• facebook
  • whatsapp
  • telegram

జాతీయాదాయ వృద్ధిరేటు   

ఒక దేశ అభివృద్ధి గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరిగినప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై ఉంటుంది. అదే ఆ దేశ జాతీయాదాయ వృద్ధిరేటు. దీని గురించి అవగాహన ఉంటే ఆర్థికాభివృద్ధిలోని ఎత్తుపల్లాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.
         ఒక దేశ ప్రగతిని ఆ దేశ స్థూల జాతీయాదాయం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తయిన అంతిమ వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తాన్ని స్థూల జాతీయాదాయం (Gross National Income) అంటారు. దేశ సరిహద్దు లోపల ఒక ఏడాదిలో ఉత్పత్తయ్యే వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తాన్ని స్థూల దేశీయ ఆదాయం (Gross Domestic Income) అంటారు. ఎక్కువ దేశాలు జీడీపీని దేశ అభివృద్ధికి కొలమానంగా ఉపయోగిస్తున్నాయి. 

GNP=GDP + విదేశీ ఆదాయం
    అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తయిన మొత్తం వస్తుసేవల విలువల నుంచి మాధ్యమిక వస్తువుల విలువను తీసివేయగా మిగిలిన అంతిమ వస్తుసేవల విలువలను కూడితే జాతీయాదాయం వస్తుంది. మాధ్యమిక వస్తువుల విలువ కూడా అంతిమ వస్తువు విలువలో కలిసి ఉంటుంది. కాబట్టి మాధ్యమిక వస్తువుల విలువ తీసివేయకపోతే జాతీయాదాయం అధికంగా, అవాస్తవంగా లెక్కించబడుతుంది. 
ఉదా: సెల్‌ఫోన్‌ తయారీలో దాని విడిభాగాలు మాధ్యమిక వస్తువులు అవుతాయి. వాటన్నింటి విలువలు కలిసి సెల్‌ఫోన్‌ విలువ అవుతుంది. కాబట్టి విడిభాగాల విలువలు విడిగా లెక్కించనవసరం లేదు.

లభించే మార్గాలు
ఒక దేశానికి జాతీయాదాయం ప్రధానంగా నాలుగు మార్గాల ద్వారా లభిస్తుంది.
ప్రజలు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో ప్రవేశించి కింది విధులు నిర్వర్తించడం ద్వారా జాతీయాదాయం లభిస్తుంది.  

ప్రజల వినియోగం(Consumpion): కుటుంబాలు తమ అవసరాలు తీర్చుకోవడానికి అనేక రకాల వస్తు సేవలపై వ్యయం చేస్తుంటారు. అలా ఖర్చు చేసే ప్రతి రూపాయి అమ్మకందారుడికి ఆదాయం అవుతుంది. ఆ ఆదాయం మరో కొత్త వస్తుసేవలకు డిమాండ్‌ను సృష్టిస్తుంది. అలా ఆర్థిక వ్యవస్థలో ఆదాయం చక్రంలా ఒకరి నుంచి మరొకరికి ప్రయాణించి జాతీయాదాయాన్ని పెంచుతుంది.

పెట్టుబడి వ్యయం(Investment): వ్యాపార సంస్థలు ప్రజల డిమాండ్‌ ఆధారంగా వస్తువులను తయారుచేసి సప్లయ్‌ చేయడానికి పెట్టుబడులు పెడతాయి. ఇది కొత్త ఉద్యోగాలను కల్పిస్తుంది. వారి జీతాలు పెరిగి, కొనుగోలు శక్తిని పెంచుతుంది. యజమానుల లాభాలు పెరిగితే మూలధన సంచయనం జరిగి కొత్త సంస్థలు, వస్తువులు, ఉద్యోగాల ద్వారా జాతీయాదాయం పెరుగుతుంది.

ప్రభుత్వ వ్యయం(Governament ependiture): ఇది మరో ప్రధాన సూత్రధారి. ప్రజల అవసరాలు, అవస్థాపన సౌకర్యాలు కల్పించడానికి, శాంతిభద్రతల కోసం ప్రభుత్వం ఏటా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ వ్యయం ప్రజల ఉపాధిని, ఆదాయాలను, కొనుగోలుశక్తిని, జీవన ప్రమాణాలను పెంచుతుంది. సంస్థలకు అనుకూల పెట్టుబడి వాతావరణాన్ని కల్పిస్తుంది.

విదేశీ ఆర్థిక వ్యవహారాలు(foreign economic transactions): ఒక దేశం వివిధ ప్రపంచ దేశాలతో వస్తుసేవల వ్యాపారం చేస్తుంది. దాంతో పెట్టుబడులు వివిధ దేశాల మధ్య ప్రవహిస్తాయి. దీనివల్ల ఇతర దేశాలకు చెల్లింపులు జరిగి వాటి నుంచి ఆదాయాలు వస్తాయి. చెల్లింపుల కంటే ఆదాయాలు ఎక్కువగా ఉంటే ఆ దేశ ఆదాయానికి కలుపుతాం. తక్కువగా ఉంటే దేశ ఆదాయం నుంచి తీసివేస్తాం. 
        ప్రస్తుతం ప్రపంచీకరణ కాలంలో మన దేశంతో పాటు అనేక దేశాలు అంతర్జాతీయ వ్యాపారంలో భాగమయ్యాయి. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల పనితీరు ప్రభావం మన ఆదాయవృద్ధిపై పడుతుంది.
GNP= C + I + G + (X - M) + (R - P)
C = వినియోగం,  I  = పెట్టుబడులు,
G = ప్రభుత్వ వ్యయం
X - M = విదేశీ వ్యాపార శేషం, 
R - P = విదేశీ చెల్లింపుల శేషం

లెక్కింపు 
   జాతీయాదాయం లెక్కింపు పద్ధతి వీలైనంత సమగ్రంగా, శాస్త్రీయంగా ఉంటే ఒక దేశ అభివృద్ధి తాలూకు దశదిశలను సులభంగా అంచనా వేయవచ్చు.
    జాతీయాదాయం విలువ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 
   1) వస్తు సేవల పరిమాణంలో మార్పు
    2) వాటి ధరల్లో మార్పు
    ఈ రెండింటలో కలిసి లేదా ఏ ఒక్కదానిలోనైనా మార్పు వచ్చినప్పుడు జాతీయాదాయం విలువ మారుతుంది. వస్తుసేవల పరిమాణం పెరగడమే నిజమైన అభివృద్ధి. అయితే ఒక్కోసారి వస్తుసేవల సంఖ్య పెరగకుండానే కేవలం వాటి ధరలు పెరగడం వల్ల జాతీయాదాయం పెరిగినట్లుగా కనిపిస్తుంది. కానీ అది వాంఛనీయ అభివృద్ధి కాదు. 
    మన దేశంలో జీడీపీ డిఫ్లేటర్‌ను కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు శాఖ నిర్ణయిస్తుంది. జీడీపీని త్రైమాసికానికి ఒకసారి చొప్పున ప్రతి ఏడాది కేంద్ర గణాంక సంస్థ లెక్కిస్తుంది. మన దేశంలో గత 7 త్రైమాసికాలుగా జీడీపీ వృద్ధిరేటు క్షీణిస్తూ వస్తుంది. ఇటీవల సవరించిన అంచనాల ప్రకారం 2019-20 ఏప్రిల్‌ - డిసెంబరు మధ్య కాలంలో కేవలం 5.1%  వృద్ధి రేటు నమోదైంది. 
2012 - 13లో నమోదైన 4.3% తర్వాత ఇదే అతి తక్కువ వృద్ధిరేటు. మన దేశ వృద్ధిరేటు పడిపోయి ప్రపంచ అత్యధిక వృద్ధిరేటు కలిగిన దేశంగా చైనా నిలిచింది. పైన పేర్కొన్న ప్రజల వినియోగం, పెట్టుబడులు, విదేశీ ఎగుమతుల్లో (ప్రైవేటు రంగం) క్షీణత కనిపిస్తుంది. డిమాండ్‌ కొరత వల్ల వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.
    ప్రధానంగా కీలక పరిశ్రమల వృద్ధి బాగా తగ్గింది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం ప్రపంచ ప్రగతిపై పడి మన దేశ వృద్ధిరేటు తగ్గుదలకు కారణమైంది.
    2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్‌టీ అమలుచేయడం వల్ల స్వదేశీ మార్కెట్‌లో కొంత అనిశ్చితి ఏర్పడింది. దీనివల్ల ముఖ్యంగా గ్రామీణ ఆదాయాలు తగ్గి, డిమాండ్‌ తగ్గింది. వ్యాపారాల్లో మార్పు సంధి దశలో అనుమానాలు, భయాలు కూడా కొంతమేర అమ్మకాలు పడిపోవడానికి కారణమయ్యాయని నిపుణుల అంచనా.
    నమోదైన వృద్ధిరేటుకు ప్రధాన చోధకం ప్రభుత్వ వ్యయం. ఇప్పటికే ప్రభుత్వం విత్తలోటుకు సమానంగా నిధులు అప్పులుగా తెచ్చి వివిధ కార్యక్రమాలపై వెచ్చిస్తుంది. మన ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటురంగం సుమారు 87% కలిగి ఉన్నా, గత తొమ్మిది నెలల్లో కేవలం 4.01% వృద్ధి నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. అయితే ప్రభుత్వ వ్యయం అంచనాలకు మించి 15.64% పెరిగింది. ఆర్థిక మందగమన కాలంలో ప్రైవేటురంగం వెనకడుగు వేసినప్పుడు ప్రభుత్వ రంగం కీలకపాత్ర పోషించాల్సి వస్తుందని ఇది రుజువు చేస్తుంది.
మార్పులు - గణన
జాతీయాదాయంలో మార్పులను రెండు రకాల మార్కెట్‌ ధరల సహాయంతో గణిస్తారు.

ఆధార సంవత్సర ధరల్లో.. 
(GNP at base year or constant priece)

    ప్రజలకు అవసరమైన వస్తుసేవలు పెరగడమే నిజమైన అభివృద్ధి. కాబట్టి ధరలతో ప్రమేయం లేకుండా వస్తుసేవల పరిమాణంలో మార్పులు లెక్కించాలి. దీనికి గణాంక శాస్త్రవేత్తలు ఆధార సంవత్సరాన్ని సూచించారు. ఒడిదొడుకులు లేని  సాధారణ పరిస్థితులు కలిగిన సంవత్సరాన్ని ఎన్నుకుంటారు. ఒక నిర్దిష్ట కాల వ్యవధి తర్వాత ఈ ఆధార సంవత్సరాన్ని మారుస్తుంటారు. ఆధార సంవత్సర ధరల్లో తర్వాతి సంవత్సరాల వస్తుసేవల ఉత్పత్తి విలువను లెక్కిస్తారు. దీనివల్ల ధరలు మారకుండా కేవలం వస్తుసేవల పరిమాణం మార్పులను తెలుపుతుంది. ధరలు మారవు కాబట్టి దీన్ని స్థిర ధరల్లో జాతీయాదాయం లేదా వాస్తవిక ఆదాయం అని పిలుస్తారు. మన దేశంలో ఇప్పుడు  ఆధార సంవత్సరంగా 2011 - 12ను ఉపయోగిస్తున్నారు. త్వరలో 2017 - 18కి మారాలని గణాంక మంత్రిత్వ శాఖ ఆలోచిస్తుంది. పట్టికలోని చక్కెర, పాలు, టీ పొడి విలువలను 2011 - 12 నాటి ధరల్లో 2018, 2019 నాటి ఉత్పత్తులను లెక్కిస్తారు. అప్పుడు ధరల్లో మార్పు ఉండకుండా వాస్తవ ఆదాయంలో మార్పులను సులభంగా తెలుసుకోవచ్చు. 
    సాధారణంగా వాస్తవ ఆదాయం కంటే ద్రవ్యోల్బణం సమయంలో ధరలు పెరుగుతుండటం వల్ల నామమాత్ర ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక మాంద్యకాలంలో వాస్తవ ఆదాయం కంటే నామమాత్రపు ఆదాయం తక్కువగా ఉంటుంది. వాస్తవ ఆదాయ విలువను కింది సూత్రం ఆధారంగా లెక్కిస్తారు.
 
    డిఫ్లేటర్‌ అంటే ప్రస్తుత సంవత్సర ధరలకు, ఆధార సంవత్సర ధరలకు మధ్య ఉన్న నిష్పత్తి. ఇది వినియోగదారుల సూచిక మాదిరి (దిశిఖి) ధరల స్థాయిని తెలియజేస్తుంది.

ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం(GNP at current prices)
    ఏ సంవత్సరంలో ఉత్పత్తయిన వస్తుసేవల విలువలను అదే సంవత్సర ధరల్లో లెక్కిస్తే దాన్ని నామమాత్రపు జాతీయాదాయం అంటారు. 2018లో ఒక లక్ష కార్లు తయారైతే వాటి విలువను అదే సంవత్సర ధరల్లో లెక్కిస్తాం. ఇక్కడ ధరల మార్పు జాతీయాదాయ విలువపై పడుతుంది. వస్తువుల సంఖ్య పెరిగినా, తగ్గినా, స్థిరంగా ఉన్నా వాటి ధరల్లో పెరుగుదల ఉంటే జాతీయాదాయం పెరుగుతుంది. ధరలు తగ్గితే జాతీయాదాయం తగ్గుతుంది. ఇది ద్రవ్యోల్బణం వల్ల  పెరిగినట్లు కనిపిస్తుంది. అసలైన అభివృద్ధిని తెలుపదు.

    పట్టికలో చూపినట్లుగా ధరల్లో మార్పు వచ్చినప్పుడు వస్తువు విలువలో మార్పు కనిపిస్తుంది. కానీ, ప్రజలకు కావాల్సిన వస్తుసేవల పరిమాణంలో మార్పులను ఇది తెలపడం లేదు.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మాన‌వాభివృద్ధి సూచీ   

 ప్రపంచంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ప్రగతికి కొలమానంగా 1990 నుంచి మానవాభివృద్ధి సూచీ (Human development Index)ని ఉపయోగిస్తున్నాయి. కాలానుగుణంగా సూచిక అంశాలు, లెక్కింపు విధానంలో మార్పులు చెందుతూ ఇది నిత్య జీవన కొలమానంగా కొనసాగుతోంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూఎన్‌డీపీ (United Nations Development programme) 1990 నుంచి ఏటా మానవాభివృద్ధి నివేదికలో ఈ సూచికను తెలుపుతుంది. మానవ శ్రేయస్సును పెంచే అవకాశాలను విస్తృతం చేసే ప్రక్రియనే మానవాభివృద్ధి అంటారు. నిత్య జీవితంలో మనిషి తన ఎదుగుదల కోసం అనేక అంశాలను సేకరిస్తాడు. మానవాభివృద్ధికి తోడ్పడే అనేక అంశాల్లో ఆదాయం ఒకటి అని తీర్మానించారు. ఆర్థికాభివృద్ధి అంతిమంగా మానవాభివృద్ధికి తోడ్పడాలని దేశాల లక్ష్యాల్లో మార్పులు తీసుకొచ్చారు. 

మానవాభివృద్ధి సూచిక - రూపకల్పన
    పాకిస్థాన్‌కు చెందినఆర్థికవేత్త మహబూబ్‌-ఉల్‌-హక్‌ సూచన మేరకు మానవాభివృద్ధికి ప్రధానమైన మూడు అంశాలను  పరిగణనలోకి తీసుకొని 1990లో మొదటిసారి 130 దేశాల గణాంకాల సహాయంతో ర్యాంకులను ప్రకటించారు. ఇది 2018 నాటికి 189 దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం నార్వే ప్రథమ స్థానంలో ఉండగా భారత్‌ 130వ స్థానంలో ఉంది.
1) సుదీర్ఘ ఆరోగ్య జీవనకాల సూచీ(Life expectancy Index)
2) విద్యా సూచిక (Education Index) వయోజన అక్షరాస్యత 2/3 + స్థూల నమోదు నిష్పత్తి 1/3్శ
3) GDP per capita (ppp US $) తో కొలిచే జీవన ప్రమాణ సూచిక (Standerd of living index)
    ప్రతి అంశంలోని కనీస, గరిష్ఠ విలువల ఆధారంగా సూచిక విలువను నిర్ణయిస్తారు. }


    ఈ విలువలను కింది సూత్రంలో ఉపయోగించి సూచిక విలువను లెక్క కడతారు. 


