• facebook
  • whatsapp
  • telegram

  భారత రాజ్యాంగ రచన - స్వభావం

పరిపాలనకు పరమ శాసనం

ప్రజాస్వామ్య పాలనకు, అందరికీ ఆమోదనీయమైన, అనుకూలమైన చట్టాల రూపకల్పనకు, పౌర హక్కుల నిర్వచనానికి, సామాజిక న్యాయానికి, సంక్షేమానికి 


మౌలిక ఆధారం మన రాజ్యాంగం. ఎందరో మహానుభావుల మహోన్నత కృషితో రూపొందింది. దశాబ్దాల కాలపరీక్షలను దాటి ఇప్పటికీ, ఎప్పటికీ  తిరుగులేని పరమ శాసనంగా నిలిచింది. అంతటి అత్యున్నతమైన ఆ రాజ్యాంగ రచన జరిగిన విధానం, దాని స్వభావంపై పోటీ పరీక్షల్లో తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. ఆ ప్రశ్నల సరళిపై అభ్యర్థులు తగిన అవగాహన పెంపొందించుకోవడానికి రకరకాల బిట్లను ప్రాక్టీస్‌ చేయాలి. 


1. రాజ్యాంగానికి సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) దేశ పరిపాలనను వివరించే అత్యున్నతమైన శాసనం.

బి) ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం అమెరికా.

సి) బ్రిటన్‌ దేశానికి లిఖిత రాజ్యాంగం లేదు.

డి) ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం భారత్‌.

జవాబు : ఎ, బి, సి, డి


2. ‘రాజ్యాంగం’ అనే భావనను తొలిసారిగా శాస్త్రీయంగా ప్రతిపాదించినవారు?

జవాబు : అరిస్టాటిల్‌ 


 

3. ‘స్వరాజ్‌’ అనేది బ్రిటిష్‌వారు ప్రసాదించే ఉచిత కానుక కాదని, అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణ అని 1922, జనవరి 5న గాంధీజీ ఏ పత్రికలో పేర్కొన్నారు?

జవాబు : యంగ్‌ ఇండియా  


4. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు ‘రాజ్యాంగ సభ’ను ఏర్పాటు చేయాలని 1934లో ఆంగ్లేయులను తొలిసారిగా డిమాండ్‌ చేసిన భారతీయుడు?

జవాబు : మానవేంద్రనాథ్‌ రాయ్‌ 


5. జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశం రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని తొలిసారి అధికారికంగా ఆంగ్లేయులను డిమాండ్‌ చేసింది. అది ఎక్కడ జరిగింది?    

జవాబు :  ఫైజ్‌పుర్‌  


6. భారతీయులతో కూడిన రాజ్యాంగ సభ ద్వారా రాజ్యాంగ రచన జరిగితే మన దేశం ఎదుర్కొంటున్న కుల, మత వర్గాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని 1939లో ‘హరిజన్‌’ అనే పత్రికలో ఎవరు పేర్కొన్నారు?

జవాబు : మహాత్మా గాంధీ


7. ‘భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను, ఇలాంటి దేశంలో అంటరానితనం, మత్తు పానీయాలు, మత్తు మందులు అనే శాపం ఉండరాదు’ అని 1931లో గాంధీజీ ఏ పత్రికలో వ్యాఖ్యానించారు?

జవాబు : యంగ్‌ ఇండియా   


8. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు ‘రాజ్యాంగ సభ/రాజ్యాంగ పరిషత్‌’ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆంగ్లేయులు తొలిసారిగా దేని ద్వారా గుర్తించారు?

జవాబు : ఆగస్టు ప్రతిపాదనలు - 1940


  
9. భారతీయులకు అవసరమైన రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తామని ఆంగ్లేయులు తొలిసారి అధికారికంగా ఎప్పుడు ప్రతిపాదించారు?

జవాబు : క్రిప్స్‌ రాయబారం - 1942  


 


10. మహాత్మా గాంధీ కింద పేర్కొన్న దేన్ని ‘పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌’గా అభివర్ణించి తిరస్కరించారు?

1) ఆగస్టు ప్రతిపాదనలు - 1940          2) క్రిప్స్‌ రాయబారం - 1942 

3) మంత్రిత్రయ రాయబారం - 1946       4) సిమ్లా సమావేశం - 1944

జవాబు : క్రిప్స్‌ రాయబారం - 1942 

 


11. త్వరలోనే రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికైన శాసన సభ్యులు రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకుంటారని 1945, సెప్టెంబరు 19న దిల్లీలోని ఆలిండియా రేడియో కేంద్రం నుంచి ప్రకటించినవారు?

