1. 1929 లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
సమాధానం: జవహర్లాల్ నెహ్రూ
2. గాంధీజీ దండి యాత్రను ఏ రోజున ప్రారంభించారు?
సమాధానం: మార్చి 12, 1930
3. తమిళనాడులో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు?
సమాధానం: సి. రాజగోపాలాచారి
4. ఈశాన్య రాష్ట్రాల్లో శాసనోల్లంఘన ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు?
సమాధానం: రాణి గైడిన్ ల్యూ
5. ఖుదై ఖిద్మత్ గార్స్ దళాన్ని ఏర్పాటు చేసింది ఎవరు?
సమాధానం: ఖాన్ అబ్దుల్ గఫార్ఖాన్
6. ఢాకాలో శాసనోల్లంఘన ఉద్యమంలో ఏయే వర్గాలు పాల్గొన్నాయి?
సమాధానం: ముస్లిం నాయకులు, బలహీనవర్గాలు
7. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ నాయకుడు ఎవరు?
సమాధానం: తేజ్ బహదూర్ సప్రూ
8. గాంధీ - ఇర్విన్ ఒప్పందంలో భాగంగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి?
సమాధానం: సుభాష్చంద్ర బోస్
9. కమ్యూనల్ అవార్డును ప్రకటించిన బ్రిటిష్ ప్రధాని ఎవరు?
సమాధానం: మెక్ డొనాల్డ్
10. గాంధీజీ, అంబేడ్కర్ మధ్య పుణె ఒప్పందం జరగడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు?
సమాధానం: మదన్ మోహన్ మాలవీయ
11. గాంధీజీకి మహాత్మా అనే బిరుదును ఇచ్చింది ఎవరు?
సమాధానం: రవీంద్రనాథ్ ఠాగూర్
12. దండి సత్యాగ్రహంతో సంబంధం ఉన్న దండి గ్రామం గుజరాత్లోని ఏ జిల్లాలో ఉంది?
సమాధానం: నౌసారి