    ప్రతి అంశం విలువను 0 నుంచి 1 మధ్య తెలుపుతారు.

    మానవాభివృద్ధి సూచిక =    

    మానవాభివృద్ధి సూచిక పైమూడు అంశాల సూచికల విలువల సాధారణ సగటు. ఈ సూచిక అనేక విమర్శలను ఎదుర్కొంది.


విమర్శలు
* మానవాభివృద్ధి అనేది విశాలమైన భావన. కేవలం మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవడం సంకుచిత కొలమానం అవుతుంది. వీటి గణాంకాలు వెనుకబడిన దేశాల్లో విశ్వసనీయంగా ఉండవు.
* విద్యా, ఆరోగ్యం, ఆదాయం మూడింటికీ సమ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఏ రెండింటిలో మార్పులకైనా ఒకే విలువను పరిగణిస్తున్నారు. దీంతో విజ్ఞానం పెరగకపోయినా ఆదాయం పెరుగుదలతో అభివృద్ధి చెందినట్లు ఈ సూచీ తెలుపుతుంది. 
* తలసరి ఆదాయాలు పెరిగినా అవి కొంత మంది ధనవంతులవే కావచ్చు. ఆదాయ అసమానతలను తెలియజేయలేదు.
* విజ్ఞానం, ఆరోగ్యం నాణ్యత గురించి పేర్కొనలేదు. ఇవి తలసరి ఆదాయంతో పటిష్ఠ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వీటినే పరిగణనలోకి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. బహుళ విభిన్న అంశాలు ఉంటే మంచిదని కొంత మంది అభిప్రాయం.
* సమగ్ర మానవాభివృద్ధికి అవసరమైన శాంతి, స్వేచ్ఛ, పారదర్శకమైన పాలన, పర్యావరణ పరిరక్షణ గురించి చర్చించలేదు. దేశ ప్రగతిలో సాంకేతిక పరిజ్ఞానం పాత్రను మానవాభివృద్ధి సూచీ విస్మరించింది. ఈ విమర్శలను తగ్గించుకోవడానికి మానవాభివృద్ధి సూచిక నిర్మాతలు ఎప్పటికప్పుడు లెక్కించే అంశాలు, విధానాల్లో మార్పులు తీసుకొస్తున్నారు.

లింగ అభివృద్ధి సూచిక (GDI - 1995)
    మానవాభివృద్ధి సూచికను స్త్రీలకు ప్రత్యేకంగా వర్తింపజేసి అందులోని మూడు అంశాల్లో సాధారణ అభివృద్ధితో పాటు స్త్రీ - పురుషుల మధ్య పంపిణీలో అసమానతలను గుర్తిస్తున్నారు. హెచ్‌డీఐ, జీడీఐ మధ్య తేడా స్త్రీల వెనుకబాటుతనాన్ని తెలియజేస్తుంది.

లింగ సాధికారిక సూచిక (1995)
    ఈ సూచిక ద్వారా మూడు అంశాల ఆధారంగా స్త్రీల సాధికారతను కొలవవచ్చు.
    1) జాతీయ పార్లమెంట్‌లో మహిళలు పొందిన సీట్లు 
    2) ఆర్థిక నిర్ణయ స్థానాల్లో మహిళల శాతం
    3) ఆదాయంలో స్త్రీల వాటా
* వీటిపై కూడా అనేక విమర్శలు వచ్చాయి. సాంకేతిక అంశాలు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. సరైన గణాంకాలు అందుబాటులో లేవు. వివిధ దేశాలతో పోల్చుకోవడం సముచితంగా లేదు.
* అభివృద్ధి చెందిన సమాజాలకు మాత్రమే వర్తిస్తాయి. స్థానిక, గ్రామీణ స్థాయి, అసంఘటిత రంగంలోని స్త్రీల ప్రాధాన్యత,  పాత్రను గుర్తించడం లేదు.

మానవ పేదరిక సూచిక (1997)
    1997లో విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదికలో సరికొత్త కొలమానంగా మానవ పేదరిక సూచిక (Human poverty index)ను ప్రవేశపెట్టారు. మానవ జీవన ప్రమాణాన్ని తెలపడంలో మానవాభివృద్ధి సూచికకు సహాయకారిగా ఉంటూ జీవనకాలం, విద్య, జీవన ప్రమాణాల్లో వెనుకబాటుతనాన్ని తెలియజేస్తుంది. అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలకు వేర్వేరుగా లెక్కించి సామాజిక బహిర్గతను బయటపెడుతుంది.

సూచికలో మార్పులు
రెండు దశాబ్దాల తర్వాత లోపాలను సవరించుకొని 2010 నుంచి కొన్ని మార్పులతో మానవాభివృద్ధి సూచికను గణిస్తున్నారు.

    1) సుదీర్ఘమైన ఆరోగ్య జీవన కాలం లెక్కింపులో మార్పు చేయలేదు. 
    2) విజ్ఞాన సూచిక కోసం రెండు కొత్త అంశాలను ఎంచుకున్నారు.
 a) 25 ఏళ్లు, ఆపైన వయసు గలవారు చదువుకున్న సగటు సంవత్సరాలు. (Mean Years of schooling index - MYSI)
   
        గరిష్ఠంగా ఒక వ్యక్తి 15 సంవత్సరాలు నియత విద్యను పొందుతాడని అంచనా.
b)  పాఠశాలలో 18 ఏళ్ల లోపు పిల్లలు కొనసాగే అంచనా సంవత్సరాలు (Expected years of schooling index - EYSI) 

 చాలా దేశాల్లో మాస్టర్‌ డిగ్రీని 18 ఏళ్లకే పొందుతారు.

3) ఒక దేశానికి విదేశాల్లో ఉన్న తమ పౌరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కలుపుతూ GDP for capita బదులు GNP for capita ఉపయోగించారు. వాటి కనీస, గరిష్ఠ విలువల్లో మార్పులు తీసుకొచ్చారు.
    ఈ మూడింటి సాధారణ సగటు బదులు గుణాత్మక సగటు (geometric mean)ను వాడుతున్నారు.


అసమానతల సర్దుబాటుతో హెచ్‌డీఐ
    యూఎన్‌డీపీ 2010లో ఈ సూచికను ప్రవేశపెట్టింది. మానవాభివృద్ధి సూచిక దాగి ఉన్న మానవాభివృద్ధిని తెలియజేస్తుంది. అసమానతల సర్దుబాటుతో మానవాభివృద్ధి సూచిక(inequality adjusted Human Devolopment Index - IHDI) అసమానతలు లేకుండా వాస్తవంగా సాధించిన అభివృద్ధిని తెలుపుతుంది. ఆరోగ్యం, విజ్ఞానం, ఆదాయాల్లో అసమానతల వల్ల మానవాభివృద్ధికి వాటిల్లిన నష్టాన్ని గుర్తిస్తుంది.

లింగ అసమానతల సూచిక 
   లింగ అభివృద్ధి సూచిక, లింగ సాధికారిక సూచిక (1995) లోని లోపాలను సవరించి 2010లో వాటి స్థానంలో లింగ అసమానతల సూచికను (Gendar Inequality Index - GII) ప్రవేశపెట్టారు. దీన్ని మూడు ప్రధాన అంశాల విలువల ఆధారంగా లెక్కిస్తారు.
1) పునరుత్పాదక ఆరోగ్యం (Reproductive health): దీనిలో మాతా మరణాల నిష్పత్తి (maternal mortality Ratio - MMR), వయోజనుల సంతానోత్పత్తి రేటు(Adolescent Fertility Rate - AFR) అనే రెండు అంశాలు ఉంటాయి. 
2) సాధికారత (Empowerment): దీనిలో పార్లమెంట్‌ సీట్లలో వాటా, ఉన్నత విద్యలో అవకాశాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి.
3) కార్మిక మార్కెట్‌లో భాగస్వామ్యం (Labour market participation)
    ఈ మూడు అంశాల్లో వెనుకబాటుతనం వల్ల మానవాభివృద్ధికి జరిగిన నష్టాన్ని తెలుసుకోవచ్చు.

బహుళ అంశాల పేదరిక సూచిక 
    2010లో మానవ పేదరిక సూచిక స్థానంలో బహుళ అంశాల పేదరిక సూచికను ప్రవేశపెట్టారు.పేదరికాన్ని కేవలం ఆదాయం ఆధారంగా కాకుండా ఒక వ్యక్తి ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలకు చెందిన పది అంశాల ఆధారంగా లెక్కిస్తారు. అయితే అన్ని అంశాలకు చెందిన గణాంకాలు లభ్యం కాకపోవడంతో 100 దేశాల్లో మాత్రమే బహుళ అంశాల పేదరిక సూచిక (Multidimensional Poverty Index)ను లెక్కిస్తున్నారు. అనేక మార్పులు జరుగుతున్నప్పటికీ కొన్ని అధ్యయనాలు మానవాభివృద్ధి సూచికను విమర్శిస్తూనే ఉన్నాయి. 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిరాభివృద్ధి   

మాదిరి ప్రశ్నలు
1. అభివృద్ధి రకాల్లో అతి ప్రాచీనమైంది?
    1) ఆర్థికవృద్ధి     2) ఆర్థికాభివృద్ధి    3) ఆర్థిక సంక్షేమం    4) మానవాభివృద్ధి

2. ఆర్థికాభివృద్ధి అంటే?
    1) స్వల్పకాలంలో ఉత్పత్తిలో మార్పు    
    2) దీర్ఘకాలంలో ఉత్పత్తిలో మార్పు
    3) స్వల్పకాలంలో ఉత్పత్తితోపాటు సామాజిక మార్పు
    4) దీర్ఘకాలంలో ఉత్పత్తిలో మార్పుతో పాటు సామాజిక మార్పు

3. ట్రికిల్‌ డౌన్‌ (Trickle Down) సిద్ధాంతం దేనికి సంబంధించింది?
    1) ధరల తగ్గింపు        2) ఆర్థిక మాంద్యం మదింపు
    3) పేదలకు అభివృద్ధి ఫలాలు చేరడం    4) అన్నీ

4. ప్రపంచీకరణలో భాగంగా అమలు చేసిన అభివృద్ధి?
    1) ఆర్థిక సంక్షేమం    2) మానవాభివృద్ధి     3)  సుస్థిరాభివృద్ధి    4) ఆర్థిక వృద్ధి 

5. సుస్థిరాభివృద్ధి లక్ష్యం?
    1) ప్రాంతాల మధ్య సమానాభివృద్ధి    2) ప్రజల మధ్య సమానాభివృద్ధి
    3) దేశాల మధ్య సమానాభివృద్ధి    4) తరాల మధ్య సమానాభివృద్ధి


సమాధానాలు: 11; 24; 33;  42; 54. 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

  సుస్థిరాభివృద్ధి

   అభివృద్ధి అనేది అతి ప్రాచీనమైన మానవ వ్యక్తిగత, సామూహిక కార్యక్రమం. దీనిలో భాగంగా గుహలు విడిచి గృహాలను నిర్మించారు. ఇది కుమ్మరి చక్రంతో మొదలైన మొదటి ఉత్పత్తి. ద్రవ్యం సంపద, సంతోషానికి మారుపేరుగా మారి పర్యావరణాన్ని బాధిస్తున్న విధ్వంసక ప్రక్రియ. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో జరిగిన వాతావరణ కార్యాచరణ సదస్సులో 16 ఏళ్ల స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థెన్‌బర్గ్‌  ‘మా తరాన్ని ముంచేస్తారా’ అని పాలకులను ప్రశ్నించింది. నేటి తరం ఇలా ఎందుకు స్పందిస్తుందో అర్థం కావాలంటే మనిషి అభివృద్ధి భావనా ప్రస్థానాన్ని అవగాహన చేసుకోవాలి. ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు మొదట తక్కువ కాలంలో అభివృద్ధి చెందిన దేశాల్లో వాస్తవిక ఆదాయంలోని పెరుగుదలనే ఆర్థిక వృద్ధిగా పరిగణించారు. సాంకేతికతను అందిపుచ్చుకొని సంపదను వస్తువుల రూపంలో సేకరించి, మార్కెటింగ్‌ చేసుకోవడాన్నే ముఖ్యంగా భావించారు. ఈ క్రమంలో పర్యావరణ జాగ్రత్తలను విస్మరించారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం రాజకీయంగా స్వతంత్ర దేశంగా అవతరించిన భారత్‌ లాంటి దేశాలను పరిశీలిస్తే వెనుకబడిన దేశాలకు ఆర్థికవృద్ధితోపాటు ఆర్థికాభివృద్ధి కూడా అవసరమని తేల్చారు. దీర్ఘకాలంలో వాస్తవిక ఆదాయంతో పాటు సామాజిక, సంస్థాగత, సాంకేతిక మార్పులను తెలిపే విశాల ప్రక్రియను ఆర్థికాభివృద్ధి అని గుర్తించారు.

ఆర్థికాభివృద్ధి = ఆర్థికవృద్ధి + ఇతర ఆవశ్యక మార్పులు
    ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థికవృద్ధిలా సంపద సృష్టికి ప్రాధాన్యం ఇస్తుంది. అంటే జాతీయాదాయ పెంపుదలే ముఖ్యం. ఇది తక్కువ కాలంలో అధిక వృద్ధిరేటు కోసం ప్రయత్నిస్తుంది. ఉత్పత్తి ఉపాధికి దారితీసి మరెన్నో పరోక్ష ప్రయోజనాలను కల్పిస్తుంది. దీని వల్ల అభివృద్ధి జరుగుతుందనేది సైద్ధాంతిక విశ్వాసం. దీన్నే ట్రికిల్‌ డౌన్‌ థియరీ అంటారు. ఈ సిద్ధాంతం ఆధారంగానే అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేక ఆదాయ అభివృద్ధి పనులను చేపట్టాయి. మన దేశంలో 1951-1970 మధ్య కాలంలో సామాజిక అభివృద్ధి, గ్రామాల్లో భూసంస్కరణలు, వ్యవసాయ విస్తరణ, భారీ ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణం, హరిత విప్లవాలతో ఆర్థికాభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి.

ఆర్థిక సంక్షేమం 
    ఆర్థికాభివృద్ధి ఫలాలు కొన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకే పరిమితమయ్యాయని ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. పేద ప్రజల స్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీన్ని అధిగమించడానికి ఆర్థిక సంక్షేమం ఏర్పడింది. అంటే పేద, బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. మన దేశంలో 1971 - 1990 కాలంలో అనేక పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ - పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఇవి దారిద్య్రరేఖ కింద జీవించేవారి ప్రాథమిక అవసరాలను కొంతమేర తీర్చాయి. కానీ ఆశించిన ఫలితాలు కనిపించలేదు. ఈ పథకాలు ప్రజాస్వామ్య దేశాల్లో క్రమంగా ఓట్ల కోసం పేదలను ఆకర్షించే నినాదాలుగా మారాయి. వీటిలో జరిగే అవినీతి వల్ల ఖజానాపై భారం పెరిగింది.