జవాబు : లార్డ్‌ వేవెల్‌   


12.  బ్రిటన్‌ ప్రధాని క్లెమెంట్‌ అట్లీ మంత్రిత్రయ రాయబారం/కేబినెట్‌ మిషన్‌ను భారతదేశానికి ఎప్పుడు పంపారు?

జవాబు : 1946, మార్చి 24   



13. కిందివారిలో మంత్రిత్రయ రాయబారం/కేబినెట్‌ మిషన్‌లో లేని సభ్యులు?

1) పెథిక్‌ లారెన్స్‌   2) స్టాఫర్డ్‌ క్రిప్స్‌    3) బిర్కెన్‌హెడ్‌    4) ఎ.వి.అలెగ్జాండర్‌

జవాబు : బిర్కెన్‌హెడ్‌ 


14. రాజ్యాంగ సభ ఎన్నికలకు సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) కేబినెట్‌ మిషన్‌ సిఫార్సుల మేరకు 1946లో జరిగాయి.     2) ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. 

3) పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి.     4) పరిమిత ఓటింగ్‌తో ఎన్నికలు జరిగాయి.

 జవాబు : ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. 

 


15. రాజ్యాంగ పరిషత్‌కు నిర్దేశించిన ప్రాతినిధ్యానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

 1) బ్రిటిష్‌ పాలిత రాష్ట్రాల నుంచి 292 మంది      2) స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది

3) కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నలుగురు       4) స్వయం ప్రతిపత్తి ప్రాంతాల నుంచి 9 మంది

జవాబు : స్వయం ప్రతిపత్తి ప్రాంతాల నుంచి 9 మంది



16. రాజ్యాంగ పరిషత్‌/రాజ్యాంగ సభకు వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించిన వారికి సంబంధించి సరైన జతను గుర్తించండి.

a) స్వతంత్ర అభ్యర్థులు       i) 3

b) ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌    ii) 73

c) ముస్లిం లీగ్‌     iii) 7

d) యూనియనిస్ట్‌ మహ్మదీయ పార్టీ     iv) 202

జవాబు : a - iii, b - iv, c - ii, d - i 


17. రాజ్యాంగ సభ ఎన్నికలకు (1946) సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభకు ఎన్నికైన మొత్తం సభ్యుల సంఖ్య - 38    2) ఎస్సీ వర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య - 26

3) ఎస్టీ వర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య - 23     4) రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళల సంఖ్య - 15

 జవాబు : ఎస్టీ వర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య - 23


  
18. కిందివారిలో రాజ్యాంగ సభకు విశిష్ట వ్యక్తులుగా నామినేట్‌ అయిన వారిలో లేనివారు? 

1) అనంతశయనం అయ్యంగార్‌    2) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌      3) ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌    4) కె.టి.షా 

జవాబు : అనంతశయనం అయ్యంగార్‌  


19. రాజ్యాంగ సభ ఎన్నికలకు సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభకు ఎన్నికైన ఏకైక ముస్లిం మహిళ బేగం ఎయిజాజ్‌ రసూల్‌.      2) రాజ్యాంగ సభకు ఎన్నిక కాని ప్రముఖులు మహాత్మా గాంధీ, మహ్మద్‌ అలీ జిన్నా.

3) రాజ్యాంగ సభలో ప్రతి ప్రావిన్స్‌ నుంచి సుమారు 10 లక్షల మంది జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించారు.    4) స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్య 289. 

జవాబు : స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్య 289. 



20. హైదరాబాద్‌ సంస్థానం నుంచి 15 మంది ప్రతినిధులను రాజ్యాంగ సభకు ఎప్పుడు నామినేట్‌ చేశారు? 

