• facebook
  • whatsapp
  • telegram

రైతులు, గిరిజనుల తిరుగుబాట్లు            

ఆధునిక భారతదేశ చరిత్ర

ఆంగ్లేయులపై తిరగబడిన అన్నదాతలు.. అడవి బిడ్డలు!

ఆంగ్లేయులు అడుగు పెట్టడంతోనే భారతదేశంలో అలజడులు మొదలయ్యాయి. సుభిక్షంగా, స్వయంసమృద్ధితో సాగిపోతున్న సమాజం చిన్నాభిన్నమైంది. అరాచక భూమి శిస్తు విధానాలతో అన్నదాతలు అల్లాడిపోయారు. అడవుల్లోకి చొరబడి వనరులు కొల్లగొట్టడంతో గిరిజనుల జీవన విధానం, విశ్వాసాలకు విఘాతం కలిగింది. అడవి బిడ్డలపై వలస పాలకుల అకృత్యాలకు అంతు లేకుండా పోయింది. దీంతో సంప్రదాయ విధానాల్లో జీవనం సాగించే రైతులు, తెగల ప్రజల్లో విప్లవాత్మక ధోరణులు పెరిగి తిరుబాట్లకు దారితీసింది. బ్రిటిషర్లకు కునుకు లేకుండా చేసిన ఆ పోరాటాల వివరాలు, నాయకత్వం వహించిన యోధుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


1. రైతులు, గిరిజనుల తిరుగుబాటుకు కారణాలు?

1) రాజకీయ కారణాలు      2) ఆర్థిక కారణాలు    3) గిరిజనుల అసంతృప్తి     4) పైవన్నీ

జవాబు: పైవన్నీ


2. ప్రకటన-A: భారతదేశ రాజులు వ్యవసాయ అభివృద్ధికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. 

ప్రకటన-B: ఈస్టిండియా కంపెనీ వారు వ్యవసాయ భూములపై నిర్దాక్షిణ్యంగా శిస్తు వసూలు చేశారు.

జవాబు: ప్రకటన A, B లు సరైనవి



3.  ప్రకటన-A: వలస పాలనలో చేతివృత్తులవారు జీవనోపాధి కోల్పోయారు. 

 కారణం- R: ఇంగ్లండ్‌లోని పరిశ్రమల్లో ఉత్పత్తి చేసిన వస్తువులు భారతదేశానికి దిగుమతి చేసుకోవడం.

జవాబు: ప్రకటన A కి కారణం R సరైన వివరణ.


4.  కిందివాటిని జతపరచండి.

రాష్ట్రాలు   -    గిరిజన తెగలు 

1) మహారాష్ట్ర     ఎ) కోలి

2) గుజరాత్‌      బి) నాయక్‌ 

3) ఒడిశా        సి) ఖోండ్‌ 

4) బిహార్‌      డి) సంతాలీలు

జవాబు: 1-ఎ; 2-బి; 3-సి; 4-డి


5.  బ్రిటిష్‌వారు చేసిన అటవీ చట్టాలకు సంబంధించి సరికానిది?

జవాబు: గిరిజనుల ఆదాయం పెంచాయి.


6.     నరబలి, శిశుహత్య అనాదిగా ఉన్న గిరిజన జాతి?

జవాబు: ఖోండ్‌ 


7.  బిహార్‌లోని సంతాలీల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?

జవాబు: 1855-56  


 


8.     తమల్‌ గిరిజన తెగ ఉన్న ప్రాంతం?

జవాబు:  ఛోటానాగ్‌పుర్‌    


9.     1857 తిరుగుబాటు సమయంలో పలమౌ, రాంచీ, హజారీ బాగ్‌ వద్ద ఉన్న ‘చిరో’ తెగ గిరిజనులు ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు?

జవాబు: పితాంబర్‌

10. ‘బిల్‌’ గిరిజన తిరుగుబాటుకు సంబంధించి కింది వాటిలో సరైంది?

ఎ) ఇది 1817 - 19 మధ్య జరిగింది.

