• facebook
  • whatsapp
  • telegram

భారత జాతీయోద్యమం

1. భారతదేశంలో ఏర్పడిన తొలి రాజకీయ సంస్థ ఏది?
జ: బెంగాల్ భూస్వాముల సంఘం

 

2. అకడెమిక్ అసోసియేషన్‌ను స్థాపించింది ఎవరు?
జ: హెన్రీ డిరోజియో

 

3. కింది సంస్థలను, వాటి స్థాపక సంవత్సరాలతో జత చేయండి.

I) బెంగాల్ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ A) 1870
II) బొంబాయి అసోసియేషన్ B) 1853
III) మద్రాస్ నేటివ్ అసోసియేషన్ C) 1852
IV) పూనా సార్వజనిక సభ D) 1851

జ: I-D, II-C, III-B, IV-A

 

4. లండన్ ఇండియన్ అసోసియేషన్‌ను స్థాపించింది ఎవరు?
జ: దాదాభాయ్ నౌరోజీ

 

5. 1876లో సురేంద్రనాథ్ బెనర్జీ ఎవరితో కలిసి ఇండియన్ అసోసియేషన్‌ను స్థాపించారు?
జ: ఆనందమోహన్ బోస్

 

6. 1884లో మద్రాస్ మహాజన సభను స్థాపించింది ఎవరు?
జ: సుబ్రహ్మణ్య అయ్యర్

 

7. ఆధునిక జాతీయతాభావ పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఎవరు?
జ: స్వామి వివేకానంద

 

8. 'ఇల్బర్ట్ బిల్లు భారతీయులకు నేర్పిన గుణపాఠాన్ని విద్యావంతులైన భారతీయులెవరూ మర్చిపోరు' అని వ్యాఖ్యానించింది ఎవరు?
జ: థాంప్సన్ గారట్

 

9. 1883లో కలకత్తాలో ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది ఎవరు?
జ: సురేంద్రనాథ్ బెనర్జీ

 

10. భారత జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించి సరికానిది?
జ: కాంగ్రెస్‌ను అల్ప సంఖ్యాక వర్గాల సంస్థగా విలియం వెడ్డర్‌బర్న్ వ్యాఖ్యానించారు.

 

11. తొలి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హజరైన సభ్యుల సంఖ్య?
జ: 72

 

12. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర పుస్తక రచయిత?
జ: భోగరాజు పట్టాభి సీతారామయ్య

 

13. కింది అంశాలను జతపరచండి.

I) జార్జి యూలె A) మద్రాస్
II) బద్రుద్దీన్ త్యాబ్జి B) అలహాబాద్
III) సరోజినీ నాయుడు C) నాగ్‌పుర్
IV) పి. ఆనందాచార్యులు D) కాన్పూర్

జ: I-B, II-A, III-D, IV-C

 

14. 'ఇండియా' అనే పత్రికను ప్రారంభించింది ఎవరు?
జ: దాదాభాయ్ నౌరోజీ

 

15. 1924లో గాంధీజీ అధ్యక్షత వహించిన కాంగ్రెస్ సమావేశం ఏది?
జ: బెల్గాం

 

16. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నదెవరు?
జ: జె.బి. కృపలానీ

 

17. మితవాద యుగానికి సంబంధించి కిందివాటిలో సరైన అంశం?
జ: రొట్టె కోసం పోరాడిన మితవాదులు రాళ్లు కూడా సంపాదించ లేకపోయారని తిలక్ విమర్శించారు.

 

18. బ్రిటిష్ పాలనను భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్రగా వ్యాఖ్యానించింది ఎవరు?
జ: దాదాభాయ్ నౌరోజీ

 

19. వాయిస్ ఆఫ్ ఇండియా పత్రికను, భారత తంతి సమాచార సంఘాన్ని స్థాపించింది ఎవరు?
జ: ఎ.ఒ. హ్యూమ్

 

20. భారత జాతీయ కాంగ్రెస్‌కు ఆ పేరు సూచించింది ఎవరు?
జ: దాదాభాయ్ నౌరోజీ

 

21. బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడిగా పేరొందిన దాదాభాయ్ నౌరోజీ ఏ నియోజకవర్గం నుంచి గెలిచారు?
జ: సెంట్రల్ ప్రిన్స్‌బరి

 

22. 'స్వదేశీ' అనే పదాన్ని తొలిసారిగా తీర్మానించింది, ప్రతిపాదించింది ఎవరు?
జ: దాదాభాయ్ నౌరోజీ

 

23. 1892 భారత కౌన్సిళ్ల చట్టాన్ని 'బిక్షగాడి జీవితం లాంటిది' అని వ్యాఖ్యానించింది ఎవరు?
జ: ఫిరోజ్ షా మెహతా

 

24. 'ఎ నేషన్ ఇన్ మేకింగ్' అనే గ్రంథ రచయిత ఎవరు?
జ: సురేంద్రనాథ్ బెనర్జీ

 

25. మహారాష్ట్ర సోక్రటీస్‌గా బిరుదు పొందిన వ్యక్తి ఎవరు?
జ: గోపాలకృష్ణ గోఖలే

 

26. రాజద్రోహ నేరంపై అరెస్ట్ అయిన తొలి భారతీయుడు ఎవరు?
జ: తిలక్

 