ఆర్థిక సంక్షేమం = ఆర్థికాభివృద్ధి + ప్రత్యక్ష సంక్షేమ పథకాలు
మానవాభివృద్ధి 
    1991 నుంచి ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ చాలా దేశాల్లో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక శాస్త్రవేత్తలు పునరాలోచనలో పడ్డారు. మానవుడి కేంద్రీకృతమైన అభివృద్ధి జరగాలని భావించారు. ముఖ్యంగా పేదలు స్వయంగా ఎదిగే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. సంక్షేమ పథకాల పేరుతో వారిని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుగా మాత్రమే కాకుండా వారికి స్వేచ్ఛను ఇచ్చి సామర్థ్యాల మేరకు అభివృద్ధిలో చురుకైన భాగస్వాములను చేయాలి. ఇది వారి ఆర్థిక, సామాజిక సాధికారతకు దోహదపడుతుంది. ఇదే నిజమైన మానవాభివృద్ధి. ఆదాయంతోపాటు ప్రజలకు విద్య, ఆరోగ్యాన్ని అందించాలి. ప్రపంచ దేశాలు శ్రామికులను మానవ వనరులుగా గుర్తించి పలు చర్యలు చేపట్టాయి.

మానవాభివృద్ధి = ఆర్థికాభివృద్ధి  +  విద్య + ఆరోగ్యం
    మానవాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో అభివృద్ధికి ప్రధాన అంశమైన పర్యావరణం గురించి చర్చించలేదు. ప్రకృతి మనిషి కంటే ప్రాచీనమైంది. సృష్టిలోని జీవ, నిర్జీవ పదార్థాలను ఉపయోగించుకుని మానవ నాగరికత రూపుదాల్చింది. ప్రస్తుతం మనుషుల సంఖ్య పెరిగింది. దాంతోపాటు పర్యావరణంలో అనేక మార్పులు వచ్చాయి. అభివృద్ధి పేరుతో సహజ వనరులను అతిగా ఉపయోగించడం వల్ల నేటి తరానికి సహజ సంపద తగ్గిపోయింది. ముఖ్యంగా 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత వనరుల దుర్వినియోగం వేగంగా జరిగి కాలుష్యం అధికమైంది. ఇది రేపటి తరాల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని ప్రపంచ మేధావులు, పర్యావణ వేత్తలు భావించారు. 1970 దశాబ్దంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని సమావేశాల్లో ఈ ఆలోచన ప్రారంభమైంది. 1980లో మొదటిసారిగా ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ యూనియన్‌ (ఖిగీదివి) సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని ప్రయోగించింది. 1987లో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ కమిషన్‌ విడుదల చేసిన ‘అవర్‌ కామన్‌ ఫ్యూచర్‌’లో ఈ పదానికి శాస్త్రీయ నిర్వచనం ఇచ్చింది. దీన్నే సాధారణంగా బ్రంట్‌లాండ్‌ రిపోర్ట్‌ అని పిలుస్తారు. ‘భవిష్యత్తు తరాల అవసరాలు తీర్చుకునే సామర్థ్యాలను దెబ్బతీయకుండా ప్రస్తుత తరాలు తమ అవసరాలను తీర్చుకునే అభివృద్ధే సుస్థిరాభివృద్ధి’.
* ప్రజలందరి అవసరాలు ముఖ్యంగా పేదలకు ప్రాధాన్యత. 
* పర్యావరణంపై సాంకేతికత విధించే పరిమితులు
* ప్రస్తుత, భవిష్యత్తు తరాల మధ్య సమన్యాయం 
* అభివృద్ధిని ముందు తరాలకు కొనసాగించడం. అందుకే దీన్ని కొనసాగించగల అభివృద్ధి అని కూడా అంటారు.
    ఈ నివేదిక తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధిపై చర్చలు, అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. 1992లో బ్రెజిల్‌లోని రియో-డి-జెనీరోలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ధరిత్రీ సదస్సులో అజెండా - 21 పేరుతో 21వ శతాబ్దంలో సుస్థిరాభివృద్ధి సాధనకు సాధ్యాసాధ్యాలు, పరిమితులను చర్చించారు. తర్వాత 20 ఏళ్లకు రియో నగరంలోనే రియో + 20 పేరుతో 2012లో సుస్థిరాబివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సు జరిగింది. ఈ సదస్సులో గత అనుభవాలను సమీక్షించారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు - ప్రభావంపై అవగాహన ఏర్పడింది. దీని ఆధారంగానే పారిస్‌ ఒప్పందం (2016) అమల్లోకి వచ్చింది.

భారత్‌ పనితీరు 
    ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి సూచిక - 2019 ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో డెన్మార్క్‌ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అమెరికా 35, చైనా 39, భారత్‌ 115వ స్థానంలో ఉన్నాయి. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక - బేస్‌ లైన్‌ రిపోర్ట్, 2018 తొలి నివేదిక ప్రకారం 100 పాయింట్లకు మన దేశం 58 పాయింట్లు సాధించింది. ఈ లక్ష్యాల సాధనలో హిమాచల్‌ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. SDG India Index ను కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ, గ్లోబల్‌ గ్రీన్‌ గ్రోత్‌ సంస్థ, ఐక్యరాజ్య సమితి కలిసి రూపొందించాయి.

లక్ష్యాలు
    ఐక్యరాజ్య సమితి 2015 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన పర్యావరణ సదస్సులో 2015 - 30 మధ్యకాలంలో అన్ని దేశాలు సాధించాల్సిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఆమోదించింది. 
    1)  పేదరిక నిర్మూలన
    2) ఆకలి చావులను పూర్తిగా తగ్గించడం 
    3) మంచి ఆరోగ్యం  
    4) నాణ్యమైన విద్య
    5) లింగ సమానత్వం 
    6) పరిశుభ్రమైన నీరు, పరిసరాలు 
    7) పునరుజ్జీవన ఇంధన వాడకం 
    8) ఉపాధి, ఆర్థికవృద్ధి  
    9) పరిశ్రమలు, నూతన ఆవిష్కరణలు, అవస్థాపనా సౌకర్యాల కల్పన
    10) అసమానతల తగ్గింపు  
    11) సుస్థిర నగరాలు, సమాజాలు 
    12) బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి 
    13) వాతావరణ మార్పులపై చర్యలు 
    14) నీటిలోని ప్రాణుల సంరక్షణ
    15) నేలపై జీవుల రక్షణ
    16) శాంతి, న్యాయం 
    17) ఉమ్మడి లక్ష్యాల కోసం భాగస్వామ్యం. 
    సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థూలంగా 17గా విభజించినప్పటికీ అవి ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి సామాజిక, ఆర్థిక, పర్యావరణపరంగా సుస్థిరంగా ఉండాలి. మొదటిసారి ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో వాతావరణ కార్యాచరణ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు పలువురు నేతలు, పర్యావణ శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఇప్పటివరకు సుస్థిరాభివృద్ధి కోసం చేపట్టిన చర్యలను సమీక్షించారు. సుస్థిరాభివృద్ధి అంటే అసలైన అర్థం నాలుగు కాలాల పాటు కాదు నాలుగు తరాల పాటు అందరినీ సంతోషపెట్టేది. 
                 p - people; p - planet; p - prosperity; p - partnership; p - peace  అనే 5 P's ను సాధించడానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉపయోగపడతాయి. 2000-2015 మధ్య ఎనిమిది సహస్రాబ్ది లక్ష్యాలు ఉన్నాయి.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

  సుస్థిరాభివృద్ధి

   అభివృద్ధి అనేది అతి ప్రాచీనమైన మానవ వ్యక్తిగత, సామూహిక కార్యక్రమం. దీనిలో భాగంగా గుహలు విడిచి గృహాలను నిర్మించారు. ఇది కుమ్మరి చక్రంతో మొదలైన మొదటి ఉత్పత్తి. ద్రవ్యం సంపద, సంతోషానికి మారుపేరుగా మారి పర్యావరణాన్ని బాధిస్తున్న విధ్వంసక ప్రక్రియ. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో జరిగిన వాతావరణ కార్యాచరణ సదస్సులో 16 ఏళ్ల స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థెన్‌బర్గ్‌  ‘మా తరాన్ని ముంచేస్తారా’ అని పాలకులను ప్రశ్నించింది. నేటి తరం ఇలా ఎందుకు స్పందిస్తుందో అర్థం కావాలంటే మనిషి అభివృద్ధి భావనా ప్రస్థానాన్ని అవగాహన చేసుకోవాలి. ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు మొదట తక్కువ కాలంలో అభివృద్ధి చెందిన దేశాల్లో వాస్తవిక ఆదాయంలోని పెరుగుదలనే ఆర్థిక వృద్ధిగా పరిగణించారు. సాంకేతికతను అందిపుచ్చుకొని సంపదను వస్తువుల రూపంలో సేకరించి, మార్కెటింగ్‌ చేసుకోవడాన్నే ముఖ్యంగా భావించారు. ఈ క్రమంలో పర్యావరణ జాగ్రత్తలను విస్మరించారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం రాజకీయంగా స్వతంత్ర దేశంగా అవతరించిన భారత్‌ లాంటి దేశాలను పరిశీలిస్తే వెనుకబడిన దేశాలకు ఆర్థికవృద్ధితోపాటు ఆర్థికాభివృద్ధి కూడా అవసరమని తేల్చారు. దీర్ఘకాలంలో వాస్తవిక ఆదాయంతో పాటు సామాజిక, సంస్థాగత, సాంకేతిక మార్పులను తెలిపే విశాల ప్రక్రియను ఆర్థికాభివృద్ధి అని గుర్తించారు.

ఆర్థికాభివృద్ధి = ఆర్థికవృద్ధి + ఇతర ఆవశ్యక మార్పులు
    ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థికవృద్ధిలా సంపద సృష్టికి ప్రాధాన్యం ఇస్తుంది. అంటే జాతీయాదాయ పెంపుదలే ముఖ్యం. ఇది తక్కువ కాలంలో అధిక వృద్ధిరేటు కోసం ప్రయత్నిస్తుంది. ఉత్పత్తి ఉపాధికి దారితీసి మరెన్నో పరోక్ష ప్రయోజనాలను కల్పిస్తుంది. దీని వల్ల అభివృద్ధి జరుగుతుందనేది సైద్ధాంతిక విశ్వాసం. దీన్నే ట్రికిల్‌ డౌన్‌ థియరీ అంటారు. ఈ సిద్ధాంతం ఆధారంగానే అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేక ఆదాయ అభివృద్ధి పనులను చేపట్టాయి. మన దేశంలో 1951-1970 మధ్య కాలంలో సామాజిక అభివృద్ధి, గ్రామాల్లో భూసంస్కరణలు, వ్యవసాయ విస్తరణ, భారీ ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణం, హరిత విప్లవాలతో ఆర్థికాభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి.

ఆర్థిక సంక్షేమం 
    ఆర్థికాభివృద్ధి ఫలాలు కొన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకే పరిమితమయ్యాయని ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. పేద ప్రజల స్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీన్ని అధిగమించడానికి ఆర్థిక సంక్షేమం ఏర్పడింది. అంటే పేద, బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. మన దేశంలో 1971 - 1990 కాలంలో అనేక పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ - పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఇవి దారిద్య్రరేఖ కింద జీవించేవారి ప్రాథమిక అవసరాలను కొంతమేర తీర్చాయి. కానీ ఆశించిన ఫలితాలు కనిపించలేదు. ఈ పథకాలు ప్రజాస్వామ్య దేశాల్లో క్రమంగా ఓట్ల కోసం పేదలను ఆకర్షించే నినాదాలుగా మారాయి. వీటిలో జరిగే అవినీతి వల్ల ఖజానాపై భారం పెరిగింది.

ఆర్థిక సంక్షేమం = ఆర్థికాభివృద్ధి + ప్రత్యక్ష సంక్షేమ పథకాలు
మానవాభివృద్ధి 
    1991 నుంచి ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ చాలా దేశాల్లో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక శాస్త్రవేత్తలు పునరాలోచనలో పడ్డారు. మానవుడి కేంద్రీకృతమైన అభివృద్ధి జరగాలని భావించారు. ముఖ్యంగా పేదలు స్వయంగా ఎదిగే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. సంక్షేమ పథకాల పేరుతో వారిని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుగా మాత్రమే కాకుండా వారికి స్వేచ్ఛను ఇచ్చి సామర్థ్యాల మేరకు అభివృద్ధిలో చురుకైన భాగస్వాములను చేయాలి. ఇది వారి ఆర్థిక, సామాజిక సాధికారతకు దోహదపడుతుంది. ఇదే నిజమైన మానవాభివృద్ధి. ఆదాయంతోపాటు ప్రజలకు విద్య, ఆరోగ్యాన్ని అందించాలి. ప్రపంచ దేశాలు శ్రామికులను మానవ వనరులుగా గుర్తించి పలు చర్యలు చేపట్టాయి.

మానవాభివృద్ధి = ఆర్థికాభివృద్ధి  +  విద్య + ఆరోగ్యం
    మానవాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో అభివృద్ధికి ప్రధాన అంశమైన పర్యావరణం గురించి చర్చించలేదు. ప్రకృతి మనిషి కంటే ప్రాచీనమైంది. సృష్టిలోని జీవ, నిర్జీవ పదార్థాలను ఉపయోగించుకుని మానవ నాగరికత రూపుదాల్చింది. ప్రస్తుతం మనుషుల సంఖ్య పెరిగింది. దాంతోపాటు పర్యావరణంలో అనేక మార్పులు వచ్చాయి. అభివృద్ధి పేరుతో సహజ వనరులను అతిగా ఉపయోగించడం వల్ల నేటి తరానికి సహజ సంపద తగ్గిపోయింది. ముఖ్యంగా 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత వనరుల దుర్వినియోగం వేగంగా జరిగి కాలుష్యం అధికమైంది. ఇది రేపటి తరాల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని ప్రపంచ మేధావులు, పర్యావణ వేత్తలు భావించారు. 1970 దశాబ్దంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని సమావేశాల్లో ఈ ఆలోచన ప్రారంభమైంది. 1980లో మొదటిసారిగా ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ యూనియన్‌ (ఖిగీదివి) సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని ప్రయోగించింది. 1987లో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ కమిషన్‌ విడుదల చేసిన ‘అవర్‌ కామన్‌ ఫ్యూచర్‌’లో ఈ పదానికి శాస్త్రీయ నిర్వచనం ఇచ్చింది. దీన్నే సాధారణంగా బ్రంట్‌లాండ్‌ రిపోర్ట్‌ అని పిలుస్తారు. ‘భవిష్యత్తు తరాల అవసరాలు తీర్చుకునే సామర్థ్యాలను దెబ్బతీయకుండా ప్రస్తుత తరాలు తమ అవసరాలను తీర్చుకునే అభివృద్ధే సుస్థిరాభివృద్ధి’.
* ప్రజలందరి అవసరాలు ముఖ్యంగా పేదలకు ప్రాధాన్యత. 
* పర్యావరణంపై సాంకేతికత విధించే పరిమితులు
* ప్రస్తుత, భవిష్యత్తు తరాల మధ్య సమన్యాయం 
* అభివృద్ధిని ముందు తరాలకు కొనసాగించడం. అందుకే దీన్ని కొనసాగించగల అభివృద్ధి అని కూడా అంటారు.
    ఈ నివేదిక తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధిపై చర్చలు, అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. 1992లో బ్రెజిల్‌లోని రియో-డి-జెనీరోలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ధరిత్రీ సదస్సులో అజెండా - 21 పేరుతో 21వ శతాబ్దంలో సుస్థిరాభివృద్ధి సాధనకు సాధ్యాసాధ్యాలు, పరిమితులను చర్చించారు. తర్వాత 20 ఏళ్లకు రియో నగరంలోనే రియో + 20 పేరుతో 2012లో సుస్థిరాబివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సు జరిగింది. ఈ సదస్సులో గత అనుభవాలను సమీక్షించారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు - ప్రభావంపై అవగాహన ఏర్పడింది. దీని ఆధారంగానే పారిస్‌ ఒప్పందం (2016) అమల్లోకి వచ్చింది.

