మగధ సామ్రాజ్యం
ప్రాచీన భారతదేశంలోని మహాజనపదాల్లో ప్రముఖ రాజ్యం మగధ. పాటలీపుత్రం రాజధానిగా మౌర్యులు, గుప్తుల పాలనలో శక్తిమంతమైన సామ్రాజ్యంగా ఆవిర్భవించింది. వ్యవసాయం, వాణిజ్యం, సైనిక రంగాల్లో ప్రగతితో అత్యంత సంపన్న ప్రాంతంగా దేశ వైభవాన్ని నలుదిశల్లో చాటింది. బౌద్ధ, జైన మతాల వ్యాప్తికి కేంద్ర స్థానంగా నిలిచిన మగధ విశేషాలన్నీ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా పరాక్రమంలో అజేయంగా, ప్రజాసంక్షేమంలో ఆదర్శంగా నిలిచిన మౌర్యుల గురించి పోటీ పరీక్షార్థులు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. మౌర్య సామ్రాజ్యం ఆవిర్భావం, విస్తరణ తీరు, నాటి పాలనా విధానాలు, అశోకుడి ఔన్నత్యం, శాశ్వతంగా నిలిచిపోయిన అతడి కీర్తి తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.
ఆన్లైన్ పరీక్ష కోసం క్లిక్ చేయండి...
1. కిందివాటిలో చంద్రగుప్త మౌర్యుడు నంద రాజులపై చేసిన తిరుగుబాటు కథాంశంగా ఉన్న గ్రంథం?
1) కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం’ 2) విశాఖదత్తుడి ‘ముద్రారాక్షసం’
3) పతంజలి ‘మహాభాష్యం’ 4) మాడలీన్ ‘స్లేడ్’
2. మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడికి సంబంధించి సరైనవి?
ఎ) క్రీ.పూ.321లో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
బి) ఈయన మొరియా తెగకు చెందినవాడు.
సి) జైన, బౌద్ధ మత గ్రంథాల ప్రకారం మౌర్యులు క్షత్రియులు.
డి) పురాణాల ప్రకారం చంద్రగుప్త మౌర్యుడిది శూద్రవంశం.
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, డి
3. కింద ఇచ్చిన రచయితలు, గ్రంథాలను జతపరచండి.
1) ప్లీనీ | ఎ) ఇండికా |
2) ప్లూటార్క్ | బి) ది లైన్స్ |
3) టాలమీ | సి) నేచురల్ హిస్టరీ |
4) మెగస్తనీస్ | డి) జాగ్రఫీ |
1) 1-ఎ 2-బి, 3-సి, 4-డి 2) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి 4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4. కిందివాటిలో అశోకుడి గురించి తెలుసుకోవడానికి ఆధారమైన స్వదేశీ గ్రంథాలు, వాటి రచయితలను జతపరచండి.
రచయితలు | గ్రంథాలు |
1) విశాఖదత్తుడు | ఎ) రాజతరంగిణి |
2) హేమచంద్ర | బి) పరిశిష్ట పర్వన్ |
3) సోమదేవుడు | సి) ముద్రారాక్షసం |
4) కల్హణుడు | డి) కథాకవితాసాగరం |
1) 1-ఎ 2-బి, 3-సి, 4-డి 2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ 4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
5. కౌటిల్యుడి అర్థశాస్త్రానికి సంబంధించి సరైనవి ఏవి?
ఎ) కౌటిల్యుడిని చాణుక్యుడు, విష్ణుగుప్తుడు అని అంటారు.
బి) సంస్కృతంలో రాసిన అర్థశాస్త్రం 1905లో తంజావూర్ వద్ద దొరికింది. దీన్ని ఆంగ్లంలోకి అనువదించినవారు ఆర్.శ్యామశాస్త్రి.
సి) అర్థశాస్త్రం అనే గ్రంథంలో 15 అధికరణలు, 180 ప్రకరణలు ఉన్నాయి.
డి) మౌర్యుల కాలంలోని ధర్మస్థేయ అనే పౌర న్యాయస్థానం; కంఠక శోధన అనే క్రిమినల్ న్యాయస్థానాల గురించి దీనిలో ఉంది.
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
6. ఇండికా గ్రంథానికి సంబంధించి కిందివాటిలో సరైనవి గుర్తించండి.
ఎ) గ్రీకు దేశానికి చెందిన సెల్యూకస్ నికేటర్ రాయబారి అయిన మెగస్తనీస్ ఈ గ్రంథాన్ని రచించారు.
బి) ప్రస్తుతం ఈ గ్రంథం అందుబాటులో లేదు.
సి) ఈ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడి సైనిక వ్యవస్థ గురించి ఉంది.
