* ఏ దేశమైనా ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించాలంటే స్థానిక ఉత్పత్తుల వాడకంతోపాటు, వాటి ఎగుమతుల ద్వారానే సాధ్యమవుతుంది. ఈ వస్తువుల తయారీకి ఎంఎస్ఎంఈలు ముఖ్యం.
* స్థానిక వస్తు ఉత్పత్తులకు, డిమాండ్ సృష్టించడానికి, మార్కెట్ పోటీని తట్టుకుని నిలబడటానికి ఎంఎస్ఎంఈల ఆర్థిక విస్తృతిని పెంచాలి.
* మనదేశం నుంచి నమోదయ్యే ఎగుమతుల్లో దాదాపు సగభాగం ఈ విభాగానికి చెందిన యూనిట్ల నుంచే వస్తున్నాయి.
* 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం, 2018లో స్థూల అదనపు విలువ (జీవీఏ)లో ఎంఎస్ఎంఈల వాటా 29.3% ఉండగా, 2020లో 30.5 శాతానికి పెరిగింది. అయితే 2021 నాటికి కరోనా కారణంగా వీటి వాటా 26.8 శాతానికి తగ్గింది.
* ఎంఎస్ఎంఈలలో తయారీ రంగం వాటా 2021 నాటికి 36 శాతానికి తగ్గింది.
* సూక్ష్మ పరిశ్రమల ద్వారా సుమారు 70-80% వలస కార్మికులకు ఉపాధి లభిస్తోంది. స్థూల దేశీయోత్పత్తిలో వీటి వాటా 35 శాతంగా ఉన్నట్లు అంచనా.
కరోనా సమయంలో ఎంఎస్ఎంఈల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు
* మనదేశ జీడీపీలో మూడో వంతు భాగం ఎంఎస్ఎంఈలదే. కేంద్ర ప్రభుత్వం 2020, మే 13న ప్రకటించిన ప్యాకేజీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలు, వాణిజ్య సంస్థలను ఆదుకుని, ఉద్యోగాలను కాపాడటంపై దృష్టి సారించింది.
* ఈ ప్యాకేజీలో ఎంఎస్ఎంఈలు సహా చిన్న వ్యాపారాల కోసం హామీ లేని రూ.3 లక్షల కోట్ల రుణాలను ప్రకటించారు.
* వీటివల్ల 45 లక్షల సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని, ఉద్యోగాలు తొలగించకుండా కార్యకలాపాలు ప్రారంభించడానికి వీలవుతుంది ప్రభుత్వం పేర్కొంది.
* ఈ రుణాలు తీర్చేందుకు నాలుగేళ్ల గడువు ఇచ్చారు. 12 నెలల పాటు అసలుపై మారటోరియం ఉంటుంది. వడ్డీ కట్టాల్సిందే.
* 100 శాతం ప్రభుత్వ హామీతో ఈ రుణాలు లభ్యమవుతాయి.
* 2020, అక్టోబరు 31 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది.
* హామీ రుసుము ఉండదు.
* రూ.25 కోట్ల పెట్టుబడులు, రూ.100 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులకు ఈ పథకం వర్తిసుంది.
* రుణ ఒత్తిళ్లలో ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ.20,000 కోట్ల సబ్-ఆర్డినేట్ రుణాలు కల్పించారు. అంటే బ్యాంకుల ద్వారా ఎంఎస్ఎంఈ ప్రమోటర్లకు రుణం ఇస్తారు. దీన్ని ప్రమోటర్ ఈక్విటీ రూపంలో కంపెనీలోకి ప్రవేశపెడతారు. (ఈక్విటీ అంటే వాటాదార్లు షేర్ల రూపంలో ఒక కంపెనీలో కలిగి ఉండే వాటా)
* దీనివల్ల 2 లక్షల మంది వ్యాపారులకు ప్రయోజనం కలిగింది.
* నికర నిరర్ధక ఆస్తులుగా మారిన లేదా ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు వీటిని మంజూరు చేశారు.
* ద్రవ్యలభ్యత సమస్యలను ఎదుర్కొన్న ఎంఎస్ఎంఈల కోసం ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్’ను ఏర్పాటు చేశారు. దీనివల్ల రూ.50,000 కోట్ల మేర ద్రవ్య లభ్యత ప్రయోజనాలు సమకూరాయి.
* కంపెనీలు తమ పరిమాణాన్ని, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. అవి స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదు అయ్యేలా ఈ మొత్తం సహాయపడింది.
