1. విష్ణుకుండినుల వంశ స్థాపకుడు ఎవరు?
జ: ఇంద్ర వర్మ
2. విష్ణుకుండినుల రాజభాష ఏది?
జ: సంస్కృతం
3. విష్ణుకుండినుల్లో గొప్పవాడు ఎవరు?
జ: రెండో మాధవ వర్మ
4. వి.పి.కృష్ణశాస్త్రి ప్రకారం... విష్ణుకుండినుల రాజధాని నగరం ఏది?
జ: కీసర
5. రామతీర్థ శాసనాన్ని వేయించిన విష్ణుకుండినుల రాజు ఎవరు?
జ: ఇంద్ర వర్మ
6. విష్ణుకుండినులు ఎవరి భక్తులు?
జ: శ్రీ పర్వత స్వామి
7. ప్రియపుత్రుడు అనే బిరుదు ఎవరిది?
జ: ఇంద్ర వర్మ
8. ఇంద్రపురం/ ఇంద్రపాలపురాన్ని నిర్మించింది ఎవరు?
జ: ఇంద్ర వర్మ
9. పి.వి.పరబ్రహ్మశాస్త్రి ప్రకారం.. విష్ణుకుండినుల రాజధాని ఏది?
జ: ఇంద్రపాల నగరం
10. విక్రమాశ్రయ అనే బిరుదు ఎవరిది?
జ: గోవింద వర్మ
11. గోవింద వర్మ పట్టమహిషి పేరు ఏమిటి?
జ: మహాదేవి
12. రాజధానిని ఇంద్రపాలపురం నుంచి అమరావతికి మార్చింది ఎవరు?
జ: రెండో మాధవ వర్మ
13. ఉండవల్లి గుహలలో పూర్ణకుంభాన్ని చెక్కించింది ఎవరు?
జ: రెండో మాధవ వర్మ
14. కీసరగుట్టలో రామలింగేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు?
జ: రెండో మాధవ వర్మ
15. ఇంద్రపాలపురంలో బౌద్ధ బిక్షువులకు మహావిహారాన్ని నిర్మించింది ఎవరు?
జ: మహాదేవి
16. మహాదేవి ఏ మతాభిమాని?
జ: బౌద్ధ
17. కిందివాటిలో విష్ణుకుండినుల రాజచిహ్నం ఏది?
1) పంజా ఎత్తిన పులి 2) పరిగెత్తే గుర్రం
3) పరిగెత్తే ఏనుగు 4) పంజా ఎత్తిన సింహం
జ: 4 (పంజా ఎత్తిన సింహం)
18. రాజసూయ, అశ్వమేథ, నరమేథ యాగాలు చేసిన విష్ణుకుండినుల రాజు ఎవరు?
జ: రెండో మాధవ వర్మ
19. కిందివారిలో మహాకవి అనే బిరుదు పొందిన రాజును గుర్తించండి.
1) మంచన భట్టారక వర్మ 2) నాలుగో మాధవ వర్మ
3) విక్రమేంద్ర వర్మ 4) ఇంద్ర భట్టారక వర్మ
జ: 3 (విక్రమేంద్ర వర్మ)
20. విష్ణుకుండినుల నాణేలపై ఏయే చిహ్నాలు ఉండేవి?
1) శంఖువు - గరుడ 2) శంఖువు - ఎద్దు
3) శంఖువు - సింహం 4) శంఖువు - ఓడ
జ: 3 (శంఖువు - సింహం)
21. మహాదేవి నిర్మించిన విహారానికి విక్రమేంద్ర వర్మ ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు?
జ: ఇరుందెర
22. మొదటి ఈపూరు శాసనంను వేయించింది ఎవరు?
జ: రెండో మాధవ వర్మ
23. తెలుగులో తొలి వాక్యం ఏది?
జ: విజయరాజ్య సంవత్సరంబుల్
24. బ్రాహ్మణులకు తుండి గ్రామాన్ని దానం చేసిన విష్ణుకుండినుల రాజు ఎవరు?
జ: విక్రమేంద్ర భట్టారక వర్మ
25. కీసరగుట్ట సమీపంలోని ఘటకేశ్వర్ ఘటికా స్థానాన్ని స్థాపించింది ఎవరు?
జ: ఇంద్ర భట్టారక వర్మ
26. గోవింద వర్మ ఏ గ్రామాన్ని బౌద్ధ విహారానికి దానంగా ఇచ్చాడు?
జ: పెన్కపుర
27. అమరేశ్వరం, రామేశ్వరం మల్లిఖార్జున ఆలయాలను నిర్మించింది ఎవరు?
జ: రెండో మాధవ వర్మ
28. జనాశ్రయ అనే బిరుదు పొందిన రాజు ఎవరు?
జ: నాలుగో మాధవ వర్మ
29. ఏ తామ్ర శాసనంలో 'విజయరాజ్య సంవత్సరంబుల్' అనే తెలుగు వాక్యం ఉంది?
జ: చిక్కుళ్ల తామ్ర శాసనం
30. జనాశ్రయ చంధోవిచ్ఛితి గ్రంథ రచయిత ఎవరు?
జ: గుణ స్వామి
31. రాజధాని నగరాన్ని అమరావతి నుంచి దెందులూరుకు మార్చింది ఎవరు?
జ: విక్రమేంద్ర భట్టారక వర్మ
32. ఘటికలు అంటే ఏమిటి?
జ: విద్యా కేంద్రాలు
33. ఇంద్రపాల నగరం ఏ జిల్లాలో ఉంది?
జ: నల్గొండ
34. గుల్మికుడు అని ఎవరిని అంటారు?
జ: సైనిక రాజ ప్రతినిధిని
35. ఉండవల్లి గుహలు ప్రస్తుతం ఏ జిల్లాలో ఉన్నాయి?
జ: కృష్ణా
36. హస్తికోశుడు అని ఎవరిని అనేవారు?
జ: గజదళాధిపతిని
37. విషయాల అధిపతులను ఏమనేవారు?
జ: అధికార పురుషులు - మహోత్తరులు
38. విష్ణుకుండినుల కాలంలో ఉపనిషత్తులను అధ్యయనం చేసింది ఎవరు?
జ: భావశర్మ
39. విష్ణుకుండినుల కాలంలో గొప్ప బౌద్ధ క్షేత్రం ఏది?
జ: బొజ్జన్న కొండ
40. పండిన పంటలో రాజ్యభాగాన్ని నిర్ణయించే అధికారిని ఏమని పిలిచేవారు?
జ: పలదారుడు
41. విష్ణుకుండినుల్లో చివరి పాలకుడు ఎవరు?
జ: మంచన భట్టారక వర్మ
42. కిందివారిలో విష్ణుకుండినుల కాలంనాటి బౌద్ధ పండితుడిని గుర్తించండి.
1) బహు బలబల 2) దశ బలబల
3) మేఘ బలబల 4) మహా బలబల
జ: 2 (దశ బలబల)
43. విష్ణుకుండినుల పరిపాలనను తెలియజేసే శాసనం ఏది?
జ: తుమ్మలగూడెం శాసనం
44. ఉండవల్లి గుహల్లో ఎన్ని అంతస్తులు ఉన్నాయి?
జ: 4 అంతస్తులు
45. విష్ణుకుండినుల కాలం నాటి ప్రసిద్ధ ఘటిక ఏది?
జ: ఘటకేశ్వర్