• facebook
  • whatsapp
  • telegram

విష్ణుకుండినులు

1. విష్ణుకుండినుల వంశ స్థాపకుడు ఎవరు?
జ: ఇంద్ర వర్మ

 

2. విష్ణుకుండినుల రాజభాష ఏది?
జ: సంస్కృతం

 

3. విష్ణుకుండినుల్లో గొప్పవాడు ఎవరు?
జ: రెండో మాధవ వర్మ

 

4. వి.పి.కృష్ణశాస్త్రి ప్రకారం... విష్ణుకుండినుల రాజధాని నగరం ఏది?
జ: కీసర

 

5. రామతీర్థ శాసనాన్ని వేయించిన విష్ణుకుండినుల రాజు ఎవరు?
జ: ఇంద్ర వర్మ

 

6. విష్ణుకుండినులు ఎవరి భక్తులు?
జ: శ్రీ పర్వత స్వామి

 

7. ప్రియపుత్రుడు అనే బిరుదు ఎవరిది?
జ: ఇంద్ర వర్మ

 

8. ఇంద్రపురం/ ఇంద్రపాలపురాన్ని నిర్మించింది ఎవరు?
జ: ఇంద్ర వర్మ

 

9. పి.వి.పరబ్రహ్మశాస్త్రి ప్రకారం.. విష్ణుకుండినుల రాజధాని ఏది?
జ: ఇంద్రపాల నగరం

 

10. విక్రమాశ్రయ అనే బిరుదు ఎవరిది?
జ: గోవింద వర్మ

 

11. గోవింద వర్మ పట్టమహిషి పేరు ఏమిటి?
జ: మహాదేవి

 

12. రాజధానిని ఇంద్రపాలపురం నుంచి అమరావతికి మార్చింది ఎవరు?
జ: రెండో మాధవ వర్మ

 

13. ఉండవల్లి గుహలలో పూర్ణకుంభాన్ని చెక్కించింది ఎవరు?
జ: రెండో మాధవ వర్మ

 

14. కీసరగుట్టలో రామలింగేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు?
జ: రెండో మాధవ వర్మ

 

15. ఇంద్రపాలపురంలో బౌద్ధ బిక్షువులకు మహావిహారాన్ని నిర్మించింది ఎవరు?
జ: మహాదేవి

 

16. మహాదేవి ఏ మతాభిమాని?
జ: బౌద్ధ

 

17. కిందివాటిలో విష్ణుకుండినుల రాజచిహ్నం ఏది?
1) పంజా ఎత్తిన పులి                                      2) పరిగెత్తే గుర్రం            
3) పరిగెత్తే ఏనుగు                                          4) పంజా ఎత్తిన సింహం
జ: 4 (పంజా ఎత్తిన సింహం)

 

18. రాజసూయ, అశ్వమేథ, నరమేథ యాగాలు చేసిన విష్ణుకుండినుల రాజు ఎవరు?
జ: రెండో మాధవ వర్మ

 

19. కిందివారిలో మహాకవి అనే బిరుదు పొందిన రాజును గుర్తించండి.
1) మంచన భట్టారక వర్మ                                 2) నాలుగో మాధవ వర్మ
3) విక్రమేంద్ర వర్మ                                           4) ఇంద్ర భట్టారక వర్మ
జ: 3 (విక్రమేంద్ర వర్మ)   

 

20. విష్ణుకుండినుల నాణేలపై ఏయే చిహ్నాలు ఉండేవి?
1) శంఖువు - గరుడ                                      2) శంఖువు - ఎద్దు
3) శంఖువు - సింహం                                    4) శంఖువు - ఓడ
జ: 3 (శంఖువు - సింహం)

 

21. మహాదేవి నిర్మించిన విహారానికి విక్రమేంద్ర వర్మ ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు?
జ: ఇరుందెర

 

22. మొదటి ఈపూరు శాసనంను వేయించింది ఎవరు?
జ: రెండో మాధవ వర్మ

 