* భారతదేశ ఎంఎస్ఎంఈలకు విదేశీ కంపెనీల నుంచి ఊహించని రీతిలో పోటీ ఉంటోంది. ఈ నేపథ్యంలో రూ.200 కోట్ల వరకు ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ టెండర్లలో విదేశీ కంపెనీలను అనుమతించకుండా జనరల్ ఫైనాన్షియల్ రూల్స్లో సవరణలు చేశారు.
* భారత్లో తయారీ రంగానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఎంఎస్ఎంఈలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
* కరోనా సమయంలో రుణ మార్కెట్ల నుంచి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు(NBFC), గృహ ఆర్థిక కంపెనీలు (HFC), మ్యూచువల్ ఫండ్ సంస్థల (MFI) కు నిధులు
* సమీకరించడం క్లిష్టంగా మారింది. అందుకే కేంద్రం రూ.30,000 కోట్లతో ప్రత్యేక ద్రవ్య లభ్యత పథకాన్ని ప్రకటించింది.
* ప్రాథమిక, సెకండరీ మార్కెట్లోని వితీనీది, బీనీది, లీనీఖి ల రుణపత్రాల్లో ఈ పెట్టుబడులు పెడతారు. ద్రవ్యలభ్యత పెరగడానికి ఈ చర్య ఉపయోగపడుతుంది. వీటికి ప్రభుత్వమే 100 శాతం హామీ ఇస్తుంది.
* తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న వితీనీది, బీనీది, లీనీఖి లు చిన్న వ్యాపారులకు రుణాలు ఇచ్చేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పాక్షిక రుణ హామీ పథకాన్ని విస్తరించింది. తొలి 20 శాతం నష్టాన్ని హామీదారు అంటే ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకం వల్ల రూ.45,000 కోట్ల ద్రవ్యం అందుబాటులోకి వచ్చింది.
* కరోనా సమయంలో ఎంఎస్ఎంఈలకు మార్కెటింగ్, ద్రవ్య లభ్యత విషయంలో సమస్యలు ఎదురయ్యాయి. దీన్ని అధిగమించేందుకు వాణిజ్య ప్రదర్శనలు, ట్రేడ్ ఫెయిర్స్ స్థానంలో ఈ-మార్కెట్ లింకేజ్ను ఎంఎస్ఎంఈలకు అనుసంధానం చేశారు. ఫిన్టెక్ సాయంతో లావాదేవీ ఆధారిత రుణాలను పెంచారు.
* కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నుంచి ఎంఎస్ఎంఈ వెండర్ల బకాయిల సెటిల్మెంట్లను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది.
* సంబంధిత బకాయిలను 45 రోజుల్లోగా ప్రభుత్వం విడుదల చేస్తుంది.
* దేశవ్యాప్తంగా సుమారు 90 శాతం సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయి.
* రాష్ట్రాలవారీగా చూస్తే ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉత్తర్ ప్రదేశ్లో అత్యధికంగా ఉన్నాయి. పశ్చిమ్ బంగా, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు మొదటి 10 రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.
* ముడిసరకు, విడిభాగాల కోసం దేశీయ యూనిట్లు చైనాపై అధికంగా ఆధారపడుతున్నాయి. అవి మనదేశంలో దొరుకుతున్నప్పటికీ ఖర్చు తక్కువగా ఉండటం, చైనా వస్తువుల సప్లయ్ చైన్ వ్యవస్థ బలంగా ఉండటం వల్ల ఆయా సంస్థలు వాటిని అక్కడ నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి.
* దీన్ని అధిగమించేందుకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలపై పన్ను భారం పెంచి, స్వదేశీ ఉత్పత్తులపై పన్ను మినహాయింపులు ఇవ్వాలని ఆర్థిక నిపుణులు కోరుతున్నారు.
ఎంఎస్ఎంఈ సంస్థల మంత్రిత్వ శాఖకు సంబంధించిన చట్టబద్ధ సంస్థలు
* ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ (1956)
* జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ (1955)
* కొబ్బరి పీచు పరిశ్రమ చట్టం, 1953 (Coir Board)
* సూక్ష, చిన్న, మధ్య తరహా సంస్థల జాతీయ సంస్థ (1960)
* ఖాయిలాపడిన పారిశ్రామిక సంస్థల చట్టం, 1985 (Sick Industries)
* పారిశ్రామిక, విత్త పునర్నిర్మాణ మండలి (1987)
* జిల్లా పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటు (1978)
ఎంఎస్ఎంఈల నిర్వచనం మార్పు
* ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో మార్చింది. దీని ప్రకారం, ఈ రంగంలో పెట్టుబడుల పరిమితిని పెంచడంతోపాటు అదనంగా టర్నోవరు అర్హతను జతచేశారు. దీనిద్వారా ఎక్కువ కంపెనీలు ఈ పరిధిలోకి వచ్చే వీలు కలిగింది.