భారత్‌ పనితీరు 
    ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి సూచిక - 2019 ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో డెన్మార్క్‌ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అమెరికా 35, చైనా 39, భారత్‌ 115వ స్థానంలో ఉన్నాయి. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక - బేస్‌ లైన్‌ రిపోర్ట్, 2018 తొలి నివేదిక ప్రకారం 100 పాయింట్లకు మన దేశం 58 పాయింట్లు సాధించింది. ఈ లక్ష్యాల సాధనలో హిమాచల్‌ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. SDG India Index ను కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ, గ్లోబల్‌ గ్రీన్‌ గ్రోత్‌ సంస్థ, ఐక్యరాజ్య సమితి కలిసి రూపొందించాయి.

లక్ష్యాలు
    ఐక్యరాజ్య సమితి 2015 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన పర్యావరణ సదస్సులో 2015 - 30 మధ్యకాలంలో అన్ని దేశాలు సాధించాల్సిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఆమోదించింది. 
    1)  పేదరిక నిర్మూలన
    2) ఆకలి చావులను పూర్తిగా తగ్గించడం 
    3) మంచి ఆరోగ్యం  
    4) నాణ్యమైన విద్య
    5) లింగ సమానత్వం 
    6) పరిశుభ్రమైన నీరు, పరిసరాలు 
    7) పునరుజ్జీవన ఇంధన వాడకం 
    8) ఉపాధి, ఆర్థికవృద్ధి  
    9) పరిశ్రమలు, నూతన ఆవిష్కరణలు, అవస్థాపనా సౌకర్యాల కల్పన
    10) అసమానతల తగ్గింపు  
    11) సుస్థిర నగరాలు, సమాజాలు 
    12) బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి 
    13) వాతావరణ మార్పులపై చర్యలు 
    14) నీటిలోని ప్రాణుల సంరక్షణ
    15) నేలపై జీవుల రక్షణ
    16) శాంతి, న్యాయం 
    17) ఉమ్మడి లక్ష్యాల కోసం భాగస్వామ్యం. 
    సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థూలంగా 17గా విభజించినప్పటికీ అవి ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి సామాజిక, ఆర్థిక, పర్యావరణపరంగా సుస్థిరంగా ఉండాలి. మొదటిసారి ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో వాతావరణ కార్యాచరణ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు పలువురు నేతలు, పర్యావణ శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఇప్పటివరకు సుస్థిరాభివృద్ధి కోసం చేపట్టిన చర్యలను సమీక్షించారు. సుస్థిరాభివృద్ధి అంటే అసలైన అర్థం నాలుగు కాలాల పాటు కాదు నాలుగు తరాల పాటు అందరినీ సంతోషపెట్టేది. 
                 p - people; p - planet; p - prosperity; p - partnership; p - peace  అనే 5 P's ను సాధించడానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉపయోగపడతాయి. 2000-2015 మధ్య ఎనిమిది సహస్రాబ్ది లక్ష్యాలు ఉన్నాయి.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సహజ వనరులు - అభివృద్ధి

ప్రకృతి ప్రసాదించిన సమాజ సంపద

 

అవసరాలకు ఉపయోగపడే వాటిని వనరులు అంటారు. భూమి, నీరు, సూర్యకాంతి,  ఇనుము, బొగ్గు, ఏదైనా ప్రాజెక్టు, చివరికి ఒక మనిషి నైపుణ్యాన్ని కూడా వనరుగా పరిగణించవచ్చు. ప్రాంతాలు, వ్యక్తులు, దేశం, ప్రపంచం అభివృద్ధికి అవి అత్యంత కీలకం. వాటిలో సమాజానికి ప్రకృతి ప్రసాదించిన సంపద అయిన సహజ వనరుల ప్రాధాన్యాన్ని, సమర్థ వినియోగాన్ని పోటీ పరీక్షల కోసం అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

   

 

ఎకానమీ పరంగా వనరులను మూడు రకాలుగా విభజించారు. అవి 1. సహజ వనరులు 2. మానవ వనరులు, 3. మూలధన వనరులు లేదా మానవ నిర్మిత వనరులు.


సహజ వనరులు: ప్రకృతిలో లభించే వనరులన్నింటినీ సహజ వనరులు లేదా ప్రకృతి వనరులు అంటారు. వీటిని మళ్లీ రెండు రకాలుగా విభజిస్తారు. 1. పునరుద్ధరించగలిగిన వనరులు 2. పునరుద్ధరించలేని వనరులు.


వస్తుసేవల ఉత్పత్తిలో ఉపయోగించే పదార్థాలు, శక్తి లాంటి వాటిని సహజ వనరుల రూపంలో వాతావరణం అందిస్తుంది. మనిషి వినియోగించే అనేక వస్తువుల ఉత్పత్తికి అవసరమైన సహజ వనరులను, వాటి భాగాలను భూమి సమకూరుస్తుంది.


1) పునరుద్ధరించగలిగిన వనరులు: అడవులు, మొక్కలు, చేపలు లాంటి వాటిని తక్కువ కాలంలోనే సహజంగా పునరుద్ధరించవచ్చు. సూర్యరశ్మి, నీరు, వాయువు లాంటి వనరులు మానవుడు ఉపయోగిస్తున్నా నిరంతరం నాణ్యత, తరుగుదల లేకుండా లభిస్తూనే ఉంటాయి. ఈ వనరుల పునరుద్ధరణ రేటు కంటే వాటి వినియోగ రేటు తక్కువ ఉన్నంతవరకు వాటిని పునరుద్ధరించవచ్చు. ఈ వనరులు రెండు రకాలు.

* పరిమితంగా పునరుద్ధరించగలిగిన వనరులు: బొగ్గు నిల్వలు, చేపల ఉత్పత్తి మొదలైనవి.

* అపరిమితంగా పునరుద్ధరించగలిగిన వనరులు: సౌరశక్తి, వాయు శక్తి


2) పునరుద్ధరించలేని వనరులు: ప్రకృతిలోని వాతావరణంలో కొన్ని వనరులను పునరుద్ధరించడానికి వీలు కాదు. ఉదా: శిలాజ ఇంధన వనరులు

* సహజ వనరుల్లో భూవనరులు, ఖనిజ వనరులు, అటవీ వనరులు, జల వనరులు ముఖ్యమైనవి.


 

భూవనరుల లభ్యత

సహజసిద్ధంగా పరిమిత పరిమాణంలో, ప్రకృతిలో లభించే అన్నివనరుల సమూహాన్ని భూవనరులు అంటారు. నేటి కాలంలో ప్రకృతిలో లభించే ఖనిజాలు, అటవీ ఉత్పత్తులు, నీరు, నేల అన్నింటినీ కలిపి భూవనరులుగా పరిగణిస్తారు. భూగోళంలోని 20% శాతం భాగంలో భూవనరులు విస్తరించి ఉన్నాయని అంచనా.

 

భూవనరుల ఉపయోగాలు: * వ్యక్తులకు, సమాజాలకు భూమి సంపదగా ఉపయోగపడుతుంది.

* వ్యవసాయం, అనుబంధ వృత్తులైన పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, చేపల పెంపకం లాంటి కార్యకలాపాలు భూవనరుల లభ్యతపై ఆధారపడి ఉంటాయి.

* తయారీ, పరిశ్రమల్లో ఉపయోగించే అనేక ఖనిజాలు, లోహలు, భూగర్భం నుంచే వస్తాయి.

* పెరిగే జనాభాకు ఆహారం, ఉపాధిని భూమి కల్పిస్తుంది.

* వివిధ రవాణా సౌకర్యాలకు భూమి ఉపయోగపడుతుంది.

 

భారతదేశంలో భూమి వినియోగం: దేశంలో భూవినియోగ తీరు వ్యవస్థాపరమైన, శామ్రికుల మూలధన లభ్యత ప్రక్రియకు సంబంధించిందని చెప్పవచ్చు.

* భారత్‌లో మొత్తం భూ విస్తీర్ణం 328 మిలియన్‌ హెక్టార్లు (ప్రపంచంలో 7వ స్థానం)

* స్థూల సాగు నేల - 200.86 మి.హె.

* నికర సాగు నేల - 141.43 మి.హె.

* వ్యవసాయానికి ఉపయోగపడని భూమి 18%

* పచ్చిక మైదానాలు 10%

* బీడు భూములు 8%

* అటవీ భూమి 23.34%

* దేశ భూభాగంలో సాగునీటి వసతి ఉన్న భూమి 45% నుంచి 47%కు పెరిగింది.

* రెండు పంటలు పండే వ్యవసాయ భూమి 23%.

 

భూక్షీణతకు కారణాలు: భూవనరుల క్షీణత ముఖ్యంగా వ్యవసాయ వినియోగానికి సంబంధించినది.

* అదనంగా వ్యవసాయ భూమి కోసం నరికివేయడం.

* పేలవపరమైన వ్యవసాయ పద్ధతులు అవలంబించడం ద్వారా భూకాలుష్యాన్ని పెంచి, భూసారాన్ని రక్షించలేకపోవడం.

* భారీ యంత్రాలు, పనిముట్లు ఉపయోగించి నేలను దున్ని ఎండకు వదిలేయడం.

* అవసరానికి మించి పశుసంపదను పెంచడంతో పచ్చిక బయళ్లు తగ్గడం.

* పెరుగుతున్న పట్టణీకరణ, ప్లాస్టిక్‌ వినియోగం అధికంగా పెరగడం.

గత 60 సంవత్సరాల కాలంలో భూమి క్షీణత వల్ల నీరు, గాలి భూసార కోత వల్ల భూవనరుల నాణ్యత, ఉత్పాదకత తగ్గిపోతోంది. భూమిని సమర్థంగా వినియోగించడానికి తగిన వ్యూహాన్ని రూపొందించి అమలుచేయాలి. పారిశ్రామిక, పట్టణాభివృద్ధికి ఎంత భూమిని కేటాయించాలో హేతుబద్ధంగా నిర్ణయించాలి.

 

ఖనిజ వనరులు 

భూమి అంతర్భాగంలో లభించే ఖనిజాలు పునరుద్ధరించలేని సహజ వనరులు. అవి భౌతిక, నిర్జీవ పదార్థాలు. కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి జరుగుతున్న భౌగోళిక ప్రక్రియల వల్ల ఖనిజాలు ఏర్పడతాయి. ఖనిజాలను మూడు రకాలుగా వర్గీకరిస్తారు.1) లోహ ఖనిజాలు  2) అలోహ ఖనిజాలు  3) ఇంధన ఖనిజాలు


లోహ ఖనిజాలు: వీటిని ఫెర్రస్, నాన్‌ఫెర్రస్‌ ఖనిజాలుగా వర్గీకరించారు.

ఫెర్రస్‌: ఇనుము క్రోమియం, మాంగనీసు, నికెల్‌ మొదలైనవి.

నాన్‌ ఫెర్రస్‌: కాపర్, లెడ్, జింక్, అల్యూమినియం.

అలోహ ఖనిజాలు: మైకా, ఆస్‌బెస్టాస్, లైమ్‌స్టోన్, జిప్సం, డోలమైట్, సోడియం క్లోరైడ్, వజ్రాలు, బంగారం, వెండి, రత్నాలు.

ఇంధన ఖనిజాలు: బొగ్గు, లిగ్నైట్, చమురు, సహజ వాయువు, థోరియం, యురేనియం మొదలైనవి.

ఖనిజ వనరుల ఉపయోగం: * పారిశ్రామిక ముడి పదార్థాలుగా, ఇంధనాలుగా ఉపయోగపడతాయి.

* జీడీపీ వృద్ధికి ఖనిజ రంగం తోడ్పడుతుంది.

* గనుల రంగం లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది.

* విదేశీ మారక ద్రవ్య ఆర్జనకు ఉపయోగపడతాయి.

*  వెనుకబడిన రాష్ట్రాలు, ప్రాంతాలు, ఆదివాసీ ఆవాసాల వద్ద ఖనిజ వనరులు ఉంటాయి. గనుల తవ్వకం వల్ల ఈ ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది.

* మన దేశ జీడీపీలో ఖనిజాల వాటా సగటున 2% ఉంది. 2030లో ఈ వాటా 5% పెంచాలని లక్ష్యంగా ఉంది.

* మన దేశంలో 7 లక్షల మంది శ్రామికులకు గనుల రంగం ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తోంది.

* మన దేశం నుంచి బాక్సైట్, మైకా వంటి అనేక ఖనిజాలు ఎగుమతి అవుతున్నాయి.

 

ఖనిజ వనరుల వినియోగం: ఖనిజాల ఉత్పత్తిలో ప్రపంచంలోని మొదటి పది స్థానాల్లో భారతదేశం ఉంది. దేశంలో 89 ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు.

* 2021-22లో బెరైటీస్‌ ఉత్పత్తిలో మూడవ స్థానం.

* క్వానైట్, విండల్‌ సైట్, సిల్లమనైట్‌ ఉత్పత్తిలో నాలుగో స్థానం.

* ఇనుము, స్టీలు ఉత్పత్తిలో 5వ స్థానం.

* బాక్సైట్‌ ఉత్పత్తిలో ఆరో స్థానం.

* అల్యూమినియం ఉత్పత్తిలో ఎనిమిదో స్థానం.

* పెట్రోలు ఉత్పత్తిలో భారత్‌ 25వ స్థానంలో ఉంది.

* బొగ్గు నిక్షేపాలలో ప్రపంచంలో నాలుగో స్ధానం.(దేశంలోని 98% బొగ్గు నిక్షేపాలు బిహార్, బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిశా, గోదావరి ప్రాంతాల్లో, మిలిగిన 2% అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌లో లభిస్తున్నాయి.)

* లిగ్నైట్‌ ఖనిజం తమిళనాడు, పాండిచ్చేరి, రాజస్థాన్, గుజరాత్‌లో అధికం.

* ద్రవరూప బంగారంగా భావించే పెట్రోలు నిక్షేపాలు అస్సాం, గుజరాత్‌లో ఉన్నాయి. దేశంలో 13 పెట్రోలు రిఫైనరీలున్నాయి.

* ప్రపంచ ఇనుము నిక్షేపాలలో 6.6% మన దేశంలో ఉన్నాయి.

* 2020లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ‘సోన్‌భద్రా’ వద్ద 2,294 టన్నుల అతిపెద్ద బంగారం నిక్షేపాలను కనుక్కున్నారు.

* బంగారం ఉత్పత్తిలో 98% కర్ణాటకలోని కోలార్‌ గనుల నుంచి లభిస్తుంది.

* వెండి నిక్షేపాలు రాజస్థాన్‌లో అధికం

 

దేశంలో మైనింగ్‌ విధానం


1975లో మైనింగ్‌ అండ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌ చట్టం (MMRD) ను అమలుచేశారు. ఈ చట్టం ఖనిజ వనరులను రెండు రకాలుగా వర్గీకరించింది.

* మినరల్స్‌ (చమురు, సహజవాయువు తప్ప మిగిలిన ఖనిజాలు)

* మినరల్‌ ఆయిల్స్‌ (అన్నిరకాల చమురు, సహజ వాయువులు)

* 1988లో మినరల్‌ కన్జర్వేషన్‌ డెవలప్‌మెంట్‌ రూల్స్‌ను రూపొందించారు. 

* 1991లో నూతన ఆర్థిక విధానానికి అనుగుణంగా మైనింగ్‌ రంగంలో సరళీకరణ చేపట్టారు.

* 1999లో మైనింగ్‌ విధాన నియంత్రణలను ప్రవేశపెట్టారు.

* 2008లో జాతీయ ఖనిజ విధానం (NMP) రూపొందించారు.

* 2011లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ‘మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ యాక్ట్‌’గా ఆమోదించారు.

 

 

అటవీ వనరులు

అడవులు భూమి క్షీణతను నివారించి, జలవనరులను అభివృద్ధి చేస్తాయని, తద్వారా తాగునీటి సమస్య తీరుతుందని 12వ ప్రణాళిక ముసాయిదా పేర్కొంది.

