస్తే దాన్ని నామమాత్రపు జాతీయాదాయం అంటారు. 2018లో ఒక లక్ష కార్లు తయారైతే వాటి విలువను అదే సంవత్సర ధరల్లో లెక్కిస్తాం. ఇక్కడ ధరల మార్పు జాతీయాదాయ విలువపై పడుతుంది. వస్తువుల సంఖ్య పెరిగినా, తగ్గినా, స్థిరంగా ఉన్నా వాటి ధరల్లో పెరుగుదల ఉంటే జాతీయాదాయం పెరుగుతుంది. ధరలు తగ్గితే జాతీయాదాయం తగ్గుతుంది. ఇది ద్రవ్యోల్బణం వల్ల  పెరిగినట్లు కనిపిస్తుంది. అసలైన అభివృద్ధిని తెలుపదు.

పట్టికలో చూపినట్లుగా ధరల్లో మార్పు వచ్చినప్పుడు వస్తువు విలువలో మార్పు కనిపిస్తుంది. కానీ, ప్రజలకు కావాల్సిన వస్తుసేవల పరిమాణంలో మార్పులను ఇది తెలపడం లేదు. 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మాన‌వాభివృద్ధి సూచీ   

      ప్రపంచంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ప్రగతికి కొలమానంగా 1990 నుంచి మానవాభివృద్ధి సూచీ (Human development Index)ని ఉపయోగిస్తున్నాయి. కాలానుగుణంగా సూచిక అంశాలు, లెక్కింపు విధానంలో మార్పులు చెందుతూ ఇది నిత్య జీవన కొలమానంగా కొనసాగుతోంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూఎన్‌డీపీ (United Nations Development programme) 1990 నుంచి ఏటా మానవాభివృద్ధి నివేదికలో ఈ సూచికను తెలుపుతుంది. మానవ శ్రేయస్సును పెంచే అవకాశాలను విస్తృతం చేసే ప్రక్రియనే మానవాభివృద్ధి అంటారు. నిత్య జీవితంలో మనిషి తన ఎదుగుదల కోసం అనేక అంశాలను సేకరిస్తాడు. మానవాభివృద్ధికి తోడ్పడే అనేక అంశాల్లో ఆదాయం ఒకటి అని తీర్మానించారు. ఆర్థికాభివృద్ధి అంతిమంగా మానవాభివృద్ధికి తోడ్పడాలని దేశాల లక్ష్యాల్లో మార్పులు తీసుకొచ్చారు. 

మానవాభివృద్ధి సూచిక - రూపకల్పన
    పాకిస్థాన్‌కు చెందినఆర్థికవేత్త మహబూబ్‌-ఉల్‌-హక్‌ సూచన మేరకు మానవాభివృద్ధికి ప్రధానమైన మూడు అంశాలను  పరిగణనలోకి తీసుకొని 1990లో మొదటిసారి 130 దేశాల గణాంకాల సహాయంతో ర్యాంకులను ప్రకటించారు. ఇది 2018 నాటికి 189 దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం నార్వే ప్రథమ స్థానంలో ఉండగా భారత్‌ 130వ స్థానంలో ఉంది.
1) సుదీర్ఘ ఆరోగ్య జీవనకాల సూచీ(Life expectancy Index)
2) విద్యా సూచిక (Education Index) వయోజన అక్షరాస్యత 2/3 + స్థూల నమోదు నిష్పత్తి 1/3్శ
3) GDP per capita (ppp US $) తో కొలిచే జీవన ప్రమాణ సూచిక (Standerd of living index)
    ప్రతి అంశంలోని కనీస, గరిష్ఠ విలువల ఆధారంగా సూచిక విలువను నిర్ణయిస్తారు. }


    ఈ విలువలను కింది సూత్రంలో ఉపయోగించి సూచిక విలువను లెక్క కడతారు. 


    ప్రతి అంశం విలువను 0 నుంచి 1 మధ్య తెలుపుతారు.

    మానవాభివృద్ధి సూచిక =    

    మానవాభివృద్ధి సూచిక పైమూడు అంశాల సూచికల విలువల సాధారణ సగటు. ఈ సూచిక అనేక విమర్శలను ఎదుర్కొంది.

విమర్శలు
* మానవాభివృద్ధి అనేది విశాలమైన భావన. కేవలం మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవడం సంకుచిత కొలమానం అవుతుంది. వీటి గణాంకాలు వెనుకబడిన దేశాల్లో విశ్వసనీయంగా ఉండవు.
* విద్యా, ఆరోగ్యం, ఆదాయం మూడింటికీ సమ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఏ రెండింటిలో మార్పులకైనా ఒకే విలువను పరిగణిస్తున్నారు. దీంతో విజ్ఞానం పెరగకపోయినా ఆదాయం పెరుగుదలతో అభివృద్ధి చెందినట్లు ఈ సూచీ తెలుపుతుంది. 
* తలసరి ఆదాయాలు పెరిగినా అవి కొంత మంది ధనవంతులవే కావచ్చు. ఆదాయ అసమానతలను తెలియజేయలేదు.
* విజ్ఞానం, ఆరోగ్యం నాణ్యత గురించి పేర్కొనలేదు. ఇవి తలసరి ఆదాయంతో పటిష్ఠ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వీటినే పరిగణనలోకి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. బహుళ విభిన్న అంశాలు ఉంటే మంచిదని కొంత మంది అభిప్రాయం.
* సమగ్ర మానవాభివృద్ధికి అవసరమైన శాంతి, స్వేచ్ఛ, పారదర్శకమైన పాలన, పర్యావరణ పరిరక్షణ గురించి చర్చించలేదు. దేశ ప్రగతిలో సాంకేతిక పరిజ్ఞానం పాత్రను మానవాభివృద్ధి సూచీ విస్మరించింది. ఈ విమర్శలను తగ్గించుకోవడానికి మానవాభివృద్ధి సూచిక నిర్మాతలు ఎప్పటికప్పుడు లెక్కించే అంశాలు, విధానాల్లో మార్పులు తీసుకొస్తున్నారు.

లింగ అభివృద్ధి సూచిక (GDI - 1995)
    మానవాభివృద్ధి సూచికను స్త్రీలకు ప్రత్యేకంగా వర్తింపజేసి అందులోని మూడు అంశాల్లో సాధారణ అభివృద్ధితో పాటు స్త్రీ - పురుషుల మధ్య పంపిణీలో అసమానతలను గుర్తిస్తున్నారు. హెచ్‌డీఐ, జీడీఐ మధ్య తేడా స్త్రీల వెనుకబాటుతనాన్ని తెలియజేస్తుంది.

లింగ సాధికారిక సూచిక (1995)
    ఈ సూచిక ద్వారా మూడు అంశాల ఆధారంగా స్త్రీల సాధికారతను కొలవవచ్చు.
    1) జాతీయ పార్లమెంట్‌లో మహిళలు పొందిన సీట్లు 
    2) ఆర్థిక నిర్ణయ స్థానాల్లో మహిళల శాతం
    3) ఆదాయంలో స్త్రీల వాటా
* వీటిపై కూడా అనేక విమర్శలు వచ్చాయి. సాంకేతిక అంశాలు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. సరైన గణాంకాలు అందుబాటులో లేవు. వివిధ దేశాలతో పోల్చుకోవడం సముచితంగా లేదు.
* అభివృద్ధి చెందిన సమాజాలకు మాత్రమే వర్తిస్తాయి. స్థానిక, గ్రామీణ స్థాయి, అసంఘటిత రంగంలోని స్త్రీల ప్రాధాన్యత,  పాత్రను గుర్తించడం లేదు.

మానవ పేదరిక సూచిక (1997)
    1997లో విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదికలో సరికొత్త కొలమానంగా మానవ పేదరిక సూచిక (Human poverty index)ను ప్రవేశపెట్టారు. మానవ జీవన ప్రమాణాన్ని తెలపడంలో మానవాభివృద్ధి సూచికకు సహాయకారిగా ఉంటూ జీవనకాలం, విద్య, జీవన ప్రమాణాల్లో వెనుకబాటుతనాన్ని తెలియజేస్తుంది. అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలకు వేర్వేరుగా లెక్కించి సామాజిక బహిర్గతను బయటపెడుతుంది.

సూచికలో మార్పులు
రెండు దశాబ్దాల తర్వాత లోపాలను సవరించుకొని 2010 నుంచి కొన్ని మార్పులతో మానవాభివృద్ధి సూచికను గణిస్తున్నారు.

    1) సుదీర్ఘమైన ఆరోగ్య జీవన కాలం లెక్కింపులో మార్పు చేయలేదు. 
    2) విజ్ఞాన సూచిక కోసం రెండు కొత్త అంశాలను ఎంచుకున్నారు.
 a) 25 ఏళ్లు, ఆపైన వయసు గలవారు చదువుకున్న సగటు సంవత్సరాలు. (Mean Years of schooling index - MYSI)
   
        గరిష్ఠంగా ఒక వ్యక్తి 15 సంవత్సరాలు నియత విద్యను పొందుతాడని అంచనా.
b)  పాఠశాలలో 18 ఏళ్ల లోపు పిల్లలు కొనసాగే అంచనా సంవత్సరాలు (Expected years of schooling index - EYSI) 

 చాలా దేశాల్లో మాస్టర్‌ డిగ్రీని 18 ఏళ్లకే పొందుతారు.

3) ఒక దేశానికి విదేశాల్లో ఉన్న తమ పౌరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కలుపుతూ GDP for capita బదులు GNP for capita ఉపయోగించారు. వాటి కనీస, గరిష్ఠ విలువల్లో మార్పులు తీసుకొచ్చారు.
    ఈ మూడింటి సాధారణ సగటు బదులు గుణాత్మక సగటు (geometric mean)ను వాడుతున్నారు.



అసమానతల సర్దుబాటుతో హెచ్‌డీఐ
    యూఎన్‌డీపీ 2010లో ఈ సూచికను ప్రవేశపెట్టింది. మానవాభివృద్ధి సూచిక దాగి ఉన్న మానవాభివృద్ధిని తెలియజేస్తుంది. అసమానతల సర్దుబాటుతో మానవాభివృద్ధి సూచిక(inequality adjusted Human Devolopment Index - IHDI) అసమానతలు లేకుండా వాస్తవంగా సాధించిన అభివృద్ధిని తెలుపుతుంది. ఆరోగ్యం, విజ్ఞానం, ఆదాయాల్లో అసమానతల వల్ల మానవాభివృద్ధికి వాటిల్లిన నష్టాన్ని గుర్తిస్తుంది.

లింగ అసమానతల సూచిక 
   లింగ అభివృద్ధి సూచిక, లింగ సాధికారిక సూచిక (1995) లోని లోపాలను సవరించి 2010లో వాటి స్థానంలో లింగ అసమానతల సూచికను (Gendar Inequality Index - GII) ప్రవేశపెట్టారు. దీన్ని మూడు ప్రధాన అంశాల విలువల ఆధారంగా లెక్కిస్తారు.
1) పునరుత్పాదక ఆరోగ్యం (Reproductive health): దీనిలో మాతా మరణాల నిష్పత్తి (maternal mortality Ratio - MMR), వయోజనుల సంతానోత్పత్తి రేటు(Adolescent Fertility Rate - AFR) అనే రెండు అంశాలు ఉంటాయి. 
2) సాధికారత (Empowerment): దీనిలో పార్లమెంట్‌ సీట్లలో వాటా, ఉన్నత విద్యలో అవకాశాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి.
3) కార్మిక మార్కెట్‌లో భాగస్వామ్యం (Labour market participation)
    ఈ మూడు అంశాల్లో వెనుకబాటుతనం వల్ల మానవాభివృద్ధికి జరిగిన నష్టాన్ని తెలుసుకోవచ్చు.

బహుళ అంశాల పేదరిక సూచిక 
    2010లో మానవ పేదరిక సూచిక స్థానంలో బహుళ అంశాల పేదరిక సూచికను ప్రవేశపెట్టారు.పేదరికాన్ని కేవలం ఆదాయం ఆధారంగా కాకుండా ఒక వ్యక్తి ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలకు చెందిన పది అంశాల ఆధారంగా లెక్కిస్తారు. అయితే అన్ని అంశాలకు చెందిన గణాంకాలు లభ్యం కాకపోవడంతో 100 దేశాల్లో మాత్రమే బహుళ అంశాల పేదరిక సూచిక (Multidimensional Poverty Index)ను లెక్కిస్తున్నారు. అనేక మార్పులు జరుగుతున్నప్పటికీ కొన్ని అధ్యయనాలు మానవాభివృద్ధి సూచికను విమర్శిస్తూనే ఉన్నాయి. 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశంలో జనాభా తీరుతెన్నులు

* ఒక ప్రదేశంలో నివసించే జనసంఖ్యను జనాభా (Population) అంటారు. ఒక ప్రదేశంలో ప్రతీ చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో నివసించే జనసంఖ్యను జన సాంద్రత  (Density) అంటారు.
* మరణాల రేటు తగ్గుతూ, జననాల రేటు పెరుగుతుండటం వల్ల మొత్తం జనాభాలో పెరుగుదల కనిపిస్తుంది. ఇలా జనాభా పెరగడాన్ని ‘జనాభా విస్ఫోటనం’ (Population Explosion) అంటారు. 
* ఆర్థికాభివృద్ధి అనేది భౌతిక, సహజ వనరులపైనే కాకుండా మానవ వనరులపై కూడా ఆధారపడుతుంది.
* మానవ వనరులు అంటే ముఖ్యంగా దేశంలోని జనాభా, వారి విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పౌష్ఠికాహార విధానాలు, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు, ఆదాయ పంపిణీ మొదలైనవి.
* మానవ వనరుల్లో ముఖ్యమైంది జనాభా.
* ఒక దేశంలోని జనాభా గుణాత్మకత  (Quality) అంటే జనాభా పరిమాణం, పెరుగుదల తీరు, పెరుగుదల రేటు అభివృద్ధి ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. అందుకే జనాభా పెరుగుదలను ఒక దేశ అభివృద్ధిని నిర్దేశించే అంశంగా పేర్కొంటారు.  
* ఒక దేశ జనాభా అభిలషణీయ స్థాయి  (Optimum) కంటే తక్కువగా ఉంటే జనాభా పెరుగుదల ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. జనాభా అభిలషణీయ స్థాయిని దాటి ఇంకా పెరిగితే అది అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. సాధించిన ఆర్థికాభివృద్ధి పెరుగుదలనూ హరించివేస్తుంది.
* జనాభా పెరుగుదలకు సంబంధించి పలువురు ఆర్థికవేత్తలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. 
* ‘భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఒక అభివృద్ధి కారకం అవుతాడు’ - ఎడ్విన్‌ కానన్‌
* ‘భూమిపై పుట్టే ప్రతి బిడ్డ నరకాన్ని పెంపొందిస్తాడు’ - మాల్థస్‌
* 1798లో థామస్‌ రాబర్ట్‌ మాల్థస్‌ రాసిన “An Essay on the Principle of Population” గ్రంథంలో  మొదటిసారి శాస్త్రీయ జనాభా సిద్ధాంతాన్ని వివరించారు.
* ఆహార పదార్థాల సప్లయ్‌ వృద్ధికి, జనాభా వృద్ధికి మధ్య ఉన్న సంబంధాన్ని మాల్థస్‌ సిద్ధాంతం వివరిస్తుంది.
* జనాభా గుణశ్రేణిలో  (Geometric progression) పెరుగుతుందని, దీన్ని అరికట్టకుంటే ప్రతీ 25 ఏళ్లకు జనాభా రెట్టింపవుతుందని, ఆహార పదార్థాల ఉత్పత్తి నెమ్మదిగా అంకశ్రేణిలో పెరుగుతుందని మాల్థస్‌ సిద్ధాంతం పేర్కొంది. 
* మన దేశంలో జనాభా పెరుగుదలను అరికట్టేందుకు మొదటి ప్రణాళికా (1951-56) కాలంలో 1952లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే జనాభా నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది.
* మరణాల రేటు క్రమంగా తగ్గుతూ, జననాల రేటు పెరగడం వల్ల భారతదేశంలో జనాభా పెరుగుతోంది. ఇది జనాభా విస్ఫోటనానికి దారితీసింది.


దేశ జనాభా వేగంగా పెరగడానికి కారణాలు
* ఒక దేశ జనాభా వేగంగా పెరిగేందుకు మూడు కారణాలు ఉన్నాయి. అవి;
1. ఎక్కువ జననాల రేటు
2. సాపేక్ష అల్ప మరణాలు రేటు
3. వలస రావడం (భారతదేశ జనాభా వృద్ధిపై వలస ప్రభావం లేదు.)

మరణాల రేటు తగ్గడానికి కారణాలు:
* కరవులను నివారించడం. 
* రోగాల నియంత్రణ.   
* ఇతర కారణాలు
ఉదా: తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, విద్యా, వైద్య సౌకర్యాలను మెరుగుపరచడం.

 

అధిక జననాల రేటుకు కారణాలు:
జననాల రేటు పెరగడానికి రెండు రకాల కారణాలు -
1. ఆర్థిక కారణాలు    2. సాంఘిక కారణాలు


ఆర్థిక కారణాలు
1. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం 
2. నగరీకరణ
3. పేదరికం


సాంఘిక కారణాలు
1. వివాహానికి సర్వజన అంగీకారం 
2. చిన్న వయసులో వివాహం 
3. మతపరమైన సాంఘిక మూఢనమ్మకాలు
4. ఉమ్మడి కుటుంబం
5. నిరక్షరాస్యత
6. గర్భ నిరోధక పద్ధతులను పరిమితంగా ఉపయోగించడం


జాతీయ గణాంక సంస్థ నివేదిక
* జాతీయ గణాంక సంస్థ (National Statistical Office n- NSO), భారత ప్రభుత్వ కార్యక్రమాల అమలు, గణాంకాల మంత్రిత్వశాఖ (Ministry of Statistics and Programme Implementation Government of India - MOSPI) ఉమ్మడిగా ‘భారతదేశంలో మహిళలు, పురుషులు (Women and Men in India) - 2020 నివేదికను 2021, మార్చి 26న విడుదల చేశాయి.
* 2021లో మనదేశంలో మొత్తం జనాభా 136.13 కోట్లు ఉందని, స్త్రీ జనాభా శాతం 48.65%గా ఉన్నట్లు ఎన్‌ఎస్‌ఓ ప్రకటించింది. దేశంలో సగటు వార్షిక జనాభా వృద్ధిరేటు 2011లో 1.63% ఉండగా 2016 నాటికి 1.27 శాతానికి, 2021 నాటికి 1.07 శాతానికి తగ్గినట్లు పేర్కొంది.  
* ప్రతీ 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్యను తెలిపేది స్త్రీ - పురుష నిష్పత్తి. దేశవ్యాప్తంగా 2001లో స్త్రీ - పురుష నిష్పత్తి 933గా నమోదైంది. 2011 నాటికి 943కి, 2021 నాటికి 948కి పెరిగింది. 
* ప్రసవ సమయంలో పౌష్ఠికాహార లోపం వల్ల, వైద్య సదుపాయాలు లేక అనేకమంది స్త్రీలు మరణిస్తుంటారు. ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ వీరిని ‘మిస్సింగ్‌ ఉమెన్‌’గా పేర్కొన్నారు.
* 2011లో స్త్రీ - పురుష నిష్పత్తికి సంబంధించి దిల్లీలో 5.7%, చండీగఢ్‌లో 5.3%, అరుణాచల్‌ ప్రదేశ్‌ లో 5% పెరుగుదల నమోదైంది. డామన్‌ డయ్యూలో స్త్రీ, పురుష నిష్పత్తి 13 శాతం తగ్గింది.
* 2011లో 0 నుంచి 19 ఏళ్ల వారిలో స్త్రీ-పురుష నిష్పత్తి 908గా ఉంది. 15 - 59 మధ్య వయసువారిలో ఈ నిష్పత్తి 944  కాగా 60 కంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో స్త్రీ-పురుష నిష్పత్తి 1033గా నమోదైంది.
* శాంపుల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (SRS) ప్రకారం 2015-17లో స్త్రీ, పురుష నిష్పత్తి 896గా, 2016-18లో 899గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిష్పత్తి 2015-17లో 898 కాగా, 2016-18లో 900కి పెరిగింది. పట్టణాల్లో 2015-17లో 890 ఉండగా, 2016-18 మధ్య 897గా ఉంది.
* దేశంలో స్త్రీల వివాహ వయసు 2018లో 22.3 సంవత్సరాలుగా ఉంది. 2017 నుంచి 0.2 సంవత్సరాలు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల వివాహ వయసు 2017 నుంచి 2018 వరకు 0.1 సంవత్సరం; పట్టణాల్లో 0.3 సంవత్సరాలు పెరిగింది.


ప్రపంచ జనాభా స్వరూపం
* 1830 నాటికి ప్రపంచ జనాభా 100 కోట్లు (ఒక బిలియన్‌). 1930 నాటికి ఇది రెట్టింపైంది. 1960 నాటికి ప్రపంచ జనాభా 3 బిలియన్లకు (300 కోట్లు) చేరగా, 1975 నాటికి 4 బిలియన్లకు (400 కోట్లకు), 1987 నాటికి 5 బిలియన్లకు (500 కోట్లు) పెరిగింది. 5వ బిలియన్‌ చివరి శిశువు 1987, జులై 11న యుగోస్లేవియాలో జన్మించాడు. అందుకే జులై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా పరిగణిస్తారు.
* యూఎన్‌పీఎఫ్‌  (United Nations Population Fund - అంతకు ముందు దీన్ని యూఎన్‌ ఫండ్‌ ఫర్‌ పాపులేషన్‌ యాక్టివిటీస్‌గా (UNFPA) పిలిచేవారు.) నివేదిక ప్రకారం 1999, అక్టోబరు 12 నాటికి ప్రపంచ జనాభా 6 బిలియన్లకు (600 కోట్లు) చేరింది. దీన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ఆ రోజును 6వ బిలియన్‌ రోజుగా ్బ (6th day of Billion)  ప్రకటించింది. 2011 నాటికి ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరింది.
* యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ (UNPF) స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ - 2021 నివేదిక ప్రకారం 2021, ఏప్రిల్‌ నాటికి ప్రపంచ జనాభా 787.5 కోట్లకు చేరింది. ఈ నివేదిక ప్రకారం 2021 నాటికి చైనా జనాభా 144.42 కోట్లు, భారత్‌ జనాభా 139.34 కోట్లు. యూఎస్‌ఏ జనాభా 33.29 కోట్లు, ఇండోనేసియా జనాభా 27.64 కోట్లు, పాకిస్థాన్‌ జనాభా 22.52 కోట్లకు చేరింది. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (NSO) 2021, మార్చి 26న విడుదల చేసిన  ‘భారత్‌లో మహిళలు, పురుషుల నివేదిక - 2020’ ప్రకారం 2021 నాటికి భారతదేశ జనాభా 136.13 కోట్లు.
* 1921కి ముందు మనదేశంలో జనాభా పెరుగుదల చాలా స్వల్పంగా ఉండేది. కరవులు, అంటువ్యాధుల కారణంగా 1911-21 దశాబ్దంలో జనాభా తగ్గింది. అందుకే 1921ని ‘గొప్ప విభాజక సంవత్సరం’గా పేర్కొంటారు.

 

దేశంలో మతాలవారీగా  స్త్రీ, పురుష నిష్పత్తి (2011)

హిందువులు 939
ముస్లింలు 951
క్రిస్టియన్లు 1023
సిక్కులు 903
బౌద్ధులు 965
జైనులు 954

ఆధారం: ఎన్‌ఎస్‌ఓ ‘భారతదేశంలో మహిళలు, పురుషులు - 2020’ నివేదిక.


జనాభా పెరుగుదల నిర్మూలన చర్యలు
జనాభా పెరుగుదలను నివారించడానికి మూడు రకాల చర్యలు అవసరం. అవి;
1. ఆర్థిక చర్యలు     2. సాంఘిక చర్యలు  
3. కుటుంబ నియంత్రణ పథకం


ఆర్థిక చర్యలు
* పారిశ్రామిక రంగ విస్తరణ
* ఉద్యోగ అవకాశాల కల్పన
* సమానత్వంతో కూడిన ఆదాయ పంపిణీ, పేదరిక నిర్మూలన.


సాంఘిక చర్యలు
* జనాభా విస్ఫోటనం ఆర్థిక సమస్యతో పాటు సాంఘిక సమస్య కూడా. జననాల రేటును తగ్గించడానికి సాంఘిక దురాచారాలను రూపుమాపాలి.
* విద్య నీ స్త్రీల హోదా నీ వివాహ వయసును పెంచడం

 

కుటుంబ నియంత్రణ పథకానికి ప్రాధాన్యం
* ప్రభుత్వ సమాచార పథకం
* ప్రోత్సాహకాలు, నిరుత్సాహకాలు
* కుటుంబ నియంత్రణ కేంద్రాలు

 

ఆరోగ్య గణాంకాలు

(Health Statistics)


* ఏడాదిలోపు వయసున్న ప్రతీ 1000 మంది శిశువుల్లో మరణించే వారి సంఖ్యను తెలిపేదే శిశుమరణాల రేటు (Infant Mortality Rate – IMR). 2014లో ఈ రేటు 39 ఉండగా, 2018 నాటికి 32కి తగ్గింది. పౌష్ఠికాహార సమస్యలు, మెరుగైన ఆరోగ్య, వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల శిశు మరణాలు సంభవిస్తున్నాయి.

* ఒక దేశంలో ఏటా ప్రతీ లక్షమంది తల్లులకు (ప్రసవ సమయంలో) మరణించే తల్లుల సంఖ్యను మాతా, శిశుమరణాల రేటు (Maternal Mortality Rate – MMR) అంటారు. 200709 మధ్య ఈ రేటు 212 ఉండగా, 201618 మధ్య 113గా ఉంది. 

* ఏదైనా దేశంలో ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో తెలిపే సంఖ్యను సంతాన ఉత్పత్తి రేటు (Total Fertility Rate – TFR) అంటారు. 2018లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 2.3 ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 1.7 గా ఉంది.

* ఒక వ్యక్తి సగటున ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో తెలిపేది సగటు జీవిత కాలం. 202125 మధ్య మనదేశంలో స్త్రీల సగటు జీవితకాలం 72.66 సంవత్సరాలు ఉంటుందని, పురుషుల సగటు జీవితకాలం 69.37  సంవత్సరాలు ఉంటుందని అంచనా. 203136 మధ్య స్త్రీల సగటు జీవిత కాలం 74.66 సంవత్సరాలుగా, పురుషుల సగటు జీవితకాలం 71.17 సంవత్సరాలుగా ఉంటుందని అంచనా. 

* స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ ‘యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌’ 2021, ఏప్రిల్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021లో మనదేశంలో సంతాన ఉత్పత్తిరేటు 2.2 గా ఉంది. పురుషుల సగటు జీవితకాలం 69 సంవత్సరాలు, స్త్రీల సగటు జీవితకాలం 71 సంవత్సరాలుగా ఉంది.