జవాబు : 1948 నవంబరు    



21. రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళలు, వారి ప్రత్యేకతలకు సంబంధించి సరైన జతను గుర్తించండి.

a) భారత్‌లో తొలి మహిళా గవర్నరు       i) సరోజిని నాయుడు

b) భారత్‌లో తొలి మహిళా ముఖ్యమంత్రి     ii) సుచేతా కృపలానీ 

c) భారత్‌లో తొలి మహిళా కేబినెట్‌ మంత్రి     iii) విజయలక్ష్మి పండిట్‌

d) యూఎన్‌ఓ సాధారణ సభకు తొలి మహిళా అధ్యక్షురాలు     iv) రాజకుమారి అమృతకౌర్‌ 

జవాబు : a - i, b - ii, c - iv, d - iii 


22. రాజ్యాంగ సభకు ఎన్నికైన ఎవరు కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డ్‌కు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా వ్యవహరించారు?

జవాబు : దుర్గాబాయి దేశ్‌ముఖ్‌   
 

23. రాజ్యాంగ సభకు ఎన్నికైన ప్రముఖ మహిళ హంసామెహతాకు సంబంధించి కిందివాటిలో సరైంది?

1) రాజ్యాంగ సభ సమావేశాల్లో మహిళలకు ప్రాతినిధ్యం వహించారు.    2) 1947 జులై 22న రాజ్యాంగ సభలో జాతీయ పతాకాన్ని ప్రతిపాదించి ఎగురవేశారు. 

3) 1, 2       4) రాజ్యాంగ సభకు రాజీనామా చేసిన ఏకైక మహిళ. 

జవాబు : 1, 2



24. రాజ్యాంగ సభకు ఎన్నికైన ఎవరు ‘హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌’ గ్రంథాన్ని రాశారు?

జవాబు : భోగరాజు పట్టాభి సీతారామయ్య



25. రాజ్యాంగ సభకు ఎన్నికైన ప్రముఖ తెలుగు వ్యక్తులు, వారి ప్రత్యేకతలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. 

a) టంగుటూరి  ప్రకాశం పంతులు i) కర్నూలు సర్క్యులర్‌ రూపకర్త

b) నీలం సంజీవరెడ్డి      ii) ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి

c) కళా వెంకట్రావు       iii) ప్రముఖ రైతు ఉద్యమ నాయకులు

d) ఆచార్య ఎన్‌.జి.రంగా   iv) ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి

జవాబు : a - ii, b - iv, c - i, d - iii  



26. రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభ జరిపిన ప్రయత్నాల్లో కిందివాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభ రాజ్యాంగ రచనకు నిర్వహించిన సమావేశాలు - 11        2) రాజ్యాంగ సభ రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసిన కమిటీలు - 22

3) రాజ్యాంగ సభ నిర్వహించిన మొత్తం సమావేశాలు - 13         4) రాజ్యాంగ రచనకు అయిన వ్యయం - రూ.64 లక్షలు

జవాబు : రాజ్యాంగ సభ నిర్వహించిన మొత్తం సమావేశాలు - 13


భారత రాజ్యాంగ రచన - స్వభావం - 2

అది ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ! 

భారత రాజ్యాంగ రచన వెనుక ఎందరో మేధావుల అపారమైన కృషి ఉంది. అంబేడ్కర్‌ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ రచనా సంఘం అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, ఎన్నో చర్చలు, జరిపి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఏర్పాటైన వివిధ కమిటీలు విస్తృత పరిశీలన, మేధోమథనంతో ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఆధునిక, అభ్యుదయ, పురోగామి అంశాలతో రాజ్యాంగ స్వరూప స్వభావాలను మలిచాయి. ఈ మహాక్రతువు జరిగిన క్రమం, వివిధ కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రముఖులు, వారి అభిప్రాయాలు, వ్యాఖ్యల గురించి పోటీ పరీక్షార్థులు వివరంగా తెలుసుకోవాలి.

 

1. కింద పేర్కొన్న వాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభకు కార్యదర్శి హెచ్‌.వి.ఆర్‌.అయ్యంగార్‌      2) రాజ్యాంగ సభకు తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్‌ సచ్చిదానంద సిన్హా

3) రాజ్యాంగ సభకు ముఖ్య లేఖకుడు ఎస్‌.ఎన్‌.ముఖర్జీ      4) రాజ్యాంగ సభకు గౌరవ సలహాదారుడు జవహర్‌లాల్‌ నెహ్రూ

జవాబు : రాజ్యాంగ సభకు గౌరవ సలహాదారుడు జవహర్‌లాల్‌ నెహ్రూ



2.  బెనగళ నరసింగరావు (బి.ఎన్‌.రావు)కు సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభకు సలహాదారుడిగా వ్యవహరించారు.      2) చిత్తు రాజ్యాంగ రూపకర్తగా పేరొందారు.