* భారతీయ అటవీ నివేదిక - 2019 ప్రకారం దేశంలో మొత్తం అడవుల విస్తీర్ణం 7,12,249 చ.కి.మీ. (21.67%)

ఎ) దట్టమైన అడవులు - 99,278 చ.కి.మీ. (3.02%)

బి) మధ్యస్థ దట్టమైన అడవులు - 3,08,472 చ.కి.మీ. (9.38%)

సి) విస్తారమైన అడవులు - 3,04,499 చ.కి.మీ. (9.26%)

నోట్‌: అడవులు, చెట్లతో కలిపి అడవుల శాతం 24.56%

 

అటవీ విధానం - చట్టాలు

1) స్వాతంత్య్రానంతరం దేశంలో మొదటి అటవీ చట్టాన్ని 1952లో రూపొందించారు. ఈ విధానం ప్రకారం దేశ భూభాగంలో 33% అడవులు ఉండాలి. కొండలు, పీఠభూమి ప్రాంతాల్లో 60%, మైదాన ప్రాంతాల్లో 20% అడవులు ఉండాలని నిర్ణయించారు.

2) 1970లో అడవుల అభివృద్ధికి, భూమి కోత, వరదల నివారణ, కలప, పశుగ్రాసం, వంటచెరకు మొదలైన వాటికి దీర్ఘకాలిక చర్యలు చేపట్టారు.

3) 1976లో సామాజిక అడవుల పెంపకం చేపట్టాలని నిర్ణయించారు.

4) 1980లో అటవీ సంరక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం వల్ల అడవుల ఆక్రమణ 1.5 లక్షల హెక్టార్ల నుంచి 16,500 హెక్టార్లకు తగ్గింది.

5) 1985లో ‘నేషనల్‌ బోర్డ్‌ ఫర్‌ అన్‌యుటిలైజ్డ్‌ ల్యాండ్స్‌’ చట్టం చేశారు. దీని ద్వారా 95 మి.హె. నిరుపయోగంగా ఉన్న భూమిలో వంటచెరకు, పశుగ్రాసం పెంచాలని నిర్ణయించారు.

6) 1992లో National Afforestation and Forest Development Board (NAFDB) స్థాపించారు.

 

ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా - 2019 ప్రకారం భారతదేశంలో అడవులను 16 రకాలుగా వర్గీకరించారు.

* అటవీ విస్తీర్ణం పెరిగిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 

* పెద్ద అడవులున్న రాష్ట్రాలు: మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌.

* మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అధిక అడవుల వాటా ఉన్న రాష్ట్రాలు: మిజోరం (85.4%), అరుణాచల్‌ప్రదేశ్‌ (79.63%), మేఘాలయ (76.35%)

* అటవీ విస్తీర్ణం కోల్పోయిన రాష్ట్రాలు: మణిపుర్, అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరం.

* పంచవర్ష ప్రణాళికలో అడవులపై ప్రణాళిక వ్యయంలో కేవలం 0.5% - 1% మాత్రమే ఖర్చు చేశారు.

 

జలవనరుల లభ్యత

నీరు ఒక ముఖ్యమైన ప్రాణాధార శక్తి. ఆర్థికాభివృద్ధికి ముఖ్యమైన సాధనం. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ప్రధాన ఉత్పత్తి కారకం. సముద్రాలు, సరస్సులు, నదులు, కాలువలు, నేలలోని తేమ, వాతావరణంలోని నీటిఆవిరి, భూగర్భ జలాల మొత్తాన్ని ధరిత్రిపై ఉన్న జలవనరులు అంటారు. భూమి ఉపరితలంపై ప్రతి చదరపు సెంటిమీటర్‌కు సుమారు 273 లీటర్లు నీరు ఉంది. అయితే ఈ మొత్తంలో కేవలం 2.8% మాత్రమే మంచి నీరు ఉందని అంచనా.

* భారత్‌లో ఏటా సగటున 4000 బీసీఎం (బిలియన్‌ క్యూబిక్‌ మీటర్‌) అవపాతం (వర్షపు నీరు + మంచు) లభిస్తుంది. ఈ అవపాతం రాజస్థాన్‌లో 110 బీసీఎం కంటే తక్కువ ఉండగా, అస్సాంలో 2400 బీసీఎం కంటే ఎక్కువ లభిస్తుంది.

* కేంద్ర జల సంఘం లెక్కల ప్రకారం 2005లో దేశంలోని నదులన్నింటి పరీవాహక ప్రాంత విస్తీర్ణం 23.25 లక్షల చదరపు కి.మీ. వీటన్నింటిలో గంగానది పరీవాహక ప్రాంతం పెద్దది. సింధూ నది పరీవాహక ప్రాంతం (12.7%) రెండో స్థానం, గోదావరి పరీవాహక ప్రాంతం (12.3%) మూడో స్థానం, కృష్ణా నది పరీవాహక ప్రాంతం (10.25%) నాలుగో స్థానంలో ఉన్నాయి. అన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అధికంగా ఉన్నాయి. గంగానది పరీవాహక ప్రాంతంలో 41.66%, గోదావరి పరిధిలో 9.41%, సింధు నది పరిధిలో 6.13%, కృష్ణా పరీవాహక ప్రాంతంలో 6.11% భూగర్భజలాలున్నాయి.

 

జల సంఘం అంచనాల ప్రకారం 2025 - 2050 మధ్యకాలంలో వివిధ రంగాలకు అవసరమయ్యే జలవనరుల పరిమాణం. (బీసీఎంలలో)

* గృహ అవసరాల డిమాండ్‌: 73 - 102

* వ్యవసాయ రంగం డిమాండ్‌: 910 - 1072

* పారిశ్రామిక డిమాండ్‌: 23 - 63

* విద్యుత్‌ రంగ డిమాండ్‌: 15- 130

* ఇతర అవసరాల డిమాండ్‌: 7- 280

- 1945లో కేంద్ర జలసంఘం నాగ్‌పుర్‌లో ఏర్పాటైంది.

- 1956లో అంతర్‌రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం ప్రకారం ట్రిబ్యునల్స్‌ ఏర్పాటుచేశారు.

 

రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలు

* కావేరి జలాలు - తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి 

* కృష్ణా జలాలు - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర

* గోదావరి జలాలు - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్‌

* రావి, బియాస్‌ జలాలు - పంజాబ్, హరియాణా

* యమున జలాలు - హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌

* నర్మదా జలాలు - రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర

* మహదాయి జలాలు - గోవా, కర్ణాటక, మహారాష్ట్ర

నోట్‌: కృష్ణా ట్రిబ్యునల్స్‌(2) 1969, 2004లో ఏర్పాటయ్యాయి. గోదావరి ట్రిబ్యునల్‌ 1969లో ఏర్పాటైంది.

 

1983లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందం ద్వారా కృష్ణా మిగులు జలాలను తమిళనాడుకు మంచినీటి సరఫరా చేయడానికి, రాయలసీమకు సాగునీరు అందించటానికి తెలుగు గంగ ప్రాజెక్టు పథకం ప్రారంభించారు.

* మొదటి జాతీయ జలవిధానం 1987లో ప్రకటించారు. దీన్ని 2002, 2012లలో సమీక్షించి సవరణలు చేశారు.

 

జాతీయ జలవిధానం 2012లోని అంశాలు

నీటికి దేశ ఆర్థిక వస్తువుగా ప్రాధాన్యం కల్పించడం, ప్రైవేటు భాగస్వామ్యం కల్పించి జలవనరులను సంరక్షిస్తూ, సమర్థంగా వినియోగించడం దీనిలోని ముఖ్యాంశాలు.

* ప్రజలందరికీ కనిష్ఠ పరిమాణంలో నీరు లభించేలా చేయడం.

* వ్యవసాయ, విద్యుత్తు వినియోగంపై రాయితీని తగ్గించడం.

* జల క్రమబద్ధీకరణ అధికార వ్యవస్థను నెలకొల్పడం.

* నీటి వినియోగదారుల సంఘాలను బలోపేతం చేయడం.

* గ్రామీణ, పట్టణ నీటి సరఫరా మధ్య ఉన్న తేడాను తగ్గించడం.

* జాతీయ జలవ్యవస్థ చట్టాన్ని ప్రోత్సహించడం.

* నిర్వాసితుల కుటుంబాల పునరావాస వ్యయంలో కొంత భాగాన్ని ప్రాజెక్టుల వల్ల ప్రయోజనం పొందిన కుటుంబాల వారు భరించేలా చేయడం.


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో అపరిమితంగా పునరుద్ధరించగలిగే సహజ వనరు?

1) బొగ్గు      2) చేపలు      3) బంగారం      4) సౌరశక్తి


2. వ్యవసాయానికి ఉపయోగపడని భూమి ఎంత శాతం?

1) 8%       2) 18%       3) 10%       4) 20%


3. కిందివాటిలో భూవనరుల క్షీణతకు కారణం?

1) అడవులను నరికివేయడం            2) పేలవమైన వ్యవసాయ పద్ధతులు అవలంబించడం

3) అధికంగా పశుసంపద కలిగి ఉండటం         4) పైవన్నీ


4. కిందివాటిలో నాన్‌ఫెర్రస్‌ ఖనిజం కానిది? 

1) ఇనుము      2) కాపర్‌      3) జింక్‌       4) అల్యూమినియం


5. లిగ్నైట్‌ ఏ ఖనిజ సంపదకు ఉదాహరణ?

1) లోహ       2) అలోహ       3) ఇంధన       4) పైవన్నీ


6. పెట్రోల్‌ ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్‌ ఏ స్థానంలో ఉంది?

1) 20వ స్థానం      2) 10వ స్థానం       3) 25వ స్థానం      4) 15వ స్థానం


7. జాతీయ ఖనిజ విధానాన్ని ఎప్పుడు అమలు చేశారు?

1) 1975        2) 2008       3) 2010         4) 2011


8. అడవులు, చెట్లతో కలిపి దేశంలో అడవుల శాతం ఎంత?

1) 21.67%      2) 24.56%      3) 25.60%       4) 33%


9. 1952 అటవీ విధానం ప్రకారం మైదాన ప్రాంతాలలో ఎంత శాతం అడవులు ఉండాలి?

1) 66%       2) 60%       3) 20%         4) 25%


10. కేంద్ర జలసంఘం లెక్కల ప్రకారం విద్యుత్‌ శక్తి కోసం నీటికి డిమాండ్‌ ఎంత?

1) 15 బీసీఎం       2) 73 బీసీఎం        3) 7 బీసీఎం       4) 63 బీసీఎం

 

సమాధానాలు: 1-4,   2-2,   3-4,   4-1,   5-3,   6-3,   7-2,   8-2,   9-3,   10-1.

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 07-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మూలధన వనరులు

అధిక ఉత్పత్తికి.. ఆర్థిక ప్రగతికి!

 

ఒక బిజినెస్‌ పెట్టారు. అమ్మకాలు బాగా పెరిగాయి. వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలంటే ఉత్పత్తి పెంచాలి. అందుకోసం మరికొన్ని యంత్రాలు, భవనాలు, పరికరాలు, ఇతర మౌలిక సౌకర్యాలు కావాలి. వాటినే మూలధన వనరులు అంటారు. మరోవిధంగా చెప్పాలంటే ఒక సంస్థలోని వస్తుసేవల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగించే మానవ నిర్మిత ఆస్తులు లేదా వనరులే మూలధన వనరులు. వీటి వల్ల ఉత్పాతదకతోపాటు లాభాలూ పెరుగుతాయి. ఆర్థిక అభివృద్ధిలో అతి ముఖ్యమైన ఈ మూలధన వనరుల రకాలను, వాటి ప్రయోజనాలను, విత్త మార్కెట్ల వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 


ఆర్థికాభివృద్ధిలో మూలధనం కీలకం. ఆచార్య రాగ్నర్‌ నర్క్స్‌ ప్రకారం వెనుకబడిన దేశాలలో పేదరికపు విషవలయాలను ఛేదించాలంటే మూలధన సంచయనం అవసరం. పెట్టుబడి అంటే మార్కెట్ల నుంచి వాటాలు, బాండ్‌లు, డిబెంచర్లు, రుణాలు, సెక్యూరిటీల అమ్మకం మొదలైనవి. దీనినే విత్త పెట్టుబడి అని కూడా అంటారు.

* పెట్టుబడి ఒక ప్రవాహం, మూలధనం ఒక నిల్వ.

* ‘వాస్తవిక పెట్టుబడి అంటే ఉత్పత్తి సంస్థలు, యంత్రాలు, డ్యామ్‌లు, రోడ్లు, భవనాలు వంటి ప్రజా ఆస్తులు’ - జె.ఎమ్‌.కీన్స్‌

 

 

 

మూలధనం - ప్రయోజనాలు:

* అవస్థాపనా సదుపాయాలు పెరుగుతాయి.

* సాంకేతిక అభివృద్ధి జరుగుతుంది.

* జనాభా పెరుగుదలను ఎదుర్కొంటుంది.

* ఉద్యోగితను పెంచుతుంది.

* విదేశీ వ్యాపార లోటు తీరుస్తుంది.

* ద్రవ్యోల్బణాన్ని నివారిస్తుంది.

* ఆర్థిక సంక్షేమం పెరుగుతుంది.

మూలధనం - రకాలు:

మూలధనాన్ని రెండు రకాలుగా విభజిస్తారు.

మానవ మూలధనం: విద్య, వైద్యం, నైపుణ్యాలపై చేసే ఖర్చు.

భౌతిక మూలధనం: యంత్రాలు, ఫ్యాక్టరీలు, దీర్ఘకాలిక పెట్టుబడులు.

భౌతిక మూలధనం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.

1) పొదుపు

2) ఆర్థిక సంస్థలు (బ్యాంకులు)

3) ఉద్యమదారులు


పొదుపు: ఆర్థిక సంస్థల్లో జమ అయ్యి, ఉత్పత్తిదారులకు రుణం రూపంలో పెట్టుబడిగా లభిస్తుంది.

పొదుపు  పెట్టుబడి మూలధనం

పెట్టుబడి పెరిగే కొద్దీ మూలధన సంచయనం జరుగుతుంది.


మూలధననాన్ని సేకరించే మార్గాలు

1. దేశీయ మార్గాలు: పొదుపు, లోటు బడ్జెట్, దేశీయ రుణాలు, విదేశీ వాణిజ్యంలో మిగులు

2. విదేశీ మార్గాలు: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, సంస్థాగత పెట్టుబడుల్లో విదేశీ సంస్థల ఆర్థిక సహకారం

* దేశీయ మార్గాల ద్వారానే అధిక పెట్టుబడి లభిస్తుంది. దేశీయ మార్గాల్లో ముఖ్యమైనది పొదుపు. దేశీయ పొదుపును గ్రాస్‌ డొమెస్టిక్‌ సేవింగ్స్‌ (జీడీఎస్‌) అంటారు. ఈ పొదుపు 3 రకాలుగా జరుగుతుంది.1) గృహరంగాలు 2) కార్పొరేట్‌ రంగాలు 3) ప్రభుత్వ రంగం

గృహ రంగంలో 2 రకాలుగా పొదుపు చేస్తారు.

1. భౌతిక పొదుపు: బంగారం, వెండి వంటి లోహాలు, గృహ నిర్మాణాలు.వాటి రూపంలో ఉంటుంది.

2. విత్త పొదుపు: బ్యాంకుల్లో డిపాజిట్ల రూపేణా పొదుపు

భారత్‌లో విత్త పొదుపు 6.6%గా ఉంటే భౌతిక పొదుపు 10.6%గా ఉంది.

మూలధన సంచయనం: ఒక ఆర్థిక సంవత్సరంలో లభించిన స్థూల, స్థిర మూలధనాన్ని మూలధన సంచయనం అంటారు.

మూలధన సంచయనంలో అధికంగా 74% ప్రైవేటు రంగం కల్పిస్తే, 26% ప్రభుత్వ రంగం కల్పిస్తోంది.