విద్యారంగం - అక్షరాస్యత 

1951లో మనదేశంలో మొత్తం అక్షరాస్యత రేటు 18.3%. ఇందులో స్త్రీల అక్షరాస్యత 8.9% కాగా పురుషుల అక్షరాస్యత 27.2%. 

* 2011 గణాంకాల ప్రకారం మనదేశ మొత్తం అక్షరాస్యత రేటు 73%. ఇందులో స్త్రీల అక్షరాస్యత రేటు 64.6%, పురుషుల అక్షరాస్యత 80.9%గా ఉంది. ‘జాతీయ గణాంక సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) రూపొందించిన 'Women
and Men in India-2020' నివేదిక ప్రకారం 2017 నాటికి మనదేశ మొత్తం అక్షరాస్యత రేటు 77.7%. ఇందులో స్త్రీల అక్షరాస్యత రేటు 70.3%, పురుషుల అక్షరాస్యత రేటు 84.7%గా ఉంది.  

* 1951లో మొత్తం గ్రామీణ అక్షరాస్యత రేటు 12.1%గా ఉంది. ఇందులో గ్రామీణ స్త్రీల అక్షరాస్యత రేటు 4.9%, గ్రామీణ పురుషుల అక్షరాస్యత రేటు 19%గా ఉంది. 2011లో మొత్తం గ్రామీణ అక్షరాస్యత రేటు 66.8%. ఇందులో గ్రామీణ స్త్రీల అక్షరాస్యత 57.9%, గ్రామీణ పురుష అక్షరాస్యత 77.2%గా ఉంది.

* 2017లో మొత్తం గ్రామీణ అక్షరాస్యత 73.5% గా ఉంది. ఇందులో గ్రామీణ స్త్రీల అక్షరాస్యత 65%, గ్రామీణ పురుషుల అక్షరాస్యత 81.5% గా ఉంది.

* 1951లో మనదేశంలో మొత్తం పట్టణ అక్షరాస్యత 34.6%గా ఉంది. ఇందులో పట్టణ స్త్రీల అక్షరాస్యత రేటు 22.3%, పట్టణ పురుష అక్షరాస్యత రేటు 45.6% గా ఉంది.

* 2011లో మనదేశంలో మొత్తం పట్టణ అక్షరాస్యత 84.1%. ఇందులో పట్టణ స్త్రీల అక్షరాస్యత 79.1%, పట్టణ పురుష అక్షరాస్యత 88.8% గా ఉంది.

* 2017లో మొత్తం మనదేశంలో పట్టణ అక్షరాస్యత 87.7%. ఇందులో పట్టణ స్త్రీల అక్షరాస్యత 82.8% కాగా, పట్టణ పురుషుల అక్షరాస్యత రేటు 92.2%గా ఉంది.

* ఎన్‌ఎస్‌ఓ - 2020 నివేదిక ప్రకారం 2017 నాటికి మనదేశంలో అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలు వరుసగా కేరళ (96.2%), ఉత్తరాఖండ్‌ (87.6%), హిమాచల్‌ప్రదేశ్‌ (86.6%), అసోం 

(85.9%), మహారాష్ట్ర (84.8%). 

* 2017 నాటికి మనదేశంలో అక్షరాస్యత ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం - దిల్లీ (88.7%).

* 2017 నాటికి తెలంగాణలో మొత్తం అక్షరాస్యత 72.8% గా ఉంది. ఇందులో స్త్రీల అక్షరాస్యత 65.1%, పురుషుల అక్షరాస్యత 80.5% గా ఉంది. 

* 2017 నాటికి అతి తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ్బ66.4%్శ. ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 73.4%గా, స్త్రీల అక్షరాస్యత రేటు 59.5%గా ఉంది.

* జాతీయ గణాంక సంస్థ 2021 నివేదిక ప్రకారం 2018 నాటికి మనదేశంలో ప్రతీ 1000 మంది శిశువుల్లో 32 మంది మరణించారు.

* 2011 నాటికి మనదేశ మొత్తం అక్షరాస్యత రేటు 73% కాగా 2017 నాటికి 77.7 శాతానికి పెరిగింది. 

* 2017 నాటికి మనదేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కేరళ. తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.

* ప్రతీ 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్యను తెలిపేది స్త్రీ పురుష నిష్పత్తి.

* మరణాల రేటు తగ్గి, జననాల రేటు పెరగడాన్ని జనాభా విస్ఫోటనం అంటారు.

మాదిరి ప్రశ్నలు

1. జాతీయ గణాంక సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) వెలువరించిన ‘భారతదేశంలో మహిళలు, పురుషుల నివేదిక - 202021’ ప్రకారం 2021 నాటికి భారతదేశ జనాభా ఎంత?

1) 136.13 కోట్లు       2) 143.13 కోట్లు  

3) 121.13 కోట్లు       4) 128.13 కోట్లు

2. ఎన్‌ఎస్‌ఓ - 2021 నివేదిక ప్రకారం కిందివాటిలో మనదేశంలో దశాబ్ద జనాభా వృద్ధిరేటుకు సంబంధించి సరైంది ఏది? 

1) 2011 నాటికి 1.63% వృద్ధి నమోదైంది.   

2) 2016 నాటికి 1.27% వృద్ధి నమోదైంది.

3) 2021 నాటికి 1.07 శాతం తగ్గింది.     

4) పైవన్నీ

3. ఎన్‌ఎస్‌ఓ - 2021 నివేదిక ప్రకారం 2021 నాటికి మనదేశంలో ప్రతీ  1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య ఎంత? (2011 నాటి జనాభా లెక్కల ప్రకారం ఇది 943 గా ఉంది.)

1) 946    2) 947    3) 948  4) 949

4. అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

1) జులై 10       2) జులై 11   

3) జులై 12       4) జులై 13

5. యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్స్‌ ఫండ్‌ ‘స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ - 2021’ నివేదిక ప్రకారం 2021, ఏప్రిల్‌ నాటికి మొత్తం ప్రపంచ జనాభా ఎంత?

1) 787.5 కోట్లు       2) 790 కోట్లు   

3) 1000 కోట్లు       4) 900 కోట్లు

6. యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్స్‌ ఫండ్‌ ‘స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ - 2021’ నివేదిక ప్రకారం అధిక జనాభా ఉన్న దేశాల వరుసక్రమం ఏది?

1) చైనా, భారత్, అమెరికా, ఇండోనేసియా, పాకిస్థాన్‌

2) చైనా, భారత్, ఇండోనేసియా, అమెరికా, పాకిస్థాన్‌

3) చైనా, భారత్, బ్రిటన్, అమెరికా, ఇండోనేసియా

4) చైనా, బ్రిటన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, అమెరికా

7. ఒక ప్రదేశంలో ప్రతీ చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో నివసించే జనసంఖ్యను ఏమంటారు?

1) జనాభా               2) జనసాంద్రత  

3) జనాభా విస్ఫోటనం   4) పైవన్నీ

8. ‘భూమిపై పుట్టే ప్రతీబిడ్డ ఒక అభివృద్ధి కారకం అవుతాడు’ అని పేర్కొన్నది ఎవరు?

1) థామస్‌ రాబర్ట్‌ మాల్థస్‌    2) ఎడ్విన్‌ కానన్‌ 

3) మాలిని బాలసింగం       4) పై అందరూ

9. ‘భూమిపై పుట్టే ప్రతిబిడ్డ నరకాన్ని పెంపొందిస్తాడు’ అని నిర్వచించింది ఎవరు?

1) మార్షల్‌       2) థామస్‌ రాబర్ట్‌ మాల్థస్‌   

3) లార్డ్‌ రిప్పన్‌   4) ఎడ్విన్‌ కానన్‌

10. 1798లో 'An Essay on the Principles of Populatione' అనే గ్రంథంలో తొలిసారి శాస్త్రీయ జనాభా సిద్ధాంతాన్ని వివరించింది ఎవరు?

1) థామస్‌ రాబర్ట్‌ మాల్థస్‌  2) ఎడ్విన్‌ కానన్‌ 

3) జేఎమ్‌ కీన్స్‌          4) మాలిని బాలసింగం

11. మనదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్నిFamily Planning Programme) ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

1) 1951   2) 1952   3) 1953   4) 1954

12. ప్రపంచంలో జనాభాపరంగా రెండోస్థానంలో ఉన్న దేశం?

1) భారత్‌  2) ఇండోనేసియా 3) అమెరికా 4) బ్రెజిల్‌ 

 

సమాధానాలు

1-1, 2-4, 3-3, 4-2, 5-1, 6-1, 7-2, 8-2, 9-2, 10-1, 11-2, 12-1.

Posted Date : 03-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వ్యవసాయాభివృద్ధి - వ్యూహాలు - మార్పులు

ఆహార భద్రత.. ఆర్థిక సుస్థిరత!

  ప్రాచీనకాలం నుంచి ప్రజల జీవనానికి, ఉపాధికి ప్రధాన ఆధారం వ్యవసాయం. భిన్న నైసర్గిక స్వరూపాల మధ్య ప్రాంతాలవారీగా విభిన్న రీతుల్లో, వివిధ పద్ధతుల్లో సేద్యం సాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతోంది. ఆధునిక సాగు విధానాలు ఆహార భద్రతకు, ఆర్థిక సుస్థిరతకు దోహదపడినప్పటికీ కొన్ని అనర్థాలకూ కారణమయ్యాయి. దాంతో సంప్రదాయ సేంద్రీయ సేద్యం, ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో దేశాభివృద్ధిలో వ్యవసాయరంగం పాత్ర, సాగు రకాలు తదితర అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 

  

భూమిని దున్ని పంటలు సాగు చేయడాన్ని వ్యవసాయం అంటారు. పంటల సాగుతో పాటు మొక్కలు పెంచడం, పశువుల పోషణ, కోళ్లు, చేపల పెంపకం లాంటివన్నీ వ్యవసాయంలో భాగమే. మానవుడు సంచార జీవనం నుంచి స్థిర నివాస జీవనం ప్రారంభించిన కాలం నుంచే సాగు మొదలైంది. నాటి నుంచే మానవుడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం ప్రారంభించాడు. సాంఘిక జీవనానికి వ్యవసాయం పునాది వంటిది. ప్రాంతం, శీతోష్ణస్థితి, భూసారం, నీటిపారుదల, సాంకేతిక పరిజ్ఞాన లభ్యత, యాంత్రీకీకరణ లాంటి అంశాలపై వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. పారిశ్రామిక విప్లవం వల్ల సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం హరితవిప్లవానికి దారితీసింది. దాని ద్వారా వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ హరిత విప్లవం అధికంగా నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాలకే పరిమితమైంది.

  2020-21 భారత ఆర్థిక సర్వే ప్రకారం నేటికీ దేశ జనాభాలో 54.6 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. జాతీయాదాయంలో 18.8% శాతం వ్యవసాయ రంగం నుంచే వస్తోంది. భారత ప్రభుత్వం మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. 1966 - 69 మధ్య కాలంలో అనుసరించిన నూతన వ్యవసాయ వ్యూహం హరిత విప్లవసాధనకు ఉపయోగపడింది. సాగు నీటిపారుదల సౌకర్యాలు అధికమై సాగు భూమి విస్తీర్ణం పెరిగింది. పంటల తీరులో మార్పు వచ్చి వాణిజ్య పంటల ప్రాధాన్యం పెరిగింది. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు సంస్థాగత పరపతిని విస్తృతం చేశాయి.

  మన దేశంలో వ్యవసాయం రుతుపవనాలపై ఆధారపడి ఉంది. అవి ఆలస్యమైనా, ఆగిపోయినా వ్యవసాయం విఫలమవుతుంది. అందువల్ల మన వ్యవసాయాన్ని ‘రుతుపవనాలతో ఆడే జూదం’గా స్వీడిష్‌ ఆర్థికవేత్త గున్నార్‌ మిర్దాల్‌ వర్ణించాడు. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక మార్పు ప్రధానంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల పనితీరుపై ఆధారపడుతుంది. గ్రామీణ ప్రజల జీవనోపాధి, ఉద్యోగిత, ఆహార భద్రత విషయంలో వ్యవసాయ రంగం ముఖ్య పాత్ర పోషిస్తోంది.ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం మూడు రకాలుగా దోహదపడుతుంది

 

ఉత్పత్తి సహకారం: ప్రజలందరికీ ఆహార ధాన్యాలు సరఫరా చేయండంతో పాటు పారిశ్రామిక రంగానికి కావాల్సిన ముడి పదార్థాలను సమకూరుస్తుంది. 

 

కారక సహకారం: అభివృద్ధి చెందిన వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగానికి అవసరమయ్యే శ్రమ, మూలధనాన్ని బదిలీ చేస్తుంది. అలాగే వ్యవసాయ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. 

 

మార్కెట్‌ సహకారం:  సరఫరా, డిమాండ్‌ పరస్పరం ఆధారపడటాన్నే మార్కెట్‌ సహకారం అంటారు. దేశీయ, విదేశీ మార్కెట్లకు ఉత్పత్తులను వ్యవసాయ రంగం సరఫరా చేస్తుంది. ఇతర రంగాల నుంచి కొన్ని ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంది.

 

ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ ప్రాధాన్యం

* స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం గణనీయ వాటా కలిగి ఉంది.

* అధిక ఉద్యోగితను కల్పిస్తుంది.

* పరిశ్రమలకు ముడిపదార్థాలను అందిస్తుంది

* పారిశ్రామిక వస్తువులకు గిరాకీ సృష్టిస్తుంది.

* మూలధన సమీకరణ చేస్తుంది.

* ఆహార భద్రతను కల్పిస్తుంది.

* ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది.

* నిరుద్యోగం, పేదరిక నిర్మూలనకు దోహదపడుతుంది. 

* వ్యవసాయ ఎగుమతులు జరుగుతాయి.

* పండ్లు, కూరగాయలకు తరగని డిమాండ్‌ ఉంటుంది.

 

వ్యవసాయం - రకాలు

వ్యవసాయం ఒక ప్రాంతం, శీతోష్ణస్థితి, భూసారం, నీటి పారుదల, సాంకేతిక పరిజ్ఞానం లభ్యత లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రాంతీయ వ్యత్యాసాన్ని బట్టి వ్యవసాయాన్ని వివిధ రకాలుగా వర్గీకరించారు.

 

విస్తాపన వ్యవసాయం: దీన్ని స్థల మార్పిడి వ్యవసాయం అని కూడా అంటారు. ఇందులో అటవీ ప్రాంతాన్ని చదును చేసి పంటలు సాగు చేస్తారు. విస్తాపన వ్యవసాయం పూర్తిగా మనిషి శ్రమతోనే నడుస్తుంది. నాలుగైదేళ్ల తర్వాత భూసారం తగ్గుతుంది. అప్పుడు ఆ భూమిని వదిలి వేరే చోట అడవిని చదును చేసి పంటలు పండిస్తారు. ప్రధానంగా అటవీ ప్రాంతాల్లోని ఆటవిక తెగల వారు ఇలాంటి సాగు చేస్తారు.

 

స్థిర వ్యవసాయం: ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకొని ఒకే భూమిలో వ్యవసాయం చేస్తుంటారు. భూసారం తగ్గినప్పుడు దాన్ని సారవంతం చేయడానికి కొంత భూభాగాన్ని బీడుగా ఉంచి కొన్నేళ్ల తర్వాత మళ్లీ సాగు చేస్తారు.

 

జీవనాధార వ్యవసాయం: ఈ వ్యవసాయ ప్రధాన ఉద్దేశం గృహ, ఆహార అవసరాల కోసం పంటలు పండించడం. ఈ విధానంలో ఎక్కువగా ఆహార పంటలే పండిస్తారు.

 

వాణిజ్య వ్యవసాయం: అధిక దిగుబడి కోసం ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం. 

ఉదా: అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, తెగులు నివారణ మందులను ఉపయోగిస్తారు. ఇందులో ఆదాయాన్ని ఆర్జించడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. 

 

విస్తృత వ్యవసాయం: ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూమిలో అధిక పెట్టుబడితో సాగు చేయడాన్ని విస్తృత వ్యవసాయం అంటారు. ఈ పద్ధతిలో ఎక్కువ మంది కూలీలతో పాటు యంత్రాలను ఉపయోగిస్తారు.సాంద్ర వ్యవసాయం: తక్కువ విస్తీర్ణ భూమిలో ఆధునిక పద్ధతిలో సాగుచేసి ఎక్కువ దిగుబడిని పొందడాన్ని సాంద్ర వ్యవసాయం అంటారు.

 

మెట్ట సేద్యం: సాధారణంగా సహజ వర్షపాతంపై మాత్రమే ఆధారపడే భూములను మెట్ట భూములు అంటారు. 50 నుంచి 120 సెంటీమీటర్ల వరకు వర్షపాతం లభించే భూములను మెట్ట భూములుగా పరిగణిస్తారు. వీటికి నీటిపారుదల సదుపాయం ఉండదు. భారతదేశంలో 94 మిలియన్‌ హెక్టార్ల మెట్టభూమి ఉంది. దేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో 40 శాతం మెట్ట భూముల నుంచే లభిస్తోంది. వీటిలో పండే ప్రధాన పంటలు జొన్న, మొక్కజొన్న, రాగి, సజ్జ, కందులు, మినుములు, పెసలు, నువ్వులు, వేరుశనగ. దేశంలో సుమారు 120 మెట్టసాగు జిల్లాలు ఉన్నాయి. ఇందులో 91 జిల్లాలు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయి. మెట్ట నేలలో తేమ శాతంతో పాటు నత్రజని, భాస్వరం లాంటి పోషకపదార్థాలు తక్కువగా ఉండి ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. ఎక్కువగా చిన్నకమతాలుగా ఉండే ఈ భూములు నేల కోత, కరవుకు గురవుతూ ఉంటాయి. దేశంలో నేటికీ 50 శాతం పైగా పంట భూములు వర్షపాతం మీదే ఆధారపడుతున్నాయి. ఇటీవలి కాలంలో పోషక విలువలున్న చిరుధాన్యాల వినియోగం పెరుగుతోంది. ఈ ధాన్యాల ఉత్పత్తి భారీగా పెరగాల్సిన ఆవశ్యకత దృష్ట్యా మెట్ట సాగు ప్రాధాన్యం పెరిగింది.

 

సేంద్రియ వ్యవసాయం: అధిక దిగుబడుల కోసం రైతులు రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడటంతో సేద్యపు భూములు కలుషితమయ్యాయి. భూసారం క్షీణించిపోయింది. చీడపీడలు నిరోధక శక్తి పెంచుకోవడంతో, నేలలో ఉండే వ్యవసాయానికి మేలు చేసే సూక్ష్మజీవులు నశించిపోయాయి. రసాయన ఎరువులు, పురుగుమందులతో పంట దిగుబడులు పెరగకపోగా, అనర్థాలు ఎక్కువయ్యాయి. సాగు వ్యయం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయం ముందుకొచ్చింది. ఇందులో సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులు ఉపయోగిస్తారు. వ్యవసాయ, పశు వ్యర్థాలు, రాలిన ఆకులు ఎరువులుగా వినియోగమవుతాయి. పంట మార్పిడి, అంతర పంటల సాగు ఉంటుంది. భూమిలో సూక్ష్మజీవులు, వానపాముల సంఖ్య పెరిగి భూసారం పెరుగుతుంది. సేద్యపు ఖర్చుల తగ్గి పంట దిగుబడులు పెరుగుతాయి.

* కేంద్ర ప్రభుత్వం సేంద్రియ సాగును ప్రోత్సహించడానికి 2015లో పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి.

 

ప్రకృతి వ్యవసాయం (జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌): ప్రకృతి వ్యవసాయం భావనను తొలిసారిగా 1975లో జపాన్‌కు చెందిన ఒక రైతు ప్రవేశపెట్టాడు. భారతదేశంలో ఈ విధానానికి సుభాష్‌ పాలేకర్‌ విస్తృత ప్రచారం కల్పించారు. ఇది ‘జీరో బడ్జెట్‌’ అంటే ఖర్చు లేని వ్యవసాయం. విత్తనాలు, ఎరువులకు పెట్టుబడి అవసరం ఉండదు. విత్తనాలను రైతులే తమ పంట నుంచి తయారు చేసుకుంటారు. మట్టిలోని సూక్ష్మజీవులు, వానపాములే మొక్కల పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి. ఎరువులు వాడే పనిలేదు. ప్రకృతిలో దొరికే వాటితోనే భూమికి బలాన్ని ఇవ్వవచ్చు. అందుకే ఈ సాగు పద్ధతిలో ఖర్చులు ఉండవు.

  దేశీయ ఆవు పేడ, మూత్రంతో భూసారం పెంచే ద్రావణాలు (బీజామృతం, జీవామృతం) తయారుచేసుకొని భూమికి తిరిగి జవసత్వాలను అందించడం, రసాయనిక అవశేషాలు లేని ఆహారాన్ని పండించుకోవడం సుభాష్‌ పాలేకర్‌ పద్ధతిలోని ప్రత్యేకత. పొడిసున్నం, పొడిమట్టి, బెల్లం, బావి/బోరు/నది నీరును కూడా ఈ ద్రావణాల్లో కలుపుతారు. ‘భూమి అన్ని పోషకాలున్న అన్నపూర్ణ. పోషకాలను మొక్కల వేర్లు గ్రహించగలిగే రూపంలోకి మార్చేది సూక్ష్మజీవరాశి. వాటిని పెంపొందించే జీవామృతం, ఘనజీవామృతం ఇచ్చి వీలైన పద్ధతిలో మల్చింగ్‌ చేస్తే చాలు’ అంటారు పాలేకర్‌. పొలంలో పలు రకాల అంతర పంటలు వేయడం ద్వారా పంటల జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకునే వీలుండటం ప్రకృతి వ్యవసాయంలోని మరో ప్రత్యేకత. పండ్ల తోటల సాళ్ల మధ్య అడుగులోతు వరకు కందకాలు తీయడం ద్వారా వాననీటి సంరక్షణ చేపట్టి కరవు పరిస్థితులను తట్టుకునేలా చేస్తారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 50 లక్షల మంది (2019-20 కేంద్ర బడ్జెట్‌ ఆధారం) రైతులు అప్పుల నుంచి విముక్తి పొందారని పాలేకర్‌ తెలిపారు. నాణ్యమైన, పోషక ఔషధ విలువలతో కూడిన సహజాహారం పండించే రైతులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకొని నేరుగా వినియోగదారులకు అమ్మితే వ్యవసాయ సంక్షోభం పరిష్కారమవుతుందని తెలిపారు.           

  జీరో బడ్జెట్‌ వ్యవసాయం దిశగా దేశం ముందుకుసాగాలని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు పూర్వపద్ధతుల వైపు మళ్లాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2019-20 బడ్జెట్‌ ప్రకటనలో తెలిపారు. యూఎన్‌ఓకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) కూడా సహజ వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చింది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి 2020 - 21లో రాష్ట్రాలకు కేంద్రం దాదాపు రూ.49.91 కోట్లు ఇచ్చింది. 2025 నాటికి 3.50 లక్షల హెక్టార్ల భూమిని ఈ విధానం కిందకి తీసుకురావాలనేదే లక్ష్యం. కర్ణాటకలో సుభాష్‌ పాలేకర్, రైతు సంఘాలతో కలిసి దీన్ని ఒక ఉద్యమంలా చేపట్టారని, తర్వాత మిగతా రాష్ట్రాలు అనుసరించాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. నీతిఆయోగ్‌ సైతం రైతులతో శూన్య బడ్జెట్‌ వ్యవసాయం చేయించాలని రాష్ట్రాలకు సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మేరకు రైతులకు శిక్షణ శిబిరాలు నిర్వహించింది.

  సుస్థిర వ్యవసాయం: నిలకడ కలిగిన వ్యవసాయాన్ని ప్రోత్సహించడాన్ని సుస్థిర వ్యవసాయం అంటారు. దీనిలో భాగంగా 2014-15లో జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌ (నేషనల్‌ మిషన్‌ ఫర్‌ సస్టయిన్‌బుల్‌ అగ్రికల్చర్‌ - ఎన్‌ఎంఎస్‌ఎ) అమల్లోకి వచ్చింది. వ్యవసాయాన్ని మరింత ఉత్పాదకతతో సుస్థిర కార్యకలాపంగా, లాభదాయకంగా, వాతావరణ ఒడిదొడుకులు తట్టుకునేలా అభివృద్ధి చేయడం ఈ మిషన్‌ లక్ష్యం. దీనికోసం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సంఘటిత సేద్యపు వ్యవస్థలను ప్రోత్సహిస్తారు. భూసారాన్ని, నేలలో తేమను సంరక్షించడానికి చర్యలు తీసుకుంటారు. 12వ ప్రణాళిక (2012-17)లో ఏడు అంశాలను వ్యవసాయ శాఖ పథకాలు/కార్యక్రమాలు/మిషన్లలో అంతర్భాగం చేశారు. నీటి నిర్వహణ సామర్థ్యాలను పెంచే పద్ధతులు, వర్షాధార సాంకేతిక పద్ధతులను విస్తృతం చేయాలనేది ఈ మిషన్‌ లక్ష్యం.

 

1) వర్షాధార ప్రాంతాల అభివృద్ధి, సంఘటిత వ్యవసాయ వ్యవస్థ

వర్షాధార ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం 2011 - 12 నుంచి 2013 - 14 వరకు రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కార్యక్రమంలో భాగంగా అమలైంది. సన్నకారు, ఉపాంత రైతులకు గరిష్ఠ ప్రతిఫలం వచ్చేలా ప్యాకేజీని అందించి వారి జీవితాల నాణ్యతను పెంచడం దీని లక్ష్యం. 2014 - 15లో జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌లో దీన్ని ఉపమిషన్‌గా కలిపారు. ఈ పద్ధతిలో పంటల వ్యవస్థతో పాటు ఉద్యాన వ్యవసాయం, పశుపోషణ; చేపలు, వ్యవసాయ అడవులు, తేనెటీగల పెంపకం లాంటి కార్యకలాపాలను సంఘటితం చేస్తారు.

 

2) నేల ఆరోగ్య నిర్వహణ

ఒక ప్రదేశానికి, అక్కడి పంటకు తగినట్లు నేల ఆరోగ్య నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఇందులో మిగులు నిర్వహణ, సేంద్రియ పద్ధతులు ఒక భాగం. వీటికోసం నేల రకాన్ని బట్టి భూసార పంటలను పోషక పదార్థాల నిర్వహణతో అనుసంధానం చేస్తారు. భూసార ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తారు. అందులో కొన్ని సంచార ప్రయోగశాలలు కూడా ఉంటాయి. జీవ ఎరువులు, జీవ క్రిమిసంహారక మందుల యూనిట్లతో పాటు పండ్లు, కూరగాయల మార్కెట్ల వ్యర్థాలు, వ్యవసాయ వృథాల కంపోస్ట్‌ యూనిట్లను కూడా ఏర్పాటుచేస్తారు. వీటన్నింటికీ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది.

