1. కొండచరియలు విరిగిపడటంతో మనదేశంలోని ఏ జాతీయ రహదారులు తరుచుగా దెబ్బతింటున్నాయి?
జ: 1ఎ, 1బి
2. భారతదేశంలో మొదటిసారిగా ఏ సంస్థ కొండచరియలు విరిగిపడటంపై పరిశోధన నిర్వహించింది?
జ: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
3. ప్రపంచవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడి కలిగేవైపరీత్యాల్లో 30 శాతం భారతదేశంలోని ఏ ప్రాంతంలో సంభవిస్తున్నాయని అంచనా?
జ: హిమాలయాలు
4. మనదేశంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతం ఎంత శాతంగా ఉంది?
జ: 15
5. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలకు, పర్యావరణానికి వాటిల్లుతున్న నష్టం-
జ: ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి;ప్రాంత స్వరూపం మారిపోతుంది;రోడ్లు, పంటపొలాలు దెబ్బతింటాయి.
6. భారతదేశంలో ఏ ప్రాంతాల్లో కొండచరియలు తరచుగా విరిగిపడుతుంటాయి?
జ: హిమాలయాలు,పశ్చిమ కనుమలు,నీలగిరి కొండలు
7. మనరాష్ట్రంలో ఏ నగరాల్లో కొండప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య పెరుగుతూండటంతో కొండచరియలు విరిగిపడి నష్టం వాటిల్లే ప్రమాదముంది?
జ: విజయవాడ, విశాఖపట్టణం
8. కొండచరియలు విరిగి పడటానికి కారణం-
జ: కొండ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు పడటం,నేల క్రమక్షయానికి గురవడం,భూకంపాలు రావడం
9. సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటల్ ఆర్గనైజేషన్ కొండచరియలు విరిగిపడటాన్ని గుర్తించడానికి ఏ ప్రాంతంలో ఇన్స్ట్రుమెంటేషన్ నెట్వర్క్ను నెలకొల్పింది?
జ: హరిద్వార్
10. కొండచరియలు విరిగిపడే వైపరీత్యానికి సంబంధించిన ప్రాంతాల పటాలను రూపొందిస్తున్న పరిశోధనా సంస్థ ఏది?
జ: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్