 

విత్త మార్కెట్లు 

ఆర్థిక వ్యవస్థలో విత్త మార్కెట్లు ముఖ్యమైనవి. దేశంలోని పొదుపును సమీకరించి పెట్టుబడిగా తరలించడానికి విత్త మార్కెట్లు దోహదం చేస్తాయి. ఇవి రెండు రకాలు.

1) ద్రవ్య మార్కెట్‌

2) మూలధన మార్కెట్‌


ద్రవ్య మార్కెట్‌

 ఇది స్వల్పకాలిక మార్కెట్‌. ఇందులో మంజూరయ్యే రుణాల కాలవ్యవధి ఒక రోజు నుంచి ఒక సంవత్సరం వరకు ఉంటుంది. దీనిని స్వల్పకాలిక పరపతి మార్కెట్‌ అంటారు. ద్రవ్య మార్కెట్‌లో ప్రత్యక్షంగా ద్రవ్యం ఉండదు. సమీప ద్రవ్యంగా పిలిచే వర్తకపు బిల్లులు, ట్రెజరీ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రామిసరీ నోట్లు, బ్యాంకుల అంగీకార పత్రాలు మొదలైనవి ఉంటాయి. ఈ పత్రాలకు అధిక ద్రవ్యత్వం ఉంటుంది. ద్రవ్య మార్కెట్‌ స్థూలంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి 1) అసంఘటిత ద్రవ్య మార్కెట్‌ 2). సంఘటిత ద్రవ్య మార్కెట్‌


అసంఘటిత ద్రవ్య మార్కెట్‌: ఇది 3 రకాలు.

1. క్రమబద్ధీకరించని నాన్‌ బ్యాంకింగ్‌ విత్త సంస్థలు: 

ఉదా: విత్త కంపెనీలు, చిట్‌ఫండ్‌ కంపెనీలు, నిధి కంపెనీలు మొదలైనవి.


2. దేశీయ బ్యాంకర్లు: ప్రాచీన కాలం నుంచి దేశీయ బ్యాంకర్ల వ్యవస్థ ఉంది. ఇవి నాణేలను భద్రపరచి రుణాలుగా ఇచ్చేవి.

ఉదా: బెంగాల్‌లో జగత్‌ సేఠ్‌లు, పట్నాలో షాలు, సూరత్‌లో నాథ్‌జీ, అంబాజీలు: మద్రాస్‌లో చెట్టియార్లు


3) వడ్డీ వ్యాపారులు

సంఘటిత ద్రవ్య మార్కెట్‌: భారతీయ సంఘటిత ద్రవ్య మార్కెట్లో రిజర్వు బ్యాంకు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు సంఘటిత మార్కెట్‌లో ఉంటాయి.అందులో వివిధ రకాల ఉప మార్కెట్లు ఉంటాయి.


1. కాల్‌ మనీ మార్కెట్‌: ఇది ప్రధాన నగరాలైన ముంబయి, కోల్‌కత్తా, చెన్నై, దిల్లీ, అహ్మదాబాద్‌లలో ఎక్కువగా ఉంటుంది. 1970 నుంచి ఎల్‌ఐసీ, యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (యూటీఐ) ద్రవ్య మార్కెట్‌లో రుణదాతలుగా వ్యవహరించేవి. 1987లో వాఘల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ నివేదిక ప్రకారం నాన్‌ బ్యాంకింగ్‌ విత్త సంస్థలను కూడా రుణదాతలుగా అనుమతించారు.

* 1988లో ‘డిస్కౌంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ హౌస్‌ ఆఫ్‌ ఇండియా’ (డీఎఫ్‌హెచ్‌ఐ) నెలకొల్పారు.

 

2. ట్రెజరీ బిల్లుల మార్కెట్‌: ద్రవ్య మార్కెట్‌లో అత్యంత ప్రధానమైనది బిల్లుల మార్కెట్‌. ఈ మార్కెట్‌లో స్వల్పకాల వ్యవధి ఉన్న బిల్లుల క్రయవిక్రయాలు జరుగుతాయి. సాధారణ ట్రెజరీ బిల్లులకు 91 రోజుల కాలపరిమితి ఉంటుంది. వీటిని ఆర్‌బీఐ వాణిజ్య బ్యాంకులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, వాణిజ్య ప్రభుత్వ సంస్థలకు, విత్త సంస్థలకు విక్రయిస్తుంది.

1986లో 182 రోజుల ట్రెజరీ బిల్లులు, 1992లో 364 రోజుల ట్రెజరీ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. 1997లో 14 రోజుల ట్రెజరీ బిల్లులు వచ్చాయి. 2001లో వీటిని నిలిపివేశారు.

 

3. వాణిజ్య బిల్లుల మార్కెట్‌: ఒక వ్యాపార సంస్థ, మరొక వ్యాపార సంస్థ పేరు మీద విడుదల చేసే బిల్లులను వాణిజ్య బిల్లు అంటారు. సాధారణంగా దీని కాల వ్యవధి మూడు నెలలు ఉంటుంది. వాణిజ్య బిల్లులు అనేక రకాలుగా ఉన్నాయి. 1. డిమాండ్‌ బిల్లులు 2. కాలపరిమితి బిల్లులు 3. వ్యాపార బిల్లులు 4) విత్త బిల్లులు 5. దేశీయ బిల్లులు 6. విదేశీ బిల్లులు.

* భారతదేశంలో అనాదిగా ఆచరణలో ఉన్న వ్యాపార బిల్లులను హుండీలు అంటారు.

 

4) వాణిజ్య పత్రాలు: వాఘల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు మేరకు 1989, మార్చిలో రిజర్వ్‌ బ్యాంక్‌ వాణిజ్య పత్రాలను ప్రవేశపెట్టింది. కంపెనీలు జారీ చేసే వాణిజ్య పత్రాలు విలువ కనీసం రూ.కోటి ఉండాలి.

 

5) డిపాజిట్‌ సర్టిఫికెట్స్‌: వీటిని సిఫార్సు చేసినది వాఘల్‌ కమిటీ (1989). వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు తమ వద్ద ఉంచిన డిపాజిట్లపై బ్యాంకులు జారీ చేసే సర్టిఫికెట్స్‌ను డిపాజిట్‌ సర్టిఫికెట్‌లు అంటారు. 1991-92లో అఖిల భారత విత్త సంస్థలైన IDBI, ICICI, IFCIలు కూడా ఈ సర్టిఫికెట్స్‌ను జారీ చేయడానికి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది.

 

6) మ్యూచువల్‌ ఫండ్స్‌: ద్రవ్య మార్కెట్‌లో ‘మ్యూచువల్‌ ఫండ్స్‌’ని ఆర్బీఐ 1992 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టింది.

వ్యక్తిగత పెట్టుబడిదారులకు అదనపు స్పల్పకాలిక పెట్టుబడి అవకాశాన్ని ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం.

2007, మార్చి 7 నుంచి ద్రవ్య మార్కెట్, మ్యూచువల్‌ ఫండ్స్‌ను సెబీ నిబంధన పరిధిలోకి తెచ్చారు.


మూలధన మార్కెట్‌


పరిశ్రమలకు అవసరమైన దీర్ఘకాలిక మొత్తాన్ని సమకూర్చే మార్కెట్‌ను మూలధన మార్కెట్‌ అంటారు.

ప్రభుత్వ మార్కెట్‌ను Gilt Edge అని కూడా అంటారు. Gilt Edge అంటే ‘అత్యంత శ్రేష్టమైన బంగారంతో సమానం’ అని అర్ధం. మూలధన మార్కెట్‌ను నియంత్రించే సంస్థ సెబీ. భారతదేశంలో ‘సెబీ’ గుర్తించిన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు 23. వీటిలో శాశ్వతమైనవి 5. అవి.


1) అహ్మదాబాద్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌

2) బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌

3) కోల్‌కత్తా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌

4) మగధ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌

5) నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌

 


బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ):  ముంబయిలోని దలాల్‌ స్ట్రీట్‌లో 1875లో ప్రారంభమైంది. ఆసియాలో మొదటి, పురాతన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఇది. 1986లో Sensex (Sensitivity Index) పేరుతో ఒక సూచీని ప్రవేశపెట్టారు. 1978-79 దీని ఆధార సంవత్సరం. 30 కంపెనీల వాటాధరలను పరిగణిస్తూ భార సగటు పద్ధతిలో ప్రతి 15 సెకన్లకు ఒకసారి లెక్కిస్తారు. సూచీ జవాబును Points అంటారు. ప్రస్తుతం బీఎస్‌ఈ ఛైర్మన్‌ ఎస్‌ఎస్‌ ముంద్రా.


నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ): నాదకర్ణి కమిటీ సిఫార్సుతో 1992, నవంబర్‌ 1న ముంబయిలో ఎన్‌ఎస్‌ఈ ప్రారంభమైంది. UTI, IDBI, SBI, PNB, LIC మొదలైన ఆర్థిక సంస్థలు దీన్ని స్థాపించాయి. 1996 NIFTY (National Stock Exchange Fifty) పేరుతో సూచీ ప్రవేశపెట్టారు. 1995-96 దీని ఆధార సంవత్సరం. 50 కంపెనీల వాటాల ధరలను ప్రతి 15 సెకన్లకు ఒకసారి భార సగటు పద్ధతిలో లెక్కించి పాయింట్స్‌ ప్రకటిస్తారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈ ఛైర్మన్‌ ఆశీష్‌ కుమార్‌ చౌహాన్‌.


సెబీ (Securities and Exchange Board of India): షేర్వాణీ కమిటీ సిఫార్సుల మేరకు 1988లో బొంబాయిలో సెబీ ప్రారంభమైంది. 1992లో చట్టబద్ధత కల్పించారు. ఈ సంస్థ స్టాక్‌మార్కెట్‌ను క్రమబద్ధం చేస్తుంది. ప్రస్తుతం సెబీ ఛైర్మన్‌ మాధాబి పూరి బచ్‌.

 

షేర్‌ మార్కెట్‌ కుంభకోణాలు: 

*1991లో హర్షద్‌ మెహతా కుంభకోణంపై బీఎస్‌ఈ జానకీ రామన్‌ కమిటీని వేసింది.

*2001లో కేతన్‌ పరేఖ్‌ కుంభకోణంపై ‘ప్రకాష్‌ మణి త్రిపాఠి’ అధ్యక్షతన కమిటీ నియామకం.

Bull (బుల్‌): స్టాక్‌ మార్కెట్‌లో వాటాల ధరలు పెరుగుతుంటే బుల్‌ అంటారు.

Bear (బేర్‌): స్టాక్‌ మార్కెట్‌లో వాటాల ధరలు తగ్గితే బేర్‌ అంటారు.

స్టాక్‌ బ్రోకర్‌ : స్టాక్‌ మార్కెట్‌లో వాటాల కొనుగోలు, అమ్మకాలకు మధ్యవర్తిగా వ్యవహరించే వారిని బ్రోకర్‌ అంటారు. వీరు ప్రతి లావాదేవీపై కమిషన్‌ వసూలు చేస్తారు.

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 25-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మానవ వనరులు - జనాభా వృద్ధి రేటు

సాంద్రతలో ఉత్తరం.. నియంత్రణలో దక్షిణం!


ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. అయితే మన దేశమంతటా జనాభా విస్తరణ, జనన- మరణాల రేటు, ఆయుర్దాయం ఒకేవిధంగా లేవు. జనసాంద్రత విషయంలో మైదానాలకు, అటవీ, ఎడారి ప్రాంతాలకు అధిక వ్యత్యాసం కనిపిస్తోంది. సాంద్రత ఉత్తర భారత రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటే, నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు ఆదర్శంగా నిలిచాయి. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో లింగనిష్పత్తి మెరుగ్గా ఉంది. స్త్రీలలో విద్య, ఆర్థిక స్వాతంత్య్రం పెరిగిన చోట ప్రసూతి రేటు తగ్గుతోంది. ఇలాంటి లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వాలు నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. మానవవనరుల అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఈ వివరాలను గణాంకాల సహితంగా తెలుసుకోవాలి. 

 


ఒక నిర్దిష్ట ప్రదేశంలో రెండు కాలాల్లో పెరిగే జనాభాను జనాభా వృద్ధి అంటారు. జనాభా పెరుగుదలకు రెండు అంశాలు దోహదపడతాయి.

1) సహజ అంశాలు (జనన, మరణ రేట్లు) 2) వలసలు (వచ్చిన వలసలు, పోయిన వలసలు).

 

జనాభా వృద్ధి రేటును 3 రకాలుగా అంచనా వేస్తారు.

1) సహజ వృద్ధి రేటు = జనన రేటు - మరణ రేటు

2) వలస వృద్ధి రేటు = వలస వచ్చినవారు - వలస వెళ్లినవారు.

3) వాస్తవ వృద్ధి రేటు = (జనన రేటు + వలస వచ్చినవారు), (మరణ రేటు + వలస వెళ్లినవారు)


ఈ జనాభా వృద్ధిని 10 సంవత్సరాలకు లెక్కిస్తే దశాబ్ద వృద్ధి రేటు అని, సంవత్సరానికి లెక్కిస్తే వార్షిక వృద్ధి రేటు అని అంటారు. రెండు కాలాల మధ్య పెరిగితే ధనాత్మక జనాభా వృద్ధి రేటు అని, రెండు కాలాల మధ్య జనాభా తగ్గితే రుణాత్మక జనాభా వృద్ధి రేటు అని అంటారు.


జనాభా వృద్ధి రేటు = ((ప్రస్తుత సంవత్సరం జనాభా - గత సంవత్సరం జనాభా)/గత సంవత్సర జనాభా) x 100

జనాభా వృద్ధి రేటు అన్ని దశాబ్దాల్లో ఒకేవిధంగా లేదు. 

ఉదా: 1941-1951 మధ్య వార్షిక రేటు 1.25%గా ఉంటే, 1951-61 మధ్య 1.96%గా ఉంది. 1991-2001 మధ్య 1.97%, 2001- 2011 మధ్య 1:64%గా నమోదైంది.

భారతదేశంలో 1921లో రుణాత్మక వృద్ధిరేటు నమోదు కాగా, 1971లో అధిక వృద్ధి రేటు (24.8%) నమోదైంది.

- 2001- 2011 మధ్య పురుష జనాభా వృద్ధి రేటు 17.1%. స్త్రీ జనాభా వృద్ధి రేటు 18.3%.

- గ్రామీణా జనాభా వృద్ధి రేటు 12.3%. పట్టణ జనాభా వృద్ధి రేటు 31.8%.

- గ్రామాల్లో స్త్రీ జనాభా వృద్ధి కంటే పురుష జనాభావృద్ధి తక్కువ. పట్టణాల్లో ఇది విరుద్ధంగా ఉంది.

 

అధిక జనాభా వృద్ధి రేటున్న రాష్ట్రాలు: మేఘాలయ - 27.9%, అరుణాచల్‌ప్రదేశ్‌ - 26.03%, బిహార్‌ - 25.4%; 

కేంద్రపాలిత ప్రాంతాలు: దాద్రానగర్‌ హవేలీ - 55.9%, డామన్‌ డయ్యూ - 53.8%, పుదుచ్చేరి - 28.1%.

అల్ప జనాభా వృద్ధి ఉన్న రాష్ట్రాలు: నాగాలాండ్‌ - -0.6%, కేరళ - 4.9%, గోవా - 8.2%; 

కేంద్రపాలిత ప్రాంతాలు: లక్షదీవులు - 6.3%, అండమాన్‌ నికోబార్‌ దీవులు - 6.9%, చండీగఢ్‌ - 17.2%.

* 2001లో అధిక జనాభా వృద్ధి రేటు ఉన్న నాగాలాండ్‌ (64.5%), 2011 వచ్చేసరికి రుణాత్మక వృద్ధి రేటు సాధించడం విశేషం.