  భూసార నిర్వహణ ప్రధాన ఉద్దేశం: న్యూ ఇండియా సమాచార్‌ (2022, మే 16 - 31) మాసపత్రిక నివేదిక ప్రకారం భూసార పరీక్ష ఆధారిత పోషక నిర్వహణ, అభివృద్ధి ప్రోత్సాహకం దీని లక్ష్యం. ఈ పథకం కింద 2018 - 19 నుంచి 2020 - 21 వరకు 5.67 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. ఈ మేరకు 2022, ఏప్రిల్‌ 19 వరకు 22.19 కోట్లకు పైగా భూసార కార్డులు జారీ అయ్యాయి. 

 

3) వ్యవసాయ అడవుల సబ్‌ మిషన్‌: జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌లో సబ్‌ మిషన్‌గా వ్యవసాయ అడవుల కార్యక్రమాన్ని 2016 - 17లో ప్రవేశపెట్టారు. సాగుభూముల్లో పంటలతో పాటు చెట్లను విస్తరింపజేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. 2014లో ప్రకటించిన జాతీయ వ్యవసాయ అడవుల విధానం ప్రకారం వ్యవసాయ అడవుల పెంపకాన్ని వ్యవసాయ వ్యవస్థలో అంతర్భాగం చేస్తారు. దీనివల్ల పర్యావరణ పరిరక్షణ పెరగడమేకాకుండా కలప, వంటచెరకు, పశుగ్రాసం లాంటి అటవీ ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీ కొంతవరకు తీరుతుంది.

 

జాతీయ నూనె గింజల పామాయిల్‌ మిషన్‌ 

  ప్రపంచంలో నూనె గింజల వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది.  ప్రపంచంలోని అతిపెద్ద కూరగాయ నూనె వ్యవస్థల్లో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది. దేశంలోని స్థూల సాగు భూమిలో 13 శాతం వాటా నూనెగింజలది. స్థూల జాతీయోత్పత్తిలో 3 శాతం, వ్యవసాయ ఉత్పత్తుల విలువలో 10 శాతం వాటా వీటిదే. 1986లో నూనెగింజల ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం నూనె గింజలపై సాంకేతిక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2004 - 05లో సమగ్ర నూనెగింజలు, పామాయిల్, మొక్కజొన్న పథకాన్ని (ఇంటిగ్రేటెడ్‌ స్కీమ్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్, ఆయిల్‌పామ్, మైజ్‌) ప్రారంభించింది. ఇది 2014 మార్చి వరకు అమల్లో ఉంది. ఈ కార్యక్రమంతో పాటు 2011 - 12, 2012 - 13లలో పామాయిల్‌ విస్తరణ కార్యక్రమాన్ని అమలుచేసింది.  

  2014 - 15లో ఈ రెండు కార్యక్రమాలు, వృక్ష జనిత నూనెగింజల కార్యక్రమాన్ని పునర్నిర్మించి జాతీయ నూనెగింజలు పామాయిల్‌ మిషన్‌ను ప్రారంభించారు. నూనెగింజలు, పామాయిల్, వృక్ష జనిత నూనెగింజలకు సంబంధించిన మూడు ఉపమిషన్లను ఇందులో కలిపారు. ఈ కార్యక్రమం అమలుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 : 40 నిష్పత్తిలో భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 90 : 10 నిష్పత్తిలో భరిస్తాయి. ఈ పథకాల అమలు వల్ల దేశంలో నూనెగింజల ఉత్పాదకత, ఉత్పత్తి పెరిగింది.

ముఖ్యాంశాలు: * నూనెగింజల పంటలకు సాగునీటి లభ్యత 26 నుంచి 36 శాతానికి పెంచడం. 

* తృణధాన్యాల ఉత్పాదకత తక్కువగా ఉన్న భూమిని నూనెగింజలు సాగుకు మళ్లించడం. 

* తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, చెరకు పంటలతో పాటు మధ్యంతర నూనెగింజలు పండించడం. 

* వాటర్‌షెడ్‌ ప్రాంతాలు, వృథా నేలలకు నూనెగింజల సాగును విస్తరించడం. 

  2021 - 22 భారత ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం 2015 - 16 నుంచి 2020-21 మధ్య దేశంలో నూనెగింజల ఉత్పత్తి 43 శాతం పెరిగింది. 2019 - 20లో నూనెగింజల ఉత్పత్తి 33.2 మిలియన్‌ టన్నులు ఉండగా 2020 - 21 నాటికి 36.1 మిలియన్‌ టన్నులకు పెరిగింది. 2018 - 19 నుంచి కేంద్ర ప్రభుత్వం నూనెగింజల ఉత్పత్తి, ఉత్పాదకత కోసం దేశంలోని అన్ని జిల్లాల్లో ‘నేషనల్‌ పుడ్‌ సెక్యూరిటీ మిషన్‌’ను ప్రోత్సహించింది.

* 2012 - 13లో దేశంలో వంట నూనెల ఉత్పత్తి 7.2 మిలియన్‌ టన్నులు ఉండగా 2019 - 20 నాటికి 7.9 మిలియన్‌ టన్నులకు పెరిగింది.

* 2012 - 13లో వంట నూనెల దిగుమతులు 10.6 మిలియన్‌ ఉండగా 2019 - 20 నాటికి 13.4 మిలియన్‌ టన్నులకు  పెరిగాయి.

 

జాతీయ ఆహార భద్రత - పప్పుధాన్యాల మిషన్‌ 

  హరిత విప్లవం వల్ల పప్పుధాన్యాల ఉత్పత్తి పెరగలేదు. దీంతో జాతీయ ఆహార భద్రత మిషన్‌ - పుప్పుధాన్యాలు (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎమ్‌ - పల్సెస్‌) అనే పథకం ద్వారా దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించారు. 2021 - 22 భారత ఆర్థిక సర్వే ప్రకారం 2019 - 20లో పప్పుధాన్యాల ఉత్పత్తి 23 మిలియన్‌ టన్నులు ఉండగా 2020 - 21 నాటికి 25.7 మిలియన్‌ టన్నులకు పెరిగింది.

 

రచయిత: బండారి ధనుంజయ

Posted Date : 14-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 వ్యవసాయ రంగం-అల్ప ఉత్పాదకత

కష్టాలసాగులో నష్టాల దిగుబడి!

  సరాసరి సాగుభూమి తక్కువ. దానిపై ఉపాధికి ఆధారపడిన శ్రామికులు ఎక్కువ. రైతుల్లో చాలామంది పేదలు, నిరక్షరాస్యులు. ఉత్పత్తి రవాణాకు సరైన సౌకర్యాలు లేవు. మాయలతో నిండిన మార్కెటింగ్‌. పెట్టుబడుల కొరత. వడ్డీల మోత. దళారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి. ఇన్ని కష్టాల మధ్య నష్టాలతో సేద్యం సాగుతోంది.  మన దేశంలో పంట ఉత్పాదకత తగ్గడానికి ఇవన్నీ కారణాలే. 

 

ఉత్పాకత అంటే ఒక హెక్టారులో పండే సగటు ఉత్పత్తి పరిమాణం. సాధారణంగా వివిధ పంటలకు సంబంధించి ఒక హెక్టారు లేదా ఎకరా భూమి నుంచి వచ్చే దిగుబడి అని చెప్పవచ్చు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు భారతదేశ వ్యవసాయ ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు 2014లో బెల్జియంలో ఒక హెక్టారుకు గోధుమల ఉత్పాదకత 9430 కిలోలు కాగా అమెరికాలో మొక్కజొన్నల ఉత్పాదకత 10,073 కిలోలు. 2018 - 19లో భారతదేశంలో ఈ రెండు పంటల ఉత్పాదకత కేవలం ఒక హెక్టారుకు 3000 కిలోలుగా ఉంది. 2000 - 2020 మధ్య కాలంలో మొత్తం ఆహార ధాన్యాల దిగుబడి మనదేశంలో హెక్టారుకు సరాసరిన 1380 కి.గ్రా. నుంచి 2325 కి.గ్రాకు పెరిగింది. ఇదేకాలంలో నూనెగింజల దిగుబడి 810 కి.గ్రా. నుంచి 1236 కి.గ్రా.కు పెరిగింది. అంటే ఈ 20 ఏళ్ల కాలంలో చెప్పుకోదగిన రీతిలో పంట దిగుబడి పెరగలేదు.

 2018-19 నాటికి దేశంలో మొత్తం భూవిస్తీర్ణం 328.7 మిలియన్‌ హెక్టార్లు, నికర సేద్య భూమి 139.3 మిలియన్‌ హెక్టార్లు, స్థూల లేదా మొత్తం సాగుభూమి 197.3 మిలియన్‌ హెక్టార్లు. పంటల సాంద్రత 141.6 శాతం (నిర్ణీత భూవిస్తీర్ణంలో ఏడాదిలో ఎన్నిసార్లు ఒక పంటను పండిస్తారో తెలిపే సూచీని పంటల సాంద్రత/ తీవ్రత అంటారు). మొత్తం భూవిస్తీర్ణంలో 42.4 శాతం నికర సేద్యభూమి ఉంది. 


నికర సాగునీటిపారుదల విస్తీర్ణం 71.6 మిలియన్‌ హెక్టార్లు, భూవినియోగ విస్తీర్ణం 3,07,787 వేల హెక్టార్లు, అడవులు 72,011 వేల హెక్టార్లు, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూమి 27,344 వేల హెక్టార్లు; బంజరు, వ్యవసాయ యోగ్యం కాని భూములు 17,168 వేల హెక్టార్లు; పచ్చికబయళ్లు, పశువుల మేత పెంచే భూములు 10,376 వేల హెక్టార్లు, బంజరుగా ఉన్న సేద్యభూమి 12,219 వేల హెక్టార్లు, నికర సేద్యభూమిలోకి చేర్చని వివిధ వృక్ష తోటలు 3154 వేల హెక్టార్లు, ప్రస్తుత బీడు భూములు 14,531 వేల హెక్టార్లు, నికర సేద్యభూమి 1,39,351 వేల హెక్టార్లు, వ్యవసాయ భూమి 1,80,888 వేల హెక్టార్లు, సాగుభూమి 1,53,882 వేల హెక్టార్లు. 

 

ప్రభావితం చేసే అంశాలు


సాగుభూమి నాణ్యత, తగిన నీటిపారుదల సౌకర్యాల కల్పన, మేలురకం విత్తనాలు, ఎరువుల వాడకం లాంటివి పంటల ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి. అలాగే నాసిరకం విత్తనాలు, అధిక మోతాదులో ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం పంటల ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి హెక్టారులో పండించే పంట దిగుబడిని టన్నులు,  కిలోగ్రాములు/బేళ్లలో లెక్కించి ఉత్పాదకతను అంచనా వేస్తారు. సంప్రదాయ లేదా పాత పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల స్వాతంత్య్రానికి పూర్వం  ఉత్పాదకత తక్కువగా ఉండేది. ప్రణాళికల అమలు ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది పంట ఉత్పాదకత పెరిగింది. ముఖ్యంగా 1966-67 తర్వాత నూతన వ్యవసాయ వ్యూహం అమలు, అధిక దిగుబడి వంగడాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల దిగుబడి పెరిగింది. హరిత విప్లవానికి ముందు 9 హెక్టార్లకు 900 కేజీలుగా ఉన్న వరి దిగుబడి 1100 కిలోలకు పెరిగింది. ఆ కాలంలో వరి వార్షిక వృద్ధిరేటు కూడా 2.1 శాతం ఉండేది. హరిత విప్లవం ప్రభావం వల్ల వరి వార్షిక వృద్ధిరేటు కంటే తక్కువగా ఉన్న గోధుమ పంట వార్షిక వృద్ధిరేటు బాగా పెరిగింది.

తక్కువ దిగుబడి ఎందుకంటే?

భారత దేశంలో వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతకు అనేక కారణాలు ఉన్నాయి. వీటిని మూడు ప్రధాన భాగాలుగా విభజించి విశ్లేషించవచ్చు.


సాధారణ కారణాలు:


ఎ) భూమిపై జనాభా ఒత్తిడి: ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ) వరల్డ్‌ పాప్యులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌-2022 నివేదిక ప్రకారం మన దేశంలో 2022లో మొత్తం జనాభా 141.2 కోట్లు ఉంది. 2050 నాటికి అది 166.8 కోట్లకు చేరుతుందని అంచనా. భారత దేశంలో అధిక శాతం జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఆంగ్లేయుల కాలంలో సంప్రదాయ పరిశ్రమలు దెబ్బతిని వారు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపారు. స్వాతంత్య్రం తర్వాత 1951లో వ్యవసాయ రంగం మీద ఆధారపడిన శ్రామిక జనాభా, మొత్తం శ్రామిక జనాభాలో 72 శాతం. 1991 నాటికి ఇది 67 శాతానికి, 2001 నాటికి 59 శాతానికి తగ్గింది.


          భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇచ్చిన రైతుల సంక్షేమం, వార్షిక నివేదిక - 2021-22 ప్రకారం ప్రస్తుతం దేశంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడిన శ్రామిక జనాభా 54.6 శాతం. ఇదే నివేదిక ప్రకారం 2021- 22 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల వద్ద మన దేశంలో స్థూల అదనపు విలువ (జీవీఏ)లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా 18.8 శాతంగా ఉంది. పరిశ్రమ, సేవా రంగాలు అభివృద్ధి చెందినప్పటికీ వ్యవసాయ రంగం మిగులు శ్రామికులకు అవి ఉపాధి కల్పించలేకపోతున్నాయి. దాంతో వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏర్పడింది. అంటే ఉత్పత్తి ప్రక్రియల్లో అవసరమయ్యే శ్రామికుల కంటే ఎక్కువ మంది ఉంటే వారిని ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారు. తలసరి సాగుభూమి 1901లో 0.43 హెక్టార్ల నుంచి 2001లో 0.20 హెక్టార్లకు తగ్గిపోయింది. కమతాల విభజన, విఘటన వల్ల వాటి పరిమాణం తగ్గిపోయింది. ఫలితంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అనువుగా ఉండదు. 

బి) గ్రామీణ సాంఘిక వాతావరణం: వ్యవసాయదారుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులే. వీరు సంప్రదాయ అలవాట్లు, మూఢ నమ్మకాలతో అనాదిగా వస్తున్న ఆచారాలు, కట్టుబాట్లను పాటిస్తారు. ఈ సామాజిక వాతావరణం ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అనుసరించడానికి అవరోధంగా ఉంటోంది. గ్రామ ప్రజలు పట్టుదల, పంతాల వల్ల తగాదాలతో ధనం, కాలాన్ని వృథా చేసుకుంటున్నారు.


సి) వ్యవసాయేతర సేవల లోపం: వ్యవసాయాభివృద్ధికి వ్యవసాయ పరపతి, మార్కెటింగ్, రవాణా, సమాచార సౌకర్యాలు అవసరం. భారతదేశంలో మొదటి నుంచి సంస్థాగత పరపతి సౌకర్యం లేక రైతులు వ్యవసాయ పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల మీద ఎక్కువగా ఆధారపడుతూ వచ్చారు.అధిక వడ్డీలతో రుణభారం పెరిగి భూములు అమ్ముకుని కౌలుదారులు, కూలీలుగా మారే పరిస్థితులు తలెత్తాయి. దాంతోపాటు గ్రామాలను పట్టణాలకు కలిపే రోడ్లు, రవాణా సౌకర్యాలు లేకపోవడం, గిడ్డంగి సౌకర్యాలు లేక పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి రావడం, మార్కెట్‌ సమాచారం, మార్కెటింగ్‌ వసతులు తక్కువగా ఉండటం తదితర లోపాలు కూడా రైతులకు నిరుత్సాహాన్ని కలిగించాయి. వీటి వల్ల వ్యవసాయాభివృద్ధికి అవరోధం కొనసాగుతూ వచ్చింది.


డి) వలస పాలన: ఆంగ్లేయుల పాలనలో వ్యవసాయాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోలేదు. ఇంగ్లండ్‌లో వ్యవసాయ విప్లవం ఏర్పడినప్పటికీ మన దేశంలో అందుకు అనుకూల పరిస్థితులను కల్పించలేదు. రైల్వేల అభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యం నీటి పారుదల సౌకర్యాలు పెంచడానికి ఇవ్వలేదు.

 

వ్యవస్థాపూర్వక లోపాలు:


ఎ) చిన్న కమతాలు: భారతదేశంలో వంశపారంపర్య హక్కులు, వ్యవసాయంపై జనాభా ఒత్తిడి, రైతులపై రుణభారం లాంటి కారణాల వల్ల కమతాల విభజన, విఘటన జరుగుతూనే ఉంది. దాంతో వ్యవసాయ కమతం సగటు పరిమాణం 1991 నాటికి 1.57 హెక్టార్లకు క్షీణించింది. 2010 - 11లో సగటు భూకమతాల పరిమాణం 1.15 హెక్టార్లు ఉండగా 2015 - 16 నాటికి 1.08 హెక్టార్లకు తగ్గింది. ఆధునిక పనిముట్లు ఉపయోగించి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి చిన్న కమతాలు అనుకూలం కాదు.  కొత్త ఉత్పత్తి పద్ధతులు ఉపయోగించడానికి చిన్న, ఉపాంత రైతుల ఆర్థిక స్థోమత కూడా సరిపోదు. 


బి) భూస్వామ్య పద్ధతులు - కౌలు విధానాలు: ఆంగ్లేయుల పాలనా కాలంలో ఏర్పాటు చేసిన జమీందారీ వ్యవస్థ వ్యవసాయాభివృద్ధికి  ఆటంకమైంది. కౌలు విధానంలో కౌలుదారులకు భద్రత కరవైంది.

 

సాంకేతిక ఇబ్బందులు:


ఎ) పురాతన ఉత్పత్తి పద్ధతులు: అవగాహన రాహిత్యం, పేదరికం కారణంగా అనేక మంది  అన్నదాతలు వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పాదకతను పెంచుకోలేకపోతున్నారు. నాణ్యమైన విత్తనాల వినియోగం, ఎరువుల వాడకం, క్రిమిసంహారక మందుల వాడకం పెద్దగా లేకపోవడంతో ఉత్పాదకత తక్కువగా ఉంది. ఆధునిక వ్యవసాయ పనిముట్ల వాడకమూ అంతంత మాత్రమే. హరిత విప్లవం అన్ని ప్రాంతాలకు విస్తరించలేదు. పేద రైతులు కొత్త వ్యవసాయక వ్యూహాన్ని అమలు చేసే స్థితిలో లేరు. 


బి) నీటి పారుదల సౌకర్యాల కొరత: భారత దేశంలో వ్యవసాయ రంగం ప్రధాన సమస్య నీటి పారుదల సౌకర్యాలు లేకపోవడం. 60 శాతం సాగు భూమికి వర్షాలే ఆధారం. భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రైతుల సంక్షేమం, వార్షిక నివేదిక 2021-22 ప్రకారం నికర నీటి పారుదల విస్తీర్ణం 71,554 వేల హెక్టార్లు, స్థూల నీటి పారుదల భూమి 1,02,667 వేల హెక్టార్లు. మనదేశంలో అనేక మార్గాల ద్వారా భూమి సాగు చేస్తున్నారు. ప్రధానంగా కాలువలు, చెరువులు, గొట్టపు బావులు, భారీ, మధ్య తరహా, చిన్న తరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా సాగుభూమి విస్తరణ జరుగుతోంది. 


కొన్నేళ్లు వర్షాలు సకాలంలో పడక, మరికొన్నేళ్లు అసలు వర్షాలే లేకపోవడంతో వర్షాధార ప్రాంతాల్లో వ్యవసాయం దెబ్బతింటోంది. నీటి నిర్వహణ లోపం లాంటివి.

 

ప్రభుత్వం తీసుకున్న చర్యలు


వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ప్రభుత్వం పలురకాల చర్యలు చేపట్టింది. 


* భూసంస్కరణలను ప్రవేశపెట్టింది. 

* జమీందారీ వ్యవస్థను రద్దు చేసింది.

* 1966 నుంచి నూతన వ్యవసాయ వ్యూహం ప్రవేశపెట్టింది.

* అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం, పంటల మార్పిడి పద్ధతులతో హరిత విప్లవం వచ్చింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి అధికమై ఉత్పాదకత పెరిగింది.

* గిడ్డంగుల నిర్మాణం, కనీస మద్దతు ధరల విధానం వ్యవసాయదారులకు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అదేవిధంగా సహకార, వాణిజ్య బ్యాంకుల ద్వారా వ్యవసాయ పరపతి సౌకర్యం పెంచారు. 

* ఎరువుల సబ్సిడీ, మేలు రకం విత్తనాల పంపిణీ లాంటి చర్యల వల్ల ఉత్పాదకత పెరిగింది. 

రచయిత: బండారి ధనుంజయ

Posted Date : 04-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కోశ విధానం

 ఆర్థిక స్థిరత్వాన్ని అందించే సాధనం!



  వ్యక్తులు, సంస్థల ఆదాయాలపై ప్రభుత్వం పన్నులు పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. పెంచినప్పుడు ప్రజల పెట్టుబడులు అధికమవుతాయి, తగ్గించినప్పుడు వారి వ్యయాలు ఎక్కువుతాయి. ఈ రెండూ మార్కెట్‌లో ద్రవ్య చెలామణిని నియంత్రిస్తాయి. రోడ్లు, వంతెనలు, మెట్రోల వంటి మౌలిక సౌకర్యాల కోసం గవర్నమెంటు ఖర్చులు చేస్తుంది. దాంతో జనం ఉపాధి, ఆదాయం పెరుగుతాయి. సర్కారు వ్యయం, ఆదాయాన్ని మించితే ద్రవ్యలోటు ఏర్పడుతుంది. దాన్ని సరిదిద్దుకోవడానికి రుణాలు చేయాల్సి వస్తుంది. ఫలితంగా వడ్డీ రేట్లు అధికమై ఆ ప్రభావం రుణాలు, పెట్టుబడులపై పడుతుంది. ఆ విధంగా ప్రభుత్వం పన్నులు విధించడానికి, ఖర్చులు చేయడానికి, అప్పులు తీసుకోవడానికి విధానాలను రూపొందించుకుంటుంది. అదే కోశ విధానం. దాని ద్వారా సేవలు అందించి, ఉద్యోగాలు కల్పించి ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఆర్థిక స్థిరత్వాన్ని, వృద్ధినీ సాధిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో అత్యంత కీలకమైన ఈ అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

 ద్రవ్య విధానం కంటే కోశ విధానానికి జె.ఎం.కీన్స్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 1929-30 ఆర్థిక మాంద్యం - కీన్స్‌ జనరల్‌ థియరీ రచనతో కోశ విధానానికి ప్రాధాన్యం పెరిగింది. ఆర్థిక మాంద్య కాలంలో ద్రవ్య విధానం కంటే కోశ విధానం సమర్థంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ద్రవ్యవిధానం ఆర్‌బీఐకి, కోశ విధానం కేంద్ర ప్రభుత్వానికి చెందినవి.


* ఉత్పత్తి, ఉద్యోగితపై ప్రభుత్వ పన్నులు, ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ రుణాల స్థూల ప్రభావమే కోశ విధానం (Fiscal Policy).  దీన్ని ప్రభుత్వ రాబడి, వ్యయం, రుణాలకు సంబంధించిన నిర్వహణ విధానంగానూ పేర్కొనవచ్చు.


ఆర్థికాభివృద్ధిలో కోశ విధానం పాత్ర:

నల్లధనం: కోశ విధానం ద్వారా పన్ను, పన్నేతర రాబడిని పెంచి మూలధన కల్పనకు దోహదపడవచ్చు. పన్ను ఎగవేతను అరికట్టి నల్లధనాన్ని తగ్గించవచ్చు.

ఉత్పత్తి, ఉద్యోగిత: వస్తువులపై పన్నుల ద్వారా ప్రభుత్వం వనరులను సేకరించి, వాటిని అవసరమైన పరిశ్రమల్లో పెట్టుబడిగా పెట్టి జాతీయాదాయం, స్థూల జాతీయోత్పత్తి పెంచవచ్చు.

పెట్టుబడులను ప్రోత్సహించడం: ప్రైవేటు రంగానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాయితీలు ఇచ్చి పెట్టుబడులు ప్రోత్సహించడానికి కోశవిధానం ఉపయోగపడుతుంది.

స్థిరత్వం: ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో పన్నులు పెంచి ప్రజల చేతుల్లో ఉన్న డబ్బును, కొనుగోలు శక్తిని తగ్గించి సమష్టి డిమాండ్‌ను, సమష్టి సప్లయికి సరిపోయే విధంగా చేయడం.

అభిలషణీయ ఉపయోగం: పరిమిత వనరులను అభిలషణీయ స్థాయిలో ఉపయోగించడానికి, అనుత్పాదక వ్యయ నియంత్రణకు కోశ విధానం ఉపయోగపడుతుంది.

అభివృద్ధి: అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పొదుపు రేటు, పెట్టుబడి రేటు తక్కువగా ఉంటాయి. అందువల్ల తలసరి ఆదాయం, వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తుల స్థాయి, ఉద్యోగిత స్థాయి అల్పంగా ఉంటాయి. ఈ పరిస్థితులను అధిగమించి ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి కోశ విధానం ఉపయోగపడుతుంది.

లక్ష్యాలు: * ఆర్థికాభివృద్ధిని సాధించడం. 

* వినియోగాన్ని నియంత్రించి పొదుపు, పెట్టుబడులను పెంపొందించడం. 

* ధరల స్థిరత్వాన్ని సాధించడం; ద్రవ్యోల్బణ, ప్రతి ద్రవ్యోల్బణ ప్రభావాలను తగ్గించడం.

* ఉత్పాదకతను పెంచి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం.* సమర్థ వనరుల కేటాయింపు, ఆర్థిక - సాంఘిక అవసరాలకు అనుగుణంగా వనరుల కేటాయింపు.

* ఆదాయ పునఃపంపిణీ, సంపద ఆదాయ పంపిణీలో అసమానతలను తగ్గించడం.


కోశ విధానం - సాధనాలు:

పన్నులు: సంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం పన్నులు అంటే రాబడి సాధనాలు మాత్రమే. ఆధునిక కోశ ఆర్థికవేత్తల ప్రకారం పన్నులు అంటే రాబడి సాధనాలే కాకుండా ఆర్థిక వ్యవస్థలో సుస్థిరతను సాధించే సాధనాలు కూడా. ప్రైవేటు రంగంలో పొదుపు, పెట్టుబడులను నిరుత్సాహపరిచేదిగా పన్నుల విధానం ఉండకూడదు. ఆదాయం, సంపదలో వ్యత్యాసాలను తగ్గించేదిగా, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని నెలకొల్పగలిగేదిగా ఉండాలి.

ప్రభుత్వ వ్యయం: ఇది ఆర్థికాభివృద్ధి, ప్రజాసంక్షేమం, గ్రామీణాభివృద్ధి, సుస్థిర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.

