• facebook
  • whatsapp
  • telegram

‘భూమండలంపై భగవంతుడి నీడ!’

ఢిల్లీ సుల్తానుల యుగం

మధ్యయుగంలో సుమారు నాలుగు శతాబ్దాల పాటు భారతదేశాన్ని పాలించిన ఢిల్లీ సుల్తానులు సంప్రదాయ షరియాను అనుసరిస్తూ, పరిపాలనలో ఎన్నో మార్పులు, సంస్కరణలు ప్రవేశపెట్టారు. అంతర్గత కలహాల మధ్యనే హిందూ రాజ్యాలపై నిరంతరం దాడులు, దోపిడీలు కొనసాగించారు. భారతావనిపై మంగోలుల దండయాత్రలను సమర్థంగా నిలువరించారు. వీరి పాలనలో చోటుచేసుకున్న పరిణామాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. రాజ్యాధికారం చేపట్టిన మొదటి మహిళగా, ముస్లిం పాలకురాలిగా చరిత్రలో నిలిచిపోయిన రజియా సుల్తానా, నిరంకుశుడిగా ముద్రపడిన బాల్బన్, మార్కెటింగ్‌ సంస్కరణలకు ఆద్యుడైన అల్లావుద్దీన్‌ ఖిల్జీ, దేశంలో ముస్లిం పాలనకు పటిష్ఠ పునాదులేసిన ఇల్‌-టుట్‌-మిష్‌Ã తదితరుల గురించి వివరంగా తెలుసుకోవాలి.

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


 

1.    ‘భారతదేశంలో ముస్లిం సార్వభౌమాధికారం నెలకొల్పింది ఇల్‌-టుట్‌-మిష్‌’ అని అన్నది?

1) ఈశ్వర ప్రసాద్‌         2) ఆర్‌.పి.త్రిపాఠి  

3) నీలకంఠ శాస్త్రి          4) ఆర్‌.డి.బెనర్జీ


2.    1217 నాటికి ఇల్‌-టుట్‌-మిష్‌ అధికారం విస్తరించిన ప్రాంతాలు?

1) ఢిల్లీ                                     2) ముల్తాన్, సింధ్‌

3) ఉచ్, గ్యాలియర్, మాళ్వా     4) పైవన్నీ


3. 1229లో భారతదేశపు తొలి ముస్లిం సుల్తాన్‌గా మిష్‌ను గుర్తించిన ఖలీఫా?

1) ఖలీఫా వాలిద్‌                       2) ఖలీఫా ఉమ్మయ్యద్‌    

3) ఖలీఫా-అల్‌-మస్తాన్‌-బిల్హ      4) ఖలీఫా మహమ్మద్‌


4.     ‘ఢిల్లీలో వాస్తవంగా ముస్లిం రాజ్యాధికారాన్ని స్థాపించింది ఇల్‌-టుట్‌-మిష్‌’ అని అన్నది?

1) ఆర్‌.ఎస్‌.శర్మ           2) ఆర్‌.పి.త్రిపాఠి  

3) ఈశ్వర ప్రసాద్‌         4) ఆర్‌.డి.బెనర్జీ


5.     మంగోల్‌ నాయకుడు చంఘీజ్‌ఖాన్‌ ప్రమాదాన్ని చాకచక్యంగా తప్పించుకున్న ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌        2) ఇల్‌టుట్‌మిష్‌  

3) ఐబక్‌            4) అల్లావుద్దీన్‌ 


6.     కుతుబ్‌ మినార్‌ నిర్మాణం ప్రారంభించిన, పూర్తిచేసినవారు వరుసగా?

1) బాల్బన్‌-ఇల్‌ టుట్‌ మిష్‌       2) ఐబక్‌-ఇల్‌ టుట్‌ మిష్‌

3) ఐబక్‌ - రజియా సుల్తానా       4) ఐబక్‌ - అల్లావుద్దీన్‌


7.     ‘చిహల్‌ గని’ అనే 40 మంది సర్దారుల ముఠా ఎవరి కాలంలో ఏర్పడింది?

