• facebook
  • whatsapp
  • telegram

సంగం యుగం

1. సంగం యుగం నాటి కవి, పండితులను పోషించిన రాజవంశం ఏది?
జ: పాండ్య

 

2. 'సంగం' గురించి మొదట ప్రస్తావించింది ఎవరు?
జ: తిరునావుక్కరసు

 

3. సంగం అంటే...?
జ: కవి పండిత పరిషత్

 

4. మొదటి సంగాన్ని ఎక్కడ నిర్వహించారు?
జ: తెన్‌మదురై

 

5. రెండో సంగానికి సంబంధించి లభిస్తున్న ఏకైక గ్రంథం ఏది?
జ: తొల్కప్పియర్

 

6. కిందివాటిలో సంగం సాహిత్యంలో భాగం కానిది?
ఎ) ఎట్టుతొగై       బి) పత్తుప్పాట్టు       సి) పదినెన్ కీల్‌కనక్కు       డి) మత్తవిలాస ప్రహసనం
జ: డి (మత్తవిలాస ప్రహసనం)

 

7. తొల్కప్పియం గ్రంథం ఏ విషయానికి సంబంధించింది?
జ: వ్యాకరణం

 

8. మధురైక్కంజి గ్రంథ రచయిత ఎవరు?
జ: మంగుడి మరుదన్

 

9. సంగం యుగం నాటి 'కురింజి' విభాగం దేనికి సంబంధించింది?
జ: కొండలు

 

10. కురల్ గ్రంథ రచయిత ఎవరు?
జ: తిరువళ్లువార్

 

11. తమిళ భూమికి చెందిన బైబిల్‌గా ప్రసిద్ధిచెందిన గ్రంథం ఏది?
జ: తిరుక్కురల్

 

12. శిలప్పధికారం గ్రంథ రచయిత ఎవరు?
జ: ఇలంగో అడిగల్

 

13. సంగం యుగం నాటి లలితకళల అభివృద్ధి గురించి తెలిపే గ్రంథం ఏది?
జ: మణిమేఖలై

 

14. దక్షిణ భారత రాజ్యాల్లో మెగస్తనీస్ పేర్కొన్న మొదటి రాజ్యం ఎవరిది?
జ: పాండ్యులు

 

15. తమిళ రాజ్యాల గురించి ప్రస్తావించిన మొదట శాసనం ఏది?
జ: అశోకుని శాసనాలు

 

16. నక్కీరర్ ఎవరి ఆస్థాన కవి?
జ: నెడుం జెళియన్

 

17. సంగం యుగం నాటి చోళుల రాజధాని?
జ: ఉరయూర్

 

18. సంగం యుగం నాటి చోళుల్లో ప్రసిద్ధుడు?
జ: కరికాలుడు

 

19. చేర రాజుల రాజధాని ఏది?
జ: వంజి

 

20. చేర రాజుల్లో గొప్పవాడు ఎవరు?
జ: సెంగుట్టువాన్

 

21. చోళుల భూభాగాన్ని ఏమని పిలిచేవారు?
జ: తొండై మండలం

 

22. కొర్కై (Korkai) ఎవరి ఓడ రేవు?
జ: పాండ్యులు

 

23. చోళుల రాజ చిహ్నం ఏది?
జ: పులి

 

24. సంగం యుగంలో రాజు పుట్టినరోజు సంబరాలను ఏమని పిలిచేవారు?
జ: పెరునాల్

 

25. రాజ్యాన్ని ఎలా విభజించారు?
జ: మండలం

 

26. తీర ప్రాంత పట్టణాన్ని ఏమని పిలిచేవారు?
జ: పట్టిణం

 

27. సంగం యుగంలో రథాలను లాగేందుకు ఉపయోగించిన జంతువులు ఏవి?
ఎ) ఎద్దులు       బి) గుర్రాలు       సి) ఎ, బి       డి) ఏనుగులు
జ: సి (ఎద్దులు, గుర్రాలు)

 

28. సైనికుల శరీరాన్ని కాపాడటానికి ఏ జంతువు చర్మంతో తయారుచేసిన కవచాన్ని వాడేవారు?
జ: పులి

 

29. యుద్ధంలో మరణించిన సైనికుల జ్ఞాపకార్థం పాతే రాళ్లను ఏమని పిలిచేవారు?
జ: వీరక్కల్

 

