గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు
1. గ్రామ పరిపాలనలో ఆయగార్ విధానాన్ని ప్రవేశపెట్టింది?
జ: కాకతీయులు
2. ఏ శాసనం రుద్రదేవుడిని 'వినయ భూషణుడు' అని తెలియజేస్తుంది?
జ: ద్రాక్షారామ
3. మధ్యయుగాల్లో దేన్ని సుల్తాన్పూర్ అనేవారు?
జ: వరంగల్
4. కిందివాటిని జతపరచండి.
అ) బయ్యారం చెరువు | 1) జగదల ముమ్మడ |
ఆ) పాకాల చెరువు | 2) మొదటి ప్రోలరాజు |
ఇ) కేసముద్రం చెరువు | 3) మైలాంబ |
ఈ) నాగ సముద్రం చెరువు | 4) నాగాంబిక |
జ: అ-3, ఆ-1, ఇ-2, ఈ-4
5. కాకతీయులు ఎవరు?
జ: శూద్రులు