* ఇంతకుముందు వరకు తయారీ, సేవా రంగాలను విడిగా పరిగణించారు. కొత్త దానిలో ఈ రెండు రంగాలకు ఒకే నిర్వచనం ఇచ్చారు. దీనికి అవసరమైన చట్ట సవరణ చేశారు.
సవరించక ముందు అర్హత (ప్లాంట్లు, మిషనరీలో పెట్టుబడులు రూ.లలో)
వర్గీకరణ | తయారీ రంగం | సేవా రంగం |
సూక్ష్మ పరిశ్రమలు | 25 లక్షల లోపు | 10 లక్షలలోపు |
చిన్న పరిశ్రమలు | 5 కోట్ల లోపు | 2 కోట్ల లోపు |
మధ్యతరహా పరిశ్రమలు | 5 కోట్ల లోపు | 2 కోట్ల లోపు |
సవరించిన అర్హత (పెట్టుబడులు, వార్షిక టర్నోవర్ రూ.లలో)
వర్గీకరణ | తయారీ, సేవా రంగం |
సూక్ష్మ పరిశ్రమలు | కోటి లోపు పెట్టుబడులు, 5 కోట్ల లోపు టర్నోవర్ |
చిన్న పరిశ్రమలు | 10 కోట్ల లోపు పెట్టుబడులు 50 కోట్ల లోపు టర్నోవర్ |
మధ్యతరహా పరిశ్రమలు | 20 కోట్ల లోపు పెట్టుబడులు, 100 కోట్ల లోపు టర్నోవర్ |
ఎంఎస్ఎంఈలకు అత్యవసర రుణ హామీ పథకం
* ఎంఎస్ఎంఈ సంస్థలకు ద్రవ్య లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం అత్యవసర రుణ అనుసంధానిత హామీ పథకాన్ని(Emergency Credit line Guarantee Scheme) ప్రవేశపెట్టింది.
* దీనిద్వారా 202122 ఏడాదికి రూ.1.50 లక్షల కోట్ల అదనపు గ్యారంటీ ఇవ్వాలని 2021, జూన్ 28న కేంద్రం నిర్ణయించింది.
* ఈ పథకం కింద పాత, కొత్త బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సూక్ష్మరుణ సంస్థలకు, బ్యాంకులు ఇచ్చే రుణాలకు హామీ ఇస్తారు. ఈ సంస్థలు రూ.1.25 లక్షల రుణాన్ని 25 లక్షల మంది వరకు ఇవ్వొచ్చు. బ్యాంకులిచ్చే రుణాలపై అదనంగా 2 శాతం ఛార్జి వసూలు చేస్తారు. కాల పరిమితి మూడేళ్లు.
* 2023-24 బడ్జెట్ ప్రకారం, రుణ హామీ పథకం కింద ఎంఎస్ఎంఈలకు రూ.9000 కోట్లు కేటాయించారు.
* రుణాల మంజూరు సమర్థంగా సాగేందుకు, ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు‘నేషనల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీని’ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
* భారత్లోని ఎంఎస్ఎంఈ కంపెనీలు ఆర్థిక ఒత్తిళ్లలో కూరుకుపోకుండా అత్యవసర రుణ అనుసంధానిత హామీ పథకం కాపాడిందని 2022 - 23 ఆర్థిక సర్వే తెలిపింది.
* 2022, జనవరి- నవంబరులో ఈ రంగానికి ఇచ్చిన రుణాల్లో సగటున 30.6 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది. సుమారు 83 శాతం ఎంఎస్ఎంఈలు ఈ అత్యవసర రుణ అనుసంధానిత హామీ పథకాన్ని వినియోగించుకున్నాయి. వీటిలో సగం పైగా కంపెనీలు రూ.10 లక్షలలోపు రుణాలు తీసుకున్నాయని 2022 - 23 ఆర్థిక సర్వే తెలిపింది.