• facebook
  • whatsapp
  • telegram

ప్రణాళికలు

* ప్రపంచంలోనే ప్రణాళికలను మొదటిసారి రూపొందించిన దేశం - యూఎస్ఎస్ఆర్ (లెనిన్ కాలంలో 1917 - 1920 మధ్యలో రూపొందించారు)
* 1929లో ప్రపంచంలో మొదటిసారిగా అమెరికాలోని వాల్‌స్ట్రీట్‌లో ఆర్థికమాంద్యం సంభవించి, ప్రపంచ దేశాలకు విస్తరించింది. అయితే రష్యా (యూఎస్ఎస్ఆర్) మాత్రం ప్రణాళికల అమలు చేసి ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడంతో ప్రపంచ దేశాలన్నీ ప్రణాళికల పై మొగ్గు చూపాయి.
* భారతదేశం రష్యా నుంచి ప్రణాళికలను స్వీకరించి రాజ్యాంగేతర ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పింది.
* ఆర్థికమాంద్యం సంభవించని ఒకే ఒక దేశం - రష్యా


ప్రణాళికా నిర్వచనాలు:
* ఒక దేశం కొన్ని నిర్ణీత లక్ష్యాలను ఒక నిర్ణీత కాలానికి సంబంధించి సాధించడానికి రూపొందించి అమలు చేసేవే ప్రణాళికలు.
''ప్రభుత్వం ఆలోచనాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా, సుదీర్ఘ ఆలోచనలతో కొన్ని ఆర్థిక ప్రాధాన్యాలను ఎంపిక చేసుకుని వాటిని సాధించడానికి రూపొందించినవే ప్రణాళికలు'' - బార్బానా వూటన్
''లభ్యమయ్యే వనరులను కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం సమర్థంగా, ఉద్దేశపూర్వకంగా, స్పష్టమైన ఆలోచనలతో కేటాయింపులు చేసి, రూపొందించిన ప్రక్రియే ప్రణాళిక'' - ప్రణాళిక సంఘం


ప్రొఫెసర్ డికిన్‌సన్ నిర్వచనం:
* ఎంత వస్తు పరిమాణాన్ని ఉత్పత్తి చేయాలి? ఏ విధంగా ఉత్పత్తి చేయాలి? ఉత్పత్తి చేసిన వస్తువులను ఏవిధంగా కేటాయించాలి? .... లాంటి ముఖ్యాంశాలను ఆర్థిక వ్యవస్థ పరిశీలించాక నిర్దేశించే ఒక పద్ధతి. ఈ పద్ధతిలో కేంద్ర అధికార సంస్థ ఉద్దేశపూర్వకంగా నిర్ణయించే విధానాన్నే ప్రణాళికగా చెప్పవచ్చు.


స్వాతంత్య్రానికి పూర్వం భారత్‌లో ప్రణాళికా విధానం
* భారతదేశంలో ప్రణాళిక పితామహుడు - మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
* ప్రణాళికలకు సంబంధించిన వివిధ అంశాలను తెలుపుతూ ఇతడు 1934లో Planned Economy for India అనే గ్రంథం రాశారు.
* భారతదేశంలో ప్రణాళికలకు మార్గదర్శి - జవహర్‌లాల్ నెహ్రూ.
* మనదేశానికి ప్రణాళికలు అవసరమని చెప్పిన జాతీయ నాయకుడు - సుభాష్ చంద్రబోస్.


బాంబే ప్రణాళిక (Bombay Plan) (1943 - 44)
* బొంబాయికి చెందిన ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు A Plan of Economy Development for India అనే పేరుతో Bombay Plan ను రూపొందించారు.
* బాంబే ప్రణాళికకు పెట్టుబడిదారీ లక్షణాలు ఉన్నాయి.
* బాంబే ప్లాన్‌ను 'టాటా బిర్లా - ప్లాన్', 'పారిశ్రామిక ప్రణాళిక' అని కూడా అంటారు. ఇది భారీ, మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యాన్నిచ్చింది.
* ఈ ప్రణాళిక పెట్టుబడి రూ.10,000 కోట్లు. కాలవ్యవధి 15 సంవత్సరాలు. దీని లక్ష్యం - తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం.
* ఈ ప్రణాళిక ద్వారా జాతీయ ఆదాయం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేశారు.


తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కావాల్సిన మార్గాలు:
1. వ్యవసాయ రంగాన్ని 130% పెంచాలి.
2. పారిశ్రామిక రంగాన్ని 500% పెంచాలి.
3. సేవా రంగాన్ని 200% పెంచాలి.


గాంధీ ప్రణాళిక: (1944)
* 1944లో గాంధీజీ సిద్ధాంతాలను (సామ్యవాద భావాలు) దృష్టిలో పెట్టుకుని శ్రీమన్నారాయణ అగర్వాల్ రూ.3,500 కోట్ల వ్యయంతో 'గాంధీ ప్రణాళిక' ను రూపొందించారు.
* ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి, కుటీర, చేనేత, హస్తకళలకు ప్రాధాన్యం ఇచ్చారు.