27. 1905 లో 'సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ' అనే సంస్థను స్థాపించింది ఎవరు?
జ: గోపాలకృష్ణ గోఖలే

 

28. గోపాలకృష్ణ గోఖలేను 'భారతదేశపు వజ్రం'గా పేర్కొన్నది ఎవరు?
జ: తిలక్

 

29. 1905లో అతివాదం తలెత్తడానికి కారణం కాని అంతర్జాతీయ సంఘటన ఏది?
జ: 1905లో కర్జన్ బెంగాల్ విభజన చేయడం

 

30. 1858 విక్టోరియా మహారాణి ప్రకటనను భారతదేశంలో మానవ హక్కుల మాగ్నా కార్టాగా పేర్కొన్నది ఎవరు?
జ: సురేంద్రనాథ్ బెనర్జీ

 

31. 'దేశ భక్తుల్లో రాజు'గా పేరొందిన జాతీయ నాయకుడు ఎవరు?
జ: తిలక్

 

32. అమెరికా నుంచి హోంరూల్ ఉద్యమాన్ని నడిపిన నాయకుడు ఎవరు?
జ: లాలాలజపతిరాయ్

 

33. 1906 లో కలకత్తాలో శివాజీ ఉత్సవాలను రాజకీయ పండుగగా నిర్వహించిన వ్యక్తి ఎవరు?
జ: బాలగంగాధర తిలక్

 

34. వందేమాతరం (ఉర్దూ), పీపుల్ (ఆంగ్లం) పత్రికలను నిర్వహించింది ఎవరు?
జ: లాలాలజపతిరాయ్

 

35. భారతదేశ పారిశ్రామికాభివృద్ధికి 'పైసా ఫండ్' ఏర్పాటు చేసింది ఎవరు?
జ: బాలగంగాధర తిలక్

 

36. మాజినీ (ఇటలీ)ని తన రాజకీయ గురువుగా పేర్కొన్న అతివాద నాయకుడు ఎవరు?
జ: లాలాలజపతిరాయ్

 

37. 'మనపై పడే ప్రతీ దెబ్బ ఆంగ్లేయులు స్వయంగా నిర్మించుకుంటున్న శవపేటికలోకి దిగుతున్న ఒక్కొక్క మేకు' అని వ్యాఖ్యానించింది ఎవరు?
జ: పంజాబ్ కేసరి

 

38. సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీని 1921లో స్థాపించిన నాయకుడు ఎవరు?
జ: లాలాలజపతిరాయ్

 

39. న్యూ ఇండియా అనే ఆంగ్ల వార పత్రికను స్థాపించింది ఎవరు?
జ: బిపిన్ చంద్రపాల్

 

40. పాండిచ్చేరి యోగిగా పేరొందిన అతివాది ఎవరు?
జ: అరవిందో ఘోష్

 

41. వందేమాతర ఉద్యమ కాలంలో 'అమర్‌సోనార్ బంగ్లా' గీతాన్ని రచించింది ఎవరు?
జ: రవీంద్రనాథ్ ఠాగూర్

 

42. ఇండియన్ నేషనలిజం అనే గ్రంథ రచయిత ఎవరు?
జ: బిపిన్ చంద్రపాల్

 

43. వందేమాతర ఉద్యమ కాలంలో నెలకొల్పిన బెంగాల్ జాతీయ కళాశాల తొలి ప్రిన్సిపాల్ ఎవరు?
జ: అరవిందో ఘోష్

 

44. ఏ రోజును జాతీయ సంతాప దినంగా పాటిస్తారు?
జ: 1905, అక్టోబరు 16

 

45. భారతదేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1886

 

46. భారత జాతీయ కాంగ్రెస్ తొలి నామం?
జ: ఇండియన్ నేషనల్ యూనియన్

 

47. 1909 నాటి ఆలీపూర్ బాంబు కేసులో అరెస్టయిన అరవిందో ఘోష్‌ను నిర్దోషిగా నిరూపించింది ఎవరు?
జ: చిత్తరంజన్ దాస్

 

48. ది లైఫ్ డివైన్, సావిత్రి గ్రంథాలను రచించింది ఎవరు?
జ: అరవిందుడు

 

49. ఢిల్లీలో స్వదేశీ/ వందేమాతర ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు?
జ: సయ్యద్ హైదర్‌రజా

 

50. 1905, జులై 19న బెంగాల్ విభజన జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది
జ: 1905, అక్టోబరు 16

 

51. 1905లో బెనారస్‌లో జరిగిన మొదటి భారత పరిశ్రమల సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?
జ: రమేష్‌చంద్ర దత్

 

52. వందేమాతర ఉద్యమానికి సంబంధించి కిందివాటిలో సరైన అంశం ఏది?
ఎ) ఆంధ్రాలో కాకినాడ బాంబు కేసు సంఘటన జరిగింది.
బి) తమిళనాడులో చిదంబరం పిళ్త్లె స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీని స్థాపించారు.
సి) ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ ఉద్యమాన్ని ప్రచారం చేశారు.
డి) పి.సి. రే బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్స్ స్థాపించారు.
జ: బి, సి, డి సరైనవి
 

Posted Date : 02-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