మాదిరి ప్రశ్నలు
1. వేములవాడను పూర్వం ఏమని పిలిచేవారు?
జ: లేంబులవాడ
2. వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని ఏది?
జ: బోధన్
3. ఏలేశ్వర విద్యాపీఠాన్ని ఎవరు నిర్వహించేవారు?
జ: ముగ్దశివాచార్యుడు
4. 'శ్యాద్వాదచల సింహ' అనే బిరుదు ఎవరిది?
జ: సోమదేవసూరి
5. 'జనాశ్రయ' అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?
జ: మల్లియరేచన
6. కింది వాటిలో పంపకవికి రెండో అరికేసరి ఇచ్చిన అగ్రహారం ఏది?
ఎ) పెంచికల్లు బి) కురిక్క్యాల సి) ధర్మపురం డి) చెన్నూరు
జ: సి(ధర్మపురం)
7. వేములవాడ చాళుక్యుల కాలం నాటి అధికార భాష ఏది?
జ: కన్నడం
8. కింది ఏ శాసనాన్ని మూడు భాషల్లో వేయించారు?
ఎ) కురవగట్టు శాసనం బి) పర్భిణి తామ్ర శాసనం సి) కొల్లిపర తామ్ర శాసనం డి) కురిక్క్యాల శాసనం
జ: డి(కురిక్క్యాల శాసనం)
9. వేములవాడ చాళుక్యుల్లో చివరి రాజు ఎవరు?
జ: మూడో అరికేసరి
10. 'కవితాగుణార్ణవుడు' అనే బిరుదు ఎవరిది?
జ: పంపకవి
11. ఏ శాసనంలో మొదటి తెలుగు కంద పద్యాలున్నాయి?
జ: కురిక్క్యాల శాసనం
12. సోలదగండడు అనే బిరుదు ఎవరిది?
జ: ఒకటో బద్దెగడు
13. వేములవాడ చాళుక్యుల్లో గొప్ప పాలకుడు ఎవరు?
జ: రెండో అరికేసరి
14. 'విక్రమార్జున విజయం' అనే గ్రంథాన్ని రచించిందెవరు?
జ: పంపకవి
15. 'యశస్తిలక చంపు'ను రచించింది ఎవరు?
జ: సోమదేవసూరి