23. తెలుగులో తొలి వాక్యం ఏది?
జ: విజయరాజ్య సంవత్సరంబుల్

 

24. బ్రాహ్మణులకు తుండి గ్రామాన్ని దానం చేసిన విష్ణుకుండినుల రాజు ఎవరు?
జ: విక్రమేంద్ర భట్టారక వర్మ

 

25. కీసరగుట్ట సమీపంలోని ఘటకేశ్వర్ ఘటికా స్థానాన్ని స్థాపించింది ఎవరు?
జ: ఇంద్ర భట్టారక వర్మ

 

26. గోవింద వర్మ ఏ గ్రామాన్ని బౌద్ధ విహారానికి దానంగా ఇచ్చాడు?
జ: పెన్కపుర

 

27. అమరేశ్వరం, రామేశ్వరం మల్లిఖార్జున ఆలయాలను నిర్మించింది ఎవరు?
జ: రెండో మాధవ వర్మ

 

28. జనాశ్రయ అనే బిరుదు పొందిన రాజు ఎవరు?
జ: నాలుగో మాధవ వర్మ

 

29. ఏ తామ్ర శాసనంలో 'విజయరాజ్య సంవత్సరంబుల్' అనే తెలుగు వాక్యం ఉంది?
జ: చిక్కుళ్ల తామ్ర శాసనం

 

30. జనాశ్రయ చంధోవిచ్ఛితి గ్రంథ రచయిత ఎవరు?
జ: గుణ స్వామి

 

31. రాజధాని నగరాన్ని అమరావతి నుంచి దెందులూరుకు మార్చింది ఎవరు?
జ: విక్రమేంద్ర భట్టారక వర్మ

 

32. ఘటికలు అంటే ఏమిటి?
జ: విద్యా కేంద్రాలు

 

33. ఇంద్రపాల నగరం ఏ జిల్లాలో ఉంది?
జ: నల్గొండ

 

34. గుల్మికుడు అని ఎవరిని అంటారు?
జ: సైనిక రాజ ప్రతినిధిని

 

35. ఉండవల్లి గుహలు ప్రస్తుతం ఏ జిల్లాలో ఉన్నాయి?
జ: కృష్ణా

 

36. హస్తికోశుడు అని ఎవరిని అనేవారు?
జ: గజదళాధిపతిని

 

37. విషయాల అధిపతులను ఏమనేవారు?
జ: అధికార పురుషులు - మహోత్తరులు

 

38. విష్ణుకుండినుల కాలంలో ఉపనిషత్తులను అధ్యయనం చేసింది ఎవరు?
జ: భావశర్మ

 

39. విష్ణుకుండినుల కాలంలో గొప్ప బౌద్ధ క్షేత్రం ఏది?
జ: బొజ్జన్న కొండ

 

40. పండిన పంటలో రాజ్యభాగాన్ని నిర్ణయించే అధికారిని ఏమని పిలిచేవారు?
జ: పలదారుడు

 

41. విష్ణుకుండినుల్లో చివరి పాలకుడు ఎవరు?
జ: మంచన భట్టారక వర్మ

 

42. కిందివారిలో విష్ణుకుండినుల కాలంనాటి బౌద్ధ పండితుడిని గుర్తించండి.
1) బహు బలబల                                         2) దశ బలబల              
3) మేఘ బలబల                                         4) మహా బలబల
జ: 2 (దశ బలబల)

 

43. విష్ణుకుండినుల పరిపాలనను తెలియజేసే శాసనం ఏది?
జ: తుమ్మలగూడెం శాసనం

 

44. ఉండవల్లి గుహల్లో ఎన్ని అంతస్తులు ఉన్నాయి?
జ: 4 అంతస్తులు

 

45. విష్ణుకుండినుల కాలం నాటి ప్రసిద్ధ ఘటిక ఏది?
జ: ఘటకేశ్వర్
 

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