* 2011లో అధిక జనాభావృద్ధి ఉన్న జిల్లా కురుంగ్‌కుమె (111%) (అరుణాచల్‌ ప్రదేశ్‌).

* తక్కువ జనాభా వృద్ధి ఉన్న జిల్లా - లాంగ్‌లెంగ్‌ (-58%) (నాగాలాండ్‌)

 

జనసాంద్రత

ఒక చదరపు కిలోమీటరుకు నివసించే జనాభాను జనసాంద్రత అంటారు.

జనసాంద్రత = మొత్తం జనాభా/మొత్తం విస్తీర్ణం

* ఉత్తర భారతదేశంలో సారవంతమైన నేలలు, గంగానది పరీవాహక ప్రాంతం వల్ల అధిక జనసాంద్రత కనిపిస్తుంది. ఉదా: పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పంజాబ్‌.

* హిమాలయ పర్వత ప్రాంతాలు, అడవి, ఎడారి ప్రాంతాలు నివాసానికి అనుకూలంగా లేకపోవడం వల్ల, తక్కువ జనసాంద్రత ఉంటుంది.

ఉదా: అరుణాచల్‌ ప్రదేశ్, మిజోరాం, సిక్కిం, మణిపుర్‌.

* అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రాల్లో కేరళ తప్ప అన్నీ ఉత్తర భారతదేశ రాష్ట్రాలే.

* తక్కువ జనసాంద్రత ఉన్న రాష్ట్రాలన్నీ ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలే.

 

అధిక జనసాంద్రత రాష్ట్రాలు: బిహార్‌ - 1106 మంది, పశ్చిమ బెంగాల్‌ - 1028, కేరళ - 860 


కేంద్రపాలిత ప్రాంతాలు: దిల్లీ - 11,320, చండీగఢ్‌ - 9,258.


అల్ప జనసాంద్రత ఉన్న రాష్ట్రాలు: అరుణాచల్‌ప్రదేశ్‌ - 17, మిజోరం - 52, సిక్కిం - 86; 


కేంద్రపాలిత ప్రాంతాలు: అండమాన్‌ నికోబార్‌ దీవులు - 46, దాద్రానగర్‌ హవేలీ - 700.


* 2011 లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత ఉన్న జిల్లా - నార్త్‌ఈస్ట్‌ దిల్లీ (37,346 మంది). తక్కువ జనసాంద్రత ఉన్న జిల్లా - దిబాంగ్‌ వ్యాలీ (1) (అరుణాచల్‌ప్రదేశ్‌)

 

లింగ నిష్పత్తి

ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో లెక్కించడాన్ని స్త్రీ, పురుషుల నిష్పత్తి లేదా లింగ నిష్పత్తి అంటారు. ఇది స్త్రీ, పురుషుల సమానత్వానికి సామాజిక సూచిక.

లింగ నిష్పత్తి = మహిళల సంఖ్య / పురుషుల సంఖ్య

స్వాతంత్య్రం నాటి లింగ నిష్పత్తితో పోలిస్తే నేటికీ ఈ నిష్పత్తి తక్కువగానే ఉంది. 


కారణాలు:

* పురుషుల కంటే స్త్రీలలో మరణాల రేటు అధికంగా ఉండటం.

* ఆడ శిశువుల జననం పట్ల అశ్రద్ధ.

* అధిక పేదరికం.

* ఆడపిల్లలను భారంగా భావించడం.

* కౌమార దశలో సమస్యల వల్ల స్త్రీ మరణాలు పెరగడం.

* కాన్పు సమయంలో స్త్రీలు అధికంగా చనిపోవడం.

* బాలికల్లో శిశుమరణాలు రేటు అధికంగా ఉండటం.

* లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా భ్రూణహత్యలు పెరగడం.

* 1971లో ప్రవేశపెట్టిన గర్భస్రావక చట్టం ద్వారా కూడా భ్రూణహత్యలు పెరిగాయి.

* స్త్రీ సాధికారత పట్ల శ్రద్ధ వహించకపోవడం.

* భారత్‌లో తగ్గుతున్న స్త్రీలను అమర్త్యసేన్‌ ‘Missing women in India' అని వ్యాఖ్యానించారు.

 

అధిక లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రాలు:            

1. కేరళ 1084                                       

2. తమిళనాడు 996                                 

3. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 993                         

(నోట్‌ : నవ్యాంధ్రప్రదేశ్‌ 997)                         

కేంద్రపాలిత ప్రాంతాలు                                  

1. పుదుచ్చేరి 1037                                 

2. లక్షదీవులు 947                                 

3. అండమాన్‌ నికోబార్‌ దీవులు 876               

 

తక్కువ లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రాలు

1. హరియాణా 879

2. జమ్మూ- కశ్మీర్‌ 889

3. సిక్కిం 890

4. పంజాబ్‌ 895

కేంద్రపాలిత ప్రాంతాలు    

1. డామన్‌ డయ్యూ  618

2. దాద్రానగర్‌ హవేలి - 774

3. చండీగఢ్‌  818

 

* లింగ నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లా పుదుచ్చేరిలోని ‘మహె‘ (1176 మంది), తక్కువగా ఉన్న జిల్లా డామన్‌ డయ్యూలోని డామన్‌ (533).

* అభివృద్ధి చెందిన దేశాల్లో లింగ నిష్పత్తి అధికంగా ఉంటుంది. ఉదా: జపాన్‌ (1055), అమెరికా (1025)

 

పిల్లల లింగ నిష్పత్తి

0-6 సంవత్సరాల మధ్య ప్రతి 1000 మంది బాలురకు, ఎంతమంది బాలికలు ఉన్నారో తెలియజేసేది పిల్లల లింగ నిష్పత్తి.


సంవత్సరం        పిల్లల లింగనిష్పత్తి

1961                  - 976 

1991                  - 945

2001                 - 927

2011                 - 918


* పట్టణాల్లో పిల్లల లింగనిష్పత్తి 905, గ్రామాల్లో 923.

* జమ్ము-కశ్మీర్‌లో పిల్లల లింగ నిష్పత్తి గణనీయంగా తగ్గింది.

* ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌ల్లో ఈ నిష్పత్తి తగ్గితే, హరియాణా, పంజాబ్‌లో పెరిగింది.

 

అధికంగా ఉన్న రాష్ట్రాలు                     

1) అరుణాచల్‌ప్రదేశ్‌ - 972                   

2) మేఘాలయ 970                         

3) మిజోరం 970                             

కేంద్ర పాలిత ప్రాంతాలు                     

1) అండమాన్‌ దీవులు 968                 

2) పుదుచ్చేరి 967                          

3) దాద్రానగర్‌ హవేలీ 926                   

 

తక్కువ ఉన్న రాష్ట్రాలు

1) హరియాణా 834

2) పంజాబ్‌ 846

3) జమ్ము- కశ్మీర్‌ 862

కేంద్ర పాలిత ప్రాంతాలు

1) దిల్లీ  871

2) చండీగఢ్‌ 880

3) డామన్‌ డయ్యూ 904

 

బాలికలు తగ్గడానికి కారణాలు: * ఎక్కువమంది మగ పిల్లలనే కావాలనుకోవడం.* భ్రూణ హత్యలకు పాల్పడటం.* శైశవ, బాల్య దశలో ఆడపిల్లలు చనిపోవడానికి కారణం సురక్షితమైన నీరు లేకపోడం, పారిశుద్ధ్యం లోపించడం, వైద్య సదుపాయాల కొరత.


బాలికల సంఖ్య పెంచేందుకు కేంద్రం ప్రారంభించిన పథకాలు:

1) బేటీ బచావో బేటీ పఢావో: ఈ పథకాన్ని 2015, జనవరి 22లో హరియాణాలోని పానిపట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీన్ని 3 మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తాయి. అవి 1) మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 3) మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

సామూహిక ప్రచారం: ఇందులో బాలికల జననాలు, వారి ఎదుగుదల, స్త్రీ సాధికారత లాంటి అంశాలతో ప్రచారం చేస్తారు. మొదట 100 జిల్లాల్లో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు.

వివిధ విభాగాల భాగస్వామ్యం (మల్టీ సెక్టోరల్‌ యాక్షన్‌): బాలికలకు వైద్యం, రక్షణ వంటి అంశాలపై మూడు మంత్రిత్వ శాఖలు చర్యలు తీసుకుంటాయి. దీనిని మొదట 161 జిల్లాల్లో ప్రారంభించారు. ప్రస్తుతం 640 జిల్లాల్లో అమలు చేస్తున్నారు.

సుకన్య సమృద్ధి యోజన: ఈ పథకాన్ని 2015, జనవరి 22న ప్రారంభించారు. ఇందులో కనీస డిపాజిట్‌ రూ. 250 అయితే, గరిష్ఠం రూ.1,50,000. పదేళ్ల లోపు వయసున్న బాలికలంతా అర్హులు. అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చిన ఈ ఖాతా ముగుస్తుంది. 18 సంవత్సరాల తర్వాత ఉన్నత విద్య కోసం కొంతమొత్తాన్ని ఈ ఖాతా నుంచి తీసుకోవచ్చు. 21 లేదా 18 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటే, ఖాతాలో ఉన్న నగదును తీసేసుకోవచ్చు. ఈ ఖాతాపై ఇచ్చే వడ్డీ రేటు 7.6%.

 

జననాల రేటు: ప్రతి 1000 మంది జనాభాకు ఎంతమంది జన్మిస్తున్నారో ఇది తెలియజేస్తుంది.

జనన రేటు = సంవత్సరంలో సజీవ జననాల సంఖ్య/సంవత్సరం మధ్య జనాభా × 1000

 

మరణాల రేటు: ప్రతి 1000 మంది జనాభాకు ఎంతమంది చనిపోతున్నారో ఇది తెలియజేస్తుంది.

మరణ రేటు = సంవత్సరంలో మరణాల సంఖ్య /సంవత్సరం మధ్య జనాభా × 1000

* ఒక దేశ జనాభా జనన, మరణ రేట్ల మధ్య తేడాను డెమోగ్రాఫిక్‌ గ్యాప్‌ అంటారు.

జనన రేటు కేరళలో తక్కువగా, బిహార్‌ అధికంగా ఉంది. మరణ రేటు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో తక్కువగా, ఒడిశాలో ఎక్కువగా నమోదైంది.

 

శిశు మరణాల రేటు:  ప్రతి 1000 మంది జననాలకు మొదటి పుట్టినరోజు కూడా చూడకుండా చనిపోయే శిశువుల సంఖ్యను శిశుమరణాల రేటు (IMR) అంటారు. 20వ శతాబ్దం మొదటి దశకంలో శిశు మరణాల రేటు 218గా ఉండేది. 2018 నాటికి 32కి తగ్గింది. మశూచిని పూర్తిగా నిర్మూలించడం, ఇతర అంటువ్యాధుల్ని తగ్గించడంతో ఈ పురోగతి నమోదైంది. దేశంలో గ్రామాల కంటే పట్టణాల్లోనే శిశుమరణాల రేటు తక్కువ.

పెద్ద రాష్ట్రాల్లో అధిక శిశు మరణాల రేటు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్‌ (48), తక్కువ ఉన్న రాష్ట్రం కేరళ (7). చిన్న రాష్ట్రాల్లో శిశు మరణాల రేటు ఎక్కువ ఉన్న రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌ (37), తక్కువ ఉన్న రాష్ట్రం నాగాలాండ్‌ (4). అధిక శిశు మరణాల రేటు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం డామన్‌ డయ్యూ (16), తక్కువ ఉన్నది అండమాన్‌ దీవులు (9).


ప్రసూతి మరణ రేటు: ప్రతి లక్ష మందిలో సంవత్సరానికి చనిపోయే తల్లుల సంఖ్యను ప్రసూతి మరణరేటు (MMR) అంటారు. 2011లో దేశంలో ఎంఎంఆర్‌ రేటు 112. అధికంగా ఎంఎంఆర్‌ ఉన్న రాష్ట్రం అస్సాం (215), అల్పంగా ఉన్న రాష్ట్రం కేరళ (43). ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎంఆర్‌ 65, తెలంగాణలో 63.


ఎంఎంఆర్‌ను తగ్గించేందుకు పథకాలు:

1) 2005లో ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌ (NRHM)

2) 2005లో జనసంఖ్య స్థిర కోష్‌ (JSK)

3) 2011లో ప్రారంభించిన జననశిశు సురక్షా కార్యక్రమం ((JSSK)

4) పోషణ అభియాన్‌

5) ప్రధానమంత్రి సురక్షిత్‌ మాతృత్వ అభియాన్, ప్రధానమంత్రి మాతృ వందన యోజన.

*2030 నాటికి ఎంఎంఆర్‌ని 70 దిగువకు తేవడమే ఈ పథకాల లక్ష్యం.


మొత్తం ప్రసూతి రేటు: ఒక స్త్రీ తన పునరుత్పాదక వయసులో ఎంతమంది పిల్లలకు జన్మ ఇస్తుందో తెలియజేసేదాన్ని మొత్తం ప్రసూతి రేటు (TFR) అంటారు. స్త్రీ విద్యాస్థాయి పెరిగే కొద్ది టీఎఫ్‌ఆర్‌ తగ్గుతుంది.

ఇది 1961లో 5.9, 1971లో 5.4, 1981లో 4.6, 1991లో 3.8, 2001లో 3.1, 2011లో 2.7 గా ఉంది.  

అధిక టీఎఫ్‌ఆర్‌ ఉన్న రాష్ట్రం బిహార్‌ (3), తక్కువ ఉన్నది సిక్కిం (1).

 

ఆయుర్దాయం: సగటున ఒక వ్యక్తి జీవించే కాలాన్ని ఆయుర్దాయం అంటారు. దీన్ని నిర్ణయించే అంశాలు. 1) ఆరోగ్య సదుపాయాలు 2) పౌష్టికాహార లభ్యత 3) తక్కువ శిశు మరణాల రేటు. 

* 1951లో భారత్‌లో సగటు ఆయుర్దాయం 32 సంవత్సరాలు ఉంటే 2013-77 మధ్యకాలంలో 69 సంవత్సరాలకు చేరింది. 

* పురుష సగటు ఆయుర్దాయం 67.8 ఏళ్లు, స్త్రీల ఆయుర్దాయం 70.4. 

* గ్రామాల్లో ఇది 67.7 సంవత్సరాలు కాగా పట్టణాల్లో 72.4 ఏళ్లు.

* అధిక ఆయుర్దాయం ఉన్న రాష్ట్రం కేరళ (75.3), అల్ప ఆయుర్దాయం ఉన్న రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌ (65.2).

రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 27-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మాన‌వ వ‌న‌రులు - వృత్తులవారీ వ్య‌వ‌స్థ‌

దేశ ప్రగతికి మేలైన మూలధనం!

 

  దేశ నిర్మాణానికి, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మానవ వనరులే అత్యంత కీలకం. విద్యావంతులు, నైపుణ్యం ఉన్నవారు, ఆరోగ్యవంతులైన శ్రామికులతో వ్యవస్థాగత అభివృద్ధి, మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. శ్రామిక శక్తి సామర్థ్యాలపైనే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల పురోగతి ఆధారపడి ఉంటుంది.అందుకే ఆ మానవ వనరులను నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తుంటాయి.ఈ వివరాలపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి.

 

  ఆర్థిక వ్యవస్థలో వివిధ వృత్తుల్లో పనిచేసే జనాభా వివరాలను తెలియజేసేదే వృత్తులవారీ వ్యవస్థ. దాని ప్రాతిపదికన ఆర్థిక వ్యవస్థను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా విభజించారు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి తొలి దశలో ఎక్కువగా శారీరక శ్రమ చేసే పనివారు ఉంటారు. తర్వాతి దశలో సేవా రంగం విస్తరించి సేవా శ్రామికులు అధికమవుతారు. 20వ శతాబ్దం మధ్యకాలం వరకు శ్రామికులు చేసే పనులు, అవసరాలకు అనుగుణంగా వారి యూనిఫాం ఉండేది. శ్రామికుల సమూహాలను మూడు పెద్ద విభాగాలుగా వర్గీకరిస్తారు. అవి 1) బ్లూ కాలర్‌ శ్రామికులు 2) వైట్‌ కాలర్‌ శ్రామికులు 3) ప్రత్యేక ఆధారిత శ్రామికులు.

