1. శివాజీ క్రీ.శ.1627 లో ఏ దుర్గంలో జన్మించాడు?
జ: శివనేర్ దుర్గం
2. శివాజీ సంరక్షకుడు ఎవరు?
జ: దాదాజీ కొండదేవ్
3. దశబోధ గ్రంథ రచయిత ఎవరు?
జ: రామదాసు
4. శివాజీ ఏ దుర్గంపై తొలి దండయాత్ర చేశాడు?
జ: తోరణ దుర్గం
5. మరాఠీ భాష ద్వారా మహారాష్ట్రులను ఏకం చేసిందెవరు?
1) తుకారాం వామన్ పండిత్ 2) ఏక్నాథ్
3) నామ్దేవ్, సమర్థ రామదాసు 4) పైవారందరూ
జ: 4(పైవారందరూ)
6. బీజాపూర్ సుల్తాన్ రెండో అలీ ఆదిల్ షా సేనానిని శివాజీ చంపాడు. అతడి పేరేంటి?
జ: అఫ్జల్ఖాన్
7. శివాజీ ఆధ్యాత్మిక మత గురువు?
జ: సమర్థ రామదాసు
8. శివాజీ ఏ మొగలుల నగరాన్ని దోచుకున్నాడు?
జ: సూరత్
9. 1665 లో ఔరంగజేబు సేనాని రాజా జైసింగ్తో శివాజీ చేసుకున్న ఒప్పందం ఏది?
జ: పురంధర్ సంధి
10. క్రీ.శ. 1674 లో శివాజీ ఛత్రపతిగా పట్టాభిషేకం జరుపుకున్న ప్రదేశం?
జ: రాయ్గఢ్
11. శివాజీ పట్టాభిషేకానికి హాజరైన ఆంగ్లేయుడు ఎవరు?
జ: ఆక్సెన్డెన్
12. శివాజీ రాజధాని ఏది?
జ: రాయ్గఢ్
13. 1676 లో గోల్కొండ ఒప్పందం ఎవరి మధ్య జరిగింది?
జ: శివాజీ - హసన్ తానీషా
14. షయిస్తఖాన్ ఎవరు?
జ: మొగల్ సేనాని
15. శివాజీ సమకాలీకుడైన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: ఔరంగజేబు
16. పండరీపురంలోని ప్రసిద్ధ విఠలస్వామి ఆలయాన్ని ధ్వంసం చేసిన బీజాపూర్ సేనాని ఎవరు?
జ: అఫ్జల్ఖాన్
17. శివాజీ పట్టాభిషేకం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?
జ: గార్గభట్
18. శివాజీ మంత్రిమండలి పేరేంటి?
జ: అష్ట ప్రధానులు
19. శివాజీ పరిపాలనకు ఆధారం?
జ: ధర్మశాస్త్రాలు
20. శివాజీ వసూలు చేసిన భూమి శిస్తు ఎంత?
జ: 2/5 వంతు
21. పీష్వా అంటే ...?
జ: ప్రధానమంత్రి
22. అధిక భూమి శిస్తు వసూలు చేసిన మధ్యయుగ పాలకుడు ఎవరు?
జ: శివాజీ
23. శివాజీ రాజ్యానికి ఏమని పేరు?
జ: స్వరాజ్యం
24. చౌత్ (1/4), సర్దేశ్ముఖ్ (1/10) పన్నులను శివాజీ ఎవరి నుంచి వసూలు చేశాడు?
జ: రాజ్యంలో లేని ప్రాంతాల నుంచి
25. అష్ట ప్రధానుల్లో విదేశాంగశాఖ మంత్రి?
జ: సుమంత్
26. క్రీ.శ.17 వ శతాబ్దంలో మహారాష్ట్ర రాజ్య నిర్మాత?
జ: శివాజీ
27. క్రీ.శ. 17 వ శతాబ్దంలో మొగలులకు, దక్కన్ సుల్తాన్లకు మధ్య స్థాపితమైన గొప్ప రాజ్యం?
జ: మహారాష్ట్ర రాజ్యం
28. శివాజీ తండ్రి నుంచి వారసత్వంగా పొందిన జాగీరు ఏది?
జ: పుణె
29. శివాజీ ఏ కొండజాతికి నాయకత్వం వహించాడు?
జ: మావళి
30. శివాజీ తన రాజ్యాన్ని ఎన్ని రకాలుగా విభజించాడు?
జ: 5
31. భూమిని సర్వే చేయడానికి శివాజీ ఉపయోగించిన కొలబద్ద ఏది?
జ: కథి
32. శివాజీ నౌకాదళాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు?
జ: కొలాబ
33. శివాజీ కాలంలో రెవెన్యూ సంస్కరణలను ప్రవేశపెట్టింది?
జ: అన్నా జిత్తు
34. శివాజీకి రాజా అనే బిరుదునిచ్చిన మొగలు చక్రవర్తి ఎవరు?
జ: ఔరంగజేబు
35. శివాజీ గ్రామ పాలనకు నియమించిన అధికారులు ఎవరు?
జ: పటేల్, కులకర్ణి
36. రాజు పట్ల గౌరవంతో చెల్లించే పన్ను ఏది?
జ: సర్దేశ్ముఖి
37. 'శివాజీ మహారాష్ట్రులకు వెలుగు - మొగలుల పాలిట సింహస్వప్నం' అని పేర్కొన్నది ఎవరు?
జ: టి.వి. సర్కార్
38. శివాజీ ఏ సంవత్సరంలో మరణించాడు?
జ: 1680 ఏప్రిల్ 4
39. శివాజీ కుమారుడు ఎవరు?
జ: శంభాజీ
40. 'హైందవ ధర్మోద్ధారక, హిందుత్వ రక్షకుడు' అని ఎవరినంటారు?
జ: శివాజీ
41. శంభాజీని సంగమేశ్వర్ యుద్ధంలో ఓడించిన మొగలు సేనాని ఎవరు?
జ: ముకారిబ్ ఖాన్
42. సాహుకి విద్య బోధించిన ఔరంగజేబు కుమార్తె?
జ: జెబురున్నీసా
43. తారాబాయి ఎవరి భార్య?
జ: రాజారామ్
44. 1713 లో పీష్వా పదవిని ఏర్పాటు చేసింది?
జ: సాహు
45. మొదటి పీష్వా...
జ: బాలాజీ విశ్వనాథ్
46. మహారాష్ట్ర సామ్రాజ్య రెండో స్థాపకుడు ఎవరు?
జ: బాలాజీ విశ్వనాథ్
47. పీష్వాలందరిలో గొప్పవాడు?
జ: మొదటి బాజీరావు
48. హిందూ పద్పద్ షాహీ సిద్ధాంతాన్ని పేర్కొన్నది ఎవరు?
జ: బాలాజీ విశ్వనాథ్
49. నానాసాహెబ్గా ప్రసిద్ధిగాంచిన పీష్వా ఎవరు?
జ: బాలాజీ బాజీరావు
50. 1761 లో మూడో పానిపట్టు యుద్ధం ఏ పీష్వా కాలంలో జరిగింది?
జ: బాలాజీ బాజీరావు