ప్రభుత్వ రుణం: ఆర్థిక వ్యవస్థలో అదనంగా ఉన్న ద్రవ్యరాశిని స్వీకరించి రుణం రూపేణా భారీ పరిశ్రమల స్థాపనకు వినియోగించడం ద్రవ్యల్బణాన్ని తగ్గించేందుకు దోహదపడుతుంది.

లోటు బడ్జెట్‌: మాంద్యంలో ఆర్థిక సుస్థిరతకు లోటు బడ్జెట్‌ ఉపయోగపడుతుంది. 

* కోశ సాధనాల ద్వారా ద్రవ్యోల్బణ, ప్రతి ద్రవ్యోల్బణాలను నియంత్రించవచ్చు.


భారత కోశ విధాన లక్ష్యాలు: ఇవి రెండు రకాలు. 

1) ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని మెరుగుపరచడం 

2) ప్రజలకు సాంఘిక న్యాయాన్ని అందించడం


ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యం: కోశ విధానం వృద్ధి సామర్థ్యాన్ని రెండు విధాలుగా ప్రభావితం చేస్తుంది.

ఎ) వనరుల సమీకరణ: 1950-51లో పన్ను - జీడీపీ నిష్పత్తి 6.3% గా ఉంటే 2010-20 నాటికి 19.2% కి పెరిగింది. పన్ను రాబడి పెరగడానికి కారణం కోశవిధానమే. వనరుల సమీకరణకు పన్నులే కాకుండా పన్నేతర రాబడి, ప్రభుత్వరంగ సంస్థల మిగులు పెంచడం, ప్రభుత్వ వ్యయంపై ఆంక్షలు లాంటివీ దోహదపడ్డాయి.

బి) సమర్థ వనరుల కేటాయింపు: వనరుల కేటాయింపు వృద్ధి సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. సమర్థ, హేతుబద్ధమైన వనరుల కేటాయింపు వల్ల ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుంది. ఉదా: సంస్కరణలకు ముందు పరోక్ష పన్నుల రాబడి ఎక్కువగా ఉండేది. సంస్కరణల ఫలితంగా ఆ వాటా తగ్గి ప్రత్యక్ష పన్నుల వాటా పెరుగుతోంది. కస్టమ్స్‌ సుంకాలు దేశీయ పరిశ్రమల రక్షణకు దోహదపడతాయి.

కోశ అసమతౌల్యం - లోటు విత్తం:  1980 దశకం మధ్య వరకు మొత్తం బడ్జెట్‌లో లోటు కనిపించేది. ఈ అంతరాన్ని ట్రెజరీ బిల్లులను హామీగా ఉంచి ఆర్‌బీఐ నుంచి అప్పు తీసుకోవడం ద్వారా అంటే లోటు విత్తం ద్వారా భర్తీ చేసేవారు. ప్రభుత్వం ఆర్‌బీఐ వద్ద సెక్యూరిటీలను ఉంచి రుణం తీసుకునేది. ఈ సెక్యూరిటీల ఆధారంగా ఆర్‌బీఐ ఎక్కువ నోట్లను చలామణిలోకి తీసుకురావడంతో ద్రవ్య సరఫరా ఎక్కువై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగేవి.

లోటు విత్తం ఆవశ్యకత: అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధి ప్రణాళికలకు సరిపడా ఆర్థిక వనరులు ఉండవు. అందుకే లోటు విత్తం అవసరమని కొంతమంది ఆర్థికవేత్తల అభిప్రాయం. ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది కాబట్టి లోటు విత్తం అవసరం.

దీర్ఘకాల కోశ విధానం: ప్రణాళిక విధానాన్ని కోశ విధానంతో సమన్వయపరిచే ఉద్దేశంతో దీర్ఘకాల కోశ విధానాన్ని 1985లో ఏడో ప్రణాళికలో రూపొందించారు. 1985-1990 కాలంలో అమలైన ఈ ప్రణాళికలో ముఖ్యాంశాలు ఉన్నాయి. 

* ఆదాయ పన్ను రేట్లు 1985లో నిర్ణయించినవే 1990 వరకు కొనసాగాయి. పన్ను రేటు పెరుగుతుందనే భయం లేకుండా పెట్టుబడులు పెంచడానికి వీలవుతుంది.


* చనిపోయిన వారి ఆస్తులపై విధించే పన్నును తొలగించడం.

* ఆదాయ పన్ను, సంపద పన్ను రేట్లు తగ్గించడం.

సంస్కరణల్లో భాగంగా  కోశ అసమతౌల్యాన్ని తొలగించడానికి స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు చేపట్టారు. అమెరికా బడ్జెట్‌ తరహాలో కోశ లోటును ప్రవేశపెట్టారు. కోశ అసమతౌల్యాన్ని కొలవడానికి సూచీలు రెవెన్యూ లోటు, ప్రాథమిక లోటు.

వడ్డీ చెల్లింపులు, వడ్డీయేతర వ్యయం: కోశ అసమతౌల్యానికి ప్రధాన కారణమైన వడ్డీ చెల్లింపులు పెరుగుతూనే వస్తున్నాయి. 2023-24 నాటికి రూ.10,79,971 కోట్లుగా అంచనా వేశారు. సబ్సిడీలు, రక్షణ వ్యయం, జీతభత్యాలు లాంటి వ్యయం; వడ్డీయేతర వ్యయం పెరగడం కూడా కోశ అసమతౌల్యానికి కారణం. సబ్సిడీల్లో సగం కంటే ఎక్కువ ఆహార సబ్సిడీలకే కేటాయిస్తారు.


భారతదేశంలో కోశ బాధ్యత (ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం): ఆర్థికమంత్రిగా యశ్వంత్‌ సిన్హా ఉన్న 2000 సమయంలో ఎఫ్‌ఆర్‌బీఎం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీని లక్ష్యం దీర్ఘకాల స్థూల ఆర్థిక స్థిరత్వం. 2004, జులై 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో పలు ముఖ్యాంశాలు ఉన్నాయి. 

* రెవెన్యూ లోటును ఏటా 0.5% చొప్పున తగ్గిస్తూ 2008-09 నాటికి నిర్మూలించి, తర్వాత మిగులు చూపాలి.

* కోశ లోటును ప్రతి ఏడాది 0.5% చొప్పున తగ్గిస్తూ 2008-09 నాటికి 3%కి తీసుకురావాలి.

* ప్రతి మూడు నెలలకు ఆర్థిక మంత్రి ఆదాయ, వ్యయాలను సమీక్షించాలి.

* ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని అనుసరించే రాష్ట్రాలకు తక్కువ వడ్డీతో రుణాలు రీషెడ్యూల్‌ చేయడంతో పాటు పాత గ్రాంట్లు అందించాలి.

2007-08 నాటికి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కేంద్రం తన రెవెన్యూ లోటును 1.1%కి, కోశ లోటును 2.5%కి తీసుకురాగలిగింది. అయితే 2008-09 నుంచి ఆర్థికమాద్యం ప్రభావంతో ప్రభుత్వం వ్యయాన్ని పెంచాల్సి రావడం, మరోవైపు పన్ను రేటు తగ్గించాల్సి రావడంతో రెవెన్యూ లోటు, కోశ లోటు రెండూ పెరుగుతూ వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం లక్ష్యాలను వాయిదా వేసింది.


ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం సమీక్ష:  పన్ను రాబడి, జీడీపీ నిష్పత్తి కొంత తగ్గడం, వడ్డీ చెల్లింపులు, రాయితీలు, రక్షణ వ్యయం పెరగడం వల్ల కేంద్రం రెవెన్యూ లోటును తగ్గించలేకపోయింది. రెవెన్యూ లోటును సున్నా శాతానికి తీసుకురావాలంటే ప్రభుత్వం సాంఘిక వ్యయాన్ని తగ్గించాల్సి వస్తుంది. దీనివల్ల విద్య, ఆరోగ్యంపై వ్యయం తగ్గిపోతుంది.  

* సంస్కరణల తర్వాత మూలధన వ్యయం, జీడీపీ నిష్పత్తి తగ్గుతూ వస్తోంది.

* ప్రభుత్వ వ్యయం తగ్గడం వల్ల మానవవనరులు, అవస్థాపన సదుపాయాలపై పెట్టుబడులు తగ్గవచ్చు.

* ఈ చట్టం పన్ను, జీడీపీ నిష్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టలేదు.

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం సమీక్ష కమిటీ:  2016, మేలో ఎన్‌.కె.సింగ్‌ అధ్యక్షతన ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంపై సమీక్ష కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ 2017, జనవరిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో పలు ముఖ్యాంశాలు ఉన్నాయి. 

* ప్రభుత్వ రుణ, జీడీపీ నిష్పత్తి కోశ విధానానికి మధ్య కాల సంధానంగా ఉండాలి. 2023 నాటికి కేంద్ర, రాష్ట్రాలు దీన్ని 60%కి తీసుకురావాలి (కేంద్రం 40%, రాష్ట్రాలు 20%).

* 2020, మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వం జీడీపీలో కోశ లోటును 3% కి, 2022-23 నాటికి 2.5%కి తీసుకురావాలని సూచించింది. అయితే జాతీయ భద్రత, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పడిపోవడం లాంటి సందర్భాల్లో మినహాయింపు నిబంధనకు అవకాశం ఇచ్చింది.

* రెవెన్యూ లోటును ఏటా దశలవారీగా 0.25%కి తగ్గిస్తూ 2017లో ఉన్న 2.3% నుంచి 2023 నాటికి 0.8%కి తీసుకురావాలి.

* ప్రస్తుత ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం 2004 స్థానంలో కొత్త చట్టం తీసుకురావాలి. ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు కోశమండలి ఏర్పాటు చేయాలి. ఇది జీడీపీ వృద్ధి, వస్తు ధరలు, పన్ను ప్రోత్సాహకాలపై సలహాలిస్తుంది.

* కేంద్ర వ్యయం కంటే రాష్ట్రాల వ్యయం ఎక్కువగా ఉంది. రాష్ట్ర రుణ నిష్పత్తిని ప్రస్తుతం ఉన్న 21% నుంచి 20%కి తగ్గించాలి.

* కోశ, ద్రవ్య విధానాలు స్థూల ఆర్థిక స్థిరత్వానికి, వృద్ధికి ఒకదానికొకటి పూరకంగా ఉండాలి.

 రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 07-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 భారత రవాణా రంగం - విస్తరణ  (రహదారుల వ్యవస్థ)  

సుస్థిర ప్రగతికి శ్రేష్ఠమైన మార్గాలు! 

రహదారులు, పురోగతి అనేవి ఒకదానికొకటి పర్యాయ పదాలుగా మారిపోయాయి. కాస్త శ్రద్ధగా గమనిస్తే గత రెండు దశాబ్దాలపైగా రోడ్డు రవాణా వ్యవస్థ విస్తృతంగా విస్తరించింది. జాతీయ రహదారుల సంఖ్య పెరిగిపోయింది. నాలుగు దిక్కుల్లోని దేశ సరిహద్దులు అనుసంధానమయ్యాయి. వాటిని ఒక నోడల్‌ సంస్థ నిర్వహిస్తోంది. రేవు పట్టణాలు కలిశాయి. నాలుగు వరుసల మార్గాలు వెలిశాయి. ఆరు వరుసల అభివృద్ధికి సిద్ధమవుతున్నాయి. కొత్త కొత్త ఎక్స్‌ప్రెస్‌ రహదారులు, రింగ్‌ రోడ్లు, బైపాస్‌లు, ఫైఓవర్లు ప్రత్యక్షమవుతున్నాయి. వంతెనల నిర్మాణంతో సేతు భారతం ఆవిషృతమవుతోంది. ఆర్థిక కారిడార్లతో భారత్‌ మాల రూపొందుతోంది. హరిత పథకాలతో కాలుష్య కట్టడికి కృషి జరుగుతోంది. కొండ ప్రాంతాలు పర్వతమాలతో కలిసిపోతుంటే, పీఎం గతిశక్తితో ప్రగతిపథంలోకి దేశం దూసుకెళుతోంది. ఈ అంశాలన్నింటినీ పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. 


మనిషి శరీరంలో నాడీమండల వ్యవస్థ తీరుగా, దేశ ఆర్థిక వ్యవస్థలో రవాణా వ్యవస్థ పనిచేస్తుంది. ఒక దేశం నిలకడైన ఆర్థిక వృద్ధి సాధించడానికి చక్కని సమన్వయంతో కూడిన సుస్థిర రవాణా వ్యవస్థ కీలకం. ప్రస్తుతం భారత రవాణా వ్యవస్థలో నాలుగు రకాల రవాణా మార్గాలున్నాయి. అవి 

1) రోడ్డు రవాణా 

2) రైలు రవాణా

 3) నౌకా రవాణా

 4) వాయు రవాణా.


దేశ రవాణా రంగం కొన్నేళ్లుగా వివిధ వలయాలుగా విస్తరించి గణనీయ వృద్ధి సాధించడంతో పాటు సత్ఫలితాలిస్తోంది. దేశవ్యాప్తంగా రైల్వే, విమానయానం మినహా వివిధ రవాణా సాధనాల అభివృద్ధి, సంబంధిత ప్రణాళికలు, విధానాలను కేంద్ర నౌకా రవాణా, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖలు రూపొందించి అమలు చేస్తుంటాయి.


 గతంలో నౌకా, రోడ్డు రవాణాగా ఉన్న విభాగాన్ని జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి 2009లో విడదీశారు. రోడ్డు రవాణా - జాతీయ రహదారులను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేశారు. రోడ్డు రవాణాతో పాటు రవాణా రంగ పరిశోధన, సంబంధిత నియమ నిబంధనల చట్టాల రూపకల్పన, నిర్వహణ బాధ్యతను దీనికి అప్పగించారు. ప్రపంచంలోని అతిపెద్ద రోడ్డు రవాణా వ్యవస్థల్లో భారతదేశ రోడ్డు రవాణా వ్యవస్థ ఒకటి. 2017-18లో భారతదేశం స్థూల అనుసంధాన విలువలో 3.06 శాతాన్ని రోడ్డు రవాణా దక్కించుకుంది. 1951లో దేశంలోని రహదార్ల పొడవు 4 లక్షల కి.మీ. ఉంటే, 2019 నాటికి అది 63.32 లక్షల కి.మీ.కు పెరిగింది. దేశంలో ప్రధానంగా జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులని మూడు రకాలు ఉంటాయి.


జాతీయ రహదారులు: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్మించే వాటిని జాతీయ రహదారులుగా వ్యవహరిస్తారు. దేశంలోని మొత్తం రహదారుల నిడివి 2.08 శాతం. ఇందులో జాతీయ రహదారుల పొడవు 1.7 శాతం. దేశంలో రహదారులపై మొత్తం ట్రాఫిక్‌లో జాతీయ రహదారుల వాటా 40 శాతం ఉంది. 


నూతన విధానం: జాతీయ రహదార్లకు 2010, ఏప్రిల్‌ 28 నుంచి కొత్త విధానంలో సంఖ్యలు కేటాయించారు.


1) ఉత్తరం - దక్షిణం వైపు సాగే అన్ని జాతీయ రహదారులకు సరి సంఖ్య కేటాయించారు. ఈ సంఖ్యలు తూర్పు నుంచి పడమరకు ఆరోహణ క్రమంలో ఉంటాయి.


2) తూర్పు - పశ్చిమ వైపు సాగే అన్ని జాతీయ రహదార్లకు బేసి సంఖ్యలు కేటాయించారు. ఇవి ఉత్తరం నుంచి దక్షిణానికి ఆరోహణ క్రమంలో ఉంటాయి.


3) అన్ని ప్రధాన రహదార్లకు ఒక డిజిట్‌ లేదా రెండు డిజిట్‌ సంఖ్యలు మాత్రమే కేటాయించారు.


4) ద్వితీయ ప్రాధాన్యం ఉన్న రహదార్లకు, ప్రధాన రహదార్ల శాఖలకు మూడు డిజిట్‌ సంఖ్యలను కేటాయించారు.


5) మూడు డిజిట్ల రహదార్లకు సంబంధించిన కొద్దిపాటి ఉపశాఖలకు సంఖ్య తర్వాత ఎ, బి, సి, డి వంటి అక్షరాలు అదనంగా చేర్చారు.


ముఖ్యాంశాలు: 

* మొత్తం రహదార్ల పొడవు 63,31,800 కి.మీ.


* జాతీయ రహదార్ల పొడవు 1,32,499 కి.మీ.


* రాష్ట్ర రహదార్ల పొడవు 1,79,500 కి.మీ.


* మొత్తం వాహనాల సంఖ్య 32,62,99,000.


* రహదార్ల రవాణా ద్వారా రాబడి - కేంద్ర ప్రభుత్వం 1,21,.283 కోట్లు, రాష్ట్రాలు 73,880 కోట్లు.


* మొత్తం జాతీయ రహదారుల సంఖ్య - 599


* అత్యంత పొడవైన జాతీయ రహదారి - NH 44  (పాత అంకె 7) (శ్రీనగర్‌-కన్యాకుమారి 4,112 కి.మీ.)


* రెండో అత్యంత పొడవైన జాతీయ రహదారి NH 27   - పోరుబందర్‌ (గుజరాత్‌) నుంచి సిల్చార్‌ (అస్సాం) (3,507 కి.మీ.)


* ఎక్కువ జాతీయ రహదార్లు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర (98)


* అతి చిన్న జాతీయ రహదారి NH1 (జమ్ము- కశ్మీర్‌ నుంచి లద్దాఖ్‌ వరకు 534 కి.మీ.)


భారత జాతీయ రహదార్ల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ):  ఇదొక భారత ప్రభుత్వ సంస్థ. జాతీయ రహదార్ల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన నోడల్‌ సంస్థగా పనిచేస్తుంది. 1988లో ఏర్పాటు చేశారు. మొదటి అధ్యక్షుడు డాక్టర్‌ యోగేంద్ర నారాయణ్‌. ప్రస్తుత అధ్యక్షుడు సంతోష్‌ కుమార్‌ యాదవ్‌. ఎన్‌హెచ్‌ఏఐ.కి 1995లో స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు. జాతీయ రహదార్ల అభివృద్ధి పథకం అమలు బాధ్యత నిర్వహిస్తుంది. దీని కోసం పెట్రోలు, డీజిల్‌పై వసూలు చేసే మొత్తంలో కొంత భాగం ఈ సంస్థకు కేటాయిస్తారు. జాతీయ రహదార్ల అభివృద్ధి పథకం బాండ్ల విక్రయం ద్వారా అదనపు నిధులను సమకూర్చుకుంటుంది. చేపట్టే ప్రాజెక్టుల్లో పెట్టుబడి కోసం ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, జపాన్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ నుంచి రుణాలు తీసుకుంటుంది.  ఇతరత్రా చిన్న ప్రాజెక్టులతో కలిపి మొత్తం 50,329 కి.మీ. పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ సహా జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టును ఈ సంస్థకు అప్పగించారు. 


జాతీయ రహదార్ల అభివృద్ధి పథకం: ఉత్తమ ప్రయాణాలకు తగినట్లుగా దేశంలోని జాతీయ రహదారుల ఉన్నతీకరణ - పునరుద్ధరణ - విస్తరణ లక్ష్యంగా జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టును 1998లో ప్రారంభించారు. ఇది కేంద్ర రోడ్డు రవాణా - రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్‌హెచ్‌ఏఐ ద్వారా అమలవుతుంది. ఈ పథకం కింద దశలవారీగా దేశంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తారు. ఇప్పటివరకు ఏడు దశలు అమలయ్యాయి.


1) మొదటి, రెండు దశలలో స్వర్ణ చతుర్భుజి పూర్తయింది. ప్రధాన రేవు పట్టణాలను కలుపుతూ జాతీయ రహదారులను అభివృద్ధి చేశారు.


2) మూడు, నాలుగు దశల్లో నాలుగు వరుసల రహదార్లు అభివృద్ధి చేశారు.


3) అయిదో దశలో 6,500 కి.మీ. మేర ఆరు వరుసల రహదార్లుగా అభివృద్ధి చేసేందుకు ఆమోదం లభించింది.


4) ఆరో దశలో ఎక్స్‌ప్రెస్‌ రహదారులను అభివృద్ధి చేయాలని సంకల్పించారు.


5) ఏడో దశలో అనేక ప్రాంతాల్లో వలయ రహదార్లు (రింగ్‌రోడ్లు), బైపాస్‌ రహదార్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. ఈ పథకం భారత్‌ మాతా ప్రాజెక్టులో విలీనమైంది.


స్వర్ణ చతుర్భుజి: దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా నగరాలను కలుపుతూ అభివృద్ధి చేసిన రహదార్ల అనుసంధానం స్వర్ణ చతుర్భుజి. ఈ పథకాన్ని 2001లో అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రారంభించగా, 2012లో పూర్తయింది. దీని పొడవు 5,846 కి.మీ. ఇది నాలుగు వరుసల రహదారి వ్యవస్థ.


సేతు భారతం కార్యక్రమం: 2016, మార్చి 4న సేతు భారతం కార్యక్రమం ప్రారంభమైంది. రూ.50 వేల కోట్ల పెట్టుబడితో జాతీయ రహదార్లపై వంతెనలు నిర్మించడం దీని లక్ష్యం. 2019 కల్లా జాతీయ రహదార్లకు రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌లు అవరోధం కాకుండా రూ.20,800 కోట్ల వ్యయంతో 208 రైల్వే పైవంతెనలు, కింది వంతెనలు నిర్మించడం ఈ కార్యక్రమం లక్ష్యం. దీనికితోడు 1500 పాత, శిథిలమైన వంతెనలు తొలగించడంతో పాటు వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తారు.


భారత మాల పరియోజన: ఇది దేశంలో రెండో అతిపెద్ద రహదారి నిర్మాణ ప్రాజెక్టు. 2017-18లో ప్రారంభమైంది. 26,000 కి.మీ. పొడవునా ఆర్థిక కారిడార్ల అభివృద్ధి చేపడతారు. అలాగే స్వర్ణ చతుర్భుజి ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ కారిడార్ల పరిధిలో అధికశాతం సరకు రవాణా రహదారుల మీదుగా సాగుతుందని అంచనా. తదనుగుణంగా ఆర్థిక కారిడార్ల సామర్థ్యం మెరుగుదల కోసం దాదాపు 8000 కి.మీ, మధ్యంతర కారిడార్ల కోసం 7,500 కి.మీ. అనుబంధ మార్గాలను గుర్తించారు.


జాతీయ హరిత రహదారుల కారిడార్‌ ప్రాజెక్టు: ఈ పథకాన్ని 2016లో ప్రారంభించారు. దీని కింద రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మీదుగా సుమారు 781 కి.మీ. పొడవైన పలు జాతీయ రహదారుల ఉన్నతీకరణ చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయం అందిస్తోంది.


ఈ పథకం లక్ష్యాలు: 

* చెట్లు, పొదలకు వాయు కాలుష్యకారకాల సంగ్రహణ స్వభావం ఉంటుంది. అందుకే జాతీయ రహదారుల వెంట మొక్కలు నాటేందుకు విధానచట్రం రూపకల్పన

* వాహనాల సంఖ్య పెరుగుదలతో నానాటికీ అధికమవుతున్న శబ్ద కాలుష్య ప్రభావం తగ్గింపు.

* రోడ్డు గట్లు, వాలు వద్ద నేలకోతను అరికట్టడం.


పర్వతమాల పరియోజన: పర్వత ప్రాంతాల్లో ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుతో పాటు పర్యాటక రంగం ప్రగతి దిశగా జాతీయ మోకు మార్గాల (రోప్‌ వే) అభివృద్ధికి ఉద్దేశించిన పథకం. కొండ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా అధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో (ఉదా: వారణాసి, ఉజ్జయిని) ప్రత్యామ్నాయ రవాణా మార్గంగానూ రోప్‌ వేలు నిర్మిస్తున్నారు.


పీఎం గతిశక్తి ప్రణాళిక: పీఎం గతిశక్తి అనేది బహుళ రవాణా సాధన, అనుసంధాన జాతీయ బృహత్‌ ప్రణాళిక. 2021లో దీనిని ఒక డిజిటల్‌ వేదికగా ప్రకటించారు. దేశంలో రైలు, రోడ్డు మార్గాలు సహా మౌలిక సదుపాయాల అనుసంధాన పథకాలపై సమగ్ర ప్రణాళిక రచనకు, సమన్వయంతో అమలు చేయడానికి వీలుగా 16 మంత్రిత్వ శాఖలను ఒకే తాటిపైకి తేవడం దీని లక్ష్యం.


ఈ-టోల్‌ రహదారి రుసుం వసూళ్లు: రోడ్డు రవాణా- జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా జాతీయ ఎలక్ట్రానిక్‌ రహదారి రుసుం వసూళ్ల కార్యక్రమం (ఎన్‌ ఈటీసీ) పేరుతో కీలక వ్యవస్థను ప్రవేశపెట్టింది. టోల్‌ కేంద్రాల నుంచి నిరంతరం సాగే వాహన రాకపోకల పర్యవేక్షణ సహా ఫాస్టాగ్‌ సదుపాయాలతో రుసుం వసూళ్లలో పారదర్శకత పెంచడం ఈ వ్యవస్థ లక్ష్యం. దీనికి జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) పర్యవేక్షక కేంద్రంగా వ్యవహరిస్తుంది.

 

 

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌

 

 

Posted Date : 15-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రైల్వే రవాణా

సుదూరాలతో సులువైన అనుసంధానం! 

దేశ సమైక్యత, సమగ్రతను చాటే వ్యవస్థల్లో భారతీయ రైల్వేకు ప్రముఖ స్థానం ఉంది. బ్రిటిష్‌ హయాంలో దేశంలో వేళ్లూనుకున్న రైల్వే, భారతీయుల్లో జాతీయతా భావాలను పెంపొందించడంలో సాయపడింది. స్వాతంత్య్రానంతరం రవాణా, ఆర్థిక రంగాలకు ఆసరాగా నిలిచింది. ఇటీవల కాలంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వేగంగా పరుగులు తీస్తోంది. భారతీయ రైల్వే ప్రస్థానం, ఆవిరి ఇంజిన్ల నుంచి నేటి వందేభారత్‌ రైళ్ల వరకు జరిగిన ప్రగతిని అభ్యర్థులు తెలుసుకోవాలి. సువిశాల దేశంలో రైల్వేరంగం స్వరూపం, పనితీరుతో పాటు ప్రస్తుతం నడుస్తున్న రకరకాల రైళ్లు, అందులో వేగంగా నడిచేవి, వాటి ప్రయాణ మార్గాల గురించి అవగాహన పెంచుకోవాలి. 