డి) మెగస్తనీస్ ప్రకారం మగధలో బానిస వ్యవస్థ లేదు.
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి 3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
7. జునాగఢ్ శాసనం ఎవరు వేయించారు?
1) అశోకుడు 2) చంద్రగుప్త మౌర్యుడు
3) రుద్రదమనుడు 4) బిందుసారుడు
8. చంద్రగుప్త మౌర్యుడికి సెల్యూకస్ నికేటర్తో జరిగిన యుద్ధంతో సంబంధం లేనిది?
1) వీరి మధ్య క్రీ.పూ.305లో యుద్ధం జరిగింది.
2) వీరి మధ్య క్రీ.పూ.303లో సంధి జరిగింది.
3) సెల్యూకస్ నికేటర్ రాయబారిగా మెగస్తనీస్ పాటలీపుత్రంలో చాలాకాలం ఉన్నాడు.
4) చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్కు 5000 ఏనుగులు ఇచ్చాడు.
9. సంగమ సాహిత్యం అంటే?
1) చోళ సాహిత్యం 2) పాండ్య సాహిత్యం
3) చేర సాహిత్యం 4) పైవన్నీ
10. బిందుసారుడి గురించి సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ) బిందుసారుడిని ‘అమిత్రఘాత’ అంటారు.
బి) బిందుసారుడు అజీవక మతం ఆచరించాడు.
సి) ఈయనకు సిరియా రాజు ఒకటో యాంటి యోకస్తో సంబంధాలు ఉండేవి.
డి) సిరియా రాజు రాయబారి డైమోకస్ మౌర్యుల ఆస్థానంలో ఉండేవాడు.
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి, డి
3) బి, సి 4) ఏదీకాదు
11. బిందుసారుడి కాలంలో అతడి ఆస్థానంలో ఉన్న సిరియా రాయబారి?
1) స్ట్రాబో 2) హెరిడోటస్ 3) డైమోకస్ 4) ప్లీనీ
12. బిందుసారుడి కాలంలో తక్షశిల వద్ద జరిగిన తిరుగుబాటును అణచివేయడానికి వెళ్లిన యువరాజు?
1) సుశిమా 2) మహేంద్ర
3) అశోకుడు 4) బృహద్రదుడు
13. కిందివాటిలో అశోకుడికి సంబంధించి సరైనవి?
ఎ) అశోకుడి పేరును శాసనాల్లో దేవానాంప్రియ, ప్రియదర్శి అని పేర్కొన్నారు.
బి) ఈయన పేరుతో ఉన్న శాసనం కర్ణాటకలోని మస్కి వద్ద ఉంది.
సి) టిబెట్ చరిత్రకారుడు తారానాథ్ ప్రకారం అశోకుడు ఒక వైశ్య స్త్రీకి జన్మించాడు.
డి) అశోకుడు అంటే శోకించలేనివాడు అని అర్థం.
1) ఎ, డి 2) ఎ, బి, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి
14. ‘చార్లెమేన్, కాన్స్టాంటన్ గురించి తెలిసిన వారి కంటే అశోకుడి గురించి తెలిసిన వారే ఎక్కువ’ అని ఎవరు అన్నారు?
1) ప్లీనీ 2) హెచ్.జి.వెల్స్
3) టాలమీ 4) ప్లూటార్క్
15. కిందివాటిలో కళింగ యుద్ధానికి సంబంధించి సరైనవి గుర్తించండి.
ఎ) కళింగ అంటే నేటి ఒడిశా ప్రాంతం.
బి) 13వ శిలాశాసనం ఈ యుద్ధం గురించి తెలుపుతుంది.
సి) అశోకుడు రాజైన ఎనిమిదేళ్లకు ఈ యుద్ధం చేశాడు.
డి) కళింగ యుద్ధంలో మృతులు 1,00,000 మందికి పైగా కాగా, బంధీలైనవారు 1,50,000 మంది.
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి 3) ఎ, సి 4) బి, డి
16. అశోకుడి ధర్మ సూత్రాల్లో లేనిది?
ఎ) తల్లిదండ్రుల పట్ల విధేయత ఉండాలి. బి) పెద్దలను గౌరవించాలి.
సి) ఇతర మతాలను దూషించరాదు. డి) విగ్రహారాధన చేయవచ్చు.
1) సి, డి 2) సి మాత్రమే 3) డి మాత్రమే 4) ఎ, డి
17. ధర్మప్రచారం, శాసనాల్లోని అంశాలను చదివి వినిపించడానికి అశోకుడు ఎవరిని నియమించాడు?
1) అమాత్యులు 2) ధర్మాధ్యక్షులు
3) ధర్మమహామాత్రులు 4) పైవారందరూ
18. అశోకుడికి సంబంధించి కిందివాటిలో సరికానిది?