3) రాజ్యాంగ సభకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.       4) అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసిన తొలి భారతీయుడు.

జవాబు : రాజ్యాంగ సభకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.



3. రాజ్యాంగ రూపకల్పనలో ‘రాజ్యాంగ సభ’ నిర్వహించిన విధులకు సంబంధించి కిందివాటిలో సరైంది? 

1) 1946, డిసెంబరు 9 నుంచి 1947, ఆగస్టు 15 మధ్య రాజ్యాంగ రచనా విధులను మాత్రమే నిర్వహించింది.  

2) 1947, ఆగస్టు 15 నుంచి 1949, నవంబరు 26 మధ్య రాజ్యాంగ రచనా విధులతోపాటు దేశపాలనకు అవసరమైన శాసన రూపకల్పన విధులను నిర్వర్తించింది.

3) 1949, నవంబరు 26 నుంచి 1952, మే 13 మధ్య శాసన విధులను నిర్వర్తిస్తూ దేశానికి తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది. 

4) పైవన్నీ

జవాబు : పైవన్నీ 


4. రాజ్యాంగ రచన కోసం ‘రాజ్యాంగ సభ’ ఏర్పాటు చేసిన విషయ నిర్ణాయక కమిటీలు, వాటి  అధ్యక్షులకు సంబంధించి సరైన జత?

a)  కేంద్ర రాజ్యాంగ కమిటీ      i) సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

b) రాజ్యాంగ సలహా  సంఘం    ii) జవహర్‌లాల్‌ నెహ్రూ

c) రాజ్యాంగ ముసాయిదా  కమిటీ     iii) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

d)  ఆర్థిక అంశాలపై ఏర్పడిన కమిటీ      iv) నళినీ రంజన్‌ సర్కార్‌

జవాబు : a - ii, b - i, c - iii, d - iv  



5. రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ సభ ఏర్పాటు   చేసిన విషయ నిర్ణాయక కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జత?  

a) కేంద్ర ప్రభుత్వ  అధికారాల కమిటీ      i) జవహర్‌లాల్‌ నెహ్రూ

b) భాషా ప్రయుక్త ప్రాంతాలపై ఏర్పడిన కమిటీ    ii) ఎస్‌.కె.థార్‌

c) సుప్రీంకోర్టుపై ఏర్పడిన కమిటీ     iii) ఎస్‌.వరదాచారి అయ్యర్‌

d) జాతీయ పతాకంపై ఏర్పడిన కమిటీ      iv) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌

జవాబు :  a - i, b - ii, c - iii, d - iv   



6. రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన విధాన నిర్ణాయక కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జత?

a) ఆర్డర్‌ ఆఫ్‌ బిజినెస్‌ కమిటీ     i) డాక్టర్‌ బాబూ  రాజేంద్రప్రసాద్‌

b) సభా కమిటీ     ii) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌

c) క్రెడెన్షియల్‌ కమిటీ     iii) భోగరాజు పట్టాభి సీతారామయ్య

d) సాంఘిక, ఆర్థిక కమిటీ    iv) కె.ఎం.మున్షీ    

జవాబు : a - iv, b - iii, c - ii, d - i   
  


7. 1947, జనవరి 24న ఏర్పడిన రాజ్యాంగ సలహా సంఘానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) దీనికి అధ్యక్షుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌.     2) ఈ కమిటీలోని సభ్యుల సంఖ్య 54.

3) ఈ కమిటీని 4 ఉప కమిటీలుగా వర్గీకరించారు.     4) కమిటీ తన నివేదికను 1949, నవంబరు 26న సమర్పించింది.

జవాబు : కమిటీ తన నివేదికను 1949, నవంబరు 26న సమర్పించింది.



8.  రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన వివిధ ఉప కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి సరైన జత?

 a) ప్రాథమిక హక్కుల ఉప కమిటీ     i) హెచ్‌.సి.ముఖర్జీ

b) అల్ప సంఖ్యాక వర్గాల ఉప కమిటీ       ii) ఎ.వి.ఠక్కర్‌

c) ఈశాన్య రాష్ట్రాల  ఉప కమిటీ     iii) జె.బి.కృపలాని

d) అస్సాం ప్రాంతం మినహాయించి ఇతర   ప్రాంతాలపై ఏర్పడిన ఉప కమిటీ        iv) గోపీనాథ్‌ బార్డోలోయ్‌

జవాబు : a - iii, b - i, c - iv, d - ii
     


9. 1947, ఆగస్టు 29న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా  కమిటీలో సభ్యులు కానివారు? 

