పంటల ఉత్పత్తులు
ఉత్పత్తి పరంగా ముందంజలో ఉన్న ముఖ్యమైన పంటలు:
తృణధాన్యాలు, చిరు ధాన్యాలు: వరి, మొక్కజొన్న, జొన్న
పప్పు ధాన్యాలు: సెనగ, మినుములు
ఆహార ధాన్యాలు: వరి, మొక్కజొన్న, సెనగ
నూనెగింజలు: వేరుసెనగ
ఆహర పంటలు: వరి, వేరుసెనగ
ఆహారేతర పంటలు: పత్తి, చెరకు
పండ్లు, కూరగాయిలు: అరటి, మామిడి
మొత్తం పంటలు: వరి, పత్తి, చెరకు
ఉత్పత్తి ధోరణులు
* 2013-14 నాటితో పోలిస్తే 2020-21 నాటికి తృణధాన్యాలు, చిరుధాన్యాల ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ప్రారంభంలో తగ్గి మళ్లీ పెరిగి తర్వాత తగ్గుముఖం పట్టాయి.
* పప్పుధాన్యాల ఉత్పత్తిలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.
* నూనెగింజల ఉత్పత్తిలో స్వల్ప పెరుగుదల నమోదైంది. నూనెగింజల కింద సాగయ్యే భూమి తగ్గినప్పటికీ, ఉత్పత్తి పెరిగింది.
పంటల ఉత్పాదకత
సగటున ఒక హెక్టారు భూమిలో పండే పంటను వ్యవసాయ ఉత్పాదకతగా పేర్కొంటారు.
ఉత్పాదకత = ఉత్పత్తి/ హెక్టార్
2020-21లో వివిధ పంటల ఉత్పాదకత వరుసగా...
1. మొక్కజొన్న - 5918 కేజీ/హెక్టారు
2. వరి - 5130 కేజీ/హెక్టారు
3. జొన్న - 3428 కేజీ/హెక్టారు
* పప్పు ధాన్యాల్లో సెనగ పంట అత్యధిక ఉత్పాదకతను కలిగి ఉంది.
* వరి ఉత్పాదకత అత్యల్పంగా ఉన్న జిల్లా - విశాఖపట్నం
* మొక్కజొన్న ఉత్పాదకత అత్యల్పంగా ఉన్న జిల్లా - అనంతపురం
* వేరుసెనగ ఉత్పాదకత అత్యల్పంగా ఉన్న జిల్లా - అనంతపురం
* పత్తి ఉత్పాదకత అత్యల్పంగా ఉన్న జిల్లా - కర్నూలు
* సజ్జలు, రాగులు మినహా మిగతా అన్ని ప్రధాన పంటల ఉత్పాదకతలో రాయలసీమ కంటే కోస్తాంధ్ర ముందుంది. రాయలసీమ జిల్లాల కంటే కోస్తాలో భూసారం మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం.
* రాష్ట్రం మొత్తం జొన్న విస్తీర్ణంలో గుంటూరులోనే 41% సాగవుతోంది.
* గుంటూరు, కర్నూలు రెండు జిల్లాల్లో 80% జొన్నను పండిస్తున్నారు.
* రాష్ట్ర మొత్తం రాగి పంట విస్తీర్ణంలో 55% విశాఖపట్టణం జిల్లాలోనే ఉంది.
* వేరుసెనగ విస్తీర్ణం, ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న అనంతపురం ఉత్పాదకతలో ఆఖరి స్థానంలో నిలిచింది. నీ 2020-21 లో రాష్ట్రంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 165.04 లక్షల టన్నులు. 2019-20 (175.12 లక్షల టన్నులు)తో పోలిస్తే 5.76% రుణాత్మక వృద్ధి నమోదైంది.
* 2020-21లో మొత్తం తృణధాన్యాలు, చిరుధాన్యాల ఉత్పత్తి 154.10 లక్షల టన్నులు.
* 2020-21 లో వరి ఉత్పత్తి 130.89 లక్షల టన్నులు. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వరి వాటా 79%.
* 2020-21 లో మొక్కజొన్న ఉత్పత్తి 17.84 లక్షల టన్నులు. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దీని వాటా 10.8%
* గత కొన్నేళ్లుగా జొన్న పంట విస్తీర్ణం తగ్గుతున్నప్పటికీ ఉత్పాదకత పెరిగింది.
* 2020-21 లో మొత్తం పప్పు ధాన్యాల ఉత్పత్తి 10.94 లక్షల టన్నులు. మొత్తం పప్పుధాన్యాల ఉత్పత్తిలో సెనగ వాటా 50%.
* మొత్తం పప్పు ధాన్యాల ఉత్పత్తిలో సెనగ, మినుములు, పెసలు, కందులు 97% వాటాను కలిగి ఉన్నాయి.
* 2020-21లో మొత్తం నూనె గింజల ఉత్పత్తి 29.91 లక్షల టన్నులు. ఇందులో పామాయిల్ 74% వాటా, వేరుసెనగ 25% వాటాను కలిగి ఉన్నాయి.