1) కుతుబుద్దీన్‌             2) ఇల్‌టుట్‌మిష్‌  

3) రజియా సుల్తానా      4) బాల్బన్‌


8.     తాజుద్దీన్, మెన్హజ్‌- ఉస్‌ - సిరాజ్‌లు ఏ ఢిల్లీ సుల్తాన్‌ పోషణలో ఉన్నారు?

1) ఐబక్‌                       2) ఇల్‌టుట్‌మిష్‌  

3) రజియా సుల్తానా     4) బాల్బన్‌


9.     ఇల్‌టుట్‌మిష్‌ ముద్రించి వాడుకలోకి తెచ్చిన నాణేలు?

1) వెండి టంకా               2) రాగి జిటాల్‌ 

3) బంగారు శతమానం     4) 1, 2


10. ‘ఇల్‌టుట్‌మిష్‌ భారతదేశంలో బానిస వంశ అధికారాన్ని వాస్తవంగా నెలకొల్పిన సుల్తాన్‌’ అని అన్నది?

1) ఈశ్వరీ ప్రసాద్‌       2) ఆర్‌.ఎస్‌.శర్మ   

3) ఆర్‌.పి.త్రిపాఠి      4) ఆర్‌.డి.బెనర్జీ


11. భారతదేశ చరిత్రలో మొదటి మహిళా పాలకురాలు?

1) రుద్రమదేవి             2) మనుబాయి   

3) రజియా సుల్తానా      4) ఇందిరా గాంధీ


12. రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన సంవత్సరం?

1) 1236      2) 1326     3) 1623     4) 1240


13. రజియా సుల్తానా పరిపాలనను వ్యతిరేకించినవారు?

1) చిహాల్‌గనీలు       2) సర్దారులు   

3) సయ్యద్‌లు       4) ఖలీఫాలు


14. రజియా సుల్తానా అధికారం అంతం చేయడానికి ప్రయత్నించినవారు?

1) లాహోర్‌ రాష్ట్ర పాలకుడు మాలిక్‌-అల్లాఉద్దీన్‌-జైనీ

2) ముల్తాన్‌ రాష్ట్ర గవర్నర్‌ మాలిక్‌-ఇజాఉద్దీన్‌-క్రన్జన్‌

3) హాన్సీ రాష్ట్ర పాలకుడు మాలిక్‌-సఫీ-ఉద్దీన్‌          4) పైవారంతా.


15. రజియా సుల్తానా పారిపోయిన ప్రాంతం?

1) ఢిల్లీ    2) లాహోర్‌     3) భటిండా      4) ముల్తాన్‌


16. బాల్బన్‌ పరిపాలనా కాలం?

1) 1226 - 1287      2) 1266 - 1287  

3) 1266 - 1278      4) 1267 - 1287


17. బాల్బన్‌ మధ్య ఆసియాలోని ఏ తెగకు చెందినవాడు?    

1) మంగోల్‌     2) ఖురేషి     3) ఇల్బారీ    4) మొగల్‌


18. ‘చిహాల్‌గనీ ముఠా’లో కీలకపాత్ర పోషించిన ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌            2) ఆలం షా  

3) బహరాం షా       4) పైవారంతా


19. 1260లో ఢిల్లీపై మంగోల్‌ దాడులను తిప్పికొట్టింది?    

1) బాల్బన్‌            2) ఆలం షా   

3) బహరాం షా       4) పైవారంతా


20. ఘియాజుద్దీన్‌ బాల్బన్‌కు సంబంధించిన సరైన వాక్యాలు?

ఎ) 1230లో సామాన్య నీరు మోసే కూలీగా జీవితం ప్రారంభించాడు.

బి) 1233 నాటికి మిష్‌ ప్రోత్సాహంతో ఖాస్‌దార్‌ పదవి పొంది రజియా కాలంలో అమీర్‌ - ఇ- షికార్‌ హోదా పొందాడు.

సి) బానిస వంశ రాజు అయిన నాసిరుద్దీన్‌ కుమార్తెను వివాహం చేసుకున్నాడు.

డి) నాసిరుద్దీన్‌ కాలంలో నాయబ్‌-ఇ-మమాలిక్‌ (ఉపప్రధాని)గా పనిచేశాడు.