జవాబు : కె.టి.షా, హెచ్‌.సి.ముఖర్జీ



10. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ ‘ముసాయిదా రాజ్యాంగాన్ని’ రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టింది? 

జవాబు : 1948, నవంబరు 4    


 

11. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ బృందం రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంలోని అంశాన్ని గుర్తించండి.

జవాబు : 1, 2     



12. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ను ఆధునిక మనువుగా, రాజ్యాంగ పితామహుడిగా ‘ది కాన్‌స్టిట్యూషనల్‌ గవర్నమెంట్‌ ఇన్‌ ఇండియా’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?

జవాబు : ఎం.వి.పైలీ 


13. రాజ్యాంగ సభ సమావేశాల్లో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వారికి సంబంధించి సరికానిది?

జవాబు : అల్పసంఖ్యాక వర్గాలు - కె.టి.షా, కె.ఎం.మున్షీ



14. రాజ్యాంగ సభ సమావేశాల్లో వివిధ వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులకు సంబంధించి సరైన జత?

a) పారశీకులు    i) హెచ్‌.సి.ముఖర్జీ

b) యూరోపియన్లు    ii) హెచ్‌.పి.మోదీ

c) అల్పసంఖ్యాక వర్గాలు  iii) డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌

d) అఖిల భారత   కార్మిక వర్గం   iv) ఫ్రాంక్‌ ఆంటోని 

జవాబు : a - ii, b - iv, c - i, d - iii  



15. కిందివాటిలో సరికానిది? 

1) ప్రారంభంలో రాజ్యాంగ సభలో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం 69 శాతం.

2) రాజ్యాంగ సభ నుంచి ముస్లింలీగ్‌ వైదొలగడంతో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం 82 శాతానికి చేరింది.

3) రాజ్యాంగ సభ సమావేశాల్లో అఖిల భారత షెడ్యూల్డు కులాల వర్గానికి ప్రాతినిధ్యం వహించినవారు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 

4) రాజ్యాంగ సభ సమావేశాల్లో జమిందారీ వర్గానికి ప్రాతినిధ్యం వహించినవారు రతన్‌ సింగ్‌.

జవాబు : రాజ్యాంగ సభ సమావేశాల్లో జమిందారీ వర్గానికి ప్రాతినిధ్యం వహించినవారు రతన్‌ సింగ్‌. 


16. రాజ్యాంగ సభ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?

జవాబు : 1946 డిసెంబరు 9 నుంచి 23 వరకు



17. కిందివాటిలో సరికానిది?

1) రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షుడు డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌. 

2) రాజ్యాంగ సభకు శాశ్వత ఉపాధ్యక్షులు హెచ్‌.సి.ముఖర్జీ, వి.టి.కృష్ణమాచారి.

3) రాజ్యాంగ సభ తొలి సమావేశానికి హాజరైన సభ్యులు 208 మంది.

4) రాజ్యాంగ సభలో ప్రారంభ ఉపన్యాసం చేసినవారు లార్డ్‌మౌంట్‌ బాటన్‌. 

జవాబు : రాజ్యాంగ సభలో ప్రారంభ ఉపన్యాసం చేసినవారు లార్డ్‌మౌంట్‌ బాటన్‌. 



18. జవహర్‌లాల్‌ నెహ్రూ ‘ఉద్దేశాల తీర్మానం/చారిత్రక లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని’ రాజ్యాంగ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు?

జవాబు : 1946, డిసెంబరు 13    


 

19. ఉద్దేశాల తీర్మానాన్ని ‘మనం ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ’ అని ఎవరు అభివర్ణించారు?

జవాబు : జవహర్‌లాల్‌ నెహ్రూ


20. జవహర్‌లాల్‌ నెహ్రూ రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టిన ఉద్దేశాల తీర్మానానికి సంబంధించి సరైంది?

జవాబు :  పైవన్నీ 



21. ‘డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ బృందం రూపొందించిన ముసాయిదా రాజ్యాంగం 1935, భారత ప్రభుత్వ చట్టానికి జిరాక్స్‌ కాపీలా ఉంది’ అని ఎవరు విమర్శించారు?