30. సంగం యుగంలో కిందివాటిలో క్రూరమైన నేరం కానిది?
జ: పన్నులు చెల్లించకపోవడం

 

31. సంగం యుగంలో రైతులను ఏమని పిలిచేవారు?
జ: వెల్లాలర్

 

32. సంగం యుగంనాటి ముఖ్య దేవత?
జ: మురుగన్

 

33. కిందివాటిలో మురుగన్‌కు మరో పేరు కానిది?
ఎ) కార్తికేయ       బి) సుబ్రమణ్యం       సి) స్కంద       డి) భాస్కర
జ: డి (భాస్కర)

 

34. సంగం కాలంలో కృష్ణుడిని పూజించిన వర్గం?
జ: గొర్రెల కాపరులు

 

35. ఉరయూర్ ఏ వ్యాపారానికి ప్రసిద్ధిగాంచింది?
జ: నూలు వస్త్రాలు

 

36. సంగం యుగంనాటి తమిళులు ఏ దేశంతో విదేశీ వ్యాపారం నిర్వహించలేదు?
జ: చైనా

 

37. సంగం యుగంలో దక్షిణ భారతదేశాన్ని సందర్శించిన గ్రీకు, రోమన్ వర్తకులను తమిళ సాహిత్యంలో ఏమని పేర్కొన్నారు?
జ: యవనులు

 

38. సంగం సాహిత్యంలో గొప్ప పురాణ గ్రంథం కానిది?
జ: పత్తుప్పాట్టు

 

39. సంగం యుగం చివరి కాలంలో చేర రాజులతో నిరంతరం యుద్ధాలు చేసిన రాజవంశం ఏది?
జ: పాండ్య

 

40. సంగం యుగంనాటి గూఢచారులను ఏమని పిలిచేవారు?
జ: ఒర్రర్

 

41. మండలాన్ని ఎలా విభజించారు?
జ: నాడు

 

42. చోళరాజు కరికాలుడు కావేరి నదిపై నిర్మించిన ఆనకట్ట వల్ల నీటిపారుదల సౌకర్యం పొందిన ప్రాంతం ఏది?
జ: దక్షిణ తంజావూర్

 

43. సంగం యుగ కాలంలో రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతి చేసిన జంతువు/ పక్షి ఏది?
జ: నెమలి

 

44. క్రీ.పూ.20లో రోమన్ చక్రవర్తి అగస్టస్ ఆస్థానానికి రాయబారిని పంపిన తమిళ రాజు ఏ రాజ్యానికి చెందినవాడు?
జ: పాండ్య

 

45. కిందివాటిలో ప్రధానంగా దిగుమతి చేసుకున్నది?
ఎ) బంగారం, వెండి       బి) కుండలు       సి) మద్యం       డి) వస్త్రాలు
జ: ఎ (బంగారం, వెండి)

 

46. కన్నగి విగ్రహాన్ని రూపొందించడానికి హిమాలయాల నుంచి రాయిని తీసుకువచ్చినట్లుగా ఏ చేర రాజు గురించి చెబుతారు?
జ: సెంగుట్టవాన్

 

47. రోమన్లు ఏ విషయంలో భారతీయ జీవనాన్ని, సంస్కృతిని పెద్దగా ప్రభావితం చేయలేదు?
జ: అలంకరణ

 

48. కింది సంగం యుగం నాటి గ్రంథాల్లో బౌద్ధ మతం గురించి గొప్పగా పేర్కొన్నది?
ఎ) మణిమేఖలై       బి) శిలప్పధికారం       సి) కురల్       డి) తొల్కప్పియం
జ: ఎ (మణిమేఖలై)

 

49. పుహార్‌లో ఏ దేవుని గౌరవార్థం గొప్ప పండుగను నిర్వహించినట్లు సంగం పురాణాల్లో పేర్కొన్నారు?
జ: ఇంద్రుడు

 

50. ఎక్కడ నిర్వహించిన పురావస్తు తవ్వకాలు దక్షిణ భారతదేశంతో రోమన్‌ల వ్యాపారం గురించి తెలియజేయడం లేదు?
జ: పల్లవనేశ్వరం

 

51. పుహార్‌లోని మత్స్యకారుల జీవితం గురించి తెలియజేసే గ్రంథం ఏది?
జ: పట్టినప్పాలై

 

52. సంగం యుగం నాటి ప్రధాన ఎగుమతుల్లో ఒకటి కానిది?
జ: ఉల్లిపాయలు

Posted Date : 03-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