1) ఎ, బి, సి, డి        2) ఎ, బి, సి  

3) బి, సి                  4) బి, సి, డి


21. చిహల్‌గని ముఠాతో ప్రముఖ నాయకుడిగా వ్యవహరించి తను రాజు అయిన తరువాత చిహల్‌గని వ్యవస్థను నిర్మూలించినవారు?

1) ఆమీర్‌ ఖాన్‌            2) నాసిరుద్దీన్‌ 

3) బాల్బన్‌                  4) షేర్‌ఖాన్‌


22. ‘రాజరికం దైవదత్తం’ అని ప్రగాఢంగా విశ్వసించిన బానిస రాజు?

1) ఇల్‌-టుట్‌-మిష్‌           2) బాల్బన్‌    

3) ఐబక్‌                           4) రజియా సుల్తానా


23. ‘నియాబత్‌-ఇ-ఖుదాయి (కింగ్‌ ఈజ్‌ ది వైస్‌ రిజెన్సీ ఆఫ్‌ గాడ్‌ ఆన్‌ ఎర్త్‌) ‘‘రాజు భూమండలంపై భగవంతుని నీడ’ అని అభిప్రాయపడినవారు?

1) ఇల్‌టుట్‌మిష్‌            2) బాల్బన్‌  

3) ఐబక్‌                          4) రజియా సుల్తానా 


24. బాల్బన్‌ తన కుమారుడు బుగ్రాఖాన్‌కు రాజరికానికి సంబంధించి ఏమని బోధించాడు?

1) రాజరికం దైవదత్తం            2) రాజరికం నిరంకుశత్వానికి ప్రతిబింబం  

3) రాజరికం ప్రజాదీవెన          4) రాజరికం అంటే రాజ్యంపై అధికారం


25. బాల్బన్‌ రాజదర్బారులో ఆచరణలో ఉంచిన పర్షియా సుల్తానుల విధానం?

1) జమిన్‌బోస్‌                2) పాయిబోస్‌  

3) 1, 2                            4) రాజును చూసిన వెంటనే ధనం ఇవ్వడం.


26. బహిరంగ ప్రదేశాల్లో నవ్వని ఢిల్లీ సుల్తాన్‌?

1) అల్లావుద్దీన్‌                2) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌    

3) బాల్బన్‌                      4) ఐబక్‌ 


27. చెలామణిలో ఉన్న నాణేలపై ఖలీఫా పేరు ముద్రించిన ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌                   2) మహ్మద్‌ బీన్‌ ఖాసీమ్‌ 

3) అల్లావుద్దీన్‌ ఖిల్జీ      4) ఐబక్‌


28. బానిస వంశంలో చివరి రాజు?

1) కైకుబాద్‌             2) మహ్మద్‌   

3) బాల్బన్‌              4) జలాలుద్దీన్‌


29. బాల్బన్‌ కాలంలో జలాలుద్దీన్‌ ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశాడు?

1) బెంగాల్‌     2) సమారా     3) అవద్‌    4) ఉజ్జయిని


30. జలాలుద్దీన్‌ ఖిల్జీ అధికారుల్లో ప్రముఖులు?

1) మాలిక్‌ ఫక్రుద్దీన్‌          2) ఖ్వాజా ఖతర్‌ 

3) గర్షాన్స్‌ మాలిక్‌             4) పైవారంతా


31. అల్లావుద్దీన్‌-ఖిల్జీ దేవగిరిపై దాడి చేసిన సంవత్సరం?

1) 1260       2) 1270       3)1280      4) 1290


32. మార్కెటింగ్‌ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌                     2) అల్లావుద్దీన్‌ ఖిల్జీ   

3) ఇల్‌-టుట్‌-మిష్‌         4) ఐబక్‌


33. 1297లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ గుజరాత్‌పై దాడికి వీరిని పంపారు?

1) ఉల్గూఖాన్‌              2) నస్రత్‌ఖాన్‌   

3) 1, 2                       4) జాఫర్‌ మఖాన్‌


34. 1297లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ గుజరాత్‌పై దాడి చేసే సమయంలో ఆ ప్రాంత పాలకుడు, వంశం వరుసగా?