మన దేశ రవాణా రంగంలో రైల్వేలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.అతి పెద్ద రైల్వే వ్యవస్థను కలిగి ఉన్న దేశంగా ప్రపంచంలో రెండో స్థానాన్ని, ఆసియాలో మొదటి స్థానాన్ని భారత్‌ దక్కించుకుంది. ప్రయాణికులతో పాటు సరకు రవాణాలోనూ రైల్వేలు ప్రధానంగా ఉన్నాయి. దూరప్రాంత ప్రయాణానికి, రవాణాకు రహదారుల కన్నా రైల్వేలు సౌకర్యంగా ఉంటాయి. దేశం నలుమూలల నుంచి ప్రజలను అనుసంధానం చేస్తూ, వ్యాపార, పర్యాటక, తీర్థయాత్ర, విద్యాసంబంధ కార్యకలాపాల నిర్వహణను రైల్వే సులభతరం చేస్తోంది.

చరిత్ర: దేశంలో తొలి ఆవిరి ఇంజిన్‌ రైలు 1853, ఏప్రిల్‌ 16న బొంబాయి నుంచి థానే మధ్య 34 కి.మీ. ప్రయాణించింది. ఈ మార్గాన్ని నిర్మించాలనే ఆలోచన మొదట బొంబాయి ప్రభుత్వ చీఫ్‌ ఇంజినీరు జార్జి క్లార్క్‌కు 1843లో వచ్చింది. 1853లో ప్రారంభించిన రైల్వే మార్గంలో 400 మంది అతిథులతో 14 బోగీల రైలును నడిపారు. మొదటి ప్రయాణికుల వాణిజ్య రైలు 1854, ఆగస్టు 15న 24 మైళ్ల దూరం ఉన్న హుగ్లీ - హౌరా మధ్య ప్రారంభమైంది. దేశంలో తూర్పు ప్రాంతంలో ఈస్ట్‌ ఇండియన్‌ రైల్వే సెక్షన్‌ ద్వారా రైలు ప్రయాణం జరిగింది. దక్షిణాన మొదటి రైలు 1856, జులైలో మద్రాసు రైల్వే కంపెనీ వ్యాసర్పాది నుంచి ఆర్కాట్‌ మధ్య నడిచింది. 1859, మార్చి 3న అలహాబాద్‌ నుంచి కాన్పుర్‌ మధ్య 69 మైళ్ల దూర మేర రైలు ప్రయాణం జరిగింది. 1880 నాటికి 9000 మైళ్ల పొడవైన రైలు మార్గాలు దేశంలో ఏర్పడ్డాయి. ప్రస్తుతం 68,043 కి.మీ. పొడవైన మార్గాలు, 7,308 స్టేషన్లతో సువిశాల వలయంగా విస్తరించాయి. 13,215 ఇంజిన్లు, 74,744 ప్రయాణ బోగీలు, 10,103 ఇతర బోగీలు సహా 3,18,896 వ్యాగన్లతో భారతీయ రైల్వేలు పటిష్ఠంగా ఉన్నాయి.

రైలు వేగం:  

సాధారణ వేగం - గంటకు 160 కి.మీ.లోపు

* సెమీ-హై వేగం - గంటకు 160 - 200 కి.మీ. 

* అధిక వేగం (హై) - గంటకు 200 కి.మీ.పైన  

* ప్రతిపాదిత బుల్లెట్‌ రైలు వేగం - గంటకు 320 కి.మీ. 

* ప్రస్తుతం అత్యంత అధిక వేగంతో నడుస్తున్న రైలు - వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (గంటకు 180 కి.మీ.)

* అత్యంత అధిక వేగంతో నడుస్తున్న రెండో రైలు - గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ (160 కి.మీ.) (న్యూదిల్లీ - ఆగ్రా)

రైల్వే జోన్లు: పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం రైల్వే వ్యవస్థను 17 జోన్లుగా విభజించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 1966, అక్టోబరు 2న సికింద్రాబాదు కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటైంది. దక్షిణ రైల్వేలోని విజయవాడ డివిజన్‌ను, కేంద్ర రైల్వేలోని సోలాపుర్, సికింద్రాబాదు డివిజన్లను విడదీసి దక్షిణ మధ్యరైల్వేగా ఏర్పాటు చేశారు. 1977, అక్టోబరు 2 నుంచి దక్షిణ రైల్వేలోని గుంతకల్లు డివిజన్‌ను కూడా ఇందులో కలిపారు. 1978లో సికింద్రాబాదును సికింద్రాబాదు, హైదరాబాదు డివిజన్లుగా విభజించారు. 2003, ఏప్రిల్‌లో గుంటూరు డివిజన్‌ ఏర్పాటైంది.

పరిశోధన - అభివృద్ధి: భారతీయ రైల్వేల పరిశోధన - అభివృద్ధి విభాగం (రిసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్స్‌ ఆర్గనైజేషన్‌ - ఆర్‌డీఎస్‌ఓ) పేరుతో లఖ్‌నవూలో ఉంది. రైల్వే రంగ సంబంధిత సాంకేతిక అంశాల్లో ఈ సంస్థ సలహాదారుగా వ్యవహరిస్తుంది. రైల్వే తయారీ - డిజైన్‌తో ముడిపడి ఉన్న ఇతర సంస్థలకూ ఇది సంప్రదింపు సేవలను అందిస్తుంది. కొవిడ్‌ సమయంలో మహమ్మారి వ్యాప్తి నిరోధం కోసం సీఎస్‌ఐఆర్‌ - సీఎస్‌ఐఓల సహకారంతో ఏసీ బోగీల యూవీ-సీ ఆధారిత వైరస్‌ సూక్ష్మజీవ నిరోధక వ్యవస్థను ఆర్‌డీఎస్‌ఓ రూపొందించి అందజేసింది. అలాగే ద్విచక్ర, చతుశ్చక్ర తేలికపాటి/భారీ వాహనాలను ఎక్కించడం, దింపడం లాంటి సదుపాయాలతో 18 టన్నుల అత్యధిక బరువు మోయగల, 110 కి.మీ. వేగంతో ప్రయాణించే రవాణా కోచ్‌లను కూడా రూపొందించింది.

రైల్వే ఆర్థిక వ్యవస్థ: రైల్వే బడ్జెట్‌ కేంద్ర బడ్జెట్‌లో భాగమే అయినప్పటికీ 1924 నాటి తీర్మానం మేరకు అక్వర్త్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం 1924-25 ఆర్థిక సంవత్సరం నుంచి రైల్వే బడ్జెట్‌ను చట్టసభకు విడిగా సమర్పిస్తున్నారు. రైల్వే కేటాయింపులకు సంబంధించి 16 పద్దులుంటే, వాటిని పార్లమెంటు పరిగణనలోకి తీసుకుని విడిగా ఆమోదించాల్సి ఉంటుంది. సాధారణ ఆర్థిక వ్యవహారాల్లో భాగంగా రైల్వే కార్యకలాపాల్లో పౌర అంచనాలను స్థిరంగా ఉంచటమే ఈ తీర్మానం ప్రధాన ఉద్దేశం. అయితే 2017-18 నుంచి బిబేక్‌ దేబ్‌రాయ్‌ కమిటీ సిఫార్సు మేరకు రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు.

రైల్వే కంపెనీలు: భారతదేశంలో మొదట ఆంగ్లేయుల యాజమాన్యంలోని ప్రైవేటు కంపెనీలు రైళ్లను నడిపాయి. 1849లో గ్రేట్‌ ఇండియన్‌ పెనిన్సులర్‌ రైల్వే కంపెనీ ఏర్పాటైంది. ఆ తర్వాత కలకత్తా అండ్‌ సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేస్‌ ఏర్పాటైంది. 1968లో నష్టాలు భరించలేక అది తన ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనపరిచింది. ఆ విధంగా ప్రభుత్వ యాజమాన్యంలోని మొదటి రైల్వే సంస్థగా మారింది. రైలు మార్గాలకు, స్టేషన్లకు కావాల్సిన భూమిని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. మూలధనంపై కనీస ప్రతిఫలానికి హామీ ఇచ్చింది. 1882 నాటికి దాదాపు 75 రైల్వే కంపెనీలు పనిచేసేవి. అందులో కొన్నింటిని స్వదేశీ సంస్థానాలు నడిపేవి. 1889లో నిజాం రైల్వేను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1901లో థామస్‌ రాబర్ట్‌ సన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం రైల్వే బోర్డు ఏర్పాటైంది.


1920లో అక్వర్త్‌ కమిటీ సిఫార్సుల మేరకు 1925లో మొదటిసారి రైల్వే కంపెనీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. క్రమంగా అన్ని కంపెనీలను హస్తగతం చేసుకుంది. 1950లో రాజుల సంస్థానాలను నడుపుతున్న రైల్వేలను కూడా స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఏకస్వామ్య సంస్థగా భారతీయ రైల్వే నడుస్తోంది.

ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ):  ఇది భారత రైల్వే అనుబంధ సంస్థ. 1999, సెప్టెంబరు 27న ప్రారంభమైంది. ప్రధాన కార్యాలయం న్యూదిల్లీ. ఆన్‌లైన్‌లో టికెట్ల జారీ, రిజర్వేషన్, రద్దు చేసుకోవడం, రైలు వేళలు, కదలికలను తెలుసుకోవడం లాంటి సేవలను ప్రధానంగా అందిస్తోంది. రైల్వేస్టేషన్లలో ఈ సంస్థ రెస్టారెంట్లు, వసతి గదులు నిర్వహిస్తోంది. రైళ్లలో భోజనం, తినుబండారాల సౌకర్యం కల్పించడంతో పాటు, పర్యాటక ప్యాకేజీలను అందుబాటులో ఉంచుతోంది.

టికెట్ల విధానం: భారత రైల్వేల్లో నిత్యం సీటు/ బెర్తు రిజర్వేషన్‌ లేకుండా ప్రయాణించేవారే ఎక్కువ. పెద్ద రైల్వేస్టేషన్ల వద్ద కంప్యూటర్‌ ద్వారా అన్‌రిజర్వ్‌ టికెట్లను ముందస్తుగా తీసుకునే ఏర్పాటు చేశారు.

ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌: మొత్తం 13 భారతీయ రైళ్లకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ లభించింది.

లగ్జరీ రైళ్లు:  

1) ప్యాలెస్‌ ఆన్‌ వీల్స్‌ (1982)  

2) దక్కన్‌ ఒడిస్సి (2007)  

3) ది గోల్డెన్‌ చారియట్‌ (2008)  

4) రాయల్‌ రాజస్థాన్‌ ఆన్‌ వీల్స్‌ (2009)  

5) మహాపరినివాస్‌ ఎక్స్‌ప్రెస్‌ (2007)  

6) మహారాజా ఎక్స్‌ప్రెస్‌ (2010)

అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లు: 

1) తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ 

2) గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ 

3) శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ 

4) రాజధాని ఎక్స్‌ప్రెస్‌ 

5) దురంతో ఎక్స్‌ప్రెస్‌

 6) హర్‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌

7) ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ 

8) యువ ఎక్స్‌ప్రెస్‌ 

9) జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ 

10) కవిగురు ఎక్స్‌ప్రెస్‌ 

11) వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ 

12) వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌: 2019, ఫిబ్రవరి 15న న్యూదిల్లీ - వారణాసి మధ్య తొలి వందేభారత్‌ రైలు ప్రారంభమైంది. ఈ తరహా రైళ్లు నేడు దేశవ్యాప్తంగా 34 నడుస్తున్నాయి. వందేభారత్‌ రైళ్లు సన్నాహక పరీక్షల్లో గంటకు 180 కి.మీ. వెళ్లినప్పటికీ, ప్రయాణంలో అనుమతించిన గరిష్ఠ వేగం గంటకు 160 కి.మీ.



రచయిత: ధరణి శ్రీనివాస్‌


 


 

Posted Date : 21-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జల రవాణా

సరసమైన ధరల్లో సరకుల సరఫరా! 

 

మూడు వైపుల్లో సముద్రం, అంతర్గతంగా నదులు, కాలువలు వంటి విస్తృత జల వనరులు దేశంలో ఉన్నాయి.  అవి పడవలు, ఓడల ద్వారా సరసమైన ధరల్లో రవాణాకు వీలు కల్పిస్తున్నాయి. సరకు రవాణా, వాణిజ్యానికి జలమార్గాలు అత్యంత కీలకమైనవి. ఆర్థికంగా, పర్యావరణానికి అనుకూలమైనవి. దేశంలో జల రవాణా స్వరూపం, తీరుతెన్నులతో పాటు జాతీయ జలమార్గాల అభివృద్ధికి జరుగుతున్న కృషిని పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. సముద్ర రవాణాకు సంబంధించి దేశంలోని ప్రధాన రేవులు, వాటి ప్రత్యేకతలు, సముద్రయానం అభివృద్ధికి ప్రభుత్వపరంగా ఉన్న వ్యవస్థలపై అవగాహన పెంచుకోవాలి.


జలమార్గాల ద్వారా రవాణా అతిచౌకగా జరుగుతుంది. ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన  సముద్రాలు, నదులు, కాలువలను జలమార్గాలుగా ఉపయోగించుకోవడంతో నిర్మాణ వ్యయం కూడా ఉండదు. అక్కడక్కడ కొన్ని కాలువలు, మానవ నిర్మితమైనవి ఉంటాయి.ఎక్కువ పరిమాణం, ఎక్కువ బరువైన వస్తువులను, తక్కువ ఖర్చుతో తరలించేందుకు జల రవాణా అనుకూలం. ఇది పర్యావరణానికి హాని కలిగించదు. జలరవాణా రెండు రకాలుగా ఉంటుంది. 


1) లోతట్టు నీటి రవాణా (ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ ట్రాన్స్‌పోర్టు) 


2) సముద్ర రవాణా (ఓషన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫ్‌ షిప్పింగ్‌)

 

లోతట్టు నీటి రవాణా: ప్రస్తుతం దేశంలో ఉన్న లోతట్టు జలమార్గాల పొడవు 14,500 కి.మీ. అయితే కాలువలు వెడల్పుగా లేకపోవడం, లోతు తక్కువగా ఉండటం, ఒడ్డు/ తీరం కొట్టుకుపోవడం వంటి సమస్యలతో కొంతమేరకే రవాణాకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఇందులో 5,200 కి.మీ. నదీమార్గాలు కాగా, 4,000 కి.మీ కాలువలు. ఇవేకాక నిల్వ నీరు, కయ్యలు, సరస్సులు మొదలైనవి కూడా జలమార్గాలుగా వినియోగంలో ఉన్నాయి. అత్యధిక పొడవైన జలమార్గాలున్న రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ది మొదటి స్థానం. ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, కేరళ ఉన్నాయి.


బకింగ్‌హాం కాలువ: ఇది దేశంలో అత్యంత పొడవైన జలమార్గపు కాలువ. బ్రిటిష్‌ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, తమిళనాడులోని విల్లుపురాన్ని కలుపుతూ తూర్పుతీర ప్రాంతానికి దగ్గరగా 796 కి.మీ. పొడవున అనేక దశల్లో ఈ కాలువను నిర్మించారు. కొంతకాలం దీనిని లార్డ్‌క్లైవ్‌ కాలువగా పిలిచారు. 1878 నుంచి అప్పటి మద్రాస్‌ గవర్నర్‌ డ్యూక్‌ ఆఫ్‌ బకింగ్‌ హాం పేరుతో పిలుస్తున్నారు. తూర్పు తీరంలో 1966, 1976లలో ఏర్పడిన తీవ్ర తుపాన్ల వల్ల అనేక చోట్ల ఈ కాలువ పూడిపోయింది. ప్రస్తుతం మరమ్మతులు చేసి తిరిగి ఉపయోగంలోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది.


కర్నూలు- కడప కాలువ (కేసీ కెనాల్‌):  ఆంధ్రప్రదేశ్‌లో 1863-70 మధ్య సాగునీటి కాలువగా నిర్మించిన కర్నూలు - కడప కాలువ 1933 వరకు జలమార్గంగా కూడా ఉపయోగపడింది. ఇది పెన్నా, తుంగభద్ర నదులను కలుపుతుంది. కర్నూలు వద్ద సుంకేశులలో ప్రారంభమవుతుంది.వాటితో పాటు ఒరిస్సా కాలువ, మడ్నిపూరు కాలువ, దామోదర కాలువ, పశ్చిమతీర కాలువ తదితరాలను జలరవాణాకు ఉపయోగిస్తున్నారు.

 

ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ అథారిటీ: కేంద్ర ప్రభుత్వం 1986, అక్టోబర్‌ 27న ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ ఆథారిటీస్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటుచేసింది. దీని ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంటుంది. దేశంలో పలుచోట్ల దీని ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. జాతీయ జలమార్గాల అభివృద్ధి, నిర్వహణ దీని బాధ్యత. జాతీయ జలమార్గాలు అనే భావవను 1982లో ప్రవేశపెట్టారు. దేశంలో 111 జాతీయ జలమార్గాలున్నాయి. లోతట్టు జలమార్గాల అభివృద్ధిలో భాగంగా 26 జాతీయ జలమార్గాలకు సరకు రవాణా విషయంలో ప్రాధాన్యత ఇచ్చారు. వాటిలో 14 మార్గాల అభివృద్ధికి చర్యలు ప్రారంభమయ్యాయి. 2020 నుంచి 3 సంవత్సరాలపాటు జలమార్గాల వినియోగ ఛార్జీలకు మినహాయింపు ఇచ్చారు. ఇన్‌ల్యాండ్‌ వెసెల్స్‌ చట్టం- 1917 స్థానంలో 2021లో కొత్త చట్టం రూపుదిద్దుకుంది.

 

జాతీయ జలమార్గం-4:  2008, నవంబరు 24న ఈ జలమార్గాన్ని ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలలో 1095 కి.మీ. మేర  జాతీయ జలమార్గం-4 సాగుతుంది. తెలంగాణలోని భద్రాచలం వంతెన వద్ద ప్రారంభమై పుదుచ్చేరిలోని కనగచెట్టికులం వంతెన వద్ద అంతమవుతుంది. ఇందులో కాకినాడ, ఏలూరు, కుమ్మనూరు, బకింగ్‌ హాం కాలువలు అంతర్భాగం. ఈ జలమార్గంలో 690 కి.మీ. పొడవున కాలువ భాగం, 328 కి.మీ. మేర గోదావరి, కృష్ణా నదులు భాగంగా ఉంటాయి.


సముద్ర రవాణా/నౌకా రవాణా:  ఇది 

1) తీరప్రాంత రవాణా 

2) విదేశీ రవాణా అని రెండు రకాలు.


తీరప్రాంత రవాణా: భారతదేశానికి తూర్పు, పశ్చిమ తీరాలు కలిపి 7,517 కి.మీ. సముద్ర తీరం ఉంది. 12 ప్రధాన రేవులు, 205 వరకు చిన్న రేవులు ఉన్నాయి. వాటి ద్వారా జరిగే దేశీయ రవాణాను తీరప్రాంత రవాణా అంటారు. వివిధ దీవులు తీరం వెంట విస్తరించి ఉండటంతో దేశ వాణిజ్యానికి కీలక సహజవనరుగా తీరప్రాంత రవాణా ఉపయోగపడుతోంది. మన ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన రవాణా రంగంలో భారతీయ నౌకాయాన పరిశ్రమ చిరకాలం నుంచి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మేరకు పరిమాణం రీత్యా సుమారు 95 శాతం, విలువరీత్యా 68 శాతం వరకు వాణిజ్యం సముద్ర రవాణా ద్వారా సాగుతోంది.


విదేశీ రవాణా: అంతర్జాతీయ రవాణాకు జలమార్గాలు ఆయువు పట్టుగా వ్యవహరిస్తాయి. భారతదేశ అంతర్జాతీయ వ్యాపారంలో సరకుల రవాణాలో 95 శాతం, వ్యాపార విలువలో 70 శాతం వరకు నౌకల ద్వారానే జరుగుతోంది. ప్రణాళికా కాలంలో అంతర్జాతీయ నౌకా రవాణాలో భారతీయ నౌకా కంపెనీల వాటా పెరుగుతూ వస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధికంగా రవాణా నౌకలున్న దేశాల్లో భారతదేశం ఒకటి. ప్రపంచంలో 16వ స్థానంలో ఉంది.

 

షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా: 1961, అక్టోబరు 2న షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఒక ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా ఏర్పాటైంది. 1992, సెప్టెంబరు 10 నుంచి పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా మారింది. ఇది దేశంలో అతి పెద్ద షిప్పింగ్‌ కంపెనీ. ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. 2008, ఆగస్టులో దీనికి నవరత్న హోదా వచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ మూలధనంలో కేంద్ర ప్రభుత్వ వాటా 75 శాతం. దీని ప్రైవేటీకరణకు 2019, నవంబరులో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.


ప్రధాన రేవులు: దేశంలోని తీర ప్రాంతం పొడవునా 12 ప్రధాన ఓడరేవులున్నాయి. తూర్పు, పశ్చిమ తీరాల్లో ఒక్కోవైపు 6 రేవులున్నాయి. విశాఖపట్నం రేవు సహజంగా ఏర్పడింది. లోతైనది, పురాతనమైనది. దీనికి మూడు హార్బర్లు ఉన్నాయి. చెన్నై రేవు కూడా ప్రాచీనమైనదే. దీనిని కృత్రిమంగా ఏర్పాటుచేశారు. దేశంలో ముంబాయి రేవు అతిపెద్దది. ఎక్కువ రద్దీగా ఉంటుంది. కొచ్చిన్‌ రేవు కూడా సహజంగా ఏర్పడింది. జవహర్‌లాల్‌ నెహ్రూ రేవు, ఎన్నూరు రేవులు ఆధునికమైనవి. ఇందులో ఎన్నూరు రేవు ప్రైవేటు యాజమాన్యం కింద ఉంది. కోల్‌కతా, పారాదీప్, విశాఖపట్నం, చెన్నై, ట్యూటికోరిన్, మార్మగోవా, ముంబయి వద్ద నౌక దళాల కేంద్రాలున్నాయి.


సేతు సముద్రం షిప్‌ ఛానల్‌ ప్రాజెక్టు:  పాక్‌ స్ట్రెయిట్, పాక్‌ బే ద్వారా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్, బంగాళాఖాతాలను కలిపే ప్రాజెక్టు ఇది. దీనివల్ల దేశంలోని తూర్పు, పడమటి తీరాల మధ్య నౌకలు, నిరాటంకంగా నడవటానికి వీలవుతుంది. ఇది ఇంకా పూర్తికావాల్సి ఉంటుంది.

 

సాగరమాల ప్రాజెక్టు: దేశంలో ఓడరేవుల ప్రగతికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సాగరమాల కార్యక్రమాన్ని 2003లో ప్రతిపాదించింది. 2015, మార్చి 25న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2015, జులై 15న బెంగళూరులో ఈ ప్రాజెక్టును ఆవిష్కరించారు. దేశంలో 12 ప్రధాన ఓడరేవులను అభివృద్ధి చేయడం, తద్వారా ఆర్థికాభివృద్ధికి సాయపడటం దీని లక్ష్యం. ఓడరేవుల ఆధునీకరణ, వాటి మధ్య అనుసంధానాన్ని పెంచడం, రేవు ఆధారిత పారిశ్రామీకరణకు తోడ్పడటం, తీరప్రాంత సమాజ అభివృద్ధి ఈ పథకంలో భాగాలు. 2035 వరకు 500 ప్రాజెక్టుల్లో అమలు చేయాలని గుర్తించారు.


నౌకాయానం:  నౌకాయానం, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖను 2009లో విభజించి కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. దేశ ఆర్థిక ప్రగతిలో సముద్ర రవాణా రంగం ఒక కీలక మౌలిక సదుపాయం. దీని ద్వారా ప్రగతి వేగం, స్వరూపం, శైలి సానుకూల రీతిలో ప్రభావితమవుతాయి. ఈ మంత్రిత్వ శాఖ పేరును 2020లో ఓడరేవులు - నౌకాయానం - జలమార్గాల శాఖగా మార్చారు.దేశంలో ప్రధాన ఓడరేవులు - నౌకా నిర్మాణం, మరమ్మతులు, దేశీయ జల రవాణా వంటి వాటితో కూడిన నౌకాయాన - ఓడరేవుల రంగం ఈ శాఖ పరిధిలో ఉంటుంది. ఇది నౌకాయానం, సంబంధిత నియమ నిబంధనలు, చట్టాలు రూపకల్పన - నిర్వహణ బాధ్యతలు చూసే అత్యున్నత వ్యవస్థ. ప్రధాన ఓడరేవుల్లో బెర్తులు, సరకు రవాణా, నిర్వహణ సామర్థ్యం ప్రస్తుతం 1617.39 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు. పెరుగుతున్న విదేశీ వాణిజ్య అవసరాల దృష్ట్యా దీన్ని మరింత మెరుగుపరుస్తున్నారు.


సాగరమాల సముద్ర విమాన సేవల ప్రాజెక్టు:  2020, అక్టోబరులో మొదట అహ్మదాబాద్‌లోని కేవడియా-సబర్మతి నదీ తీరంలో సముద్ర విమానసేవ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా నిరాటంకంగా, వేగవంతమైన ప్రయాణానికి వీలు కల్పించటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. 2021, జనవరిలో దీనిని సాగరమాల సముద్ర విమాన సేవల ప్రాజెక్టుగా ప్రకటించారు. అందుకోసం సాగరమాల అభివృద్ధి కంపెనీ లిమిటెడ్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు కింద సేవలకు ఉడాన్‌ రాయితీ పథకం వర్తిస్తుంది.


సాగరమాల అభివృద్ధి కంపెనీ లిమిటెడ్‌:  దీనిని 2016లో నెలకొల్పారు. సాగరమాల ప్రాజెక్టుకు నిధులను సమీకరిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మారిటైం మండళ్లు ఏర్పాటు చేసిన స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌కి సహాయం అందిస్తుంది.

 

స్మార్ట్‌ ఓడరేవులు:  దేశంలోని 12 ప్రధాన ఓడరేవుల సమీపంలో నగరాలు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.5,000 కోట్ల వ్యయంతో ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రతి నగరానికి రూ.3,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఈ నగరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలాలు, ఓడలను విడగొట్టే కేంద్రాలు, ఓడ నిర్మాణ కేంద్రాలను నెలకొల్పుతారు. రేవు వద్ద రేవు వ్యర్థాలతో విద్యుత్తు తయారుచేస్తారు. ఈ పారిశ్రామిక నగరాలు అంతర్జాతీయ ప్రమాణాలను కలిగి ఉంటాయి. మొదట గుజరాత్‌లోని కాండ్లా రేవు వద్ద స్మార్ట్‌ నగరం నిర్మిస్తారు.

 

జలమార్గాల అభివృద్ధి:  దేశంలో లోతట్టు జల రవాణా అనుసంధానానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అంతకుముందు కేవలం 5 జాతీయ జలమార్గాలు ఉండగా, అదనంగా 106 జలమార్గాలను జాతీయ జలమార్గాలుగా ప్రకటించింది. గంగా-హల్దియా జాతీయ జలమార్గంలో జలమార్గ అభివృద్ధి ప్రాజెక్టు అమలుచేసి, 1500-2000 టన్నుల సామర్థమున్న నౌకలు నడిపే విధంగా వసతులు కల్పిస్తారు.