ఎ) కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధమతం స్వీకరించాడు.
బి) ఈయన బౌద్ధమతాన్ని ఈజిప్ట్, శ్రీలంక, గ్రీసు, సిరియా దేశాల్లో వ్యాప్తి చేశాడు.
సి) అశోకుడి తరఫున బౌద్ధమత ప్రచారం చేసినవారు మహేంద్ర, సంఘమిత్ర.
డి) అశోకుడిని ప్రభావితం చేసిన బౌద్ధమత సన్యాసి ఆచార్య నాగార్జునుడు.
1) ఎ, బి 2) డి మాత్రమే
3) బి, డి 4) ఎ మాత్రమే
19. మౌర్యుల తర్వాత మగధలో స్థాపించిన రాజవంశం, స్థాపకుడు?
1) కాణ్వా - సుశర్మ 2) శుంగ - పుష్య మిత్ర
3) పుష్యభూతి - హర్షవర్ధన 4) గుప్త - గుప్తుడు
20. అశోకుడి ఏ శాసనాలు సంగమ యుగం గురించి వివరిస్తాయి?
1) 2, 13 2) 2, 14 3) 1, 6 4) 7, 8
21. మగధ సామ్రాజ్య పరిపాలనకు సంబంధించి సరికానిది?
ఎ) మగధకు ప్రధాన రాజధాని పాటలీపుత్రం.
బి) పాటలీపుత్రం, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలను చక్రవర్తి ప్రత్యక్షంగా పరిపాలించేవారు.
సి) మగధలో నాలుగు ప్రాదేశిక రాజధానులున్నాయి. అవి తక్షశిల, తోసలి, సువర్ణగిరి, ఉజ్జయిని.
డి) ప్రాదేశిక రాజధానులను పరిపాలించేవారు సామంతులు.
1) ఎ, బి, సి 2) డి 3) బి, డి 4) ఎ, డి
22. మగధలో గ్రామాల వర్గీకరణను జతపరచండి.
1) సీత | ఎ) సైనికులను పంపించే గ్రామాలు |
2) ఆయుధేయ | బి) రాజుకు, ప్రభుత్వానికి చెందిన భూములున్న గ్రామం |
3) పరిహారిక | సి) పన్ను మినహాయింపు ఇచ్చిన గ్రామాలు |
4) కుప్య | డి) ముడి పదార్థాలను సరఫరా చేసే గ్రామాలు |
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి 4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
23. అశోకుడి ఏ శిలాశాసనం బోస్రో -ఫెడాన్ పద్ధతిలో రాసి ఉంది?
1) ఎర్రగుడి మైనర్ రాక్ ఈడిక్ట్ 2) లంపక రాక్ ఈడిక్ట్
3) షాబజోగిరి రాక్ ఈడిక్ట్ 4) మాన్షేరా రాక్ ఈడిక్ట్
24. మెగస్తనీస్ తన గ్రంథంలో తెలియజేసిన పెద్దరాచబాట ఏ ప్రాంతాలను కలుపుతుంది?
1) ఇండస్ - పాటలీపుత్రం 2) పాటలీపుత్రం - ప్రయాగ
3) ప్రయాగ - ఉజ్జయిని 4) పాటలీపుత్రం - తక్షశిల
25. అశోకుడి స్తంభ శాసనంలో అతిదీర్ఘమైనది?
1) 7వ 2) 6వ 3) 5వ 4) 4వ
26. ఇండికా గ్రంథం ప్రకారం మగధ సామ్రాజ్యంలోని కులాలు ఎన్ని?
1) 4 2) 5 3) 6 4) 7
27. మౌర్యుల కాలంలో రాజు గుత్తాధిపత్యం కింద లేని అంశం?
1) గనులు, అడవులు 2) చేపల పరిశ్రమ
3) మద్యం, జలరవాణా 4) వధశాలలు, జూద గృహాలు
28. అశోకుడు తన ధర్మాన్ని ఏ విధంగా ప్రచారం చేశాడు?
1) శాసనాల ద్వారా 2) ప్రాకృతం ఉపయోగించడం ద్వారా
3) విదేశాలకు భిక్షువులను పంపడం ద్వారా 4) పైవన్నీ
సమాధానాలు
1-2; 2-2; 3-2; 4-3; 5-2; 6-1; 7-3; 8-4; 9-4; 10-2; 11-3; 12-3; 13-2; 14-2; 15-1; 16-3; 17-3; 18-2; 19-2; 20-1; 21-2; 22-2; 23-1; 24-4; 25-1; 26-4; 27-4; 28-4.
రచయిత: గద్దె నరసింహారావు