బి) ఈ తిరుగుబాటు మార్కోస్‌ హేస్టింగ్స్‌ గవర్నర్‌ జనరల్‌ కాలంలో జరిగింది.

సి) పశ్చిమ కనుమల్లోని ఖాందేశ్‌ ప్రాంతంలో ఉంటారు. 

డి) వీరికి సహాయం చేసినవారు పీష్వా రెండో బాజీరావు.

జవాబు: ఎ, బి, సి, డి 


11. రమోసే తెగ వారు చిత్తూర్‌ సింగ్‌ నాయకత్వంలో ఎప్పుడు తిరుగుబాటు చేశారు?

జవాబు: 1822 


12. రమోసే తెగవారు ప్రధానంగా దాడులు చేసిన ప్రాంతం?

జవాబు: సతారా 


13. కోల్‌ గిరిజనులు తిరుగుబాటు చేసిన సంవత్సరం?

జవాబు: 1831 - 32   


14. సిర్దార్‌ అంటే

జవాబు:  గిరిజన నాయకుడు  

 


15. కోల్‌ తిరుగుబాటు ఏ ప్రాంతం కేంద్రంగా జరిగింది?

జవాబు: రాంచీ    


16. కిందివాటిలో భిన్నమైంది?

 జవాబు: బెవార్‌ 


17. 1845లో బ్రిటిష్‌వారు స్థాపించిన ‘మెరియా ఏజెన్సీ’ ప్రధాన ఉద్దేశం?


జవాబు: నరబలులు, ఆడ శిశువుల హత్యలను అరికట్టడం


18. సంతాల్‌ తిరుగుబాటు ఏ గవర్నర్‌ జనరల్‌ చివరి కాలంలో జరిగింది?

జవాబు: లార్డ్‌ డల్హౌసీ


19. సంతాల్‌ తిరుగుబాటుకు నాయకుడు?

1) సిధు    2) కన్హూ    3) 1, 2   4) బిర్సా

జవాబు:  1, 2  


20. కోల్‌ తిరుగుబాటుకు సంబంధించి సరైంది?

ఎ) ఈ తిరుగుబాటు పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.

బి) ఈ తిరుగుబాటుకు నాయకుడు బుద్ధో భగత్‌.

జవాబు: బి మాత్రమే   


 

21. అహోమ్‌ తిరుగుబాటుకు ప్రధాన కారణం?

జవాబు: అస్సాంలో బ్రిటిష్‌ వారు అవలంబించిన వ్యవసాయ విధానాలు


22. విశాఖపట్నంలో గిరిజన తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?

జవాబు: 1832  


23. విశాఖపట్నం గిరిజన తిరుగుబాటును పరిగణించి సరైనవి గుర్తించండి.    

ఎ) ఈ తిరుగుబాటు కాశీపురం, పాయకరావుపేట, పాలకొండ జమీందారీలలో జరిగింది.

బి) తిరుగుబాటు అణచివేయడానికి నియమితుడైన అధికారి జార్జి రుస్సెల్‌.

సి) 1839లో ప్రభుత్వం XXIV చట్టం చేసింది.

డి) గిరిజనులు పితూరీల రూపంలో తిరుగుబాట్లు చేశారు.

జవాబు: ఎ, బి, సి, డి 


24. ప్రకటన-A: 1917లో మద్రాసు ప్రభుత్వం ది ఏజెన్సీ ట్రాక్ట్స్‌ ఇంటరెస్ట్‌ అండ్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్‌ను రూపొందించింది.

ప్రకటన-B ఈ చట్టం గిరిజనుల భూములను గిరిజనేతరులకు ఇవ్వడం అనే సంప్రదాయాన్ని రద్దు చేసింది.

జవాబు:  ప్రకటన A, B లు సరైనవి   


25. గోండు ఉద్యమానికి సంబంధించి సరైనవి?

ఎ) దీని నాయకుడు కొమురం భీం.

బి) దీని నినాదం జల్, జంగిల్, జమీన్‌.