 

 


 

రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

 

Posted Date : 28-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

  పౌర విమానయానం

ఆకాశంలో ప్రగతి ప్రయాణం! 

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం పౌర విమానయానం. వేగవంతమైన ప్రగతికి చోదక శక్తిగా ఉపయోగపడుతోంది. ఆర్థిక సంస్కరణల ఫలితంగా ప్రైవేటు సంస్థల రంగప్రవేశంతో వేగం పుంజుకుంది. గతంలో ధనవంతులకే పరిమితమైన విమాన ప్రయాణం సగటు పౌరులందరికీ చేరువైంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త విమానాశ్రయాల నిర్మాణం, విస్తరణ శరవేగంగా జరుగుతోంది. ఈ పరిణామక్రమాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. విమానయాన నిర్వహణ, నియంత్రణ సంస్థలు, వాటి విధులు, భారతీయులకు దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు అందుతున్న తీరు, దేశవ్యాప్తంగా అనుసంధానానికి అమలుచేస్తున్న పథకాలు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కోసం వినియోగిస్తున్న సాంకేతికత గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.


దేశ అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాల్లో గగనతల రవాణా ఒకటి. ఆర్థిక వ్యవస్థతో పాటు ఉపాధి కల్పనను విశేషంగా ప్రభావితం చేయగలిగిన రంగాల్లో ఇదొకటి. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. గగన రవాణా, ఆకాశమార్గ నిర్వహణ సహా వాణిజ్య, పౌర విమానయాన మౌలిక సదుపాయాలు ఈ శాఖలో అంతర్భాగం. విమానయాన చట్టం - 1934, విమానయాన నిబంధనల చట్టం - 1937, భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ చట్టం - 1994, విమాన రవాణా చట్టం - 1972 ప్రకారం పౌర విమానయాన రంగం, సంబంధిత ఇతర చట్టాల అమలు బాధ్యతను ఈ శాఖ నిర్వర్తిస్తుంది. ఇదొక సూర్యోదయ రంగం (సన్‌రైజ్‌)గా గుర్తింపు తెచ్చుకుంది.


* 2022లో విమానాల సంఖ్య 714


* మొత్తం ప్రయాణికుల సంఖ్య 1156 లక్షలు


* సరకు రవాణా 3140 వేల టన్నులు


* అంతర్జాతీయ విమానాశ్రయాలు 34


* అతిపెద్ద విమానాశ్రయం - ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - న్యూఢిల్లీ


* రెండో అతి పెద్ద విమానాశ్రయం - ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం - ముంబయి.


* పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో నిర్మించిన మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం - కొచ్చిన్‌


* అతిచిన్న విమానాశ్రయం - తిరుచ్చి


* దేశంలో మూడు రకాల విమానాశ్రయాలున్నాయి.


1) ఏర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ప్రభుత్వ సంస్థ) నిర్వహించేవి.


2) సంయుక్తరంగ అంతర్జాతీయ విమానాశ్రయాలు


3) ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహించే విమానాశ్రయాలు

-------------------------------------------------


అంతర్జాతీయ విమాన సేవలు: విదేశాలకు భారతీయ ప్రయాణికుల రాకపోకల్లో అధిక వాటా విదేశీ విమాన సంస్థలదే. వీటిలో ఎక్కువ భాగం గల్ఫ్‌ దేశాలకు సంబంధించిన సంస్థలది. తర్వాత స్థానం ఆగ్నేయాసియా దేశాలది. భారతీయ సంస్థలు తమ వాటాను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.


మన దేశం నుంచి అత్యధికంగా విదేశీ ప్రయాణం జరిగేది గల్ఫ్‌ దేశాలకే. భారత్‌ నుంచి విదేశీ ప్రయాణ రాకపోకల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వాటా 33.6 శాతం, సౌదీ అరేబియా 6.2%, ఇంగ్లండ్‌ 5.1%, సింగపూర్‌ 6.7%, అమెరికా 2%. 


భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ (ఐఏఐ):  దేశంలో ఏర్‌ఫోర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ - 1994 ప్రకారం భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థను 1995, ఏప్రిల్‌ 1న పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. దీనికి మినీ రత్నా హోదా ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయాల ప్రాధికార సంస్థ, జాతీయ విమానాశ్రయ ప్రాధికార సంస్థల విలీనం ద్వారా ఇది ఏర్పడింది. గగనతల రవాణా సేవలు, విమానాశ్రయాలు, పౌర విమాన కేంద్రాల నిర్వహణ, విమానయాన సమాచార కేంద్రాలు, విమానాశ్రయాల స్థాపన మొదలైనవి ఐఏఐ ప్రాథమిక కర్తవ్యాలు. ప్రస్తుతం సుమారు 2.8 మిలియన్‌ చదరపు నాటికల్‌ మైళ్ల భారత్‌ గగనతలం దీని పరిధిలో ఉంది. ఇందులో భూ వైశాల్యం దాదాపు 1.0 మిలియన్‌ చదరపు నాటికల్‌ మైళ్లు కాగా, సముద్ర గగనతలం విస్తీర్ణం 1.8 మిలియన్‌ చదరపు నాటికల్‌ మైళ్లు. 133 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. అందులో 23 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 10 కస్టమ్స్‌ విమానాశ్రయాలు, 100 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి.

విమానాశ్రయ ఆర్థిక నియంత్రణ ప్రాధికార సంస్థ (ఏఈఆర్‌ఏ):  ఇది ఏర్‌ఫోర్ట్‌ ఎకనమిక్‌ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్‌-2008 ప్రకారం ఏర్పాటైన ఒక చట్టబద్ధ సంస్థ. విమానాశ్రయాల్లో అందించే ఏరోనాటికల్‌ సేవలు, విమానాశ్రయాల పనితీరు పర్యవేక్షణ, రుసుంలు, ఇతర ఛార్జీల నియంత్రణ లాంటి బాధ్యతలు ఉంటాయి. విమానయాన నిబంధనల చట్టం- 1937లోని 88వ నిబంధన ప్రకారం ప్రయాణికుల సేవా రుసుం నిర్ణయించడం కూడా దీని బాధ్యత.


బయోమెట్రిక్‌ ఆధారిత నిరంతర ప్రయాణం


పలు విమానాశ్రయాల్లో ప్రతిసారీ టికెట్‌ గుర్తింపు ధ్రువీకరణ తనిఖీ లాంటి అవరోధాలకు ఆస్కారం లేకుండా నిరంతర ప్రయాణం దిశగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ డిజి యాత్ర విధానాన్ని ప్రారంభించింది. ఇది ముఖ కవళికల గుర్తింపు సాంకేతికత ఆధారంగా విమానాశ్రయాల్లో ప్రయాణ తనిఖీ ప్రక్రియ సదుపాయం కల్పిస్తుంది.


 ప్రయాణ అనుమతి సమాచారం ప్రయాణికుల స్మార్ట్‌ ఫోన్‌లోని సురక్షిత వాలెట్‌లో నిల్వ ఉంటుంది. ఉపయోగించిన 24 గంటల్లో అదృశ్యమవుతుంది. ఈ డిజి యాత్ర యాప్‌ 2023, అక్టోబరు నాటికి ఆండ్రాయిడ్, ఐఒఎస్‌ ఫోన్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయం ప్రస్తుతం దిల్లీ, బెంగళూరు, వారణాసి, హైదరాబాద్, పుణె, కోల్‌కతా, విజయవాడ, ముంబయి, లఖ్‌నవూ, అహ్మదాబాద్, జైపుర్, కొచ్చి, గువాహటి నగరాల్లోని 13 విమానాశ్రయాల్లో పనిచేస్తోంది.

జీపీఎస్‌ ఆధారిత జియో ఆగ్‌మెంటెడ్‌ నావిగేషన్‌ (గగన్‌): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ (ఐఏఐ) సంయుక్తంగా ‘గగన్‌’ పేరుతో సహకారాత్మక వ్యవస్థను రూపొందించాయి. జీపీఎస్‌ సంకేతాల కచ్చితత్వం, విశ్వసనీయత, నాణ్యతతోపాటు ప్రత్యేకించి పౌరవిమానయానాల్లో నిర్దిష్ట విధానాలను అనుసరించడమే దీని లక్ష్యం. ఇది 2015 నుంచి దేశవ్యాప్తంగా 24 గంటలూ అందుబాటులోకి వచ్చింది.

అంతర్జాతీయ అనుసంధానం: ప్రపంచంలోని 116 దేశాలతో విమాన సేవల ఒప్పందాలున్న భారతదేశం ప్రస్తుతం విస్తృతశ్రేణి అంతర్జాతీయ విమాన సేవలు అందిస్తోంది. 52 దేశాలకు పైగా ప్రత్యక్షంగా, 100కు పైగా దేశాలకు పరోక్షంగా సంధానం కల్పిస్తోంది. 2023, అక్టోబరు నాటికి 24 దేశాలతో సార్వత్రిక గగనతల ఒడంబడిక కుదుర్చుకుంది. రష్యాతో ఉన్న ప్రత్యేక ఒప్పందం మేరకు దేశీయ కోడ్‌ వాటా కోసం కాల్‌ పాయింట్ల భాగస్వామ్యం, సామర్థ్యం పెంచుకునే హక్కులు లభించడంతో పాటు రష్యా విమానయాన సంస్థలకు మార్గాల వారి పరిమితులు తొలగించారు. 

ఉడాన్‌ (యూడీఏఎన్‌):  2016, అక్టోబర్‌లో భారత ప్రభుత్వం జాతీయ పౌర విమాన విధానంలో భాగంగా ‘ఉడే దేశ్‌కా ఆమ్‌ నాగరిక్‌’ (యూడీఏఎన్‌) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది 10 సంవత్సరాలు అమలులో ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య వైమానిక అనుసంధానం పెంచడం దీని ప్రధాన లక్ష్యం.


ఒక గంట కంటే మించని విమాన ప్రయాణానికి ఛార్జీగా రూ.2500 నిర్ణయించారు. ఈ సౌకర్యం కోసం దేశీయ విమాన సంస్థలు తమ విమానాల్లో కొంత శాతం రిజర్వ్‌ చేస్తాయి. ఈ పథకం కింద దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న 100 విమానాశ్రయాలను కలుపుతూ, 1000 మార్గాల్లో విమానాలు నడుపుతారు. ఇప్పటికే 459 మార్గాలు వినియోగంలోకి వచ్చాయి. ఉడాన్‌ కింద 2017లో సిమ్లా నుంచి దిల్లీకి తొలి విమానం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ పథకంలో 1300 మార్గాల్లో విమానయాన సేవలు అందించేందుకు వివిధ సంస్థలకు అనుమతి లభించింది. తక్కువగా సేవలు అందుతున్న 495 మార్గాల్లో 2023, అక్టోబరు 10 నాటికి 9 హెలీపోర్టులు, 2 వాటర్‌ ఏరోడ్రమ్‌లు, 75 విమానాశ్రయాలు ప్రారంభమయ్యాయి. ఉడాన్‌ కింద తూర్పు ఈశాన్య ప్రాంతంలో 13 విమానాశ్రయాలు, ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో 12 చొప్పున విమానాశ్రయాలున్నాయి. దక్షిణ ప్రాంతంలో 8 విమానాశ్రయాలను గుర్తించారు.

కృషి ఉడాన్‌ 2.0: దేశంలో ఎంపికచేసిన విమానాశ్రయాలకు విమానాల ద్వారా సరకు తరలింపు దిశగా భారతీయ రహదారులను ప్రోత్సహించడం కోసం 2021లో కృషి ఉడాన్‌ 2.0 పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనికింద సరకు రవాణాతో పాటు, ప్రయాణికులకు ల్యాండింగ్, పార్కింగ్, టెర్మినల్‌ నావిగేషన్‌ ల్యాండింగ్‌ ఛార్జీలు, రూట్‌ నావిగేషన్‌ ఫెసిలిటేషన్‌ ఛార్జీలు పూర్తిగా రద్దు చేసింది. ఈశాన్య భారతంతో పాటు, కొండలు, గిరిజన ప్రాంతాల ద్వీపాలు, ఇతర గుర్తించిన ప్రాంతాలకు ప్రభుత్వం ఇందులో ప్రాధాన్యం ఇచ్చింది. దీని కింద దేశవ్యాప్తంగా గుర్తించిన మొత్తం 58 విమానాశ్రయాల్లో ఈశాన్య, పర్వత గిరిజన, ద్వీప ప్రాంతాల్లో 25 ఉండగా, ఇతర ప్రాంతాల్లో మరో 33 ఉన్నాయి.

ఏర్‌ - ఇండియా ప్రైవేటీకరణ: 1953లో టాటా గ్రూపు నుంచి జాతీయం చేసిన ఏర్‌ ఇండియా సంస్థను ప్రైవేటీకరణలో భాగంగా తిరిగి 2023, జనవరిలో టాటా గ్రూపునకే ప్రభుత్వం విక్రయించింది. రుణ భారం భరించలేక ప్రభుత్వం ఆ విధంగా చేసింది. ఏర్‌బస్, బోయింగ్‌ లాంటి 840 విమానాల కొనుగోలుకు ఏర్‌ ఇండియా ఆర్డర్లు పెట్టింది.


ఏర్‌ సేవ:  విమాన ప్రయాణికులు ప్రయాణ సేవల సమాచారం పొందడానికి, ఫిర్యాదుల నమోదుకు అవకాశం కల్పించే చరవాణి యాప్‌ ‘ఏర్‌ సేవ’. పౌర విమానయాన మంత్రిత్వశాఖ 2016, నవంబరులో దీన్ని ప్రారంభించింది. 2018లో మెరుగుపరచి (అప్‌డేట్‌) ‘ఎయిర్‌సేవ 2.0’ను తీసుకొచ్చింది.

విమానాశ్రయాల ప్రైవేటీకరణ: ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయడానికి తొలుత 6 విమానాశ్రయాలను ఎంపిక చేశారు. అవి 

1) అహ్మదాబాద్‌ 

2) గువాహటి 

3) జైపుర్‌

 4) లఖ్‌నవూ    

 5) మంగళూరు 

6) తిరువనంతపురం


గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలు: భారతదేశంలో మొదటి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం పాక్యాంగ్‌ (సిక్కిం). కేంద్ర ప్రభుత్వం 2013లో 18 గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలకు సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం ఒకటి.


భారత విమాన రంగం చరిత్ర


1911, ఫిబ్రవరి 18న భారతదేశంలో వాణిజ్య పౌర విమాన రవాణా ప్రారంభం - అలహాబాద్‌ నుంచి నైనిటాల్‌ వరకు.


1928 మొదటి విమానాశ్రయం - బొంబాయి సమీపంలోని జూహు వద్ద వైల్‌పార్లే ఫ్లైయింగ్‌ క్లబ్‌గా ప్రసిద్ధి.


1910 - పాటియాల మహారాజు భూపేందర్‌ సింగ్‌ సొంత విమానం కొనుగోలు.


1912 - కరాచీ - ఢిల్లీ మధ్య విమాన సేవలు బ్రిటిష్‌ ఇంపీరియల్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ మొదటి దేశీయ ప్రయాణికుల విమాన సర్వీసు.


1915 - మొదటి భారతీయ విమాన సంస్థ టాటా సన్స్‌ లిమిటెడ్, కరాచీ - మద్రాసు మధ్య జంతువుల రవాణా.


1920 - రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌.. కరాచీ - బొంబాయిల వద్ద పౌరవిమానాశ్రయాల నిర్మాణం.


1927 - ప్రభుత్వ పౌర విమానయాన శాఖ ఏర్పాటు


1932 - టాటా సన్స్‌ లిమిటెడ్‌ సంస్థ శాఖగా టాటా ఎయిర్‌లైన్స్‌ ప్రారంభం. తర్వాత కాలంలో 1946లో ఎయిర్‌ ఇండియాగా మార్పు.


1940 - హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఏర్పాటు (హెచ్‌.ఎ.ఎల్‌.)


1945 - నిజాం నవాబు, టాటాల సంయుక్త దక్కన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రారంభం


1953 - భారతదేశంలో 8 దేశీయ విమాన ప్రయాణ సంస్థలు ప్రారంభం


1953 - భారత పార్లమెంటులో ఎయిర్‌ కార్పొరేషన్‌ చట్టం ఆమోదం.


ఈ చట్టంతో అప్పటి 8 ప్రైవేటు విమాన సంస్థలను జాతీయం చేశారు. వీటితో ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ అని రెండు విమాన సంస్థలను ఏర్పాటు చేశారు. ఎయిర్‌ ఇండియా విదేశీ ప్రయాణాల నిర్వహణ; ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ దేశీయ విమాన ప్రయాణాల నిర్వహణ చేసేవి.


1972 - ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐ.ఎ.ఎ.ఐ.) స్థాపన.


1986 - నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌.ఎ.ఎ.ఐ.) ఏర్పాటు. (1995లో ఐ.ఎ.ఎ.ఐ., ఎన్‌.ఎ.ఎ.ఐ. రెండింటినీ విలీనం చేసి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాగా ఏర్పాటు చేశారు)


1987 - బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ ఏర్పాటు.


1991 - భారతీయ విమాన రంగంపై ప్రభుత్వం క్రమబద్ధీకరణ తొలగింపు. ప్రైవేటు రంగంలో విమాన ప్రయాణాలు ప్రారంభం.


ఉదా: జెట్‌ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్, ఇండిగో

 

- రచయిత: ధరణి శ్రీనివాస్‌

 

 

Posted Date : 02-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత తపాలా వ్యవస్థ డిజిటల్‌ ఇండియా

తరతరాల తపాలా  సేవలు!

దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థాగత సేవల్లో తపాలాకు ప్రత్యేక స్థానం ఉంది. సమాచార వ్యవస్థలో తొలి అడుగుగా ప్రారంభమైన ఈ వ్యవస్థ దేశవ్యాప్తంగా తన పరిధిని, సేవలను విస్తరించింది. ఎప్పటికప్పుడు సంస్థాగత మార్పులు చేసుకుంటూ, ఆధునిక ధోరణుల్ని అనుసరిస్తూ విజయవంతంగా కొనసాగుతోంది. తపాలా వ్యవస్థ పూర్వాపరాలు, కాలానుగుణంగా ఎలాంటి మార్పులకు గురైంది, ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ఆధునిక సాంకేతికతతో ప్రజల అవసరాలు ఎలా తీరుస్తోందనే అంశాలను అభ్యర్థులు వివరంగా తెలుసుకోవాలి. సమాచార ప్రసార రంగంలో టెలికాం విప్లవం తీసుకొచ్చిన పెనుమార్పులు, ప్రస్తుతం డిజిటల్‌ ఇండియా లక్ష్య సాధనలో ప్రభుత్వం చూపుతున్న చొరవ, ఈ దిశగా అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల గురించి పూర్తి అవగాహనతో ఉండాలి.

భారతదేశంలో మౌర్య సామ్రాజ్యంలో పాలనా అవసరాల కోసం తపాలా వ్యవస్థ ప్రారంభమైనట్లు ఆధారాలున్నాయి. మధ్యయుగంలో 14వ శతాబ్దంలో మైసూరును పాలించిన వడయార్లు కూడా పరిపాలనా అవసరాల కోసం ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆధునిక యుగంలో ఆంగ్లేయ పాలనలో ఈస్టిండియా కంపెనీ తన వాణిజ్య వ్యవహారాలు, నిర్వహణ నిమిత్తం తపాలా వ్యవస్థను నడిపింది. 1727లో కలకత్తాలో మొదటి ఆధునిక తపాలా కార్యాలయం ప్రారంభమైంది. 1774లో కలకత్తాలో, 1786లో మద్రాస్, 1793లో బొంబాయిలో సాధారణ తపాలా కార్యాలయాలు మొదలయ్యాయి. 1837లో తపాలా కార్యాలయాల చట్టం వచ్చింది. దీని స్థానంలో 1854లో మరింత సమగ్ర చట్టం ప్రవేశపెట్టారు. అదే సంవత్సరం దేశంలో రైల్వే తపాలా సేవలు; ఇంగ్ల్లండ్, చైనాలకు సమగ్ర తపాలా సేవలు ప్రారంభమయ్యాయి. 1851లో కలకత్తా, డైమండ్‌ హార్బర్‌ల మధ్య తంతి సౌకర్యం ఆరంభమైంది. మొదట ప్రజా పనుల శాఖలో భాగంగా ప్రారంభించిన తంతి తపాలా వ్యవస్థను 1854 నుంచి ప్రత్యేక శాఖగా వేరుచేశారు. 1882, జనవరి 28న కలకత్తా, ముంబయి, మద్రాస్‌ పట్టణాలలో టెలిఫోన్‌ ఎక్స్ఛేంజీలు ఏర్పాటయ్యాయి. 1902లో వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ను ప్రవేశపెట్టారు. 1913లో సిమ్లాలో ఆటోమాటిక్‌ టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ (లఖ్‌నవూ - కాన్పుర్‌ మధ్య) ఏర్పాటైంది. 1953లో టెలెక్స్, 1960లో ఎస్‌.టి.డి. సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. 1975లో తంతి తపాలా శాఖ నుంచి టెలికాం వ్యవస్థను వేరుచేశారు. మొదటి శాటిలైట్‌ ఎర్త్‌ స్టేషన్‌ 1980లో నెలకొల్పారు. 1984లో సి-డాట్‌ సౌకర్యం ఏర్పాటైంది. 1986, ఆగస్టులో స్పీడ్‌పోస్ట్, 1996లో బిజినెస్‌ పోస్ట్‌ ప్రవేశపెట్టారు. 1995, ఆగస్టు 15న ఢిల్లీలో మొబైల్‌ సౌకర్యం ప్రారంభమైంది. 2008లో ఎలక్ట్రానిక్‌ మనీ ఆర్డర్‌ పద్ధతి, 2012లో మొబైల్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ సర్వీస్‌ (ఎం.ఎం.టి.ఎస్‌.), 2017 అక్టోబరులో ఎలక్ట్రానిక్‌ పోస్టల్‌ ఆర్డర్‌ పద్ధతి ప్రారంభమయ్యాయి.

భారత రాజ్యాంగం ప్రకారం తపాలా సేవలు కేంద్ర జాబితాలో ఉన్నాయి. తపాలా కార్యాలయాలు కార్డులు, ఇన్లాండ్‌ కవర్లు, ఎన్వలప్, తపాలా బిల్లలు విక్రయించడం, జాతీయ, అంతర్జాతీయ ఉత్తరాలు, పార్సిళ్లు బట్వాడా చేయడం, పోస్టల్‌ ఆర్డర్లు విక్రయించడం, మనీఆర్డర్‌ ద్వారా నగదు బదిలీ చేయడం, పొదుపు ఖాతాలు నిర్వహించడం, జాతీయ పొదుపు పత్రాలు, కిసాన్‌ వికాస్‌ పత్రాలు విక్రయించడం, తపాలా జీవిత బీమా, పాస్‌పోర్టు దరఖాస్తులు పంపిణీ వంటి సేవలు అందిస్తాయి. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమాచార వ్యాప్తితో పాటు సాంఘిక భదత్రా ప్రయోజనాల పంపిణీ వంటి విధులు నిర్వర్తిస్తున్నాయి. అంధ్రప్రదేశ్‌లో తిరుపతి - తిరుమల దేవస్థానం టిక్కెట్లను కూడా విక్రయిస్తున్నాయి. విశ్రాంత ఉద్యోగుల జీవిత ధ్రువీకరణ పత్రాలను, జీవన్‌ ప్రమాణ్‌ విధానం ద్వారా నమోదు చేస్తున్నాయి.

భారతదేశంలో తపాలా కార్యాలయాలు (తపాలా వ్యవస్థ 2021-22 వార్షిక నివేదిక ప్రకారం)

తపాలా సర్కిల్‌ కార్యాలయాలు - 23

తపాలా ప్రాంతీయ కార్యాలయాలు - 54

తపాలా డివిజన్‌ కార్యాలయాలు - 446

సాధారణ తపాలా కార్యాలయాలు - 24

ప్రధాన తపాలా కార్యాలయాలు - 810

ఉప తపాలా కార్యాలయాలు - 25,123

మొత్తం తపాలా కార్యాలయాలు - 1,56,434

పట్టణ తపాలా కార్యాలయాలు - 15,379

గ్రామీణ తపాలా కార్యాలయాలు - 1,41,055

శాఖా తపాలా కార్యాలయాలు - 1,31,311

గ్రామీణ డాక్‌ సేవక్‌ తపాలా కార్యాలయాలు - 2,44,328

రాత్రి తపాలా కార్యాలయాలు - 115

తపాలా డివిజన్లు - 450

సగటున ఒక తపాలా కార్యాలయం సేవలు అందుకునే జనాభా - 8,713

సగటున ఒక తపాలా కార్యాలయం సేవలు అందుకునే గ్రామ జనాభా - 6,336

సగటున ఒక తపాలా కార్యాలయం సేవలు అందుకునే పట్టణ జనాభా - 30,519

సగటున ఒక తపాలా కార్యాలయం సేవలు అందించే ప్రాంత విస్తీర్ణం - 21.36 చ.కి.మీ.

రైల్వే మెయిల్‌ డివిజన్లు - 69

అంతర్జాతీయ స్పీడ్‌ పోస్ట్‌ సౌకర్యం ఉన్న దేశాలు 100

తపాలా జీవిత బీమా (పీఎల్‌ఐ)

ఈ సౌకర్యం 1884లో ప్రారంభమైంది. భారతదేశంలో ఎంతోకాలంగా అమలులో ఉన్న పథకాలలో ఇదొకటి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల కోసం ఈ బీమా ప్రవేశపెట్టారు. ఇందులో ఆరు రకాల బీమా పాలసీలు అందిస్తారు. రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు బీమా చేయవచ్చు. గ్రామీణ తపాలా జీవిత బీమా (ఆర్‌.పి.ఎల్‌.ఐ) పథకం 1995లో గ్రామీణ జనాభా కోసం ప్రవేశపెట్టారు. ఇందులో రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు బీమా చేయవచ్చు.


ఫిలేటలీ: తపాలా స్టాంపులు సేకరించే హాబీని ఫిలేటలీ అంటారు. తపాలా శాఖ వివిధ డినామినేషన్లలో తపాలా బిళ్లలు ముద్రిస్తుంది. తపాలా సేవలకు ఛార్జీలు ఈ రూపంలో వసూలు చేస్తుంది. అయితే అనేక సందర్భాలలో స్థానికతను ప్రతిబింబించే బిళ్లలు ముద్రిస్తుంది. మహనీయులు, నాయకులు, ప్రముఖ దినాలు వంటివి ఏవైనా స్మారక బిళ్లల అంశం కావచ్చు. 2021లో 11 బిళ్లలు విడుదల చేసింది. ఆయా సందర్భాలలో ఫస్ట్‌ డే కవర్స్‌ కూడా విడుదల చేస్తుంది. ఈ తపాలా బిళ్లలకు మంచి గిరాకీ ఉంటుంది.