జవాబు : మౌలానా హస్రత్‌ మొహాని 

 

భారత రాజ్యాంగ రచన - స్వభావం - 3

సేకరించి.. మథించి.. సవరించి!


ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలను శోధించి, సేకరించి, అందులోని ఆదర్శ విధానాలను, అనుసరణీయ లక్షణాలను అధ్యయనం చేసి, మథించి, అవసరమైన సవరణలు చేసి మన రాజ్యాంగంలో చేర్చారు. స్వాతంత్య్ర పోరాట లక్ష్యాలను, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలకు నిర్దేశకాలుగా మార్చారు.  దేశ పరిస్థితులకు తగిన పాలనా ఏర్పాట్లను సంస్థాగతంగా సమకూర్చారు. వీటిపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రధాన దేశాల నుంచి గ్రహించిన లక్షణాలు, రాజ్యాంగ నిర్మాణ సభ స్వరూపం, గొప్పతనం గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

 


1. కిందివాటిలో సరికానిది?

1) ముసాయిదా రాజ్యాంగానికి 7,635 సవరణలు ప్రతిపాదించారు. 

2) ముసాయిదా రాజ్యాంగాన్ని లార్డ్‌ మౌంట్‌బాటన్‌ ధ్రువీకరించారు.

3) ముసాయిదా రాజ్యాంగానికి ఎక్కువ సవరణలు ప్రతిపాదించినవారు హెచ్‌.వి.కామత్‌

4) రాజ్యాంగ సభ చర్చల్లో 7 రోజుల పాటు 24 మంది అమెరికన్లు పాల్గొన్నారు.

జవాబు : ముసాయిదా రాజ్యాంగాన్ని లార్డ్‌ మౌంట్‌బాటన్‌ ధ్రువీకరించారు.



2.  కింద పేర్కొన్న అంశాల్లో సరికానిది?

1) రాజ్యాంగ సభ 11 సమావేశాలు కలిపి 165 రోజులు జరిగాయి. 

2) ముసాయిదా రాజ్యాంగంపై 114 రోజులు సమగ్రమైన చర్చ జరిగింది.

3) ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949, నవంబరు 26న (శనివారం) ఆమోదించింది.

4) ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించే సమయంలో గాంధీజీ పాల్గొన్నారు.

జవాబు : ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించే సమయంలో గాంధీజీ పాల్గొన్నారు.



3.  మన దేశంలో 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తున్నారు?

జవాబు : నవంబరు 26  


4. 1949, నవంబరు 26న ఆమోదించిన రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమల్లోకి రావడానికి ప్రధాన కారణం?

జవాబు : లాహోర్‌లో ఆమోదించిన సంపూర్ణ స్వరాజ్‌ తీర్మానం    

 

5. 1949, నవంబరు 26న ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన వెంటనే అమల్లోకి వచ్చిన అంశాల్లో లేనిది?

జవాబు : అత్యవసర పరిస్థితి అధికారాలు



6.1950, జనవరి 26 (గురువారం) నుంచి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలోని అంశాలకు సంబంధించి సరికానిది?

జవాబు : షెడ్యూల్స్‌ 12

 

7. రాజ్యాంగ సభ చివరి సమావేశం (12వ) ఎప్పుడు జరిగింది?

జవాబు : 1950, జనవరి 24  


8. రాజ్యాంగ సభ చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయం? 

జవాబు : 1, 2 సరైనవి



9. రాజ్యాంగ సభ చివరి సమావేశంలో ఎంత మంది ప్రతినిధులు హాజరై రాజ్యాంగ రాతప్రతులపై సంతకాలు చేశారు?

జవాబు : 284    



10.  భారత రాజ్యాంగంపై ప్రముఖుల వ్యాఖ్యానానికి సంబంధించి సరికానిది?

1) భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య - కె.సి.వేర్‌

2) భారత రాజ్యాంగాన్ని ఇంద్రుడి వాహనమైన ఐరావతంతో పోల్చవచ్చు - హెచ్‌.వి.కామత్‌

3) భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత - గాన్‌విల్‌ ఆస్టిన్‌

4) భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం - దామోదర్‌ స్వరూప్‌సేథ్‌

జవాబు : భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం - దామోదర్‌ స్వరూప్‌సేథ్‌



11.   ‘భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అసాధారణ పరిస్థితుల్లో ఏక కేంద్రంగా వ్యవహరిస్తుంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

జవాబు : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌



12.  రాజ్యాంగంలోని ప్రతిపేజీని శాంతినికేతన్‌లోని చిత్రకారుల సహకారంతో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా కళాత్మకంగా రూపొందించినవారు?