సి) ఈ తిరుగుబాటు తంత్రం గెరిల్లా పోరాటం.

జవాబు: ఎ, బి, సి   


26. ఖాసీ జయంతియా కొండల్లో బ్రిటిష్‌ వారు వేసే రోడ్లకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు?

జవాబు: ఖాసీ 


27. కుకీ తిరుగుబాటు జరిగిన ప్రాంతం?

జవాబు: మణిపుర్‌  

 

28. రంప ఏజెన్సీ అధిపతి మన్సబ్‌దార్‌కు సహాయపడినవారు?

జవాబు: ముత్తాదార్లు   


29. 1835లో మరణించిన రంప మన్సబ్‌దారు?

జవాబు:రామ భూపతిదేవ్‌  


30. రంపా తిరుగుబాటును అణచివేసేందుకు వచ్చిన రెవెన్యూ బోర్డు సభ్యుడు?

జవాబు: సల్లెవన్‌  

 


31. గిరిజనులు మాహువా చెట్ల పూలను దేనికి ఉపయోగిస్తారు?

1) తినడానికి    2) మద్యం తయారీకి      3) 1, 2      4) అలంకరణకు

జవాబు: 1, 2  


32. కింది వాక్యాల్లో సరైనవి?

ఎ) ఒడిశాలోని ఖోండ్‌లు సామూహిక వేటకు వెళతారు. 

బి) మధ్యప్రదేశ్‌లోని బైగాలు ఉత్తమ వేటగాళ్లు.

జవాబు: ఎ, బి సరైనవి


33. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

ఎ) పంజాబ్‌ - వాన్‌ గుజ్జర్లు - ఆవులను మేపేవారు 

బి) కులూ - గద్దీలు - గొర్రెలు మేపేవారు

సి) కశ్మీర్‌ - బకర్వాలాలు - మేకల కాపరులు

డి) ఆంధ్రప్రదేశ్‌ - లంబాడీలు - పందులను పోషిస్తారు

జవాబు: డి మాత్రమే   


34. గిరిజన పంట కాలాలను జతపరచండి.

1) జేత్‌     ఎ) కుత్కి పక్వానికి వస్తుంది 

2) కార్తిక్‌    బి) కొత్త బెవార్‌లకు వెళ్లేవారు

3) కౌర్‌     సి) విత్తడం ప్రారంభిస్తారు

4) మాగ్‌    డి) బీన్స్‌ పక్వానికి వస్తుంది

జవాబు:  1-సి; 2-ఎ; 3-డి; 4-బి


35. నైషి తెగ గిరిజనులు ఉన్న ప్రాంతం?

జవాబు: అరుణాచల్‌ ప్రదేశ్‌ 


36. బిర్సా ముండా ఎప్పుడు మరణించారు?

జవాబు: 1900 


37. బిర్సా ముండాకు సంబంధించి సరికానిది?

జవాబు: బిర్సాను 1897లో అరెస్ట్‌ చేశారు.

 

38. గడ్కరి తిరుగుబాటు ఎక్కడ జరిగింది?

జవాబు:  కొల్హాపుర్‌


39. ‘ఫాదర్‌ ఆఫ్‌ ఇండియా మిలిటెంట్‌ నేషనలిజమ్‌’ అని ఎవరిని పిలుస్తారు?

జవాబు: వాసుదేవ బల్వంత్‌ పాడ్కే 


40. భూగాన్‌ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది?

జవాబు: ఒరిస్సా 


41. ఖాసిస్‌ తిరుగుబాటు ఎక్కడ జరిగింది?

జవాబు: మేఘాలయ


42. బాలగంగాధర్‌ తిలక్‌ గురువు ఎవరు?

జవాబు: వాసుదేవ బల్వంత్‌ పాడ్కే


43. భిల్లుల తిరుగుబాటుకు (1818 - 36) నాయ‌క‌త్వం వ‌హించిన‌వారు?

జవాబు: సేవారం

 

Posted Date : 23-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