 

బ్లూ కాలర్‌ శ్రామికులు: చేసే పని వల్ల అయ్యే మురికి, మాలిన్యాలు కనిపించకుండా దుస్తులు ధరించే వారిని బ్లూ కాలర్‌ శ్రామికులు అంటారు. వీరు శారీరక శ్రమ చేస్తుంటారు. ఇందులో రెండు ఉప విభాగాలున్నాయి. 

 

ఎ) స్కార్‌లెట్‌ కాలర్‌ శ్రామికులు ఉదా: దుకాణాలలో పనిచేసేవారు (మహిళలు)

 

బి) నలుపు కాలర్‌ శ్రామికులు ఉదా: బొగ్గు గనులు, చమురు పరిశ్రమల్లో పనిచేసేవారు

 

వైట్‌ కాలర్‌ శ్రామికులు: వీరు కార్యాలయాల్లో పనిచేస్తుంటారు. ఇందులో నాలుగు రకాల వారున్నారు.

 

ఎ) పింక్‌ కాలర్‌ శ్రామికులు 

ఉదా: ఆఫీసులో గుమాస్తాలు

 

బి) గ్రే కాలర్‌ శ్రామికులు

ఉదా: ఐటీ రంగంలో పనిచేసేవారు

 

సి) గోల్డ్‌ కాలర్‌ శ్రామికులు 

ఉదా: డాక్టర్లు, ఇంజినీర్లు (అధిక డిమాండ్‌ ఉన్నవారు)

 

డి) రెడ్‌ కాలర్‌ శ్రామికులు 

ఉదా: సూర్యకాంతి కింద పనిచేసేవారు- వ్యవసాయం తదితరాలు

 

ప్రత్యేక ఆధారిత శ్రామికులు: వీరిని తిరిగి మూడు రకాలుగా వర్గీకరించారు. 

 

ఎ) గ్రీన్‌ కాలర్‌ శ్రామికులు 

ఉదా: పర్యావరణ పరిరక్షణ పనులు చేసేవారు.

 

బి) ఎల్లో కాలర్‌ శ్రామికులు 

ఉదా: ఫొటోగ్రాఫర్లు, ఫిల్మ్‌ మేకర్లు.

 

సి) ఆరెంజ్‌ కాలర్‌ శ్రామికులు 

ఉదా: నిర్మాణ పనులు, పారిశుద్ధ్య పనులు చేసేవారు.

 

శ్రామిక శక్తి

   శ్రమ అనేది ప్రాథమిక ఉత్పత్తి కారకం. శ్రామిక శక్తి పరిమాణం ఆర్థిక కార్యకలాపాల స్థాయిని నిర్ణయిస్తుంది, 15 - 59 ఏళ్ల వయసున్న జనాభాపై ఆధారపడుతుంది. 15 ఏళ్లలోపున్న పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులను ఉత్పాదక కార్యకలాపాల లెక్కల్లోకి తీసుకోరు. వారిని అనుత్పాదక జనాభాగా పరిగణిస్తారు.

* మన దేశంలో 1971 - 2011 మధ్య నాలుగు దశాబ్దాల్లో శ్రామిక శక్తి 18 కోట్ల నుంచి 46 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో దేశ జనాభా సగటు వార్షిక వృద్ధి రేటు 2% ఉంటే శ్రామికశక్తి వృద్ధిరేటు 2.48% ఉంది. 2011 తర్వాత 1.82 శాతానికి తగ్గింది.

* శ్రామికశక్తిలో ప్రధాన శ్రామికులు, ఉపాంత శ్రామికులు ఉంటారు. ఒక ఆర్థిక సంవత్సరంలో 183 రోజులకు మించి ఉపాధి పొందేవారు ప్రధాన శ్రామికులు. 183 రోజులకంటే తక్కువ రోజులు ఉపాధి పొందేవారు ఉపాంత శ్రామికులు.

* 1971లో ప్రధాన శ్రామికులు 96.8% కాగా ఉపాంత శ్రామికులు 3.2%.

* 2011లో ప్రధాన శ్రామికులు 75.2%, ఉపాంత శ్రామికులు 24.8%. ప్రధాన శ్రామికుల్లో పురుషులు 75.4%, మహిళలు 24.6%.

* 1971లో గ్రామీణ శ్రామికులు 82.5% ఉంటే 2011 నాటికి 77.4%కి తగ్గారు.

* 1971లో మొత్తం శ్రామిక జనాభాలో పురుషులు 79.9% ఉండగా, 2011 నాటికి 68.9 శాతానికి తగ్గారు. మహిళా శ్రామికులు 20.1% నుంచి 31.1 శాతానికి పెరిగారు.

వృత్తులవారీ జనాభా విభజనను నిర్ణయించే అంశాలు: 1) భౌగోళిక అంశాలు 2) ఉత్పాదక శక్తుల అభివృద్ధి 3) ప్రత్యేకీకరణ 4) తలసరి ఆదాయ స్థాయిలో మార్పు

* వ్యవసాయ రంగంలో ఎక్కువ శాతం శ్రామికులు పనిచేస్తుంటే వాస్తవిక తలసరి ఆదాయం అల్పస్థాయిలో ఉంటుంది. అదే ద్వితీయ, తృతీయ రంగాల్లో ఎక్కువ మంది పనిచేస్తుంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. - కొలిన్‌క్లార్క్‌

* అభివృద్ధి జరిగే కొద్దీ ఉద్యోగిత, పెట్టుబడులు ప్రాథమిక రంగం నుంచి ద్వితీయ, తృతీయ రంగాలకు తరలిపోతాయి. -ఏజీబీ ఫిషర్‌

* అభివృద్ధి జరిగేటప్పుడు వ్యవసాయంపై ఆధారపడిన శ్రామికులు తర్వాత పారిశ్రామిక, సేవా రంగాలకు వెళ్లిపోతారు. -సైమన్‌ కుజినెట్స్‌

 

మానవ వనరులు - విద్య

 

  పశ్చిమ దేశాల్లో సాధారణ మూలధనం కంటే మానవ మూలధనం వల్లే ఉత్పత్తి ఎక్కువగా పెరుగుతున్న విషయాన్ని గమనించవచ్చు. విద్య, నైపుణ్యాలు, ఆరోగ్య సేవలు మానవ మూలధనానికి దోహదపడుతాయి. థియోడర్‌ షుల్జ్‌ ప్రకారం విద్యలో పెట్టుబడి మానవ మూలధన కల్పనను పెంచుతుంది.

భారతదేశంలో విద్యావిధానం: రాజ్యాంగంలో 45వ అధికరణ ప్రకారం 14 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ సార్వత్రిక, ప్రాథమిక విద్య అందించాలి. దేశంలో 1950 దశకం ప్రారంభం నుంచి మూడు దశాబ్దాల వరకు విద్యపై వ్యయం జీడీపీలో శాతంగా చూస్తే స్తబ్దుగా ఉంది. 1952 - 53 మాధ్యమిక విద్యపై మొదలియార్‌ కమిషన్‌ ఏర్పాటైంది. 1964లో విద్యపై నియమించిన డి.ఎస్‌.కొఠారి కమిషన్‌ 1966లో నివేదిక అందజేసింది. విద్యపై ప్రభుత్వ పెట్టుబడి జీడీపీలో 6% ఉండాలని ఈ కమిషన్‌ కీలక సూచన చేసింది.  1968లో జాతీయ విద్యా విధానం ప్రకటించారు. నేడు అమలవుతున్న 10 + 2 + 3 విద్యావిధానాన్ని ఈ కమిటీనే సూచించింది. 1951లో అక్షరాస్యత 18% ఉండగా, 2011 నాటికి 73 శాతానికి పెరిగింది.

 

విద్యాహక్కు చట్టం: 6 నుంచి 14 సంవత్సరాల్లోపు పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా మారుస్తూ 86వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. దీనికి అనుగుణంగా ఆర్టికల్‌ 21-ఎ నిబంధనను రాజ్యాంగంలో చేర్చారు. 2009లో చట్టం అయినప్పటికీ 2010, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

 

ముఖ్యాంశాలు: * 6 నుంచి 14 సంవత్సరాల్లోపు వయసున్న పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను సమీప పాఠశాలలో అందించాలి. 

* సమీపంలో పాఠశాల లేకపోతే మూడేళ్లలో ఏర్పాటు చేయాలి. 

* ఉపాధ్యాయులు ప్రైవేటు ట్యూషన్‌లు చెప్పకూడదు. 

* పాఠశాల ప్రవేశ సమయంలో క్యాపిటేషన్‌ ఫీజు తీసుకోకూడదు.

 

2020 జాతీయ విద్యావిధానం: ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరి రంగన్‌ నేతృత్వంలో కొత్త జాతీయ విద్యావిధానం ముసాయిదాను కేంద్రానికి సమర్పించారు.

 

ముఖ్యాంశాలు: 1) 2030 నాటికి పాఠశాల విద్యలో 100% స్థూల నమోదు నిష్పత్తి సాధించాలి.

 

2) సార్వత్రిక అందుబాటు, ఓపెన్‌ పాఠశాలల విస్తరణ ద్వారా 2 కోట్ల మంది పిల్లలను స్కూలుకి తీసుకురావాలి.

 

3) ప్రస్తుతం ఉన్న 10 + 2 + 3 విద్యావిధానం స్థానంలో 5 + 3 + 3 + 4 విద్యా విధానాన్ని ప్రతిపాదించారు. ఇది 3 - 18 సంవత్సరాల కాలానికి వర్తిస్తుంది.

ఎ) ఫౌండేషన్‌ స్టేజ్‌ - ప్రీ ప్రైమరీ, గ్రేడ్‌ 1, 2 (3 - 8 సంవత్సరాలు: అయిదేళ్లు)

బి) ప్రిపరేటరీ స్టేజ్‌ - గ్రేడ్స్‌ 3 నుంచి 5 (8 - 11 సంవత్సరాలు: మూడేళ్లు)

సి) మిడిల్‌ స్టేజ్‌ - గ్రేడ్స్‌ 6 నుంచి 8 (11 - 14 సంవత్సరాలు: మూడేళ్లు)

డి) సెకండరీ స్టేజ్‌ - గ్రేడ్స్‌ 9 నుంచి 12 (14 - 18 సంవత్సరాలు: నాలుగేళ్లు)

 

4) 10, 12 తరగతులకు బోర్డు పరీక్షలు ఉంటాయి.

5) 6వ తరగతి నుంచి వృత్తి విద్య ప్రారంభమవుతుంది.

6) అవకాశం ఉన్నంత వరకు లేదా 5వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో బోధించాలి.

7) 2030 నాటికి బోధనా అర్హత డిగ్రీ 4 సంత్సరాలు ఉండాలి. (ఇంటిగ్రేటెడ్‌ బీ.ఎడ్‌)

 

ఆరోగ్య విధానం

 

శ్రామికుల సామర్థ్యం వారి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. పనిచేసే వారి ఆరోగ్యం మెరుగుపడితే జాతీయ సంపద పెరుగుతుంది.

 

జాతీయ ఆరోగ్య విధానం - 2002: ఈ విధానం ప్రకారం 2005 నాటికి పోలియో, కుష్ఠు వ్యాధిని నిర్మూలించాలి. 2007 నాటికి హెచ్‌ఐవీని సున్నా స్థాయికి తీసుకురావాలి. 2010 నాటికి కాలా అజార్‌ (విష జ్వరం)ను నిర్మూలించాలి.

 

జాతీయ ఆరోగ్య విధానం-2017: 1) ప్రభుత్వ ఆసుపత్రుల్లో ద్వితీయ, తృతీయ స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. 

2) వ్యక్తి జేబు నుంచి వైద్యానికి చేసే వ్యయం తగ్గించాలి. 

3) 2025 నాటికి జీడీపీలో ఆరోగ్యంపై వ్యయం 1.15% నుంచి 2.5%కి పెంచాలి. 

4) 2025 నాటికి ఆయుర్దాయం 70 సంవత్సరాలకు పెంచాలి. 

5) శిశుమరణాలను 2025 నాటికి 23కు తగ్గించాలి. 

6) సంతానోత్పత్తి రేటు 2.1కి తగ్గించాలి. 

7) 2020 నాటికి ప్రసూతి మరణాల రేటు 100కి తగ్గించాలి. 

8) ప్రస్తుత స్థాయి నుంచి ప్రజారోగ్య సదుపాయాలను 2025 నాటికి 50% పెంచాలి.

9) 1.5 లక్షల ఆరోగ్య, వెల్‌నెస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

 

ఆరోగ్యానికి సంబంధించిన ప్రధాన పథకాలు:

 

జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ (2005): ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం 0.9% నుంచి 2.3% పెంచడం, అందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం ఈ మిషన్‌ ఉద్దేశం. 2013లో జాతీయ ఆరోగ్య పట్టణ మిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌ కలిపి జాతీయ ఆరోగ్యమిషన్‌గా ఏర్పాటు చేశారు.

 

జననీ సురక్ష యోజన: ఇది 100% కేంద్ర ప్రభుత్వ పథకం. నైపుణ్యం ఉన్న వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో సంస్థాగత ప్రసవాలు నిర్వహించి, ప్రసూతి మరణాల రేటు తగ్గించడం కోసం 2005లో ఈ పథకాన్ని ప్రారంభించారు.

 

రోగి కళ్యాణ్‌ సమితి (2006): ఆస్పత్రుల్లో మెరుగైన సదుపాయాల కల్పనకు, ఆరోగ్య నియమాలు పెంచేందుకు ఉద్దేశించింది.

 

ప్రధానమంత్రి స్వాస్థ సురక్ష యోజన (2006): తృతీయ స్థాయి ఆరోగ్య సేవల విషయంలో ప్రాంతాల మధ్య అసమానతలను తగ్గించేందుకు, వైద్య విద్యలో నాణ్యత పెంచేందుకు ఉద్దేశించిన పథకం.

 

రాష్ట్రీయ స్వాస్థ బీమా యోజన: అవ్యవస్థీకృత రంగంలో ఉన్న పేదలకు రూ.30 వేల ఆరోగ్య బీమా అందించే పథకం. దీనికి కేంద్ర, రాష్ట్ర నిధులు 75 : 25 నిష్పత్తిలో, ప్రత్యేక రాష్ట్రాలకు 90 : 10 నిష్పత్తిలో అందుతాయి.

 

జననీ శిశు సురక్షా కార్యక్రమం (2011): గర్భిణులు, వ్యాధికి గురైన నవజాత శిశువులకు అయ్యే మందులు, వినియోగ వస్తువులు, భోజన ఖర్చులను ప్రభుత్వమే భరించి, ఉచిత సేవలు అందించేందుకు ఉద్దేశించింది.

 

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (2014): 2014, అక్టోబర్‌ 2న ప్రారంభించారు. 2019, అక్టోబరు 2 నాటికి బహిరంగ మలవిసర్జనను పూర్తిగా నిర్మూలించాలన్నది లక్ష్యం. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచారు.

 

ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (2018): పేద, బలహీన కుటుంబాలకు సంవత్సరానికి కుటుంబానికి రూ.5 లక్షల మేర ద్వితీయ, తృతీయ స్థాయి వైద్యానికి రక్షణ కల్పించే విధంగా 2018, సెప్టెంబరు 23న ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు. 10 కోట్ల మంది లబ్ధిదారులకు వర్తిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం.

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 14-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - అభివృద్ధి సమస్యలు, మార్పు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