ప్రజా ప్రణాళిక: (1945) (పీపుల్స్ ప్లాన్)
* 1945లో ఇండియన్ లేబర్ ఫెడరేషన్‌కు చెందిన ఎం.ఎన్.రాయ్ ఈ ప్రణాళికను రూపొందించారు.
* 10 సంవత్సరాల కాలానికి రూ.15,000 కోట్ల వ్యయంతో వ్యవసాయ, వినియోగ వస్తువుల పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఈ ప్రణాళిక సామ్యవాద లక్షణాలను కలిగి ఉంది.
* పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ప్రైవేట్ రంగ పరిశ్రమలను జాతీయీకరణం చేయాలని, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని ఎం.ఎన్. రాయ్ పేర్కొన్నారు.


పేపర్ ప్లాన్:
* స్వాతంత్య్రానికి ముందు రూపొందించిన ప్రణాళికలను పేపర్ ప్లాన్ (Paper Plan) అంటారు. వీటిని ప్రభుత్వం అమలు పరచలేదు.
* 1938లో భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ), జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీ (National Planning Committee)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 1948లో తన నివేదికను ఇచ్చింది.
* 1944లో బ్రిటిష్ ప్రభుత్వం దలాల్ అధ్వర్యంలో స్వల్ప, దీర్ఘకాల ప్రణాళికలను తయారు చేసింది.


స్వాతంత్య్రం తర్వాత:
ప్రణాళిక సంఘం:

* 1950, ఫిబ్రవరి 15న అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఆర్.కె. షణ్ముగం షెట్టి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
* 1950, మార్చి 15న ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు.
* ప్రణాళిక సంఘం కార్యాలయం పేరు - యోజన భవన్
* ఇది రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ, చట్టబద్ధమైంది కూడా కాదు. కేవలం సలహా సంఘం (Advisory Board) మాత్రమే.
* నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్న కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు ప్రణాళిక సంఘం ఏర్పడింది.
అధ్యక్షుడు: ప్రధానమంత్రి
కార్యనిర్వహణాధికారి: ప్రధానమంత్రి
* ప్రణాళిక సంఘంలో ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. వారు:
    1. ప్రధానమంత్రి
    2. ఆర్థికమంత్రి
    3. ప్రణాళిక మంత్రి
* హోదా వల్ల ఛైర్మన్‌గా ఉంటే ఎక్స్ - అఫీషియో అని పిలుస్తారు.


వాస్తవ కార్యనిర్వహణాధికారి: ఉపాధ్యక్షుడు
* ప్రణాళికా సంఘానికి అధికారరీత్యా/ పదవి రీత్యా అధ్యక్షులు - ప్రధానమంత్రి
* సాధారణంగా ప్రధానమంత్రి ప్రణాళిక శాఖను ఎవరికీ కేటాయించరు కానీ సహాయ మంత్రిని నియమిస్తారు.
* ప్రణాళికా సంఘాన్ని ఆర్థిక కేబినేట్ అంటారు. దీని ప్రధాన విధి - ప్రణాళికలను తయారు చేయడం.
* మొదటి ప్రణాళికా సంఘం అధ్యక్షుడు - జవహర్‌లాల్ నెహ్రూ
* ఉపాధ్యక్షుడు - గుల్జారీలాల్ నందా
* ప్రణాళికా సంఘానికి చివరి అధ్యక్షుడు - నరేంద్ర మోదీ.
* ప్రణాళికా సంఘానికి చివరి ఉపాధ్యక్షుడు - మాంటెక్ సింగ్ అహ్లువాలియా (మొదటిసారిగా వరుసగా రెండుసార్లు నియమితులై, అధిక కాలం డిప్యూటీ ఛైర్మన్‌గా కొనసాగారు.)
* ప్రణాళిక సంఘానికి 14వ ఉపాధ్యక్షుడు - మన్మోహన్ సింగ్
* ప్రణాళిక సంఘానికి 23వ ఉపాధ్యక్షుడు - కె.సి. పంత్


జాతీయాభివృద్ధి మండలి (National Development Council - NDC)
* ఇది 1952, ఆగస్టు 6న ఏర్పడింది. ఇది రాజ్యాంగేతర సంస్థ.
* దీనికి కూడా ప్రధానమంత్రే ఎక్స్ - అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* కేంద్ర కార్యనిర్వాహక వర్గం (Cabinet) సిఫారసు మేరకు ఏర్పాటు దీన్ని చేశారు.
* దీని ముఖ్య విధి ప్రణాళికల పరిశీలన, ప్రణాళికలు ఆమోదించడం.
* ఇది రాష్ట్రాలకు, ప్రణాళికా సంఘానికి మధ్య సహకారం పెంపొందిస్తుంది.
* దీనిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులు.
* 1967లో చేసిన పాలనా సంస్కరణల సంఘం సిఫారసు మేరకు కేంద్రపాలిత ప్రాంతాల (Union Territories) లెఫ్టినెంట్ గవర్నర్‌లు, కేంద్ర కేబినెట్ మంత్రులు కూడా దీనిలో సభ్యులే.
* ప్రణాళికా సంఘం కంటే ఎన్‌డీసీకి ఎక్కువ అధికారాలున్నాయి.
* ఎన్‌డీసీని సూపర్ కేబినెట్‌గా కె. సంతానం వర్ణించారు.
* ఎన్‌డీసీకి ప్రణాళికా ముసాయిదాను మార్పులు చేసే అధికారం ఉంటుంది.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