1) కర్ణదేవుడు-వాఘేల             2) కర్ణదేవుడు-చహమాను

3) భీమదేవుడు-వాఘేల           4) భీమదేవుడు- చహమాను

 

35. అల్లావుద్దీన్‌ ఖిల్జీకి సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) 1298లో ఉల్గూఖాన్, నస్రత్‌ ఖాన్‌ నేతృత్వంలోని సైన్యం రణతంబోర్‌ ప్రాంతంపై దాడి చేసింది.

బి) ఈ యుద్ధంలో అల్లావుద్దీన్‌ విజయం సాధించాడు. ఉల్గూఖాన్, రాణాహం వీరుడు మరణించారు.

సి) 1303లో అల్లావుద్దీన్‌ మేవాడ్‌ రాజు రాణా రతన్‌ సింగ్‌పై దాడి చేశాడు.

డి) సుమారు 7 నెలల తర్వాత ఖిల్జీ చిత్తోడ్‌ను ఆక్రమించాడు.

1) ఎ, బి, సి, డి          2) బి, సి, డి    3) ఎ, బి         4) ఎ, బి, సి


36. అల్లావుద్దీన్‌ ఖిల్జీ చిత్తోడ్‌ అనే ప్రాంతానికి పెట్టిన పేరు?

1) ఖిజరాబాద్‌            2) పద్మపురం  

3) దౌలతాబాద్‌         4) ఖిల్జిపుర్‌


37. అల్లావుద్దీన్‌ ఖిల్జీకి సమకాలీనులు అయిన దక్షిణ భారతదేశ రాజులు కానివారు?

1) దేవగిరి - యాదవులు    2) ద్వార సముద్రం - హోయసాలులు

3) మధురై - పాండ్యులు        4) విజయనగరం - విజయనగర రాజులు


38. దక్షిణ భారతదేశ దండయాత్రలకు నేతృత్వం వహించిన అల్లావుద్దీన్‌ ప్రతినిధి?

    1) ఉల్గూఖాన్‌      2) నస్రత్‌ఖాన్‌ 

    3) మాలిక్‌ కపూర్‌     4) జాఫర్‌ మఖాన్‌


39. కిందివాటిలో ఖిల్జీకి సంబంధించి సరైనవి?

    ఎ) 1313లో దేవగిరి రాజ్యంపై దాడి చేసి రామచంద్ర దేవుని ఓడించాడు.

    బి) 1308లో రెండో ప్రతాపరుద్రుడు ఓడి ఖిల్జీకి కప్పం చెల్లించడానికి అంగీకరించారు.

    సి) హోయసాల రాజు అయిన మూడో వీర బల్లాలుడు ఓటమిపాలై ఖిల్జీకి కప్పం చెల్లించాడు.

    డి) పాండ్య రాజ్యంలో జరిగిన అంతర్యుద్దంలో  పాల్గొన్నారు.

    1) బి, డి                        2) బి, సి, డి   

    3) ఎ, బి, సి, డి             4) ఎ, బి, సి


40. అల్లావుద్దీన్‌ ఖిల్జీ రాజ్య సరిహద్దులను జత చేయండి.

   

1) ఉత్తరం ఎ) ముల్తాన్‌
2) దక్షిణం బి) ద్వార సముద్రం
 3) తూర్పు సి) సోనార్‌గర్‌ 
4) పశ్చిమం డి) థట్టా

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి    2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి

3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి    4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ


41. అల్లావుద్దీన్‌ ఖిల్జీ పరిపాలనా సంస్కరణలకు సంబంధం లేనిది?

ఎ) సంపన్న సర్దారుల జాగీర్లను రద్దు చేశాడు

బి) హిందువులపై ఆంక్షలు తొలగించాడు

సి) మద్యం, మత్తు పదార్థాలు నిషేధించాడు

డి) సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించాడు

1) బి, సి    2) సి    3) బి     4) బి, డి 



సమాధానాలు

12; 24; 33; 41; 52; 62; 72; 82; 94; 101; 113; 121; 131; 144; 153; 162; 173; 181; 191; 201; 213; 222; 232; 242; 253; 263; 271; 281; 292; 304; 314; 322; 333; 341; 351; 361; 374; 383; 393; 401; 413. 

 


ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...
 

Posted Date : 11-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