• facebook
  • whatsapp
  • telegram

వరదలు

1. గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలను నియంత్రించడానికి భారత ప్రభుత్వం గంగా ఫ్లడ్ కంట్రోల్ కమిషన్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది?
జ:  1972

 

2. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధీనంలో పనిచేసే 'నేషనల్ వాటర్ అకాడమీ' (NWA)ను ఏ నగరంలో నెలకొల్పారు?
జ:  పుణే

 

3. వరదల వల్ల రోడ్లు, రైల్వే లైన్లకు కలిగే నష్టాన్ని తనిఖీ చేయడానికి ఏ సంస్థలు పనిచేస్తున్నాయి? 
జ:  బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ , నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ,  స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ

 

4. వరద హెచ్చరిక, నదీ ప్రవాహం ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి అపాయకరమైన స్థాయి కంటే తక్కువగా ఉంటే  ఆ ప్రవాహాన్ని ఏమంటారు?
జ:  తక్కువస్థాయి వరద

 

5. 2008లో బీహార్‌లోని ఏ నదికి వరదలు రావడం వల్ల 527 మంది మరణించారు? 
జ:  కోసి

 

6. భారతదేశంలో ఎంత శాతం భూ భాగం వరద ముప్పునకు గురయ్యే అవకాశం ఉంది?
జ:  8%

 

7. భారతదేశంలో ఏ నెలల మధ్యకాలంలో వరదలు వచ్చే అవకాశం ఎక్కువ?
జ:  జూన్-సెప్టెంబరు

 

8. భారతదేశంలో ఏ సంవత్సరంలో సంభవించిన వరదల ఫలితంగా అత్యధికంగా 11,316 మంది మరణించారు?
జ:  1977

 

9. మన దేశంలో వరదలు తరచుగా ఏ నదీ పరీవాహక ప్రాంతాల్లో వస్తుంటాయి?
జ:  గంగా-బ్రహ్మపుత్ర

 

10. ఏదైనా ప్రాంతంలో వరదలు రావడానికి కారణం- 
జ:  అధిక వర్షపాతం, తుపాన్లు , జలాశయాలకు గండ్లు పడటం , కొండచరియలు విరిగిపడటం, నదులు ప్రవాహ దిశను మార్చుకోవడం

 

11. హైదరాబాద్, ముంబయి లాంటి నగరాల్లో వరదలు రావడానికి కారణమేమిటి?
జ:  డ్రైనేజీలు ఘనపదార్థాలతో పూడుకుపోవడం

 

12. బ్రహ్మపుత్రా నదీ ప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రాల్లో అక్కడి నదుల వల్ల ఎక్కువగా వరదలు వస్తున్నాయి?
జ:  అసోం, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్

 

13. జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ నది, దాని ఉపనదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి?
జ:  గంగానది

 

14. మధ్య భారతదేశం, దక్కన్ ప్రాంతంలోని ఏ నదుల వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వరదలు సంభవిస్తున్నాయి?
జ:  గోదావరి, కృష్ణా, కావేరి

Posted Date : 24-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