ఐటి ఆధునికీకరణ ప్రాజెక్టు: తపాలా సంస్థ సామర్థ్యాన్ని పెంచడం, పరిపాలన, సేవలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ-పరిపాలన ప్రాజెక్టు 2012-13లో ప్రారంభమైంది. దీనితో తపాలా శాఖ నిర్వహణ ఆధునిక సాంకేతికతతో జరుగుతుంది. దేశంలోని అన్ని తపాలా కార్యాలయాలు నెట్‌వర్కింగ్‌ ద్వారా అనుసంధానమవుతాయి. 2021, డిసెంబరు నాటికి వైడ్‌ ఏరియా నెట్‌వర్కింగ్‌ (డబ్ల్యూఏఎన్‌) ద్వారా 26,708 కార్యాలయాలను కలిపారు.

దర్పణ్‌: సమాచార ప్రసార ఆధునికీకరణ ప్రాజెక్టు కింద 2017లో ప్రారంభించిన కార్యక్రమం దర్పణ్‌. డిజిటల్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ రూరల్‌ ఫోస్ట్‌ ఆఫీసెస్‌ ఫర్‌ ఎ న్యూఇండియా (డి.ఎ.ఆర్‌.పి.ఎ.ఎన్‌) కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సామాజిక రంగ పథకాలు అమలవుతాయి. గ్రామీణ జనాభాకు బ్యాంకింగ్‌ సేవల నాణ్యత పెంచడం, అదనపు విలువ చేకూర్చడం దీని లక్ష్యాలు. 

జీవన ప్రమాణ్‌ కేంద్రాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల పింఛన్‌దారులు బయోమెట్రిక్‌ పద్ధతిలో తమ జీవన ధ్రువీకరణ పత్రం సమర్పించేందుకు వీలు కల్పిస్తున్న పథకమే జీవన ప్రమాణ్‌. ఇది 2015, జూన్‌ 30 నుంచి అమలులోకి వచ్చింది. పింఛను చెల్లింపు అధికారుల ముందు భౌతికంగా హాజరుకావాల్సిన అవసరం లేకుండా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్న పింఛన్‌దారులకు ప్రయాస తప్పించింది. మొబైల్‌ యాప్‌లో ఎలక్ట్రాన్‌ పద్ధతిలో కూడా డిజిటల్‌ ధ్రువపత్రాలు సమర్పించవచ్చు. 2021-22 నాటికి 8.38 లక్షల లైఫ్‌ సర్టిఫికెట్లు ఈ కేంద్రాల్లో ఇచ్చారు.

పాస్‌పోర్టు సేవాకేంద్రాలు

2017, జనవరి 25న మైసూరులోని మెటగల్లి, గుజరాత్‌లోని దాహోద్‌ తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టు సేవాకేంద్రాలు ప్రారంభమయ్యాయి. క్రమేణా 235 ప్రధాన తపాలా కార్యాలయాలలో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

డిజిటల్‌ ఇండియా

ఈ కార్యక్రమాన్ని 2015, జులై 1న ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారతదేశాన్ని పూర్తిగా డిజిటల్‌ దేశంగా మార్చడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది.

మౌలిక సౌకర్యాలు

1) ఆధార్‌

2) భారత్‌ బ్రాండ్‌ నెట్‌వర్క్‌

3) సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌

4) ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ - ఇండియా (సి.ఇ.ఆర్‌.టి-ఇన్‌)

5) కామన్‌ సర్వీసెస్‌ సెంటర్లు

6) సైబర్‌ కేంద్రం

7) డిజిటల్‌ సాక్షరతా అభియాన్‌

ఈ కార్యక్రమంలో కీలకమైన అంశాలు మూడు

1. డిజిటల్‌ అవస్థాపన సౌకర్యాలు

దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు, సాంఘిక, ఆర్థిక ప్రయోజనాలు సులభంగా, వేగంగా అందాలంటే అన్ని గ్రామాలకు, పట్టణాలకు అధిక వేగంతో పనిచేసే ఇంటర్నెట్‌ సౌకర్యం విస్తరించాలి. బ్రాడ్‌బాండ్‌ మార్గాలు ఏర్పడాలి. 2016-17 నాటికల్లా జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ పథకం కింద 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు సామాజిక సేవా కేంద్రాల ద్వారా బ్రాడ్‌బాండ్‌ కనెక్షన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2015-16 నాటికి 1.5 లక్షల తపాలా కార్యాలయాలను బహుళ సేవా కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించారు. 2018 కల్లా మొబైల్‌ సేవలు అందని 55,619 గ్రామాలకు మొబైల్‌ అనుసంధానం చేయాలనుకున్నారు.

2) పరిపాలన కోసం, ప్రజల డిమాండ్‌ మేరకు సేవలు

సంప్రదాయ పద్ధతిలో కార్యాలయ సేవలు అందించటంలో ఆలస్యం, అసౌకర్యం ఎక్కువ. అందుకే ప్రభుత్వ రికార్డులను, పని ప్రక్రియను కంప్యూటరీకరించి ఇ-పరిపాలన వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత తీసుకురావడానికి ఇ-పాలన ఉపయోగపడుతుంది. ఇందుకోసం మేఘరాజ్‌ క్లౌడ్‌ వేదిక, మొబైల్‌ సేవ, పే-గవ్, ఐ-సంగం, మొదలైన వేదికలు ఏర్పాటయ్యాయి.

3. డిజిటల్‌ సాధికారత: డిజిటల్‌ సాంకేతికత ద్వారా అందే సేవలు ఉపయోగించుకుని డిజిటల్‌ అక్షరాస్యత, సాధికారత పొందవచ్చు. సామర్థ్యాలను పెంచుకోవచ్చు. ఆన్‌లైన్‌ కోర్సులు, నైపుణ్య శిక్షణ వంటివి ఇందులో భాగం. స్థానిక భాషల్లో సమాచారం, వనరులు, పత్రాలు పొందవచ్చు.

ఐజీఓటీ (ఇంటిగ్రేటెడ్‌ గవర్నమెంట్‌ ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌) కర్మయోగి వేదిక 

ఇది ప్రభుత్వ ఉద్యోగులు ఆన్‌లైన్‌ పద్ధతిలో తమ వృత్తి నైపుణ్యాలు, సామర్థ్యాలు పెంచుకోవడానికి, చర్చించుకోవడానికి ఏర్పాటుచేసిన అభ్యసన వేదిక. ఏ సమయంలోనైనా, ఎక్కడినుంచైనా ఈ పోర్టల్‌లో 2 కోట్ల మంది శిక్షణ పొందటానికి అవకాశం ఉంది. మిషన్‌ కర్మయోగి కింద నిర్వహించే ఈ పోర్టల్‌ను 2022, జనవరిలో ఏర్పాటుచేశారు.

జాతీయ డిజిటల్‌ గ్రంథాలయం: దీన్ని కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తుంది. 2016లో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. 2018, జూన్‌ 19న జాతికి అంకితం చేశారు. ఇందులో ఆన్‌లైన్‌ ద్వారా 10 భాషల్లో గ్రంథాలు చూడవచ్చు. గూగుల్‌ ప్లే నుంచి దీని యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పిల్లలు, యువకుల కోసం ప్రత్యేకంగా ఒక జాతీయ డిజిటల్‌ గ్రంథాలయం ఏర్పాటును 2023-24 బడ్జెట్‌లో ప్రకటించారు.

డిజిటల్‌ లాకర్‌: డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం 2015లో ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. వ్యక్తులు, సంస్థలు తమ పత్రాలు, ధ్రువపత్రాలను ఈ లాకర్‌తో అనుసంధానం చేయవచ్చు. ప్రజలు తమ పత్రాలను భౌతికంగా తీసుకెళ్లకుండా, ఎక్కడినుంచైనా ఈ లాకర్‌ ద్వారా అందుకోవచ్చు.

జాతీయ డేటా పాలనా ఫ్రేంవర్క్‌ విధానం: 2022, మే లో కేంద్ర ప్రభుత్వం ఈ విధానం ముసాయిదా విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వ్యక్తిగతం కాని సమాచారాన్ని, పరిశోధనకు, నూతన ఆవిష్కరణలకు అందుబాటులో ఉంచడం దీని లక్ష్యం. అంకుర సంస్థలు, విద్యావేత్తలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. 2023-24 బడ్జెట్‌లో ప్రకటించారు.

ఈ-కోర్టు మిషన్‌ మోడ్‌ ప్రాజెక్టు: 2005లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. 2023లో ఏర్పాటుచేసిన ఈ-కమిటీ దీన్ని సిఫార్సు చేసింది. కేంద్ర న్యాయశాఖ నిధులు సమకూరుస్తుంది. కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయాధికారులకు కొన్ని ఎంపికచేసిన న్యాయ సంబంధ సమాచార సేవలు దీనిద్వారా అందుతాయి. దీని మూడవ దశను 2023-24 బడ్జెట్‌లో ప్రకటించారు.

ఆధార్‌: ఇది 12 అంకెల ఏకైక గుర్తింపు సంఖ్య. 2009లో ఏర్పాటు చేసిన యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ పౌరులకు వారి బయోమెట్రిక్‌ డేటా ఆధారంగా కేటాయిస్తుంది. పౌరులు స్వచ్ఛందంగా దీన్ని పొందవచ్చు. అనేక ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు, పౌరుల ఆర్థిక లావాదేవీలకు ఇది గుర్తింపు కార్డు. ఆదాయపన్ను చెల్లింపుదారులు తమ పాన్‌ కార్డుకు ఆధార్‌తో అనుసంధానం చేయాలి. ఆన్‌లైన్‌లో ఆధార్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కేవైసీ: ‘మీ వినియోగదారుడు/ఖాతాదారుడిని తెలుసుకోండి’ అనే ఒక నిబంధన ద్వారా విత్త సంస్థలు/ వ్యాపార సంస్థలు తమ వినియోగదార్ల/ఖాతాదార్లను గుర్తిస్తాయి. ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ మొదలైన పత్రాలు, చిరునామా వంటి వివరాలు సేకరిస్తాయి. ఇది తప్పనిసరి.


 

రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

 

Posted Date : 10-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

  భారత టెలీ కమ్యూనికేషన్లు - సమాచార వ్యవస్థ 

సమాచార ప్రసారం శక్తిమంతం!

​​​​​​

కొన్ని దశాబ్దాలుగా దేశ సమాచార, ప్రసార సేవల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. సమాచార సాంకేతికత, సామాజిక మాధ్యమాలు దాదాపుగా అందరికీ చేరువయ్యాయి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా సమాచారాన్ని పంపడం, అందుకోవడం, పంచుకోవడం సర్వసాధారణ ప్రక్రియగా మారిపోయింది. తపాలా శాఖ నుంచి టెలికాం విభాగాన్ని వేరు చేయడంతో మొదలైన ఈ మార్పు, ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో పరుగులు తీసింది. స్పెక్ట్రమ్, ఆప్టికల్‌ ఫైబర్‌ రాకతో ఇంటర్‌నెట్‌ అనూహ్య వేగాన్ని పుంజుకుంది. మొబైల్‌ సేవలు విస్తృతంగా విస్తరించాయి. రేడియో, టీవీ సేవలు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటే, ఓటీటీలు సరాసరి ఇళ్లలోకి చొరబడిపోయాయి. సమాచార రంగంలో సంభవిస్తున్న సమకాలీన పరిణామక్రమాలపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి. ఈ నేపథ్యంలో దేశం సాధించిన ప్రగతి గురించి కూడా సమగ్రంగా తెలుసుకోవాలి.


ప్రపంచంలో అతిపెద్ద కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ ఉన్న దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉంది. చైనాది మొదటి స్థానం. దశాబ్దాల పరిణామ క్రమంలో అనేక సంస్థలు,   మౌలిక సదుపాయాలు ఏర్పాటై, దేశంలో శక్తిమంతమైన సమాచార వ్యవస్థ రూపుదిద్దుకుంది. 

 

బాక్స్‌లు

===================

1975- తంతి తపాలా శాఖ నుంచి వేరైన టెలికాం శాఖ

1985- ఢిల్లీ, ముంబయి నగరాల్లో మహానగర్‌ టెలికాం నిగమ్‌ లిమిటెడ్‌ ప్రారంభం

2000, అక్టోబరు - భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) ప్రారంభం.

---------------------------------

2021-22 నాటికి దేశంలో టెలిఫోన్, ఇంటర్నెట్, బ్రాడ్‌బాండ్‌ వివరాలు

టెలిఫోన్‌ కనెక్షన్లు - 1,191.03 మిలియన్లు

వైర్‌లెస్‌ టెలిఫోన్‌ కనెక్షన్లు - 1167.49 మిలియన్లు

మొత్తం టెలిఫోన్లలో వైర్‌లెస్‌ టెలిఫోన్ల శాతం - 98.02%

మొత్తం టెలిఫోన్లలో ప్రైవేటు రంగం వాటా - 89.35%

వైర్‌లెస్‌ టెలిఫోన్‌ కనెక్షన్లు - 126.87%

టెలిఫోన్‌ సాంద్రత (100 మందికి) - 86.69%

గ్రామీణ టెలిఫోన్‌ సాంద్రత - 59.31%

పట్టణ టెలీసాంద్రత - 138.79%

===================

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI) :  పార్లమెంటు చట్టం ద్వారా 1997, ఫిబ్రవరి 20న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) ప్రారంభమైంది. ప్రపంచ సమాచార వ్యవస్థలో ప్రధానమైన పాత్ర పోషించే విధంగా భారత టెలీకమ్యూనికేషన్లు, వ్యవస్థ అభివృద్ధికి అనువైన పరిస్థితులు కల్పించడం, ప్రోత్సహించడం ఈ సంస్థ లక్ష్యం.


అంతర్జాల సేవలు (ఇంటర్నెట్‌): ప్రపంచ వ్యాప్తంగా సమాచారాన్ని పొందడానికి, పంచుకోవడానికి అతిశక్తిమంతమైన సాధనం అంతర్జాలం. 1995, ఆగస్టు 15న భారతదేశంలో అంతర్జాల సేవలు ప్రారంభమయ్యాయి. మొదట 9.6 కేబీపీఎస్‌ వేగంతో పనిచేసే డయల్‌ అప్‌ యాక్సెస్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. 1997లో ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ డిజిటల్‌ నెట్‌వర్క్‌ (ఐఎస్‌డీఎన్‌) వచ్చింది. 2011-12లో మూడోతరం సేవలు (3జీ), బ్రాడ్‌బాండ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌ (బీడబ్ల్యూఎ), స్పెక్ట్రమ్‌ ప్రారంభమయ్యాయి. 2012, ఏప్రిల్‌ 10న ఎయిర్‌టెల్‌ కంపెనీ 4జీ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 99 శాతం 4జీ ఉపయోగిస్తున్నారు. 2021 ద్వితీయార్ధంలో 5జీ సేవలు  మొదలై,  ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. వైఫై ఇంటర్నెట్‌ విస్తరించింది. ల్యాండ్‌లైన్‌ కనెక్షన్ల కంటే వైర్‌లెస్‌ కనెక్షన్లు అధికమయ్యాయి. ఈ సేవల అభివృద్ధి కోసం 100 ప్రత్యేక ప్రయోగశాలలు నెలకొల్పారు. ట్రాయ్‌ ప్రకారం 2020 నాటికి వైర్డ్‌ ఇంటర్నెట్‌ చందాదారులు 23.05 మిలియన్లు, వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ చందాదారులు 726.01 మిలియన్లు. మొత్తం ఇంటర్నెట్‌ చందాదారులు 749.06 మిలియన్లు. దేశంలో ప్రతి వంద మంది జనాభాకు 55.41 మంది ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. పట్టణ జనాభాలో ప్రతి 100 మందికి 98.35%, గ్రామీణ జనాభాలో ప్రతి 100 మందికి 33% ఇంటర్నెట్‌ చందాదారులున్నారు. 2021-22 నాటికి మొబైల్‌ ఇంటర్నెట్‌ వాడకందార్ల సంఖ్య 469.3 మిలియన్లు.


సర్వీసు ప్రొవైడర్లు - పోటీ: వాణిజ్యపరంగా ప్రజలకు ఇంటర్నెట్‌ సేవలు అందించిన మొదటి ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ప్రభుత్వరంగ సంస్థ విదేశ్‌ సంచార్‌ నిగం లిమిటెడ్‌ (వి.ఎస్‌.ఎన్‌.ఎల్‌). 1998 వరకు ఇంటర్నెట్‌ మీద టెలీకమ్యూనికేషన్ల శాఖ, వీఎస్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ (మహానగర్‌ టెలికాం నిగమ్‌ లిమిటెడ్‌) గుత్తాధిపత్యం కొనసాగింది. 1998లో ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొవైడర్‌ పాలనా వ్యవస్థ (ఐపీఎస్‌ రీజీమ్‌)ను సరళీకరించారు. ఇంటర్నెట్‌ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు.


ఇంటర్నెట్‌ వేగం: 2011 వరకు ఇంటర్నెట్, బ్రాడ్‌బాండ్‌ సేవలు రాగి తీగలు ఉపయోగించి డిజిటల్‌ సబ్‌స్క్రైబర్‌ లేదా సబ్‌స్క్రైబర్‌ లైన్‌ (డీఎస్‌ఎల్‌) ద్వారా అందించేవారు. రాగి తీగల ప్రసార వేగం తక్కువ. అందుకే ఇంటర్నెట్‌ వేగం 256 కేబీపీఎస్‌గా ఉండేది. 2013-14లో 512  కేబీపీఎస్‌కిపెంచారు. 2012 జాతీయ టెలికాం విధానం ప్రకారం 2015 నాటికి ఆప్టికల్‌ ఫైబర్‌ తీగలు ఉపయోగించి ఇంటర్నెట్‌ వేగం 2 ఎంబీపీఎస్‌కు పెంచాలని నిర్ణయించారు. కోరిన వారికి 100 ఎంబీపీఎస్‌ వేగంతో నెట్‌ సౌకర్యం అందించాలనేది దీని లక్ష్యం. ఆప్టికల్‌ ఫైబర్‌లో ప్రసారవేగం ఎక్కువ.


జీబీపీఎస్‌ నగరం: దేశంలో 1 జీబీపీఎస్‌. వేగంతో బ్రాడ్‌ బాండ్‌ అనుసంధానం అందుబాటులోకి వచ్చిన మొదటి నగరం హైదరాబాద్‌. దీనివల్ల కేబుల్‌ టెలివిజన్‌ డైరెక్టు-టు-హోం సేవ మీద ఆధారపడకుండా టెలివిజన్‌ కార్యక్రమాలు వీక్షించే అవకాశం కలుగుతుంది. ఎక్స్‌ ఫైబర్‌ నెట్‌ 2017, మార్చి 30న దీనిని ప్రారంభించింది.


భారత్‌నెట్‌ ప్రాజెక్టు:  2011, అక్టోబరులో నేషనల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ (ఎన్‌ఓఎఫ్‌ఎన్‌) పథకం ప్రారంభమైంది. దీని అమలుకు 2011, ఫిబ్రవరి 25న ఒక స్పెషల్‌ పర్చేజ్‌ వెహికల్‌ ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ బ్రాడ్‌బాండ్‌ ప్రాజెక్టు దీని లక్ష్యం. 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు, 6,25,000 గ్రామాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ ద్వారా 100 ఎంబీపీఎస్‌ వేగం కలిగిన బ్రాడ్‌బాండ్‌ అనుసంధానం చేసే విధంగా దీనిని రూపొందించారు. 2015లో ‘భారత్‌నెట్‌ ప్రాజెక్టు’గా పేరు మార్చారు. 2021, జనవరి 12న కేరళలోని ఇడుక్కి జిల్లాలో ప్రారంభించారు. 2023 నాటికి 3 దశల్లో పూర్తవుతుందని ప్రకటించారు. దీని లక్ష్యం అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం, కోరిన నివాసాలకు 2 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ సౌకర్యం అందించడం. ఈ కార్యక్రమానికి కావాల్సిన నిధులను యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌) అందిస్తోంది. అన్ని గ్రామాలకు ఈ-పాలన, ఈ-ఆరోగ్యం, ఈ-విద్య, ఈ-బ్యాంకింగ్, ఇంటర్నెట్, ఇతర సేవలు అందించడం దీని లక్ష్యం.

సంచార్‌ శక్తి: స్వయం సహాయక బృందాలకు సమాచార ప్రసార సాంకేతిక సేవలు అందుబాటులోకి తెచ్చి మహిళా సాధికారత పెంపొందించే లక్ష్యంతో సంచార్‌ శక్తి పథకాన్ని 2011, మార్చిలో ప్రారంభించారు. దీనికి యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ ఆర్థిక సహాయం అందిస్తోంది. మొబైల్‌ ద్వారా విలువైన సేవలు అందిస్తోంది.

రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌: భారతదేశంలో 1920లో రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఆ ఏడాదే కొన్ని అమెచ్యూర్‌ రేడియో క్లబ్బులు ఏర్పడ్డాయి. 1927లో ఇండియా బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీని నెలకొల్పారు. 1936లో ప్రభుత్వం దీనిని స్వాధీనం చేసుకుంది. ఇదే తర్వాత ఆల్‌ ఇండియా రేడియో (ఏఐఆర్‌)గా మారింది. 1965 నుంచి ఆకాశవాణిలో భాగంగా క్రమం తప్పకుండా ప్రసారాలు మొదలయ్యాయి. 2000 సంవత్సరం వరకు రేడియా బ్రాడ్‌కాస్టింగ్‌లో ఆల్‌ ఇండియా రేడియోదే గుత్తాధిపత్యం. 2000లో ఎఫ్‌ఎం రేడియోను ప్రారంభించి, ఇందులో ప్రైవేటు సంస్థలను అనుమతించారు. ప్రస్తుతం ఆల్‌ ఇండియా రేడియోకు చెందిన 367 మీడియం వేవ్, షార్ట్‌ వేవ్‌ సంస్థలకు ఎఫ్‌ఎం డిజిటల్‌ ట్రాన్స్‌మీటర్లు ఉన్నాయి. ప్రైవేటు రంగంలోనూ ఎఫ్‌ఎం రేడియో, కమ్యూనిటీ రేడియో స్టేషన్లు పనిచేస్తున్నాయి.

టెలివిజన్‌ టెలికాస్టింగ్‌: 1959, సెప్టెంబరు 15న భారతదేశంలో మొదటి టెలివిజన్‌ ప్రసారం ప్రయోగాత్మకంగా జరిగింది. దీనినే దూరదర్శన్‌గా పిలుస్తారు. 1972లో ముంబయి, అమృత్‌సర్‌లకు టెలివిజన్‌ ప్రసారం మొదలైంది. 1975 నుంచి శాటిలైట్‌ ద్వారా ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1975 నుంచి శాటిలైట్‌ ఇన్‌స్ట్రక్షనల్‌ టెలివిజన్‌ ఎక్స్‌పరిమెంట్‌ (ఎస్‌ఐటీఈ) ప్రాజెక్టు ద్వారా పాఠశాల విద్యార్థుల కోసం విద్యా కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. పంచాయతీ కేంద్రాల కోసం సామాజిక కార్యక్రమాల ప్రసారం జరుగుతోంది. 1976లో ఆకాశవాణి నుంచి దూరదర్శన్‌ వేరయింది. 1982, ఆగస్టు 15 నుంచి రంగుల్లో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1982లో జాతీయ ప్రసారాలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడిన దూరదర్శన్‌ వ్యవస్థ ద్వారా టెలివిజన్‌ కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. 2012లో ఒలింపిక్స్‌ ప్రసారమయ్యాయి. 2020లో దేశంలో 332 పెయిడ్‌ ఛానళ్లు నడుస్తున్నాయి. దూరదర్శన్‌ 30 శాటిలైట్‌ టెలివిజన్‌ ఛానళ్లను నడుపుతోంది. 66 ప్రసార కేంద్రాలు; 1,412 ట్రాన్స్‌మిటర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ‘మన టీవీ’ ఛానల్‌ ద్వారా ఉన్నత విద్యాకార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి.

కేబుల్‌ టెలివిజన్‌: 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో కేబుల్‌ టెలివిజన్‌ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. దేశంలో పే బ్రాడ్‌కాస్టర్లు, కేబుల్‌ ఆపరేటర్లు పే డి.టి.హెచ్‌. ఆపరేటర్లు పనిచేస్తున్నాయి.

ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ): కేబుల్, బ్రాడ్‌కాస్ట్, శాటిలైట్‌ మాధ్యమ వేదికలకు భిన్నంగా అంతర్జాలం ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందించేదే ఓవర్‌ ది టాప్‌ వేదిక. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, ఆహా లాంటి వేదికలు ఈ కోవకు చెందినవి. వీటి ద్వారా సినిమాలు, టీవీ షోలు, డాక్యుమెంటరీలు, వెబ్‌సిరీస్‌లు మొదలైన కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. ఇటీవల కాలంలో వీటికి ప్రాచుర్యం పెరిగింది. వివిధ భాషలు, దేశాల చిత్రాలు ఈ వేదికలో ప్రసారమవుతున్నాయి. 


సామాజిక ప్రచార మాధ్యమం: డిజిటల్‌ విధానం ద్వారా వ్యక్తులు, సంస్థలు అభిప్రాయాలు వ్యక్తం చేయడం, సమాచారాన్ని పంచుకోవడానికి నేడు ఉపకరిస్తున్న సాంకేతిక వేదికను సామాజిక ప్రచార మాధ్యమం అని పిలుస్తారు. ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రాం, ఎక్స్, యూట్యూబ్‌ ఇందుకు ఉదాహరణలు. ఇవి అంతర్జాతీయ సంస్థలు నడుపుతున్న వేదికలు. వీటి సేవలు ఉచితంగా అందుతాయి. 2020, నవంబరు 12న భారత ప్రభుత్వం ఈ మాధ్యమాన్ని సమాచార శాఖ పరిధిలోకి తెచ్చింది. 


సమాచార సాంకేతిక పరిశ్రమ వృద్ధి: భారతదేశంలో 1955-70 కాలంలో కంప్యూటరింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 1970-78లో దేశంలో కంపూటర్ల ఉత్పత్తి నిదానంగా జరిగింది. అప్పటికి ప్రభుత్వపరంగా స్పష్టమైన సమాచార సాంకేతిక విధానం లేదు. 1978-90 మధ్య హార్డ్‌వేర్‌ తయారీ ప్రారంభమవగా, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కంప్యూటర్ల దిగుమతులు మొదలయ్యాయి. 1991-97 మధ్య దేశంలో టెలికాం అవస్థాపన ప్రోత్సాహాల పెరుగుదల కొన్ని నగరాలకే పరిమితమైంది. 1997-2008 మధ్య ఎగుమతులకు ప్రోత్సాహం, ప్రత్యేక క్లస్టర్లు, సాప్ట్‌వేర్‌ పార్క్‌ల ఏర్పాటు జరిగింది.