జవాబు : నందలాల్‌ బోస్‌   



13.  మన రాజ్యాంగ నిర్మాతలు ‘భారత ప్రభుత్వ చట్టం - 1935 ’ నుంచి గ్రహించిన అంశాల్లో లేనిది?

జవాబు : స్వేచ్ఛా, వాణిజ్య, వ్యాపార చట్టాలు    



14.  రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్‌ నుంచి గ్రహించిన అంశాల్లో లేనిది? 

జవాబు : దేశాధినేత పేరుమీదుగా పరిపాలన నిర్వహించడం



15.  రాజ్యాంగ నిర్మాతలు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి గ్రహించిన అంశాల్లో లేనిది? 

జవాబు : అంతర్‌రాష్ట్ర వర్తక వాణిజ్యం

 

16. రాజ్యాంగ నిర్మాతలు కెనడా దేశ రాజ్యాంగం నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి సరికానిది? 

జవాబు :  రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు విశిష్ట వ్యక్తుల నియామకం
  

17. రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి  సరైన జత?  

a) ఉమ్మడి జాబితా    i) దక్షిణాఫ్రికా

b) న్యాయమూర్తుల తొలగింపు   ii) జపాన్‌

c) చట్టం నిర్ధారించిన పద్ధతి    iii) అమెరికా

d) రాజ్యాంగ సవరణ విధానం   iv) ఆస్ట్రేలియా

జవాబు : a - iv, b - iii, c - ii, d - i 



18.  రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి  సరైన జత? 

a) ప్రొటెం స్పీకర్‌ నియామకం     i) ఐర్లాండ్‌

b) ఆదేశిక సూత్రాలు      ii) ఫ్రాన్స్‌

c) రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం   iii) జపాన్‌

d) జీవించే హక్కు    iv) దక్షిణాఫ్రికా

జవాబు : a - ii, b - i, c - iv, d - iii



19. రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి  సరైన జత? 

a) రాజ్యాంగ ప్రవేశికలోని గణతంత్ర అనే భావన      i) కెనడా

b) సుప్రీంకోర్టు సలహా రూపక అధికార పరిధి       ii) ఫ్రాన్స్‌

c) దేశాధినేత పేరు మీదుగా  దేశ పరిపాలన నిర్వహణ  iii) ఆస్ట్రేలియా

d) పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం     iv) అమెరికా

జవాబు : a - ii, b - i, c - iv, d - iii


20.  కిందివాటిలో భారత రాజ్యాంగం స్వతహాగా ఏర్పాటు చేసుకున్న లక్షణం?

1) భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య - కె.సి.వేర్‌

2) భారత రాజ్యాంగాన్ని ఇంద్రుడి వాహనమైన ఐరావతంతో పోల్చవచ్చు - హెచ్‌.వి.కామత్‌

3) భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత - గాన్‌విల్‌ ఆస్టిన్‌

4) భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం - దామోదర్‌ స్వరూప్‌సేథ్‌

జవాబు : పైవన్నీ



21. మన దేశ సాంఘిక, ఆర్థిక లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ సభ అనుసరించిన ‘యూరో - అమెరికన్‌’ నమూనాలో లేని అంశం?

జవాబు : పార్లమెంటు ఆధిక్యత



22.  రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభ సర్వసమ్మతి, సమన్వయ పద్ధతులను ఉపయోగించిందని ‘ది ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌ కార్నర్‌ స్టోన్‌ ఆఫ్‌ ఏ నేషన్‌’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?

జవాబు : శిఖర్‌ మిశ్రా  


23.  రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభ ‘సర్దుబాటు పద్ధతిని’ (Method of Adoption) ఉపయోగించిందని ‘ఇండియన్‌ గవర్నమెంట్‌ అండ్‌ పాలిటిక్స్‌’ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు?

జవాబు : అవస్తీ, మహేశ్వరి


24. ‘ప్రాచీన కాలం నాటి సాంఘిక, ఆర్థిక నిర్మాణాన్ని తిరస్కరించి ముందుకు కదులుతూ కొత్త వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఉంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

జవాబు : జవహర్‌లాల్‌ నెహ్రూ 
 

 

Posted Date : 10-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