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

 

 

Posted Date : 17-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యాటక రంగం

ఆర్థికాభివృద్ధికి చోదక యంత్రం!

ఆర్థిక ప్రగతిలో పర్యాటకం ప్రాధాన్యం అంతకంతకు ఎక్కువవుతోంది. ఈ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ, విస్తృతంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు, కీలకమైన విదేశీమారక ద్రవ్య ఆర్జనకు దోహదపడుతోంది. దాంతోపాటు రవాణా, బ్యాంకింగ్, బీమా, హోటళ్లు, చేనేత, చేతివృత్తుల ఉత్పత్తుల అమ్మకాలు తదితరాలను ఉత్తేజితం చేస్తోంది. సేవా రంగంలో ప్రధాన విభాగమైన పర్యాటకంలో నెలకొన్న దేశీయ, అంతర్జాతీయ ధోరణులపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి. టూరిజం దేశంలో వృద్ధి చెందుతున్న తీరు, సంబంధిత ప్రభుత్వ విధానాలతో పాటు అన్ని రకాల యాత్రికులను ఆకర్షిస్తున్న రాష్ట్రాలు, ప్రదేశాల గురించి తెలుసుకోవాలి.


పర్యాటకం ఆర్థిక ప్రాధాన్యం ఉన్న సామాజిక కార్యకలాపం. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ   (యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ - యూఎన్‌డబ్ల్యూఓ) ప్రకారం ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 5 శాతం వరకు పర్యాటక రంగం నుంచే లభిస్తోంది. పర్యాటకం ఆర్థిక పురోగతి చోదక యంత్రంగా భావించే దేశాల్లో వాటి స్థూల జాతీయోత్పత్తిలో ఈ రంగం వాటా 10 శాతం పైగా ఉంటుంది. ప్రపంచ ఉద్యోగితలో 6-7 శాతం వరకు ఈ రంగం కల్పిస్తోంది. 2008-09 నుంచి భారతదేశం స్థూల జాతీయోత్పత్తిలో పర్యాటక రంగం వాటా 9-10 శాతం మధ్య ఉంటోంది. 2018లో సుమారు 4.3 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పించింది. మొత్తం ఉద్యోగితలో పర్యాటక రంగం వాటా 12.36 శాతం. 2017ను ‘అభివృద్ధి కోసం నిలకడ ఉన్న పర్యాటక అంతర్జాతీయ సంవత్సరం (ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ సస్టెయినబుల్‌ టూరిజం ఫర్‌ డెవలప్‌మెంట్‌)’ గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 2021-22లో ప్రపంచ ప్రయాణ, పర్యాటక  అభివృద్ధి సూచికలో భారతదేశం 54వ స్థానంలో ఉంది.


నిర్వచనం:  ‘పర్యాటకం అంటే వినోదం కోసం ప్రయాణాలు చేయడం’ అని క్లుప్తంగా చెప్పవచ్చు. విశ్రాంతి, వ్యాపారం కోసం లేదా సందర్శన ప్రదేశం నుంచి పారితోషికం గ్రహించని ఏ ఇతర కార్యక్రమం కోసమైనా ప్రజలు తమ సాధారణ పరిసరాల వెలుపల ఉన్న ఏదైనా ఇతర ప్రదేశాలకు ప్రయాణం చేసి 24 గంటలకు మించి, ఒక సంవత్సరానికి మించని సమయం గడిపితే అలాంటి వారిని పర్యాటకులుగా ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వచించింది. దీని ప్రకారం భారత ప్రభుత్వం కూడా విదేశీ పర్యాటకులెవరో పేర్కొంది. విదేశీ పాస్‌పోర్టు కలిగి విశ్రాంతి, వినోదం, వైద్యం, మతసంబంధ కార్యక్రమం, క్రీడలు, వ్యాపారం, సభలు, సమావేశాలు మొదలైన వాటి కోసం భారతదేశాన్ని సందర్శించి ఒక రోజు కంటే ఎక్కువ, ఏడాది కంటే తక్కువ కాలం గడిపిన విదేశీయుడు మనకు విదేశీ పర్యాటకుడు అవుతాడు. పర్యాటకులకు సలహాలు, సమాచారం అందించడం, పర్యాటకాన్ని నిర్వహించడం, పర్యాటక రంగ కార్యకలాపాలను ప్రోత్సహించడం, అవసరమైన వసతులు అభివృద్ధి చేయడం లాంటివన్నీ పర్యాటక రంగం విధి అవుతుంది.


పర్యాటక ఆర్జనలు: విదేశీమారక ద్రవ్య ఆర్జనకు పర్యాటక రంగం ఎంతో తోడ్పడుతుంది. అంతర్జాతీయ పర్యాటకుల ద్వారా ఆర్జించిన విదేశీ మారక ద్రవ్యం అమెరికా డాలర్లలో 2001లో 3.198 మిలియన్‌ డాలర్లు, 2019లో 30.058 మిలియన్‌ డాలర్లు, 2020లో 6,950 మిలియన్‌ డాలర్లు. అంతర్జాతీయ పర్యాటక ఆర్జనలో మన దేశానికి 64.49% అమెరికా నుంచి లభిస్తోంది. తర్వాతి స్థానాల్లో స్పెయిన్, ఫ్రాన్స్‌ ఉన్నాయి. ఈ విషయంలో భారత్‌ వాటా 2001లో 0.69%, 2019లో 2.05%, 2020లో 2.38%. ప్రపంచ ఆర్జనలో భారతదేశం స్థానం 2001లో 36, 2019-20లో 13, 2020-21లో 12. ఆసియా పసిఫిక్‌ దేశాల ఆర్జనలో భారత్‌ వాటా 2001లో 3.63%, 2019లో 6.78%.


విదేశీ పర్యాటకులు:  2021లో భారతదేశాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకులు 1.52 మిలియన్లు. వీరిలో అత్యధికంగా 28.15 శాతం అమెరికా నుంచి వచ్చారు. రెండు, మూడు స్థానాల్లో బంగ్లాదేశ్‌ 15.75 శాతం, ఇంగ్లాండు 10.75 శాతం. తర్వాతి స్థానాల్లో కెనడా, నేపాల్, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, జర్మనీ, పోర్చుగల్, ఫ్రాన్స్‌ ఉన్నాయి. 2021-22లో భారత్‌ను సందర్శించిన విదేశీ పర్యాటకుల్లో 37.7 శాతం భారతీయ ప్రవాసులు. మొత్తం విదేశీ పర్యాటకుల్లో 19.9% వైద్యం, 12.4% వ్యాపారం, వృత్తిపరమైన అవసరాలు;    8.1% మంది విశ్రాంతి, వినోదం కోసం సందర్శించారు. అత్యధికంగా 39.7% విదేశీ పర్యాటకులు దిల్లీ విమానాశ్రయం ద్వారా రాగా, హైదరాబాద్‌ విమానాశ్రయం ద్వారా 5.65% మంది సందర్శించారు.

భారతీయుల విదేశీ సందర్శన: ఇతర దేశాలను సందర్శించిన భారతీయులు 2001లో 4.56 మిలియన్ల నుంచి 2019లో 26.92 మిలియన్లకు పెరిగారు. 2021లోనే 8.55 మిలియన్లుగా నమోదయ్యారు. 2021లో భారత పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (42.4%), రెండో స్థానం అమెరికా (8.1%), మూడో స్థానం ఖతార్‌ (7.9%). మొత్తం భారతీయ పర్యాటకుల్లో పునఃప్రవేశం కోసం 40.25%, పర్యాటకం కోసం  14.99%, సందర్శన కోసం 17.70%, ఉద్యోగాల కోసం 9.5%, చదువుల కోసం 5.2% మంది ఇతర దేశాలను సందర్శించారు.

రాష్ట్రాల్లో పర్యాటకం - విదేశీ పర్యాటకులు: 2021-22లో భారతదేశంలో అత్యధిక విదేశీ పర్యాటకులు సందర్శించిన రాష్ట్రాల్లో పంజాబ్‌ (29.2%), మహారాష్ట్ర (17.6%), దిల్లీ (9.6%) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించడంలో 89.2 శాతం వాటా 10 రాష్ట్రాలదే. అవి 

1) పంజాబ్‌ 

2) మహారాష్ట్ర, 

3) దిల్లీ 

4) కర్ణాటక 

5) కేరళ 

6) తమిళనాడు 

7) ఉత్తర్‌ప్రదేశ్‌ 

8) మధ్యప్రదేశ్‌ 

9) పశ్చిమ బెంగాల్‌ 

10) రాజస్థాన్‌.

దేశీయ పర్యాటకులు:  2021లో దేశీయ పర్యాటకులు సందర్శించిన మొదటి పది రాష్ట్రాలు 

1) తమిళనాడు 

2) ఉత్తర్‌ప్రదేశ్‌ 

3) ఆంధ్రప్రదేశ్‌ 

4) కర్ణాటక 

5) మహారాష్ట్ర 

6) తెలంగాణ 

7) పంజాబ్‌ 

8) మధ్యప్రదేశ్‌ 

9) గుజరాత్‌ 

10) పశ్చిమ బెంగాల్‌. 2021-22లో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించిన మొదటి మూడు ప్రదేశాలు 

1) తాజ్‌మహల్‌ (3.29 మిలియన్లు) 

2) ఎర్రకోట (1.32 మిలియన్లు) 

3) కుతుబ్‌ మినార్‌ (1.15 మిలియన్లు). విదేశీ పర్యాటకులు సందర్శించిన ప్రదేశాలు 1) మహాబలిపురం (0.14 మిలియన్లు) 2) తాజ్‌మహల (0.038 మిలియన్లు)   4) పలువం కుప్పం (0.025 మిలియన్లు)


పర్యాటకంలో రకాలు: పర్యాటకం ద్వారా ఆశించే ప్రయోజనం, దాని స్వభావం ఆధారంగా పర్యాటకాన్ని పలు రకాలుగా విభజించవచ్చు.  అవి 

1) తీరిక సమయం పర్యాటకం 

2) వ్యాపార పర్యాటకం 

3) వైద్య పర్యాటకం 

4) ఆరోగ్య పర్యాటకం 

5) సాంస్కృతిక పర్యాటకం, 

6) సాహస పర్యాటకం 

7) పర్యావరణ పర్యాటకం 

8) క్రీడా పర్యాటకం 

9) మతపరమైన పర్యాటకం


పర్యాటక విధానం: పర్యాటకాన్ని వేగంగా వృద్ధి చెందుతున్న పరిశ్రమగా భారత ప్రభుత్వం గుర్తించింది. దీనిని ప్రోత్సహించేందుకు 1982లో జాతీయ పర్యాటక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. 1992లో దానిని మెరుగుపరిచి మరో ప్రణాళిక రూపొందించింది. 2002లో జాతీయ పర్యాటక విధానాన్ని ప్రకటించింది. అందులో పలు అంశాలు ఉన్నాయి. 

1) పర్యాటకం ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదక యంత్రం 

2) పర్యాటకం గుణక ప్రభావం వల్ల ఉద్యోగావకాశాలు అధికంగా పెరుగుతాయి. 

3) దేశీయ పర్యాటకం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం.

4) పర్యాటక గమ్యస్థానంగా భారతదేశానికి ఉన్న సంభావ్యతను ప్రపంచ స్థాయిలో ప్రచారం చేసి ప్రయోజనం పొందడం. 

5) ప్రైవేటు రంగం పాత్రను గుర్తించి ప్రోత్సహించడం.


పర్యాటక విధానం - కీలక అంశాలు: 

1) స్వాగతం 

2) సూచన 

3) సువిధ 

4) సురక్ష 

5) సహయాగ్‌ 

6) సంరచన, సఫాయి

లక్ష్యాలు: 

1) పర్యాటకాన్ని జాతీయ ప్రాధాన్య కార్యకలాపంగా నిర్వహించడం  

2) ప్రపంచ పర్యాటకంలో భారత పోటీ సామర్థ్యాన్ని పెంచడం 

3) ప్రస్తుతం ఉన్న పర్యాటక స్థలాలు, వసతులు మెరుగు పరుస్తూ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా నూతన స్థలాలు, వసతులు కల్పించడం 

4) ప్రపంచ స్థాయి అవస్థాపనా సౌకర్యాలు కల్పించడం 

5) సుస్థిర, సమర్థవంతమైన మార్కెటింగ్‌ ప్రణాళికలు, కార్యక్రమాలు రూపొందించడం. 


2017 నూతన పర్యాటక విధానం: పర్యాటక అభివృద్ధిలో ఉపాధి కల్పన, సామాజిక భాగస్వామ్యంపై దృష్టి, సుస్థిర బాధ్యతాయుతమైన పర్యాటకానికి ప్రాధాన్యం ఇవ్వడం ఈ విధానం ప్రధాన లక్ష్యం

 


 

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 25-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యాటకం - ప్రభుత్వ ప్రోత్సాహకాలు

సేవలు.. సౌకర్యాల విస్తరణలో సర్కారు సాయం!

 

భారతదేశంలో వినోదం, విజ్ఞానం, ఆధ్యాత్మిక అనుభూతిని పంచే పర్యాటక ప్రాంతాలకు లోటు లేదు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు చూసి తీరాల్సిన చారిత్రక, వారసత్వ కట్టడాలు, పురాతన సంస్కృతికి ప్రతీకగా నిలిచే కళారూపాలు వేటికవే ప్రత్యేకం. ప్రకృతి ఒడిలో సేదతీరే ప్రాంతాలు, సుదీర్ఘ సముద్రతీరాలు, ఆహ్లాదానికి, సాహస కృత్యాలకు అనువైన వనరులెన్నో ఉన్నాయి. ఇటీవలి కాలంలో వైద్య పర్యాటకం కూడా ఈ వరుసలో చేరింది. అందుకే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే శక్తిగా పర్యాటక - ఆతిథ్య రంగాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఆ రంగాన్ని వ్యవస్థాగతంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన విధానాలు, ప్రోత్సాహక పథకాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దేశీయ, విదేశీ పర్యాటకులకు సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలు, అందుకు సంబంధించి ఇస్తున్న పలు రకాల ప్రోత్సాహకాలపై అవగాహన పెంచుకోవాలి.

జాతీయ పర్యాటక అభివృద్ధి సంస్థ: దేశంలో పర్యాటకం అభివృద్ధి, విస్తరణ కోసం 1966, అక్టోబరులో ఈ సంస్థ ఏర్పాటైంది. పర్యాటకుల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, బీచ్‌ రిసార్ట్‌లు నిర్మించడం; వాటి సేవలను మార్కెట్‌ చేయడం దీని ప్రధాన లక్ష్యం. రవాణా, వినోదం, విక్రయం, సంప్రదాయ పర్యాటక సేవలు అందించడంతోపాటు పర్యాటక ప్రచారానికి సంబంధించిన కన్సల్టెన్సీ, నిర్వహణ సేవలు, కరెన్సీ మార్పిడి సేవలను అందిస్తోంది. దేశంలో 4 అశోకా గ్రూపు హోటళ్లను నడుపుతోంది. సంయుక్త రంగంలో ఒక హోటల్, ఒక రెస్టారెంటు నిర్వహిస్తోంది. 12 రవాణా యూనిట్లతోపాటు అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో ఒక టాక్స్‌ఫ్రీ ఔట్‌లెట్‌ ఈ సంస్థకు ఉన్నాయి. దృశ్య శ్రవణ ప్రదర్శనలు, 13 డ్యూటీ ఫ్రీ దుకాణాలను కూడా నడుపుతోంది.


భారతీయ పర్యాటక విత్త సంస్థ: ప్రణాళికా సంఘం ఏర్పాటు చేసిన యూనస్‌ కమిటీ సిఫార్సుల మేరకు 1988లో ఈ సంస్థ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా ఏర్పాటైంది. 2020-21 సెప్టెంబరు నాటికి దీని వాటా మూలధనం రూ.80.72 కోట్లు. పర్యాటకానికి సంబంధించిన సౌకర్యాలు, సేవల అభివృద్ధికి విత్త సహాయం చేస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, హాలిడే రిసార్ట్‌లు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, మల్టీప్లెక్స్‌లు, సఫారీ పార్కులు, సాంస్కృతిక కేంద్రాలు, రవాణా, పర్యాటక విక్రయశాలలు మొదలైన వాటికి విత్త సహాయాన్ని అందిస్తుంది.


ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా: భారత్‌లోని పర్యాటక సేవల సమాచారాన్ని అంతర్జాతీయ పర్యాటకులకు అందించడం కోసం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన మార్కెటింగ్‌ కార్యక్రమమే ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా. ఈ ప్రచారానికి సంబంధించిన వెబ్‌సైట్‌ 2002లో ప్రారంభమైంది. ప్రయాణం, పర్యాటక ప్యాకేజీలు, పర్యాటక కేంద్రాలు, వర్తకం, వీసా లాంటి అనేక అంశాలకు సంబంధించిన సమాచారం, సేవలు ఇందులో ఉంటాయి. ఈ పదం ఒక నినాదంగా వాడుకలోకి వచ్చింది.


సాధి (ఎస్‌ఏఏ టీహెచ్‌ఐ):  దీని పూర్తి పేరు సిస్టం ఫర్‌ అసెస్‌మెంట్‌ అవేర్‌నెస్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఫర్‌ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. సంక్షిప్తనామం సాధి. కొవిడ్‌-19 నిబంధనల గురించి ఆతిథ్య పరిశ్రమ ఉద్యోగులకు తెలియజేయడం, ఆతిథ్య ప్రదేశాల్లో పరిశుభ్రత, భద్రతకు చర్యలు తీసుకుని పర్యాటకులకు విశ్వాసం కలిగించడం లాంటి లక్ష్యాలతో క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన వ్యవస్థ.


టూరిస్టు గైడ్‌లకు రుణాలు:  కొవిడ్‌ వల్ల పర్యాటక రంగం దెబ్బతిన్నప్పుడు ఆదాయం కోల్పోయిన 10,700 మంది టూరిస్టు గైడ్‌లకు, వెయ్యి మంది పర్యాటక రంగ వాటాదారుల (స్టేక్‌ హోల్డర్లు)కు ప్రభుత్వం రుణాలు ఇచ్చింది. జాతీయ పరపతి హామీ ట్రస్టీ కంపెనీ ద్వారా ఈ రుణాలు అందాయి.


నిధి (ఎన్‌ఐడీహెచ్‌ఐ):  ‘నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ డేటాబేస్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ’ సంక్షిప్త నామమే నిధి. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యంగా ఆతిథ్య పరిశ్రమ వ్యాపార వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్‌. ఆతిథ్య పరిశ్రమ అవకాశాలకు గేట్‌ వేగా ఉపయోగపడుతోంది.  ప్రపంచ పర్యాటక దినం సందర్భంగా నిధి 2.0ను లోక్‌సభ స్పీకర్‌ 2021, సెప్టెంబరు 27న ప్రారంభించారు. భారత పర్యాటక శాఖ, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, రెస్పాన్సిబుల్‌ టూరిజం సొసైటీ ఆఫ్‌ ఇండియా మధ్య పర్యాటక అభివృద్ధి, సుస్థిర చొరవ కోసం ఒప్పందం కుదిరింది.


పర్యాటక పురస్కారాలు:  భారతదేశంలో పర్యాటక రంగం వృద్ధిని ప్రోత్సహించే విధంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ అనేక అవార్డులను ప్రకటించింది. ఏటా ఎంపిక కమిటీలను ఏర్పాటుచేసి వాటి సిఫార్సుల మేరకు అవార్డులు ప్రదానం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు, హోటళ్లకు, ట్రావెల్‌ ఏజెంట్లకు, పర్యాటక ఆపరేటర్లకు, వ్యక్తులకు, సంస్థలకు ఈ అవార్డులను అందిస్తోంది.


ఈ-వీసా: భారత్‌ను సందర్శించేందుకు విదేశీయులకు ఇచ్చే అనుమతిని సులభతరం చేస్తూ 2014, నవంబరు 27 నుంచి ఎలక్ట్రానిక్‌ ట్రావెల్‌ ఆథరైజేషన్‌ పథకాన్ని ప్రారంభించారు. తొలుత 40 దేశాల పౌరులకు అవకాశం ఇవ్వగా, 2016, ఆగస్టు నాటికి 163 దేశాలకు వర్తింపజేశారు. 2017, ఏప్రిల్‌ నుంచి ఈ పథకానికి   ఈ-వీసా పథకం అని పేరు పెట్టారు. దీని కింద ఈ-టూరిస్ట్‌ వీసా, ఈ-బిజినెస్‌ వీసా, ఈ-మెడికల్‌ వీసా అని మూడు తరగతులు   ఉంటాయి. దేశంలోని 24 విమానాశ్రయాలు, 3 ఓడరేవుల్లో ఈ-వీసా పొందిన విదేశీ పర్యాటకులు ప్రవేశించవచ్చు. 2021-22లో ఈ-వీసా  ఉపయోగించుకున్న విదేశీ పర్యాటకులు 72,870 మంది. వీరిలో హైదరాబాదు విమానాశ్రయం ద్వారా ప్రవేశించినవారు 7 శాతం. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు 2022-23లో విదేశీ పర్యాటకులకు 5 లక్షల ఈ-వీసాలిచ్చారు. ఈ సౌకర్యం ఉపయోగించుకున్న దేశాల్లో అమెరికా, రష్యా, జర్మనీ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.


రైల్వే పర్యాటకం: భారతీయ రైల్వేకు సంబంధించిన ఐఆర్‌సీటీసీ దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ అనేక ప్యాకేజీలను రూపొందించింది. ప్రత్యేకంగా కొన్ని పర్యాటక రైళ్లను నడుపుతోంది. అవి మహారాజ ఎక్స్‌ప్రెస్, ఆస్థా సర్క్యూట్‌ ప్రత్యేక రైలు, భారత దర్శన్, స్టీమ్‌ ఎక్స్‌ప్రెస్, బుద్దిస్ట్‌ సర్క్యూట్‌ పర్యాటక రైలు, టైగర్‌ ఎక్స్‌ప్రెస్, డెజర్ట్‌ సర్క్యూట్‌ సెమిలగ్జరీ రైలు.* అరకు సందర్శనకు విశాఖపట్నం నుంచి ఒక టూరిస్టు రైలు నడుస్తోంది. దీని పైకప్పు డోమ్‌ మాదిరిగా ఉంటుంది.


భారతదేశంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు: 10 ప్రమాణాల    ఆధారంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలను ఎంపిక చేస్తుంది.  ఇప్పటివరకు మన దేశంలోని 40 ప్రదేశాలు ఈ జాబితాలో చేరాయి. ఉదా: అజంతా ఎల్లోరా (మహారాష్ట్ర), ఆగ్రా కోట (ఉత్తర్‌ప్రదేశ్‌),   తాజ్‌మహల్, సూర్యదేవాలయం (ఒడిశా), మహాబలిపురం (తమిళనాడు), రామప్ప గుడి (తెలంగాణ), లేపాక్షి నంది (సత్యసాయి జిల్లా - ఆంధ్రప్రదేశ్‌)...


హోటళ్లు: 2022-23 నాటికి భారత ప్రభుత్వం పర్యాటక శాఖ ఆమోదించిన హోటళ్లు 1880. వీటిలో మొత్తం గదులు 1,05,344. * 1 స్టార్‌ హోటళ్లు 10, * 2 స్టార్‌ - 23, *3 స్టార్‌ హోటళ్లు - 564, *4 స్టార్‌ - 423, *5 స్టార్‌ - 185, *5 స్టార్‌ డీలక్స్‌ - 149, *వారసత్వ హోటళ్లు - 55.


పర్యాటకానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు

1) పర్యాటన్‌ పర్వ్‌: దేశీయ పర్యాటకం అభివృద్ధి కోసం 2016లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమమే పర్యాటన్‌ పర్వ్‌. దేశంలోని అన్ని ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు, క్రాఫ్ట్‌ బజార్లు, జానపద, శాస్త్రీయ నృత్యం, సంగీతం, హస్తకళలు, చేనేత, వంటకాల ప్రదర్శనలు ఇందులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో మూడు భాగాలున్నాయి.

దేఖో అప్నా దేశ్‌: భారతీయులను తమ దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించమని ప్రోత్సహించే కార్యక్రమం.

అందరికీ పర్యాటకం: ఈ పథకం కింద దేశంలోని పర్యాటక ప్రదేశాలను దీపాలతో అలకంరిస్తారు. సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తారు.

పర్యాటకం పాలన: ఇందులో భాగంగా పర్యాటక రంగానికి సంబంధించిన పలువురు వాటాదారులతో వివిధ అంశాలపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు.


2) స్వదేశ్‌ దర్శన్‌ యోజన: కేంద్ర ప్రభుత్వం 2015, మార్చి 9న ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం దేశంలో ప్రపంచస్థాయి పర్యాటక మౌలిక సదుపాయాలు కల్పించడం. ఈ పథకం కింద దేశం మొత్తం 76 ప్రాజెక్టులున్నాయి. 2023-24 బడ్జెట్‌లో దీని కోసం రూ.1,412 కోట్లు కేటాయించారు.


3) ప్రసాద్‌: ఈ పథకం పూర్తి పేరు ‘పిలిగ్రిమేజ్‌ రెజువెనేషన్‌ అండ్‌ స్పిరిచ్యువల్‌ ఆగ్మెంటేషన్‌ డ్రైవ్‌’. 2015, మార్చి 9న ప్రారంభించారు. దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను గుర్తించి, అభివృద్ధి చేసి, తీర్థయాత్రికులకు మతపరమైన పర్యాటక అనుభవాన్ని సుసంపన్నం చేయడం ఈ పథకం ఉద్దేశం. ఇందుకోసం ఎంపిక చేసిన నగరాలు.. అమరావతి (ఆంధ్రప్రదేశ్‌), గయా (బిహార్‌), ద్వారక (గుజరాత్‌), అమృత్‌సర్‌ (పంజాబ్‌), ఆజ్మీర్‌ (రాజస్థాన్‌), కాంచీపురం (తమిళనాడు), వేలాంకన్ని (తమిళనాడు), పూరి (ఒడిశా),  వారణాసి (ఉత్తర్‌ప్రదేశ్‌), మధుర (ఉత్తర్‌ప్రదేశ్‌), కేదార్‌నాథ్‌ (ఉత్తరాఖండ్‌), కామాఖ్య (అస్సాం).


4) వారసత్వ దత్తత పథకం: ఇది 2017, సెప్టెంబరు 27న ప్రారంభమైంది. దేశంలోని ప్రధాన చారిత్రక, పురాతన కట్టడాలను దత్తత తీసుకుని వాటిని సంరక్షిస్తూ అభివృద్ధి చేసే బాధ్యతను చేపట్టమని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను, కార్పొరేట్‌ రంగ వ్యక్తులను ప్రభుత్వం కోరింది. ఆ విధంగా దత్తత తీసుకున్న సంస్థలను చారిత్రక కట్టడాల మిత్రులు అని పిలుస్తారు.

 


రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

 

Posted Date : 31-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